Diabetes: షుగర్‌ వ్యాధి అదుపులో ఉండాలంటే...

మధుమేహంతో బాధపడేవాళ్లు చలికాలంలో పోషకాలు ఎక్కువగా ఉండే ఈ నాలుగు రకాల దుంపలు తినడంవల్ల రక్తంలో చక్కెరశాతం అదుపులో ఉంటుంది అంటున్నారు వైద్య నిపుణులు.

Updated : 11 Dec 2022 12:19 IST

Diabetes: షుగర్‌ వ్యాధి అదుపులో ఉండాలంటే...

మధుమేహంతో బాధపడేవాళ్లు చలికాలంలో పోషకాలు ఎక్కువగా ఉండే ఈ నాలుగు రకాల దుంపలు తినడంవల్ల రక్తంలో చక్కెరశాతం అదుపులో ఉంటుంది అంటున్నారు వైద్య నిపుణులు.

* పిండిపదార్థాలు తక్కువగానూ పీచు, నీటిశాతం ఎక్కువగానూ ఉండే టర్నిప్‌ (గుండ్రంగా ఉండే ముల్లంగి లాంటి దుంప)ను ఆహారంలో భాగంగా చేసుకుంటే చక్కెరశాతం పెరగకుండా ఉంటుంది.

* రక్తంలో గ్లూకోజ్‌ నిల్వలు మరీ ఎక్కువగా ఉన్నవాళ్లు ఆల్ఫా-లిపోయిక్‌ ఆమ్లం ఎక్కువగా ఉండే బీట్‌రూట్‌ను తింటే నరాలు దెబ్బతినకుండా ఉంటాయి. ఇవి కంటికీ మంచిదే. పోతే, ఈ దుంపల్లోని బెటాలెయిన్‌, నియో బెటానిన్‌లు ఇన్సులిన్‌ శాతాన్ని పెంచడం ద్వారా వ్యాధిని నియంత్రిస్తాయి.

* గ్లూకోసైనోలేట్‌, ఐసోథియోసైనేట్‌లు ఎక్కువగా ఉన్న ముల్లంగిని ఆహారంలో భాగంగా తీసుకుంటే చక్కెర వ్యాధి అదుపులో ఉండటంతోపాటు ఇన్సులిన్‌ స్రావాన్ని పెంచే అడిపొనెక్టిన్‌ శాతం పెరిగేలా చేస్తుంది. విటమిన్‌-ఎ, పీచు అధికంగా ఉండే క్యారెట్‌ కూడా ఆ కాలంలో తింటే మంచిదే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..