Andhra News: రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ సర్కారు నిర్లక్ష్యం
సాగునీటి ప్రాజెక్టులపై చిత్తశుద్ధి ఉందంటూ ఊదరగొట్టిన సీఎం జగన్.. సీమలో కరవు శాశ్వత నివారణకు చేపట్టిన ప్రాజెక్టులకు నిధులివ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. రాయలసీమ జిల్లాలకు వరంలాంటి ప్రాజెక్టులపై శీతకన్నేశారు. నిధులు లేకున్నా ఆర్భాటంగా 23 ప్రాజెక్టులు ఒకేసారి మొదలుపెట్టి.. ఆదిలోనే కాడిపడేశారు. ప్రస్తుతం సాగు నీటి కోసం రైతులు ధర్నాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ప్రాజెక్టులను గాలికొదిలేసి.. కర్నూలులో ‘రాయలసీమ గర్జన’కు పిలుపునిచ్చి వైకాపా రాజకీయం చేస్తుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయిు.
Updated : 05 Dec 2022 12:53 IST
Tags :