ముక్తిదాయకం
గాలి వీస్తున్నట్టుగానో, నది ప్రవహిస్తున్నట్టుగానో మనిషి మదిలో నిరంతరం ఆలోచనల స్రవంతి కొనసాగుతూ ఉంటుంది. వాటికి కర్త, కర్మ, క్రియ మనం ఎంతమాత్రం కాదు. ప్రదేశాలు, పరిస్థితులు, జీవితంలో తటస్థపడిన మనుషులు వారి మనస్తత్వాలు, గత స్మృతులు... ఇలా అనేకం ఆలోచనల తేనెతుట్టెను నిరంతరం కదుపుతూనే ఉంటాయి.
గాలి వీస్తున్నట్టుగానో, నది ప్రవహిస్తున్నట్టుగానో మనిషి మదిలో నిరంతరం ఆలోచనల స్రవంతి కొనసాగుతూ ఉంటుంది. వాటికి కర్త, కర్మ, క్రియ మనం ఎంతమాత్రం కాదు. ప్రదేశాలు, పరిస్థితులు, జీవితంలో తటస్థపడిన మనుషులు వారి మనస్తత్వాలు, గత స్మృతులు... ఇలా అనేకం ఆలోచనల తేనెతుట్టెను నిరంతరం కదుపుతూనే ఉంటాయి. అనవరతం జనించే ఆలోచనలను అదిమిపట్టడం, అరికట్టడం ఎవరికీ సాధ్యంకాదు. అదొక నిర్విరామ, నిరాఘాటమైన ప్రక్రియ. కాకపోతే కొంత సాధనతో ఆలోచనలను సరైన దారిలో ప్రవహింపజేయవచ్చు.
ఒక మనిషిని చూస్తే వెనువెంటనే మంచో చెడో ఏదో ఒక అభిప్రాయం అసంకల్పితంగా కలుగుతుంది. అప్పటిదాకా కలవని మనిషి పట్ల అలాంటి ఒక అభిప్రాయం కలగడానికి కారణమేమిటి, అసలు ఎందుకు కలగాలి? మనసు అప్పటిదాకా ప్రోది చేసుకున్న అనుభవాలతో మంచివైపో, చెడువైపో మొగ్గి ఉంటుంది. ఆ దిశగానే కనిపించిన రూపాన్ని బట్టి ఒక అంచనాకు వస్తుంది. చాలామంది తాము మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తిని చూసినప్పుడు కలిగిన అభిప్రాయం అనంతర కాలంలో తప్పో ఒప్పో కావడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది.
దీనికి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. మనకు ఒక అపరిచితుడి నుంచి ఫోన్ వచ్చినప్పుడు అతడి గొంతు విన్న మన మనసు ఒక రూపం ఏర్పరచి, అతడెప్పుడు మాట్లాడినా ఆ రూపమే మదిలో మెదిలేలా చేస్తుంది. భవిష్యత్తులో అతడు ఎదురైనప్పుడు కలిగిన వాస్తవ రూప దర్శనంతో, మనసులో ఉన్న రూపం అదృశ్యమై ఆశ్చర్యపోవడం మనవంత వుతుంది. ఎందుకిలా జరుగుతుందంటే, మనసు పని రూపకల్పన. నవల చదువుతున్నప్పుడు సినిమా చూస్తున్న అనుభూతి కలగడానికి మనసు మాయాజాలమే కారణం. మనసు నిశ్చలంగా ఉండాలంటారు కొందరు పెద్దలు. అలా ఉంటే- తటస్థంగా వెలిగే దీపానికి, కాగితం మీది దీపం చిత్రానికీ తేడా ఏముంటుంది? సున్నితమైన గాలి అలలకు వయ్యారాలు పోతూ వెలిగే దీపమే కళ్లకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని చేకూరుస్తుంది. అలాగని పెద్ద ఎత్తున వీచే గాలిలో దీపాన్నుంచితే రెపరెపలాడుతూ, ఆరిపోతుందేమోనన్న ఆందోళన కలగడం ఖాయం. మనసులోని ఆలోచనల ప్రవాహం మనం ఏర్పరచిన హద్దుల నడుమ, పద్ధతయిన ఒరవడితో సాగిపోయేలా చేయడం ముఖ్యం. మనస్తత్వ నిపుణులు తరచూ చెప్పే భావోద్వేగాల అదుపు అంటే అదే. భావవ్యక్తీకరణ అన్నది ఒక కళ. అవసరానికి తగినట్టు, విషయానికి ప్రాధాన్యం ఇస్తూ తూచినట్టుగా పదాలను వెలువరించే వ్యక్తి పదిమంది గౌరవం పొందుతాడు. అతడి మాటలు విలువైనవి, ఆచరణీయం అవుతాయి.
