Hyderabad: జీడిమెట్లలో సైకో వీరంగం.. ఇళ్ల ముందు నిలిపిన బైక్లకు నిప్పు..!
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్, శ్రీనివాస కాలనీల్లో ఆగంతకుడు వీరంగం సృష్టించాడు. కాలనీలో ఇంటి ముందు నిలిపిన ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. రెండు చోట్ల.. మొత్తం 9 వాహనాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. గమనించిన స్థానికులు మంటలు ఆర్పివేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఆగంతకులు ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లు చెప్పారు. ఈ ఘటనలో సుమారు రూ.7లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని స్థానికులు తెలిపారు.
Published : 27 Sep 2022 11:52 IST
Tags :