ఆత్మావలోకనం
చాలామందికి ఆత్మగురించిన ఆలోచనే ఉండదు. ఎన్నిమార్లు భగవద్గీత విన్నా సరే, వేదాంత గ్రంథాలు చదివినా అంతే. అగుపించని ఆత్మ గురించి ఆలోచన ఎందుకు అనుకుంటారు.
చాలామందికి ఆత్మగురించిన ఆలోచనే ఉండదు. ఎన్నిమార్లు భగవద్గీత విన్నా సరే, వేదాంత గ్రంథాలు చదివినా అంతే. అగుపించని ఆత్మ గురించి ఆలోచన ఎందుకు అనుకుంటారు. కనిపించే దేహమే ప్రధానమనుకుంటారు. ఇలా అనుకోవడంలోనే జీవితం గతించిపోతుంది. శక్తులన్నీ ఉడిగిపోయి, వార్ధక్యంలోకి అడుగుపెట్టగానే కొందరికి ఆత్మవిచారం మొదలవుతుంది. ఈ శరీరమిలా అయిపోయిందేమిటి? అలనాటి రూపురేఖలన్నీ ఇలా మారిపోయాయేమిటి? కొంత దిగులు... కొంత విచారం... మనిషిని సతమతం చేస్తుంటాయి. కొందరికి వార్ధక్య భయం ఉంటుంది. వార్ధక్య లక్షణాలు దాచుకునేందుకు అనేక పాట్లు పడతారు. జుట్టుకు రంగు వేసుకుంటారు. పడుచువాళ్లు వేసుకునే దుస్తులు ధరిస్తారు. ఎన్ని పాట్లు పడినా, వార్ధక్య చిహ్నాలు మాయం కావు. యౌవనం తిరి గిరాదు. మార్పులకు మనిషి సిద్ధంగా ఉండాలి. పరిణామ శీలంగల ప్రకృతిలో మార్పు సహజం. అనివార్యం. దీన్ని మనం స్వీకరించాలి. అప్పుడే జీవన సత్యాలు గోచరిస్తాయి. అజేయ ధనుర్ధారిగా ప్రఖ్యాతి పొందిన అర్జునుడు శ్రీకృష్ణ నిర్యాణం తరవాత గాండీవాన్ని మోయ లేనంత అశక్తుడవుతాడు. అప్పుడు గానీ అర్థం కాలేదు, తనలో ఇంతకాలమూ ప్రజ్వరిల్లింది పర మాత్మ దివ్యశక్తి తప్ప తనదంటూ ఏమీ లేదని.
నరనారాయణ రుషుల్లో నరుడే అర్జునుడు. సర్వమానవాళికి ప్రతి నిధి. అందుకే శ్రీకృష్ణుడు గీతాబోధను అర్జునుడి ద్వారా సమస్త మానవజాతికి బహూకరించాడు. గీత ఒక దివ్య ఆధ్యాత్మిక గృహం. సాధకుడు విషాదంతో అందులోకి ప్రవేశిస్తాడు. జయం అనే పద్దెనిమిది అధ్యాయాల అధ్యయనంతో మాయనుంచి విముక్తుడై, యోగిగా పరివర్తన చెందుతాడు. ‘యోగి’ అంటే దైవస్వరూపుడు! ‘నేనే యోగి’ రూపుణ్ని అంటాడు శ్రీకృష్ణుడు. అంటే యోగి వేషధారులంతా దైవస్వరూపులని కాదు. వేమన యోగికి వస్త్రాలే ఉండేవి కావు. రమణ మహర్షులూ అంతే. చిన్న కౌపీనం ధరించేవారు. యోగులు శరీరంతో అనుబంధం పెట్టుకోరు. దానికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వరు. అంతరంగంలో దేదీప్యమానంగా వెలిగిపోయే ఆత్మ వెలుగులు వారి మొహంలో ప్రస్ఫుటమవుతుంటాయి. నిర్మలమైన చూపులు, చెరగని మందహాసంతో- వారి ప్రతి పలుకులో ప్రేమ తొణికిసలాడుతుంది. భగవంతుడి భాష ప్రేమ. ఆయన అనంత ప్రేమ అనేక రూపాల్లో అనుక్షణం మనల్ని ఆదుకుంటూ ఉంటుంది. ఆత్మను స్పృశిస్తూ పరవశింపజేస్తుంటుంది.
ఆ పారవశ్యాన్ని అనుభూతి చెందాలంటే, మన ఆధ్యాత్మిక జీవితం ఆత్మావలోకనంతో ఆరంభం కావాలి. మన చూపులన్నీ బయటి ప్రపంచంపైనే ఉంటాయి. అంతర్యామి నివాసంలోకి చూడాలనే ఆసక్తి మనకు కలిగిననాడు అంతర్నేత్రాలు తెరుచుకుంటాయి. అప్పుడు మనం చూస్తున్న బాహ్యప్రపంచానికన్నా ఎన్నోరెట్లు ఆనందమయ, ప్రశాంత వాతావరణంలోకి మనసు ప్రవేశిస్తుంది. మనోనేత్రాలకు కనిపించే దివ్య దృశ్యాలన్నీ మనల్ని పరవశుల్ని చేస్తాయి. అందులోనే లీనమై, అంతర్యామి దర్శనం కోసం తపిస్తే, దివ్య తేజస్సు ఆవిష్కృతమవుతుంది. అదే రుషులు చెప్పిన ఆత్మసాక్షాత్కారం. ఆ తేజస్సు రూపం దాలిస్తే, అది మన రూపమేనని అర్థమవుతుంది! ఆత్మావలోకనం అంటే మనలోని మనల్ని వీక్షించడం!
కాటూరు రవీంద్ర త్రివిక్రమ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి. -
గజ పురాణం
దేవదానవులు పాలసముద్రాన్ని మథించినప్పుడు వెలువడిన ఏనుగును వైభవ చిహ్నంగా ఇంద్రుడు స్వీకరించాడు. ఆ ఏనుగు పేరు ఐరావతం. తెల్లని వర్ణంతో ప్రకాశిస్తుందంటారు.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?