తపోధనులు
పూర్వకాలం మునులు, రుషులు మొదలైనవారు నదీతీరాల్లోగాని, అడవుల్లో గాని కళ్లు మూసుకుని తీక్షణంగా తపస్సు చేసుకునేవారు. దీనికోసం ప్రత్యేకంగా ఆశ్రమాలు ఏర్పాటు చేసుకునేవారు. తమకు తామే కఠిన నియమాలను విధించుకొని దైవధ్యానం కావించడం
పూర్వకాలం మునులు, రుషులు మొదలైనవారు నదీతీరాల్లోగాని, అడవుల్లో గాని కళ్లు మూసుకుని తీక్షణంగా తపస్సు చేసుకునేవారు. దీనికోసం ప్రత్యేకంగా ఆశ్రమాలు ఏర్పాటు చేసుకునేవారు. తమకు తామే కఠిన నియమాలను విధించుకొని దైవధ్యానం కావించడం తపస్సు ముఖ్య ఉద్దేశం. కాలాలు, రుతువులు మారినా కఠోర తపోదీక్ష సాగించేవారు. వారికి తపస్సే సర్వం.
ఎండలో వానలో తిండీతిప్పలు మానేసి ధ్యానించడమే తపస్సు అని వారి భావన. కానీ, అందరికీ ఆమోదయోగ్యమైన మూడు విధాల తపస్సులను సూచించారు గీతాచార్యులు. మానసికంగా ఉండే మాలిన్యాలను తొలగించడమే తపస్సు ప్రధాన ధ్యేయం. అదే మోక్షానికి కారణం కాగలదు కూడా. జీవిత పరమార్థ సాధనకు ఇది చాలా ప్రధానమైనది.
మొదటిది శారీరక తపస్సు. ఇందులో అయిదు సాధనాల గురించి వివరించారు. పెద్దలను సేవించడం, పూజించడం ప్రధానం. పెద్దలను, పండితులను, జ్ఞానులను పూజించడం, సేవించడం వల్ల రెండు మహత్తర ఫలితాలు కలుగుతాయి. అవి వారి అనుగ్రహం లభించడం, తమ అహంకార అభిమానాలు నశించడం.
ఆధ్యాత్మిక మార్గంలో సర్వేశ్వరుడు, సద్గురువులు, మహాత్ముల అనుగ్రహం లేనిదే లౌకికమైన మాయ నశించదు. ప్రతిబంధకాలు తొలగిపోవు. కాబట్టి పూజ, సేవలతో వినయ విధేయతలతో వారి అనుగ్రహం, ఆశీర్వాదం సంపాదించాలి. అలాంటి మహాత్ములను సత్క రించడం, సేవించడమే ఒక విధమైన తపస్సు. సాధకుడు చాలా జాగ్రత్త వహించి పరిస రాల శుభ్రత, శుచిత్వం, సాత్వి కాహార స్వీకరణ లాంటి సద్గు ణాలతో శారీరక, మానసిక మాలిన్య త్యాగాల ద్వారా మన సును శుచిగా ఉంచుకోవాలి. త్రికరణ శుద్ధితో సత్ప్రవర్తన కలిగి ఉండటం దీనికి అవసరం.
బాహ్యాంతరాలు శుచిగా ఉంచుకోవడమే శారీరక తపస్సు. ఇతరులకు బాధ కలిగించనిది, సత్యమైనది, ప్రియంగాను, హితంగాను ఉండేదైన వాక్కు, వేదాల అధ్యయనం మొదలైన వాటిని వాచక తపస్సుగా వ్యవహరిస్తారు. మనసును నిశ్చలంగా ఉంచుకోవడం, ముఖంలో ప్రసన్నత, దైవధ్యానం, మనో నిగ్రహం, పరిశుద్ధ భావం కలిగి ఉండటం... ఇవన్నీ మానసిక తపస్సు కిందకు వస్తాయి.
ఇవికాక సాత్విక, రాజసిక, తామసిక తపస్సుల గురించి మరొక వివరణ ఉంది. సాత్విక తపస్సును ఆచరించేవారు మూడు సుగుణాలు కలిగి ఉండాలి. వారు పరమ శ్రద్ధాపరులై ఉండాలి. ఫలాన్ని ఆశించకుండా కర్మలను చేయాలి. నిశ్చల చిత్తం కలిగి ఉండాలి. ఇలాంటి ఉత్తమ స్వభావాలు కలిగి పైన తెలిపిన శారీరక, మానసిక, వాచక తపస్సులను ఆచరిస్తే దాన్ని సాత్విక తపస్సు అంటారు.