సానుకూల ఆలోచనలు మనిషి ఉన్నతికి దోహదం చేస్తాయి. కనిపించే మనిషి రూపానికి విలువను ఆపాదించేవి, గుర్తింపును తెచ్చేవి మనసులో అహర్నిశం ఊరే ఆలోచనలే. ఆలోచనలు మాటల రూపంలో పెదవులు దాటడానికి, చేతలుగా బహిర్గతం కావడానికన్నా ముందు మనసును మరొక్కసారి పరిశీలించుకునే తర్ఫీదు ఇస్తే- మానవుడు మాననీయుడిగా కీర్తిప్రతిష్ఠలు పొందుతాడు.
పొరపాటు జరిగాక క్షమించమని అడగడం మనిషితనం. పొరపాటు చెయ్యకుండా ఉండటం ఉత్తమ వ్యక్తిత్వానికి నిదర్శనం. వ్యక్తిత్వ వికాసంతో కూడిన ఆధ్యాత్మిక ప్రయాణం పరమార్థ సాధకం, ముక్తిదాయకం.
- ప్రతాప వెంకట సుబ్బారాయుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిర్ణయాధికారం
ప్రభువును సాక్షాత్తు విష్ణు అంశ సంభూతుడిగా శాస్త్రాలు చెబుతున్నాయి. పాలకుడు తీసుకునే నిర్ణయాల కారణంగా ఎన్నో కోట్లమంది ప్రజల జీవితాలు ప్రభావితమవుతాయి. పాలన చేసే వ్యక్తి అనేకమంది ప్రజానీకంలాగానే భూమిపై జన్మిస్తాడు. -
సింహాచల చందనోత్సవం
తెలుగునాట వెలసిన సుప్రసిద్ధ నరసింహ క్షేత్రాల్లో సింహాచలం ఒకటి. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో తృతీయ చతుర్థ అవతారాల కలయికతో వరాహ లక్ష్మీనృసింహస్వామిగా కొలువై ఉన్న దైవాన్ని అశేష భక్తకోటి దర్శించి సేవిస్తుంటారు. గోస్తని శారదా నదుల పరీవాహక ప్రాంతం మధ్య ఈ గిరిక్షేత్రం నెలకొని ఉంది. -
లోకులు పలు కాకులు
ఈ నానుడి మనం తరచుగా వింటుంటాం. లోకంలో ఉన్న మనుషుల్లో ఏ ఒక్కరి అభిప్రాయమూ వేరొకరి అభిప్రాయంతో దాదాపుగా కలవదు. ఎవరి ఆశయాలు వారివి. ఎవరి అభిరుచులు వారివి. ఎవరి అలవాట్లు వారివి. ఒకరినొకరు మార్చడమనేది అసాధ్యం. అసంభవం. -
శాంతి సౌభాగ్యాలు
కష్టకాలంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రశాంతమైన మనసులో శుభకరమైన ఆలోచనలు పుడతాయి. సమస్యలకు పరిష్కారాలు గోచరిస్తాయి. శాంతచిత్తులు రాగ ద్వేష క్రోధ రహితులవుతారు. -
సాధన పంచకం
మానవ జీవితాన్ని సక్రమ మార్గంలోకి మరల్చడానికి ఆదిశంకరాచార్యులు చేసిన రచనల్లో సాధన పంచకం ఒకటి. ఇందులో ఉన్నవి అయిదు శ్లోకాలే! ప్రతి శ్లోకానికి నాలుగు పాదాలు, ప్రతి పాదంలో రెండు బోధనల చొప్పున ఎనిమిది అంశాలు. వెరసి అయిదు శ్లోకాల్లో మొత్తం నలభై ఉపయోగకర సూత్రాలను బోధిస్తుందీ సాధన పంచకం. -
ధర్మ స్వరూపం
ఏ పని చేస్తే మనకు గానీ ఇతరులకు గానీ మంచి జరుగుతుందో అది ధర్మం. ఆ ధర్మం వల్ల మనుషులకు గానీ పశుపక్ష్యాదులకు గానీ నష్టం కలగకూడదు. పాంచభౌతిక పదార్థాలకూ చేటు కలగకూడదు. అటువంటి ధర్మం వల్ల సర్వత్రా మంచే జరగాలి. ధర్మం సముద్రం వంటిది. అది ఎంతో లోతైనది. కడలిలో రత్నాలు దాగి ఉన్నట్టే ధర్మంలో వినయం, శీలం వంటి సుగుణాలు ఇమిడి ఉంటాయి... -
విద్యాదానం
విద్య సంస్కారాన్ని నేర్పుతుంది. నైతికతను పెంచుతుంది. విద్య ద్వారా ఏది దైవమో, ఏది ధర్మమో, ఏది జడమో, ఏది చేతనమో, ఏది మట్టో, ఏది మాణిక్యమో బోధపడుతుంది. విద్యకు, వినయానికి అవినాభావ సంబంధముంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో విద్య నేర్పుతుంది. -
వైరాగ్య సుఖం
మనిషికి ఆశలు తీరనప్పుడు, ప్రయత్నాలు విఫలమైనప్పుడు, విషాద సంఘటనలు సంభవించినప్పుడు నిరాశా నిస్పృహలతో జీవితంపై విరక్తి పుట్టి సహజంగానే వైరాగ్య భావాలు ముంచెత్తుతాయి. నిజానికి వైరాగ్యమంటే తాత్కాలికంగా వచ్చిపోయే విరక్తి భావతరంగాలు మాత్రమే కాదు. -
పొందిగ్గా విజ్ఞతాయుతంగా...
