శ్రీకాళహస్తీశ్వరా!
తెలుగు గడ్డపై పుణ్యక్షేత్రాల్లో విశిష్టమైన శైవక్షేత్రం శ్రీకాళహస్తి. చిత్తూరు జిల్లాలో సువర్ణముఖీ నదీ తీరాన గల కాళహస్తిలో శివుడు లింగాకారుడై స్వయంభువుగా వెలశాడు. సృష్టిలో పంచభూతాలకు ప్రతీకలైన పంచలింగాల్లో ఒకటైన....
తెలుగు గడ్డపై పుణ్యక్షేత్రాల్లో విశిష్టమైన శైవక్షేత్రం శ్రీకాళహస్తి. చిత్తూరు జిల్లాలో సువర్ణముఖీ నదీ తీరాన గల కాళహస్తిలో శివుడు లింగాకారుడై స్వయంభువుగా వెలశాడు. సృష్టిలో పంచభూతాలకు ప్రతీకలైన పంచలింగాల్లో ఒకటైన వాయులింగంగా ఇక్కడి శివలింగాన్ని భావిస్తారు. శ్రీ-సాలెపురుగు, కాళం-పాము, హస్తి-ఏనుగు అనే మూడూ శివభక్తివల్ల మోక్షం పొందిన క్షేత్రంగా ప్రసిద్ధి. శ్రీకాళహస్తి అనగానే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానకవి ధూర్జటి, ఆయన రచించిన శ్రీకాళహస్తి మాహాత్మ్యం, శ్రీకాళహస్తీశ్వర శతకం గుర్తుకొస్తాయి. భక్తి వైరాగ్య భావనలకు ప్రబల దృష్టాంతంగా నిలిచింది. శ్రీకాళహస్తీశ్వర శతకం ధూర్జటి వివేక పరిపాకానికి దర్పణంగా నిలిచిన రచన.
రాచరిక వ్యవస్థలో మనుగడ సాగించినా, రాయల కొలువులో గౌరవం పొందినా అనంతర పాలకుల అహంకారం, నాటి పండితుల భేషజాలు ధూర్జటికి రోత పుట్టించాయి. అందుకే ‘రాజుల్ మత్తులు వారి సేవ నరక ప్రాయంబు’ అన్నాడు. ‘చదువుల్ నేర్చిన పండితాధములు’ అని ఈసడించాడు. ధూర్జటికి భోగాలు అందని మానిపళ్లు కావు. కానీ అందులో సారంలేదని గ్రహించాడు. మోక్షాన్ని కోరుకున్నాడు. శ్రీకాళహస్తీశ్వరుడికి ఆత్మనివేదనం చేసుకున్నాడు. తన దోషాల్ని విన్నవించి ఆత్మ ప్రక్షాళనం చేసుకున్నాడు. సాంసారిక జీవితం పట్ల వైముఖ్యం ప్రదర్శించాడు. ధూర్జటి అంటే పరమేశ్వరుడు. బరువైన జటల సమూహంతో భాసిల్లే దేవుడు. శ్రోత శ్రీకాళహస్తీశ్వరుడు. వక్త కవి ధూర్జటి.
‘శ్రీకాళహస్తీశ్వరా! నా మనసు తరుణుల సౌఖ్యాన్ని, పుత్రమిత్ర సిరులపై వ్యామోహాన్ని వదిలినట్లే ఉంటుంది కానీ వదలదు’ అంటాడు. ప్రతి పద్యంలోనూ కవి లోకానుభవం, అనుభూతి, సత్యసందర్శనం సువ్యక్తమయ్యాయి. ‘అంతా మిథ్య తలంచి చూచిన’ అనే పద్యంలో భారతీయ వేదాంతసారం మొత్తాన్ని కవి హృద్యంగా పొందుపరచాడు. ధూర్జటి వేదవేదాంగాలు చదివాడు. శాస్త్రాల లోతులూ చూశాడు. సాలెపురుగు ఏ వేదాలు చదవలేదని, పాము ఏ శాస్త్రాలూ పరికించలేదని, ఏనుగు ఎక్కడా విద్య నేర్చుకోలేదని, చెంచు బాలుడు తిన్నడు ఏ జ్ఞానం లేని అమాయకుడని వీళ్లంతా అచంచల భక్తివల్లనే జీవన్ముక్తులయ్యారని గ్రహించాడు.
శివనామస్మరణం వల్ల అన్నీ స్వాధీనమవుతాయని విశ్వసించాడు ఈ భక్తకవి. ‘శివ శివ’ అని పలికేసరికి వజ్రం పుష్పంలా, నిప్పు మంచులా, సముద్రం నేలలా, పగవారు స్నేహితుల్లా, విషం అమృతంలా మారడం సాధ్యమని భావించాడు. ఇంద్రియాలు బలమైనవి. ఎంతటి విద్వాంసుడినైనా అవి లొంగదీస్తాయి. ఏ ఇంద్రియంతో ఏం చేసినా అది కర్మ. దానివల్ల పాపం కలుగుతుంది. ఇంద్రియసౌఖ్యం కోసం వెంపర్లాడటమంటే పాపం మూటగట్టుకోవడమేనని హెచ్చరించిన ధూర్జటి, అలాంటి ఇంద్రియాల్ని ఎందుకు సృష్టించావయ్యా అని పరమేశ్వరుణ్ని ప్రశ్నించాడు.
ఆత్మవంచన లేని అంతశ్శుద్ధితో ముక్తికాంతాసమ్మిళితంగా ఈ శతకం రచించాడు ధూర్జటి. నిశ్చలభక్తుడైన ఈ కవి శివుణ్ని సర్వస్వంగా భావించి ‘నిన్ను నమ్మిన రీతి నమ్మనొరులన్’ అన్నాడు. కవితాకళను దివ్యార్చన కళగా చేశాడు ధూర్జటి. తెలుగువారికి నిత్యపారాయణ యోగ్యం ఈ శతకం.
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్