ఇతరులు తనను సత్కరించాలని, గౌరవించాలని, పూజించాలనే డంబంతో చేసే తపస్సు అస్థిరమై అనిశ్చిత ఫలాన్ని కలిగి ఉంటుంది. దీన్ని రాజసిక తపస్సు అంటారు. కాబట్టి విజ్ఞులు దీన్ని అనుసరించకూడదు. మూర్ఖపు పట్టుదలతో శుష్క ఉపవాసాల ద్వారా శరీరాన్ని బాధించుకుంటూ తపస్సు చేస్తారు కొందరు. ఇతరులను నాశనం చేయాలనే ఉద్దేశంతో ఈ తపస్సు చేస్తారు. దీన్ని తామసిక తపస్సు అంటారు. ఇది ఎవరికీ ఆచరణీయం కాదు.
తపస్సును దుర్వినియోగం చేయడం మరో పాపకార్యం అవుతుంది. కాబట్టి దాన్ని పోగొట్టుకుని రాజసిక, తామసిక తపస్సును ఆశ్రయించకుండా సాత్విక తపస్సును సన్మార్గంలో సక్రమంగా ఆచరించి దైవప్రాప్తి కోసం ప్రయత్నం చేస్తే సత్ఫలితాన్నిస్తుంది. లోకంలో శాంతిసౌఖ్యాలు వెల్లివిరుస్తాయి.
- వి.ఎస్.రాజమౌళి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సింహాచల చందనోత్సవం
తెలుగునాట వెలసిన సుప్రసిద్ధ నరసింహ క్షేత్రాల్లో సింహాచలం ఒకటి. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో తృతీయ చతుర్థ అవతారాల కలయికతో వరాహ లక్ష్మీనృసింహస్వామిగా కొలువై ఉన్న దైవాన్ని అశేష భక్తకోటి దర్శించి సేవిస్తుంటారు. గోస్తని శారదా నదుల పరీవాహక ప్రాంతం మధ్య ఈ గిరిక్షేత్రం నెలకొని ఉంది. -
లోకులు పలు కాకులు
ఈ నానుడి మనం తరచుగా వింటుంటాం. లోకంలో ఉన్న మనుషుల్లో ఏ ఒక్కరి అభిప్రాయమూ వేరొకరి అభిప్రాయంతో దాదాపుగా కలవదు. ఎవరి ఆశయాలు వారివి. ఎవరి అభిరుచులు వారివి. ఎవరి అలవాట్లు వారివి. ఒకరినొకరు మార్చడమనేది అసాధ్యం. అసంభవం. -
శాంతి సౌభాగ్యాలు
కష్టకాలంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రశాంతమైన మనసులో శుభకరమైన ఆలోచనలు పుడతాయి. సమస్యలకు పరిష్కారాలు గోచరిస్తాయి. శాంతచిత్తులు రాగ ద్వేష క్రోధ రహితులవుతారు. -
సాధన పంచకం
మానవ జీవితాన్ని సక్రమ మార్గంలోకి మరల్చడానికి ఆదిశంకరాచార్యులు చేసిన రచనల్లో సాధన పంచకం ఒకటి. ఇందులో ఉన్నవి అయిదు శ్లోకాలే! ప్రతి శ్లోకానికి నాలుగు పాదాలు, ప్రతి పాదంలో రెండు బోధనల చొప్పున ఎనిమిది అంశాలు. వెరసి అయిదు శ్లోకాల్లో మొత్తం నలభై ఉపయోగకర సూత్రాలను బోధిస్తుందీ సాధన పంచకం. -
ధర్మ స్వరూపం
ఏ పని చేస్తే మనకు గానీ ఇతరులకు గానీ మంచి జరుగుతుందో అది ధర్మం. ఆ ధర్మం వల్ల మనుషులకు గానీ పశుపక్ష్యాదులకు గానీ నష్టం కలగకూడదు. పాంచభౌతిక పదార్థాలకూ చేటు కలగకూడదు. అటువంటి ధర్మం వల్ల సర్వత్రా మంచే జరగాలి. ధర్మం సముద్రం వంటిది. అది ఎంతో లోతైనది. కడలిలో రత్నాలు దాగి ఉన్నట్టే ధర్మంలో వినయం, శీలం వంటి సుగుణాలు ఇమిడి ఉంటాయి... -
విద్యాదానం
విద్య సంస్కారాన్ని నేర్పుతుంది. నైతికతను పెంచుతుంది. విద్య ద్వారా ఏది దైవమో, ఏది ధర్మమో, ఏది జడమో, ఏది చేతనమో, ఏది మట్టో, ఏది మాణిక్యమో బోధపడుతుంది. విద్యకు, వినయానికి అవినాభావ సంబంధముంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో విద్య నేర్పుతుంది. -
వైరాగ్య సుఖం
మనిషికి ఆశలు తీరనప్పుడు, ప్రయత్నాలు విఫలమైనప్పుడు, విషాద సంఘటనలు సంభవించినప్పుడు నిరాశా నిస్పృహలతో జీవితంపై విరక్తి పుట్టి సహజంగానే వైరాగ్య భావాలు ముంచెత్తుతాయి. నిజానికి వైరాగ్యమంటే తాత్కాలికంగా వచ్చిపోయే విరక్తి భావతరంగాలు మాత్రమే కాదు. -
పొందిగ్గా విజ్ఞతాయుతంగా...
