సకల పుణ్యరాశి తులసి
ప్రతి ఇంటా ప్రత్యక్షంగా ఎల్లవేళలా దర్శనమిచ్చే మహాలక్ష్మి ‘తులసి’. సాధారణంగా హైందవ గృహిణులు తులసికోట ముందు దీపారాధన చేసి ప్రదక్షిణ చేసి గాని భోజనం చేయరు.
ప్రతి ఇంటా ప్రత్యక్షంగా ఎల్లవేళలా దర్శనమిచ్చే మహాలక్ష్మి ‘తులసి’. సాధారణంగా హైందవ గృహిణులు తులసికోట ముందు దీపారాధన చేసి ప్రదక్షిణ చేసి గాని భోజనం చేయరు. తులసి కన్యరూపంలో ఓసారి గంగానదీ తీరాన నడిచి వెళుతూంటే వినాయకుడు కనిపించాడు. తాను ధర్మధ్వజుడి కూతురినని, తనను వివాహమాడమని కోరితే గణపతి నిరాకరించాడు. అందుకు కోపించి శపించబోగా, ‘వచ్చే జన్మలో రాక్షస జాతిలో జన్మిస్తావు’ అని గణపతే ఆమెను శపించాడు. తులసి పశ్చాత్తాపాన్ని గ్రహించి తదనంతరం వృక్షరూపం పొంది శ్రీమన్నారాయణుడి గళ సీమను అలంకరిస్తావని వరమిచ్చాడు. తులసి శంఖచూడుడనే రాక్షసుడికి పుత్రికగా జన్మించి జలంధరుణ్ని వివాహమాడింది. విష్ణువు ఆమె పాతివ్రత్యాన్ని భంగంచేసిన తరవాత, శివుడు జలంధరుణ్ని సంహరించగలిగాడు. అటుపిమ్మట తులసి వృక్షరూపం ధరించింది. ఇది బ్రహ్మవైవర్త పురాణ కథనం.
భక్తిగా తులసిని ఆరాధిస్తే ‘తులా’ పురుషుణ్ని ఆరాధించినట్లే అని, తులసీ ప్రదక్షిణంతో అశ్వమేధ యాగం చేసిన పుణ్యం దక్కుతుందని, తులసి తీర్థం గంగాజలం కన్నా నూరురెట్ల ఫలప్రదమైనదని పురాణ కథనం.
శివాలయం లేని గ్రామంలోను, తులసిమొక్క లేని ఇంటిలోను భోజనం చేయరాదని ధర్మశాస్త్రం చెబుతోంది. తులసి మృత్యువును ధిక్కరించేదన్నది పెద్దల మాట. తులసిమొక్క ఉన్న ఇంట హఠాన్మ రణాలు జరగవని చెబుతారు. తులసివనాన్ని భక్తితో పెంచినవారికి ధర్మార్థ కామ మోక్ష ఫలాలను, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని ‘అగస్త్యసంహిత’ చెబుతోంది. వేదమాతను ఆరాధించిన ఫలితాన్ని తులసి ఇస్తుందని శాస్త్రం చెబుతోంది. గోదాదేవి తులసి మాలను అనుదినం అలంకరించి శ్రీరంగనాథ స్వామిలో ఐక్యమైంది. శ్రీకృష్ణతులాభార ఘట్టంలో తులసి ఎంత మహత్తరంగా నిరూపితమైందో తెలిసిందే!
తులసిని వైష్ణవి, అమృత, పవిత్ర, లక్ష్మి అనే పేర్లతో పిలుస్తారు. సంపూర్ణంగా ఎదిగే కాలం శరదృతువు కావడంతో కార్తికమాసంలో తులసిని ఎక్కువగా ఆరాధిస్తారు. తులసి పెద్ద వృక్షం కాదు. కాయ, పండు, కలప ఇవ్వదు. నీడ, గూడునూ ఇవ్వదు. అయినా అనంతమైన ఔషధ గుణాలు అందులో నిక్షిప్తమై ఉన్నాయి. దేవాలయాల్లో తులసిని కలిపిన తీర్థం ఇస్తారు. తులసి సకలరోగ నివారిణి అని అధర్వణవేదం చెబుతోంది. శుభ అశుభ కార్యాలన్నింటిలోను తులసి దళాలను వినియోగిస్తారు.
ప్రధానంగా తులసికి నేల తులసి, అడవితులసి, మరువతులసి, రుద్రతులసి, శ్వేతతులసి, భద్రతులసి, లక్ష్మీతులసి అనే ఏడు పేర్లున్నట్లు చెబుతారు. కృష్ణతులసి అనే పేరు కూడా వ్యవహారంలో ఉంది. తులసిని పున్నమి, అమావాస్య, అష్టమి, ద్వాదశి తిథులలో, మంగళ, శుక్ర, ఆదివారాలలో, పురుడు, మైల, బహిష్టు లాంటి అశుభ తరుణాలలో, పాద రక్షలతో, స్నానాదిక నిత్యకృత్యాల ముందు తుంచకూడదని శాస్త్రం చెబుతోంది. తులసిని నాటడం, నీళ్లు పోయడం, దర్శించడం, స్పృశించడం, ఆరాధించడంవల్ల మనో వాక్కాయ కర్మలతో చేసిన పాపాలన్నీ హరిస్తాయంటారు. గణేశ చతుర్థినాడు గణపతిని తులసిదళాలతో పూజించవచ్చు అంటారు. తులసికి ‘విష్ణువల్లభ’ అనే పేరూ ఉంది. భక్తులు తులసి పూసలమాలతో జపం చేస్తారు. పద్మపురాణం, దేవీభాగవతం, మాఘపురాణం మొదలైన అనేక గ్రంథాల్లో తులసి వృత్తాంతముంది.
చిమ్మపూడి శ్రీరామమూర్తి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్