బ్రేకింగ్

breaking
06 May 2024 | 12:40 IST

జగన్‌ను నమ్మి మరోసారి మోసపోవద్దు: చంద్రబాబు

పాణ్యం: సైకో జగన్‌ను నమ్మి మరోసారి మోసపోవద్దని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. నంద్యాల జిల్లా పాణ్యంలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారు. కోడికత్తి, గులకరాయి నాటకాలాడారు. ప్రజా వేదికను కూల్చేసి విధ్వంసానికి నాంది పలికారు. రాయలసీమలో 198 ప్రాజెక్టులు పూర్తిగా రద్దు చేశారు. ఐదేళ్లు జగన్‌ పరదాలు కట్టుకొని తిరిగారు. మీ పాసు పుస్తకాలపై ఆయన ఫొటో ఎందుకు? జగన్‌ దోచేసిన డబ్బుపై నేను పోరాడుతున్నా. అది ప్రజలకు చేరాలి’’ అని చంద్రబాబు తెలిపారు.

మరిన్ని

తాజా వార్తలు