సమయం సందర్భం తెలిసి మాట్లాడటం సంస్కారవంతుల లక్షణం. అలా కాకుండా అన్నింట్లో తలదూర్చి అప్రస్తుత అధిక ప్రసంగాలు చేసేవారు తమకు తెలియకుండానే అవివేకాన్ని బయట పెట్టుకుంటారు. మాటలపై అదుపు, వాటి ప్రయోగంపై పొదుపు లేకపోతే జీవితం గండిపడ్డ చెరువులా మారుతుంది. దేని గురించి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. -
గోవిందా... గోవింద!
పరమాత్ముడి అనుగ్రహం కలగాలంటే నామస్మరణే సులభమైన మార్గం. అదే విషయాన్ని పోతన ‘నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని...’ అని ప్రహ్లాదుడి పాత్రతో చెప్పించాడు. ‘గోవింద గోవిందయని పిలువరే’ అన్న పాటలోనూ ఆ విషయాన్నే చెప్పాడు అన్నమయ్య. -
నమామి నర్మదా
నదుల్ని ప్రత్యక్ష దైవస్వరూపాలుగా యజుర్వేదం అభివర్ణించింది. అలాంటి నదులతోనే నాగరికతలు పరిఢవిల్లాయి. జీవకోటి మనుగడకు పరమాత్మ జలాన్ని సృష్టించాడని పద్మపురాణోక్తి. నదుల్ని జలదేవతలుగా, నదీమతల్లులుగా ఆరాధించడం మన సంప్రదాయం. ఆ నేపథ్యంలోనిదే నదులకు నిర్వహించే పుష్కరోత్సవం. -
కర్మయోగం - జ్ఞానయోగం
పరమాత్మ సాక్షాత్కారం పొందడానికి మన శాస్త్ర గ్రంథాలు రెండు మార్గాలను సూచించాయి. వాటిలో ఒకటి కర్మయోగం, మరొకటి జ్ఞానయోగం. లోకంలో కర్మలు చేయకుండా ఎవరూ ఉండరు. ఏదో ఒకపని చేస్తూ ఫలాన్ని ఆశిస్తారు. -
విజయానికి సోపానం
జీవితంలో ఏదో సాధించాలన్న తపన అందరికీ ఉంటుంది. ఇలాంటి తపనే లేకపోతే మనిషి బతుకు బండబారుతుంది. గుండె రాయిగా మారి చివరికి ఆ మనిషి శిలగా మిగిలిపోతాడు. జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి లక్ష్యం అంటూ ఉండాలి. ఏం కావాలో, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో... వీటిని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. -
సహనానికీ హద్దుంటుంది...
సహనం సంస్కారవంతమైన పదం. సహనశీలత గొప్ప మానవతా గుణం. సహనంతోనే శాంతిని సాధించాలి. నిజమే! ఎంతవరకు సహనం వహించాలనేదీ ఆలోచించాలి. కొంతవరకే సహనానికి మంచి ఫలితం ఉంటుంది. హద్దు మీరితే ఎంతటి సహనశీలుడైనా తిరగబడతాడు. సహనాన్ని కొందరు బలహీనతగా, చేతగానితనంగా భావిస్తారు. అనువుగాని చోట అధికులమనరాదు. ఒదిగి ఉండటం వల్ల చిన్నతనం రాదు. -
ధర్మమే సర్వం
‘ధర్మం పాటించండి’ అనే మాట సాధారణంగా వినిపిస్తుంది. రెండక్షరాల ఈ పదం వెనక చాలా పెద్దభావం ఉంది. లోతైన వివరణ ఉంది. చేయదగినపని, లక్షణం, స్వభావం, పద్ధతి, తగినది, దానగుణం అనే వివిధ అర్థాల్లో ఈ పదాన్ని వాడతారు. సమాజంలో ప్రతివారికీ ఏదో ఒక చేయదగిన పని ఉంటుంది. -
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు.
తాజా వార్తలు (Latest News)
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు