బ్రేకింగ్

breaking
25 Jan 2022 | 09:36 IST

నర్సీపట్నంలో మహారాష్ట్ర గంజాయి ముఠా బీభత్సం

నర్సీపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా నర్సీపట్నంలో మహారాష్ట్రకు చెందిన గంజాయి ముఠా బీభత్సం సృష్టించింది. ఈ ముఠా ప్రయాణిస్తున్న వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు ట్రాఫిక్‌ ఎస్‌ఐ గుర్తించారు. దాంతో ఎస్‌ఐ ఆ వాహనాన్ని వెంబడించి పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఇది పసిగట్టిన స్మగ్లర్లు కారు మరింత వేగంగా నడిపి, ఇతర వాహనాలను ఢీకొట్టారు. ఈ క్రమంలో కారు వదిలేసి స్మగ్లర్లంతా చెరువులోకి దూకారు. ఈ విషయాన్ని ట్రాఫిక్‌ ఎస్‌ఐ, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారంతా ఘటనాస్థలికి చేరుకున్నారు. చెరువు చుట్టూ పోలీసులను మోహరించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని

తాజా వార్తలు