పోలవరం రివైజ్డ్ అంచనాలు..హైదరాబాదే దాటలేదు
పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఆమోదిస్తుందా అని ఆంధ్రప్రదేశ్ ఎదురు చూస్తోంది. ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు కేంద్ర జల్శక్తి, ఆర్థిక శాఖ అధికారులను కలిసినప్పుడల్లా తాజా అంచనాకు ఆమోదం తెలపాలని కోరుతున్నారు. కేంద్ర అధికారులూ అలాగే అని తల ఊపుతున్నారు.
అడుగడుగునా కొర్రీలు
అమరావతి నుంచి వాటికి సమాధానాలు
9 నెలలుగా ఇదే తంతు
ప్రతిపాదన నేటికీ దిల్లీకి పంపకపోవడంపై విమర్శలు
ఈనాడు, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఆమోదిస్తుందా అని ఆంధ్రప్రదేశ్ ఎదురు చూస్తోంది. ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు కేంద్ర జల్శక్తి, ఆర్థిక శాఖ అధికారులను కలిసినప్పుడల్లా తాజా అంచనాకు ఆమోదం తెలపాలని కోరుతున్నారు. కేంద్ర అధికారులూ అలాగే అని తల ఊపుతున్నారు. అయితే సవరించిన అంచనాల దస్త్రం అసలు హైదరాబాదే దాటకపోవడం గమనార్హం. హైదరాబాద్ నుంచి పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కొర్రీల మీద కొర్రీలు వేయడం, అమరావతి నుంచి ఆంధ్రప్రదేశ్ సమాధానాలు ఇవ్వడమే తప్ప రివైజ్డ్ అంచనాల ప్రతిపాదన దిల్లీకి చేరనేలేదు. రెండు వారాల క్రితం కూడా పీపీఏ లేవనెత్తిన అంశాలకు రాష్ట్రం సమాధానాలిచ్చినా సవరించిన అంచనాల ప్రక్రియ ముందుకు కదలలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. తొమ్మిది నెలలైనా ఈ ప్రతిపాదన దిల్లీకి ఎందుకు పంపలేదనేది చర్చనీయాంశంగా మారింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2014 ఏప్రిల్ 1 నుంచి అయ్యే వ్యయాన్ని మాత్రమే కేంద్రం భరించాలని 2020 అక్టోబరు 12న కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది.
2013-14 ధరల ప్రకారం ఈ ప్రాజెక్టు సాగునీటి పనుల నిర్మాణ వ్యయం రూ.20,398.61 కోట్లని, ఇందులో 2014 మార్చి 31 వరకు రూ.4,730.71 కోట్లు ఖర్చు చేశారని, ఇక ఇవ్వాల్సింది రూ.15,660.96 కోట్లు మాత్రమేనని లేఖలో పేర్కొంది. 2014 ఏప్రిల్ 1 నుంచి రూ.8,614.16 కోట్లు ఇచ్చినందున, ఇక కేంద్రం ఇవ్వాల్సింది రూ.7,053.74 కోట్లు మాత్రమేనని పేర్కొనడం రాష్ట్ర అధికార వర్గాల్లో కలకలం రేపింది. పోలవరం నిర్మాణానికి నూరు శాతం వ్యయం కేంద్రమే భరించాల్సి ఉన్న నేపథ్యలో ఇలా పేర్కొనడం చర్చనీయాంశమైంది.
తొమ్మిది నెలలు దాటినా..
