Kishan Reddy: కేంద్రం, రాష్ట్రం కలిసి బాధితులను ఆదుకోవాలి: కిషన్ రెడ్డి
రాజకీయాలకు అతీతంగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వరద బాధితులను ఆదుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లిలో కేంద్రమంత్రి పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కిషన్ రెడ్డి గ్రామస్థులకు ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.3లక్షలు, రాష్ట్రం రూ.లక్ష నష్టపరిహారం అందిస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Published : 30 Jul 2023 19:39 IST
Tags :