యోగిరాజ వల్లభుడు దత్తుడు
గృహస్థ ధర్మం పేరిట, ఇంద్రియ లోలత్వం పట్ల లాలసత్వం చూపుతూ ప్రజలు అంతర్ముఖత్వానికి దూరమవుతూ ఆత్మతత్వం కనుమరుగవుతున్న వేళ అనసూయ, అత్రి దంపతులకు దత్తుడై ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించడానికి జన్మించాడు దత్తాత్రేయ స్వామి.
గృహస్థ ధర్మం పేరిట, ఇంద్రియ లోలత్వం పట్ల లాలసత్వం చూపుతూ ప్రజలు అంతర్ముఖత్వానికి దూరమవుతూ ఆత్మతత్వం కనుమరుగవుతున్న వేళ అనసూయ, అత్రి దంపతులకు దత్తుడై ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించడానికి జన్మించాడు దత్తాత్రేయ స్వామి. బ్రహ్మ, విష్ణు, రుద్రాంశలతో త్రిమూర్త్యాంశగా మార్గశిర శుక్ల పౌర్ణమినాడు ఉద్భవించాడు స్వామి. ఆ రోజునే దత్తజయంతిగా భక్తజనులు జరుపుకొంటారు. యోగీశ్వరుడై, దుష్ట దైత్య సంహారకుడై, శిష్టజన పాలకుడై, భక్తజనుల పాలిట కల్పతరువై, జగద్రక్షకుడై, తన జ్ఞానబోధతో అనుగ్రహిస్తూ సహ్యాద్రి గుహలలో నివసించసాగాడు.
అనేక వేల సంవత్సరాలు మహా యోగసాధనలు చేసిన మునివృద్ధులకు సైతం అందని మహా చిత్రాలు చూపించి బాలకేళిగా అల్లరి పనులతో వారిని దిగ్భ్రమకు గురిచేసి లోకాన్ని రక్షించాడు. జ్ఞానరూపిణియైన అనసూయా మాత పుత్రవ్యామోహంతో ఆయన నిష్క్రమణను అడ్డుకుని నీకీ చర్మదేహం ఇచ్చింది నేనేనని హెచ్చరిస్తే, తన చర్మాన్ని ఒలిచి ఆమె అజ్ఞాన పొరలు చీల్చి జ్ఞానకాంతిని ప్రసాదించాడు. శాంత మనోహరమైన యతిరూపంలో ఒకసారి, చిత్ర విచిత్ర బీభత్స స్వరూపాల్లో మరోసారి కనిపించి భక్తులను పరీక్షించి పరిరక్షించాడు. కేవలం నామస్మరణతోనే మానవుల పాపాలను, దుఃఖాలను పరిహరిం పజేసిన కరుణాంతరంగుడు దత్త స్వామి. ఒకప్పుడు అవిద్యను సృష్టించి వేదాలను మరచిపోయిన బ్రహ్మదేవుడికి త్రుటికాలంలో సమస్త వేదాలను స్ఫురింపజేశాడు. వృద్ధ ప్రహ్లాదుడి మొరాలకించి పరమహంస యోగాన్ని బోధించి అంతర్జ్యోతి దర్శనం కలిగించాడు. కార్త వీర్యార్జునుడికి దృఢదేహాన్ని, రాజ్యాన్ని అనుగ్రహించి అతడి సందేహ కంటకాలను తొలగించి జ్ఞానయోగాన్ని ప్రసాదించాడు.
శాస్త్రాలన్నీ ఒకే గమ్యాన్ని బోధిస్తాయని, వాటికి విరోధ భావం లేదని మహావాక్యోపదేశాన్ని అను గ్రహించాడు. భూమండలంపై ఇరవై ఒక్కసార్లు క్షత్రియ సంహారం చేసిన పరశురాముడి అశాంతి జ్వాలలను చల్లార్చి ఆత్మవిచార తత్త్వ సిద్ధిని ‘త్రిపురా రహస్యం’ పేరిట వివరించాడు. ఆదరించే దత్తుణ్ని అజ్ఞానంతో మనం విస్మరించినా లోకాంతరాల్లో, జన్మాంతరాల్లో సైతం ఆయన మనల్ని విడిచిపెట్టడంటారు. గాలవపుత్రుడిగా జన్మించిన ధర్మకీర్తిని ఆదరించి స్వామి ధర్మోపదేశం గావించి జ్ఞానభిక్ష ప్రసాదించాడు. కానీ వక్రబుద్ధితో, దుష్టసావాసంతో అహంకరించి స్వామిని దూరం చేసుకున్నా, నీచ స్థితికి చేరిన ధర్మకీర్తిని శిష్య ప్రేమతో ఏకాదశి ఘడియల్లో మరణింపజేసి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు స్వామి.
దత్తప్రభువు ప్రేమాస్పదుడు. నమ్మినవారు దరికి రాలేని స్థితిలో ఉంటే, తానే వారి చెంతకు నడిచివెళ్ళి ఆదుకుని అనుగ్రహించే పరమ పురుషుడు. ఈ యుగంలో శ్రీపాద శ్రీవల్లభులుగా, నృసింహ సరస్వతిగా అవతరించి భక్తులకు ఐహికాముష్మిక ఫలాలను అందించి ఆనందం కలిగించాడంటారు. షోడశావతారాల్లోను, నవనాథుల పేరిట తొమ్మిది అవతారాల్లో మన రాష్ట్రంలోను, రాష్ట్రేతర ప్రాంతాల్లోను వెలసి గురు ఆరాధనా సంప్రదాయంగా పూజలందుకుంటున్నాడు. భక్తుల దోషాలను ప్రేమతో పోగొట్టి, సంపూర్ణసిద్ధి ననుసరించి ఆత్మారామ స్థితిని సమకూర్చే పరిపూర్ణ అవతారం దత్తావతారం. మంగళకరమైన స్వామి నామమే కలుషాలను పరిహరించి పుణ్యాలను సమకూరుస్తుంది. ప్రేమతో, భక్తితో తమను తాము అర్పించుకొనే భక్తులకు కైవల్యానందాన్ని అనుగ్రహిస్తాడు దత్తుడు. తలచినంతనే కరుణించి భక్తి, జ్ఞాన, వైరాగ్య, ముక్తులను అనుగ్రహించే దత్తస్వామి సదా వందనీయుడు.
- మాడుగుల రామకృష్ణ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!