Pawan Kalyan: కేంద్ర పథకాలను వైకాపా తన పథకాలుగా చెప్పుకొంటోంది: పవన్‌ కల్యాణ్‌

కేంద్ర పథకాలను వైకాపా తన పథకాలుగా చెప్పుకుంటోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. రాజమహేంద్రవరంలో కూటమి పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు.

Updated : 06 May 2024 19:33 IST

కేంద్ర పథకాలను వైకాపా తన పథకాలుగా చెప్పుకుంటోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. రాజమహేంద్రవరంలో కూటమి పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. ‘‘దేశానికి అభివృద్ధితోపాటు గుండె ధైర్యం అవసరం. పదేళ్లుగా భారత్‌ వైపు చూడాలంటేనే శత్రువుల భయపడుతున్నారు. మోదీ గొంతెత్తితే దేశంలోని అణువణువూ స్పందస్తోంది. కేంద్రం ఇచ్చే ఇళ్లకు జగనన్న కాలనీలు అని పేరు పెట్టుకున్నారు’’ అని అన్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు