జయాపజయాలు
మనిషి తాను తలపెట్టిన ప్రతి కార్యంలోనూ విజయం పొందాలని కాంక్షిస్తాడు. అందుకు మొదట సంకల్పం చేస్తాడు. ప్రణాళిక వేసుకుంటాడు. ప్రయత్నం చేస్తాడు. సాధన చేస్తాడు. శ్రమిస్తాడు. ఇతరుల విమర్శలను లెక్కచేయడు.
మనిషి తాను తలపెట్టిన ప్రతి కార్యంలోనూ విజయం పొందాలని కాంక్షిస్తాడు. అందుకు మొదట సంకల్పం చేస్తాడు. ప్రణాళిక వేసుకుంటాడు. ప్రయత్నం చేస్తాడు. సాధన చేస్తాడు. శ్రమిస్తాడు. ఇతరుల విమర్శలను లెక్కచేయడు. ఎంతకాలం పట్టినా, ఎంత కష్టమైనా తన ప్రయాణం మానుకోడు. చివరికి గమ్యం చేరతాడు. విజయం సాధిస్తాడు. అయితే ఒక్కొక్కప్పుడు పరాజయం పాలవుతాడు కూడా. ఈ ఓటమికి అనేక కారణాలు ఉండవచ్చు.
మనిషి తన కోసం చేసే పనులు కొన్ని, ఇతరుల కోసం చేసేవి కొన్ని ఉంటాయి. ఏ పనులైనా ధర్మబద్ధంగా ఉండాలి. కేవలం తనకోసమే జీవితం అనుకోవడం స్వార్థం అనిపించుకుంటుంది. ‘పుట్టుక నీది, చావు నీది, మధ్య బతుకు దేశానిది’ అంటాడో కవి. అవి అక్షరసత్యాలు. తన కోసం, తన కుటుంబం కోసం శ్రమించగా వచ్చిన ఫలితానికి, విజయానికి మనిషి సంతుష్టి చెందాలి. అత్యాశకు పోయి అక్రమార్జన చేసి అంతులేని సంపదను కూడబెట్టుకోవడం విజయం అనిపించుకోదు. అది సంతృప్తిని ఇవ్వకపోగా, దుఃఖానికి దారితీస్తుంది. భయాన్నీ పెంచుతుంది. ప్రేమతో, సేవాభావంతో పరులకు చేసే ఉపకారం మనిషికి ఎంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది. అసలైన విజయం అంటే అదే! అటువంటి విజయం మనిషిని శిఖరాగ్రానికి తీసుకెళ్తుంది. అఖండమైన ఖ్యాతిని తెచ్చిపెడుతుంది. మనిషిని మహామనిషిని చేస్తుంది. ఆ విజయం సత్యమైనది, శాశ్వతమైనది, ఆదర్శవంతమైనది.
ఓ మంచి ఆలోచనవల్ల, మాటవల్ల, ప్రవర్తనవల్ల, పరోపకార ప్రవృత్తివల్ల లభించే ఆనందం, విజయం జన్మకు సార్థకత చేకూరుస్తాయి. దుఃఖాన్ని సహించడంలో నష్టాన్ని భరించడంలో మనిషికి అణకువ అలవడుతుంది. ఆ అణకువే అద్భుతమైన విజయాన్ని అందిస్తుంది. మంచి మాట దానం లాంటిది. ప్రతిఫలంగా పుణ్యం ఇస్తుంది. చెడ్డమాట అప్పులాంటిది. ప్రతిగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. నోరు విప్పేవరకు మాటపైన పెత్తనం మనదే. నోరు జారితే ఆ మాటే మనపైన పెత్తనం చేస్తుంది. కష్టాలను చిరునవ్వుతో, ఒత్తిడిని మనోబలంతో, విమర్శలను ఆత్మవిశ్వాసంతో అధిగమించడమే విజయం. విజయ రహస్యాలన్నీ తెలిసి కూడా పని ప్రారంభించనివాడు ఏదీ తెలియనివాడితోనే సమానం. సంశయం, ఆలస్యం, అశ్రద్ధ- విజయ సాధనకు ప్రధాన అవరోధాలు.
‘జయాపజయాలు దైవాధీనాలు’ అనే నానుడిని మనం తరచూ వింటుంటాం. కార్యశీలుడు ఆధ్యాత్మిక చింతన అనే చివరిమెట్టు ఎక్కితే దైవాధీనమైన విజయమే చేతికందుతుంది. పాండవులు ధర్మవర్తనులు. అందువల్లనే ధర్మ పక్షపాతి వాసుదేవుడు వారి పక్షాన నిలుచుని వాళ్లను విజేతల్ని చేశాడు. అరణ్య, అజ్ఞాతవాసాలు చేయాల్సి వచ్చినా పాండవులు ఏనాడూ కుంగిపోలేదు. నిరాశ పడలేదు.
మనిషి అన్నాక గెలుపు, ఓటమి సహజం. గెలుపొందినప్పుడు తన ప్రతిభే కారణమని అహంకారంతో విర్రవీగకూడదు. ఓటమి ఎదురైనప్పుడు ‘అంతా నా ఖర్మ’ అని కుంగిపోనూకూడదు. ఆత్మనిర్భరత అంతిమ విజయాన్ని ఇస్తుంది. పరహిత వ్రతం ఆచరించేవాణ్ని ఎప్పుడూ విజయమే వరిస్తుంది. స్వార్థపరుణ్ని ఓటమి తన బానిసగా చేసుకుంటుంది. ‘ఆత్మజ్ఞాని కానివాడికి విజయం లభించదు’ అంటారు ఆదిశంకరులు. సత్సంగంవల్ల సద్గురు బోధవల్ల మాత్రమే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. క్షీరసాగర మథనం చేసిన దేవతలు పడిన శ్రమ మానవజాతికి సర్వదా స్మరణీయం. నదికి రెండు తీరాలు ఎంత సహజమో, జీవితంలో జయాపజయాలు అంతే సహజమన్న సత్యాన్ని గ్రహించాలి.
చిమ్మపూడి శ్రీరామమూర్తి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధర్మమే సర్వం
‘ధర్మం పాటించండి’ అనే మాట సాధారణంగా వినిపిస్తుంది. రెండక్షరాల ఈ పదం వెనక చాలా పెద్దభావం ఉంది. లోతైన వివరణ ఉంది. చేయదగినపని, లక్షణం, స్వభావం, పద్ధతి, తగినది, దానగుణం అనే వివిధ అర్థాల్లో ఈ పదాన్ని వాడతారు. సమాజంలో ప్రతివారికీ ఏదో ఒక చేయదగిన పని ఉంటుంది. -
నిక్షిప్త నిధులు
అంతర్గత శక్తిని వ్యక్తీకరించగలిగే పనిని కనుక్కుంటే ఆనందాన్ని పొందవచ్చు. ఆ పని ద్వారా జోడించే విలువను ప్రపంచం గుర్తించేలా చేస్తే విజయం సాధించవచ్చు. -
పేరే పెన్నిధి
భువిలో మానవుడిగా జన్మించడం, పేరు కలిగి ఉండటం రెండూ అయాచిత వరాలే. సృష్టిలో పేరు కలిగి, తన పేరుకున్న ఔన్నత్యాన్ని కాపాడుకునే భాగ్యం ఒక్క మనిషిదే. ఎంతటి విద్యాపారంగతుడైనా, సకల కళా, శాస్త్ర ప్రవీణుడైనా పేరు లేకపోతే గుర్తింపునకు నోచుకోలేడు. -
మాటకు కట్టుబడితేనే...
చేతులకు ఎప్పుడూ దానం చేసే గుణం, నోటికి సత్యవాక్కు పలికే లక్షణం సజ్జనులకు సహజమైన అలంకారాలుగా శోభిస్తాయంటాడు భర్తృహరి. నిలబెట్టుకోలేని మాటలు పదేపదే చెబుతుంటే ఆ వ్యక్తి గౌరవం కోల్పోతాడు. సత్యంలో ధర్మం ప్రతిష్ఠితమై ఉంటుంది. సత్యపాలన చాలా కష్టమైన పని. అది కత్తిమీద సాము. సత్యంతో పాటు దానాన్నీ గొప్ప గుణంగా చెప్పుకొన్నాం. -
పున్నమిలో ఉన్నవి ఎన్నో...
చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు నిండుగా వెలుగొందే రోజు పౌర్ణమి. ప్రతి పౌర్ణమికీ ఒక్కో ప్రాధాన్యం ఉంది. చిత్ర నక్షత్రం పేరుతో చైత్ర పూర్ణిమ ఏర్పడింది. ఈ పర్వడిని ‘మహాచైత్రి’ అని అంటారు. ఈ రోజున చిత్రగుప్త వ్రతం చేస్తారు. -
నాలుగు మంచి మాటలు
‘రుషి కానివాడు కావ్యాన్ని రాయలేడు’ అనేది నానుడి. అంటే కావ్యాన్ని రాయడానికి తపస్సు చేసి సంపాదించినంత శక్తి కావాలని భావం. అలాంటి కావ్య ప్రక్రియలో నాటకాలు రమ్యంగా ఉంటాయట. ఆ నాటకాల్లో శాకుంతలం, అందులో నాలుగో అంకం, అందులో నాలుగు శ్లోకాలు మహాద్భుతంగా ఉండి ఆహ్లాదాన్ని కలిగిస్తాయనేది ఒక శ్లోక భావం. -
ప్రాప్తకాలం
అనంతమైన కాలంలో ప్రతిదానికీ కొంత కాల నియమం ఉంటుంది. ఏది ఎప్పుడు పుట్టాలో, పుట్టింది ఎంతకాలం ఉండాలో, ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది. ఏదీ కాలానికి అతీతంగా ఉండలేదు. -
పరమ గమ్యం
ఆధ్యాత్మికతను కొందరు మతంగా పొరపడతారు. వాస్తవానికి ఆధ్యాత్మికత అనేది గొప్ప నాగరికత. వ్యక్తి చేతనను ఉన్నతీకరించే ఒకానొక రసాయనిక ప్రక్రియ అది. తద్వారా సమాజాల హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం పేరు- ఆధ్యాత్మికత. ఆదర్శప్రాయమైన శాంతియుతమైన సమాజాల ఆవిర్భావానికి మనిషి ఆధ్యాత్మిక సాధకుడు కావడమే గొప్ప ఆలంబన. -
పట్టు విడుపులు
అన్నివేళలా గెలుపు గుర్రమెక్కి సవారి చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తికావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. -
ఈ మట్టి పవిత్రం
శ్రీరాముడి పాదస్పర్శతో పులకించిన పవిత్ర భూమి, భగవానుడి గీతోపదేశంతో ప్రభావితమైన పుణ్యభూమి- మనదేశం. కశ్మీరు నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారతం గంగ, గోదావరి వంటి పుణ్య నదుల ప్రవాహాలతో పావనమై పరిఢవిల్లుతోంది. సృష్టి స్థితి లయ కారకుల అనుగ్రహంతో శక్తిమంతమైన దేశం ప్రకృతి శోభతో అలరారుతోంది. -
శ్రీరామ విజయం
సాధకులు అంతర్ముఖులై, ఏ ఆనందం కోసం అన్వేషిస్తున్నారో, తమ మనో మందిరాల్లో ఏ ఆకృతిని ప్రతిష్ఠితం చేసుకుని ఆరాధిస్తున్నారో ఆ దివ్యపథానికి సాకారం- శ్రీరాముడు. మనుషుల్లోని ‘రా’క్షస గుణాలను ‘మ’ర్దించే పరమ దైవం- రాముడు. -
దేహాలయం
సృష్టిలో శాశ్వతం కాని వాటిలో దేహం కూడా ఒకటి. జీవితాంతం జీవికి ఆలంబనగా ఉండేదీ శరీరమే. ఎలాంటి పనులు చేయాలన్నా శరీర సహకారంతోనే చెయ్యగలం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు దేహమే క్షేత్రమని, అన్ని కర్మల సాధనకు అదే భూమిక అని, క్షేత్రమెరిగినవాడు క్షేత్రజ్ఞుడని, అలాంటివాడే తనకు ఇష్టుడని చెబుతాడు. -
