దారుణంగా వివేకా హత్య జరిగితే.. హార్ట్‌ఎటాక్‌ అని ప్రసారం చేసింది ఎవరు?: షర్మిల

దారుణంగా వైఎస్‌ వివేకా హత్య జరిగితే సాక్షిలో హార్ట్‌ఎటాక్‌ అని ప్రసారం చేసింది జగన్‌మోహన్‌రెడ్డి భార్యనే కదా? అని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు.

Updated : 07 May 2024 13:54 IST

దారుణంగా వైఎస్‌ వివేకా హత్య జరిగితే సాక్షిలో హార్ట్‌ఎటాక్‌ అని ప్రసారం చేసింది జగన్‌మోహన్‌రెడ్డి భార్యనే కదా? అని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. వైఎస్సార్‌ జిల్లా కమలాపురంలో మంగళవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అవినాష్‌రెడ్డి ఏనాడైనా కడప స్టీల్‌ ఫ్యాక్టరీ కోసం పార్లమెంట్‌లో మాట్లాడారా? అని ప్రశ్నించారు. ‘‘వివేకా హత్య జరిగిన రోజు ఎవరు చంపారో మాకు కూడా తెలియదు. సీబీఐ సాక్ష్యాలు, ఆధారాలను సేకరించాకే అవినాష్‌ హస్తం ఉందని తెలిసింది. అవినాష్‌ అమాయకుడని సీఎం జగన్, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి చెబుతున్నారు. వాళ్లను అమాయకులంటే ఎవరైనా నమ్ముతారా? సాక్షాత్తూ ముఖ్యమంత్రే అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన్ను కాపాడుతున్నారు’’ అని షర్మిల ఆరోపించారు.

Tags :

మరిన్ని