Antaryami: నిరంతర అభ్యాసం
మనం చేసే ప్రతి పనీ సరోవరం ఉపరితలంపై సంచరించే అల వంటిది. అల క్షణాల్లోనే అదృశ్యమవుతుంది. మనసులో తలెత్తే ఆలోచనలు మనం చేసే పనిలాగే క్షణభంగురాల్లా అనిపిస్తాయి. కానీ, లోపలి
మనం చేసే ప్రతి పనీ సరోవరం ఉపరితలంపై సంచరించే అల వంటిది. అల క్షణాల్లోనే అదృశ్యమవుతుంది. మనసులో తలెత్తే ఆలోచనలు మనం చేసే పనిలాగే క్షణభంగురాల్లా అనిపిస్తాయి. కానీ, లోపలి పొరల్లో అవి సంస్కార రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. అనేక సంస్కారాల తుది రూపమే ఆధ్యాత్మిక ఔన్నత్యం.
అభ్యాసం మనిషి స్వభావంలోనే ఉంది. ఒక కొత్త అలవాటును అలవరచుకోవడానికి దృఢమైన సంకల్పం కావాలి. చేపట్టే పని ఏదైనా అభ్యాసం లేకపోతే నైపుణ్యం లోపిస్తుంది. అప్పుడు భయం మనసులో చొరబడి సంకల్పాన్ని అస్థిరపరుస్తుంది.
గురుకులంలో ద్రోణాచార్యుడి వద్ద పాండవులు కౌరవులు విలువిద్య అభ్యసించారు. ఓ రోజు ద్రోణుడు శిష్యుల విద్యను పరీక్షించదలచి దూరంగా ఓ నమూనా పక్షి ఉంచాడు. దాని కంటికి గురిపెట్టి బాణం వెయ్యాలని యుధిష్ఠిరుణ్ని ఆదేశించాడు. ఈ సమయంలో నీకు ఏమి కనిపిస్తున్నదని అడిగాడు. పక్షి కనిపిస్తోందన్నాడు యుధిష్ఠిరుడు. నీకు విలువిద్యలో అభ్యాసం ఇంకా అవసరం వెళ్ళమన్నాడు. అలాగే మిగిలిన వారంతా పరీక్షలో విఫలమయ్యారు. చివరికి అర్జునుడి వంతు వచ్చింది. తనకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తోందని చెప్పాడు. వెంటనే బాణం సంధించమని ఆదేశించి ఆశీర్వదించాడు ద్రోణుడు. గురితప్పని ధనుర్ధారిగా అర్జునుడు ఎనలేని కీర్తి గడించాడు.
ప్రతిరోజూ ఉదయం చన్నీటితో స్నానం చేస్తున్నప్పుడు ఒక క్లిష్టమైన గణిత సూత్రమో, శ్లోకమో, సంగీతమో సాధన చేయవచ్చు. అభ్యాస సిద్ధికోసం నిరంతర సాధనకు పనికివచ్చే ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకోవాలి. అప్పుడే నిష్ణాణత సిద్ధిస్తుంది. నిరంతర అభ్యాసం వల్ల మనకు తెలియకుండానే ఆమూలాగ్ర పరివర్తన వస్తుంది. సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నాడు వేమన.
కేవలం భావోద్వేగాలతో విజయం వరించదు. ఈ తరహా ఉద్వేగాలు దుర్బల మనస్కుల్లో అధికంగా ఉంటాయి. దక్షిణ గోగ్రహణ సమయంలో కౌరవుల మీద యుద్ధం చేస్తానని ప్రగల్భాలు పలికాడు ఉత్తరకుమారుడు. తీరా యుద్ధక్షేత్రంలోకి అడుగుపెట్టగానే భయానికి లోనయ్యాడు. చివరికి బృహన్నల రూపంలో ఉన్న రథసారథి అర్జునుడు గాండీవంతో యుద్ధం చేసి విజయం సాధించాడు.
ఆత్మ విమర్శ లేదా సింహావలోకనం అత్యుత్తమమైన అభ్యాసం. మృగరాజు తరచూ తన ముఖాన్ని వెనక్కు తిప్పి నడిచి వచ్చిన మార్గాన్ని చూసుకుంటుంది. దీన్ని సింహావలోకనం అంటాం. ప్రతి దినం మన నిత్యకృత్యాలను రాత్రి నిద్రించే ముందు సింహావలోకనం చేసుకోవడం అభ్యాసం చేయాలి. దీనివల్ల స్వీయ నియంత్రణ, నిబద్ధత తద్వారా ఉన్నత వ్యక్తిత్వం సిద్ధిస్తాయి. అద్దంలో ప్రతిబింబం చూసుకుంటూ బాహ్య సౌందర్యానికి మెరుగులు దిద్దినట్టు, అంతరంగంలో చేసుకునే ఆత్మవిమర్శ వల్ల సద్గుణాలు సొంతమవుతాయని బెంజమిన్ ఫ్రాంక్లిన్ సూచించాడు.
మోయలేని బరువులు తలకు ఎత్తుకుంటే పరాజయం పాలవుతాం. అది మరో ప్రయత్నంలో ఉత్సాహ శూన్యుణ్ని చేస్తుంది. తొలి ప్రయత్నంలో లభించే యశస్సు మలి ప్రయత్నానికి ప్రేరణ కావాలి. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనే విధివాదులుగా ఉండకూడదు. అభ్యాసం, ప్రయత్నం ద్వారా దేనినైనా సాధించగలమనుకునే సాధకులుగా ఉండాలి. ఆరువంతుల మానవ ప్రయత్నం, ఏడో వంతు దైవ కృప అన్నారు పెద్దలు. అభ్యాసం ద్వారా మనలోనే దాగి ఉన్న అనంత శక్తిని జాగృతపరచే సాధన చేయాలి. అభ్యాసం ఆధ్యాత్మిక ప్రయాణానికి దోహదపడే నిరంతర స్రవంతి.
- ఎం.వెంకటేశ్వరరావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం