దృష్టికోణం
ఒకసారి ఓ సంస్కృత పండితుడు కబీర్ దగ్గరికొచ్చి ‘ఏం చేస్తున్నారు ప్రస్తుతం’ అని అడిగాడు. ‘మనసును ప్రాపంచిక విషయాలనుంచి వేరుచేసి భగవంతుడి పాదపద్మాలకు అతికిస్తున్నాను’ అని జవాబిచ్చారాయన. ఇదే ఏకాగ్రత లేదా ధారణ... మనసును ఒకే ఆలోచనపై ఉంచడం. వేదాంతులు
ఒకసారి ఓ సంస్కృత పండితుడు కబీర్ దగ్గరికొచ్చి ‘ఏం చేస్తున్నారు ప్రస్తుతం’ అని అడిగాడు. ‘మనసును ప్రాపంచిక విషయాలనుంచి వేరుచేసి భగవంతుడి పాదపద్మాలకు అతికిస్తున్నాను’ అని జవాబిచ్చారాయన. ఇదే ఏకాగ్రత లేదా ధారణ... మనసును ఒకే ఆలోచనపై ఉంచడం. వేదాంతులు మనసును ఆత్మ పైన నిలుపుతారు. హఠయోగులు, రాజయోగులు వారి దృష్టిని ఆరు చక్రాల పైన, శక్తి కేంద్రాల పైన కేంద్రీకరిస్తారు. భక్తులు దృష్టిని తమ తమ ఇష్టదేవతల పైన లగ్నం చేస్తారు.
అభిలషించేవారికి ఏకాగ్రత ఎంతో అవసరం. దృష్టి నిలిపేటప్పుడు మనసులోని విభిన్న కిరణాలు ఒక చోట కేంద్రీకృతమవుతాయి. మనసు ఎగిరిపడదు. గాఢమైన ఏకాగ్రత ఉన్నప్పుడు శారీరక స్పృహగానీ, పరిసరాలను పట్టించుకోవడంగానీ ఉండదు. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత ఏకాగ్రతతో ఉంటారు. ఆధ్మాత్మిక లక్ష్యాల్లో ఏకాగ్రత అనంత స్థాయిలో అవసరమవుతుంది.
చదరంగంలాంటి ఆటలకు ఏకాగ్రత ఎంతో అవసరం. ఏకాగ్రత అనేక రకాలుగా వ్యక్తీకరణం చెందుతుంది. తీవ్ర భావపరంపరగా శక్తి వెలువడటం సాధుమార్గంగా గోచరిస్తుంది.
ఉన్నతస్థాయుల్లో ఏకాగ్రత ఎంతో లోతుగా ఉండి, అభ్యాసంలో ప్రశ్నలకందని స్థాయికి చేరుతుంది. యోగిని పూర్తిగా అతడి ఏకాగ్రతతోనే గుర్తిస్తారు.
ఒక విషయం అధ్యయనం చేయాలనే కోరిక ఉంటే, ముందుగా దాన్ని ఇష్టపడాలి. ఆ ఇష్టమే లేకపోతే దానిపట్ల శ్రద్ధ ఉండదు. ఏకాగ్రతకు చోటుండదు. ఇక ఆనందం ఎక్కడుంటుంది? ఏకాగ్రత కుదరడం లేదని చాలామంది చెప్పడానికి అదే ప్రధాన కారణం. ప్రాథమిక సమస్య ఇష్టం లేకపోవడం. మనిషి దేన్నైతే విని అవగాహన చేసుకోవాలనుకుంటాడో దానిలో అతడు లీనమైపోవాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి వినికిడి కళ గురించి ఉపదేశిస్తాడు. మనసుతో విని, తాను చెప్పేదాన్ని ఆకళించుకొమ్మంటాడు.
తేనెటీగ ఒక చోటు నుంచి మరో చోటుకు ఎగురుతూ, నచ్చిన పూలను ఎంపిక చేసుకుని వాలుతుంది. అది ప్రయాణించే బాటలో ఎన్నో ముళ్లుంటాయి. అవరోధాలుంటాయి. ఎంతో నేర్పుగా వెళ్ళి పూలను ఎంపిక చేసుకుని, నిరంతర శ్రమతో ఆ అమృతాన్ని సేకరిస్తుంది. అనుకున్న లక్ష్యం పూర్తికాగానే, క్షణం కూడా వృథా చేయకుండా నేరుగా తేనెతుట్టెను చేరుకుంటుంది. సేకరించి తెచ్చిన తేనెను భద్రపరుస్తుంది. దీనికి ఎంతో ఏకాగ్రత అవసరం. చలించకుండా ఉండే శ్రద్ధ, పట్టుదల అవసరమన్న పాఠాన్ని మనుషులు తేనెటీగ నుంచి నేర్చుకోవాలి.
ఆ సృష్టికర్త ఈ భూమ్మీదకు ఇంతమందిని పంపించాడంటే దానికి కారణం లేకపోలేదు. ఆధ్యాత్మిక మూర్తిమత్వానికి కావాల్సిన పరిపూర్ణతను సాధించడానికి ఎదురయ్యే తీపి చేదు అనుభవాలను అసాధారణమైన స్ఫూర్తితో ఎదుర్కొంటూ, ఎంతో ఎరుకతో ఆధ్యాత్మికంగా మనిషి ఎదగాలి. లక్ష్యం ఏదైనా పూర్తి ఏకాగ్రత అవసరం. మార్గంలో ధ్యానభంగం కలిగించే పరిస్థితులు ఎదురుకావడం సహజం. అనేకానేక ఆకర్షణలకు లోనై వాటివైపు అనవసరంగా దృష్టి మళ్ళుతుంటుంది. మనిషి సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఓర్పు, కరుణలతో ఉంచడానికి- ప్రతీకారం వ్యతిరేక భావనల్లాంటివి లేకుండా క్షమాగుణం కలిగి ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలని సృష్టికర్త ఉద్దేశం.
సూదిలో దారం ఎక్కించాలంటే ముందు విడివిడిగా కనిపించే దారపు పోగులను ఒకటిగా చేసి కొనదేరేలా చేస్తాం- సులభంగా దారం ఎక్కించడానికి. అదే విధంగా విచ్చలవిడిగా ఉండే కోరికల్ని తొలగించుకుని, అహంకారాన్ని వదిలిపెట్టి, వినమ్రతతో మనసును దైవంపైన లగ్నం చేయడమే- ఏకాగ్రత.
- మంత్రవాది మహేశ్వర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధర్మమే సర్వం
‘ధర్మం పాటించండి’ అనే మాట సాధారణంగా వినిపిస్తుంది. రెండక్షరాల ఈ పదం వెనక చాలా పెద్దభావం ఉంది. లోతైన వివరణ ఉంది. చేయదగినపని, లక్షణం, స్వభావం, పద్ధతి, తగినది, దానగుణం అనే వివిధ అర్థాల్లో ఈ పదాన్ని వాడతారు. సమాజంలో ప్రతివారికీ ఏదో ఒక చేయదగిన పని ఉంటుంది. -
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్