గొప్పతనం
సాధారణంగా మనిషి గొప్ప విషయాల పట్ల వ్యామోహితుడై ఉంటాడు. బుద్ధి తెలిసిన నాటి నుంచి తానే గొప్పవాడిగా ఉండాలని భావిస్తాడు. తన గొప్పతనాన్ని, ప్రతిభను ఇతరులు గుర్తించాలని తాపత్రయపడతాడు. తనకు సంబంధించిన సామాన్య విషయాలను కూడా గోరంతలు కొండంతలుగా చెబుతూ అందరిలో తననో ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటాడు. ఇతరుల కంటే ఏనాడూ తాను తక్కువ కావడానికి ఇష్టపడడు. -
కొత్త ప్రపంచం
ప్రపంచాన్ని కొత్తగా చూడటం వేరు. కొత్త ప్రపంచాన్ని చూడటం వేరు. కొత్తగా, అందంగా, సృజనాత్మకంగా, అద్భుతంగా ప్రపంచాన్ని చూపించే మనుషులతో బంధాలు ఏర్పరచుకోవాలి. వాళ్లు దివ్య పురుషులు. పుట్టినప్పటి నుంచి అమ్మ ఈ ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. -
నిరంతరం ఆనందమే!
మానవ జీవితం చిత్రమైనది. దాని పోకడ గ్రహించడం సులభం కాదు. మనసు ఆడించే నాటకానికి జీవితం వేదికవుతుంది. ఒకానొక క్షణంలో కారణం లేకుండా సంతోషం కలుగుతుంది. -
భయమే భయానక వ్యాధి
జీవితంలో మనిషిని పీడించే మహాశాపం భయం. ప్రతి మనిషిలోనూ ఏదో సందర్భంలో, ఏదో కారణంగా భయం ఏర్పడుతూనే ఉంటుంది. వేరుపురుగు వృక్షాన్ని కూల్చేసే విధంగా భయమనేది మనిషి మనసులో దిగులును, అశాంతిని, నిరాశా నిస్పృహలను, పిరికితనాన్ని, దుఃఖాన్ని పెంచుతుంది. అభద్రతాభావాన్ని ప్రేరేపిస్తుంది. -
ఈదుల్ ఫితర్ - శుభాకాంక్షలు
మానవ ఆకారంలో దైవదూత జిబ్రయిల్ (అ.స.) ప్రవక్త మొహమ్మద్ (స.అ.వ.) వద్దకు వచ్చి ఈమాన్ విశ్వాసం అంటే ఏమిటని అడిగారు. సమాధానంగా ప్రవక్త (స.అ.వ.) ఇలా సెలవిచ్చారు. -
ఆనందమే పరమావధి
మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనందతీరాల్ని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. -
‘క్రోధి’ శుభప్రదమే!
మధుమాసంతో ప్రారంభమవుతుంది మన సంవత్సరం. వేదంలో చైత్ర, వైశాఖాలకు మధు, మాధవ మాసాలని పేర్లు. ఈ రెండు మాసాలు వసంత ఋతువు. చాంద్రమానం ప్రకారం వసంత ఋతువుతో ఏడాదిని ప్రారంభించుకొనే అందమైన సంప్రదాయం మనది. -
నదులు-ఆధ్యాత్మిక కేంద్రాలు
ఎల్లప్పుడూ ప్రవహిస్తుండేవాటిని జీవనదులంటారు. వీటిలో ప్రధానమైనవి గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర. ఇవి హిమాలయాల్లో పుట్టి మైదానాలగుండా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఎండాకాలంలో మంచు కరగడం వల్ల, వర్షాకాలంలో వర్షపు నీటితోను సంవత్సరమంతా ప్రవహిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్