సమయం సందర్భం తెలిసి మాట్లాడటం సంస్కారవంతుల లక్షణం. అలా కాకుండా అన్నింట్లో తలదూర్చి అప్రస్తుత అధిక ప్రసంగాలు చేసేవారు తమకు తెలియకుండానే అవివేకాన్ని బయట పెట్టుకుంటారు. మాటలపై అదుపు, వాటి ప్రయోగంపై పొదుపు లేకపోతే జీవితం గండిపడ్డ చెరువులా మారుతుంది. దేని గురించి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి. -
గోవిందా... గోవింద!
పరమాత్ముడి అనుగ్రహం కలగాలంటే నామస్మరణే సులభమైన మార్గం. అదే విషయాన్ని పోతన ‘నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని...’ అని ప్రహ్లాదుడి పాత్రతో చెప్పించాడు. ‘గోవింద గోవిందయని పిలువరే’ అన్న పాటలోనూ ఆ విషయాన్నే చెప్పాడు అన్నమయ్య. -
నమామి నర్మదా
నదుల్ని ప్రత్యక్ష దైవస్వరూపాలుగా యజుర్వేదం అభివర్ణించింది. అలాంటి నదులతోనే నాగరికతలు పరిఢవిల్లాయి. జీవకోటి మనుగడకు పరమాత్మ జలాన్ని సృష్టించాడని పద్మపురాణోక్తి. నదుల్ని జలదేవతలుగా, నదీమతల్లులుగా ఆరాధించడం మన సంప్రదాయం. ఆ నేపథ్యంలోనిదే నదులకు నిర్వహించే పుష్కరోత్సవం. -
కర్మయోగం - జ్ఞానయోగం
పరమాత్మ సాక్షాత్కారం పొందడానికి మన శాస్త్ర గ్రంథాలు రెండు మార్గాలను సూచించాయి. వాటిలో ఒకటి కర్మయోగం, మరొకటి జ్ఞానయోగం. లోకంలో కర్మలు చేయకుండా ఎవరూ ఉండరు. ఏదో ఒకపని చేస్తూ ఫలాన్ని ఆశిస్తారు. -
విజయానికి సోపానం
జీవితంలో ఏదో సాధించాలన్న తపన అందరికీ ఉంటుంది. ఇలాంటి తపనే లేకపోతే మనిషి బతుకు బండబారుతుంది. గుండె రాయిగా మారి చివరికి ఆ మనిషి శిలగా మిగిలిపోతాడు. జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి లక్ష్యం అంటూ ఉండాలి. ఏం కావాలో, ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో... వీటిని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. -
సహనానికీ హద్దుంటుంది...
సహనం సంస్కారవంతమైన పదం. సహనశీలత గొప్ప మానవతా గుణం. సహనంతోనే శాంతిని సాధించాలి. నిజమే! ఎంతవరకు సహనం వహించాలనేదీ ఆలోచించాలి. కొంతవరకే సహనానికి మంచి ఫలితం ఉంటుంది. హద్దు మీరితే ఎంతటి సహనశీలుడైనా తిరగబడతాడు. సహనాన్ని కొందరు బలహీనతగా, చేతగానితనంగా భావిస్తారు. అనువుగాని చోట అధికులమనరాదు. ఒదిగి ఉండటం వల్ల చిన్నతనం రాదు. -
ధర్మమే సర్వం
‘ధర్మం పాటించండి’ అనే మాట సాధారణంగా వినిపిస్తుంది. రెండక్షరాల ఈ పదం వెనక చాలా పెద్దభావం ఉంది. లోతైన వివరణ ఉంది. చేయదగినపని, లక్షణం, స్వభావం, పద్ధతి, తగినది, దానగుణం అనే వివిధ అర్థాల్లో ఈ పదాన్ని వాడతారు. సమాజంలో ప్రతివారికీ ఏదో ఒక చేయదగిన పని ఉంటుంది. -
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు