Telangana news: మిషన్ భగీరథ పైపుల దొంగలు దొరికారు!
మిషన్ భగీరథ ప్లాస్టిక్ పైపుల కట్టలు దొంగతనంలో నిందితులను అదుపులోకి తీసుకున్నామని తొర్రూరు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. ‘తొర్రూరు డివిజన్ కేంద్రంలోని సబ్ స్టేషన్ సమీపంలో భద్రపరిచిన 40 కట్టలు దొంగతనానికి గురయ్యారని ఫిర్యాదు అందింది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు కూలీలను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. నిందితుల వద్ద నుంచి 30 ప్లాస్టిక్ బెండల్లను స్వాధీనం చేసుకొన్నామని’ డీఎస్సీ తెలిపారు.
Published : 17 May 2022 19:52 IST
Tags :