ఈ అంశంపై చర్చించేందుకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిరుడు నవంబరు 2న అత్యవసరంగా సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ, కేంద్ర జల్శక్తి, ఆర్థిక శాఖల అధికారులతోపాటు పీపీఏ అధికారులు చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారు. 2020 మార్చి 17న జరిగిన సవరించిన అంచనాల కమిటీ నిర్ణయం ప్రకారం 2013-14 అంచనా రూ.29,027.95 కోట్లుగాను, ఇందులో విద్యుత్తు బ్లాక్ వ్యయం రూ.4,560.91 కోట్లు, తాగునీటి సరఫరా రూ.4068.43 కోట్లు, సాగునీటి ప్రాజెక్టు వ్యయం రూ.20,398.61 కోట్లుగా పేర్కొంటూ ఆర్థిక శాఖ రాసిన లేఖకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ కోరినట్లుగా తాగునీటి సరఫరా వ్యయాన్ని కలపడంపై కేంద్ర జల్శక్తి శాఖ నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైంది. 2017-18 ధరల ప్రకారం సవరించిన అంచనా రూ.47,725.74 కోట్లకు పీపీఏ అంగీకరించింది. ఇందులో విద్యుత్తు బ్లాక్ ఖర్చు రూ.4,560.91 కోట్లు, తాగునీటి సరఫరా ఖర్చు రూ.7,214.67 కోట్లుగా పేర్కొంది. 2014 ఏప్రిల్ 1 నుంచి సాగునీటి ప్రాజెక్టుకయ్యే వ్యయం నూరు శాతం భరిస్తామని కేంద్ర మంత్రివర్గం పేర్కొందని, ప్రాజెక్టు పూర్తి కావడానికి 2017-18 ధరల ప్రకారం ఇవ్వాలని పీపీఏ పేర్కొంది. 2013-14 ధరల ప్రకారం చెల్లించేలా ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వుకు పీపీఏ ఆమోదం పొందిందనీ కేంద్రానికి నివేదించారు.
ఆరుసార్లు కొర్రీలు
ప్రాజెక్టు పూర్తి కావాలంటే 2017-18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్లు ఇవ్వాలని నిరుడు నవంబరులో పీపీఏ సమావేశం చేసిన తీర్మానాన్ని మాత్రం ఇప్పటి వరకూ కేంద్రానికి పంపలేదు. ప్రాజెక్టు ప్రతిపాదనలో లోపాలున్నాయంటూ 8 అంశాలకూ, ఆయకట్టు, వ్యయానికి సంబంధించి మరో తొమ్మిదింటికీ సమాధానాలు ఇవ్వాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో పీపీఏ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. దానికి సమాధానం రాగానే పునరావాసం, కాలువల సామర్థ్యం, సొరంగాలు, కొత్తగా చేపట్టిన లిప్టు ఇలా పలు అంశాలపై కొర్రీలు వేస్తోంది. ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్, నీటిపారుదల శాఖ అధికారులు వాటికి సమాధానాలు ఇస్తూనే ఉన్నారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఆరుసార్లు పీపీఏ కొర్రీలు వేసినట్లు తెలిసింది. చివరగా గత నెలలో పీపీఏ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గత నెల 30న కేంద్ర జల్శక్తి కార్యదర్శికి అంశాల వారీగా సమాధానాలిస్తూ లేఖ రాశారు. ‘పోలవరం కుడికాలువ సామర్థ్యం మొదట 330 క్యూమెక్కులు. తర్వాత 496.2 క్యూమెక్కులకు పెరిగింది. దీనికి జలసంఘం కూడా ఆమోదం తెలిపింది. ఎడమ కాలువ సామర్థ్యం 230 క్యూమెక్కుల నుంచి 498.03 క్యూమెక్కులకు పెంచారు. వీటన్నిటికి 2004-05లోనే టెండర్లు పిలిచి ఆమోదం తెలిపారు’ అని లేఖలో ఏపీ వెల్లడించింది. పునరావాసం, సొరంగ మార్గాలు వెడల్పు చేయడం, డిస్ట్రిబ్యూటరీలు ఇలా అన్నింటి గురించీ వివరించింది. ఇంత వివరంగా సమాధానాలిస్తున్నా.. సవరించిన అంచనాకు సంబంధించి పీపీఏ చేసిన నిర్ణయం మాత్రం దిల్లీ చేరలేదని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
అంచనా వ్యయం పెరిగింది ఇలా..
* పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 2009 జనవరిలో రూ.10,511 కోట్లతో కేంద్ర జలసంఘం సాంకేతిక సలహా కమిటీ ఆమోదం తెలిపింది.
* 2011 జనవరిలో రూ.16,010.45 కోట్లతో సవరించారు.
*2019 ఫిబ్రవరి 11న.. 2017-18 ధరలతో రూ.55,548.87 కోట్లకు సవరించిన అంచనాకు ఆమోదం తెలిపింది.
అయితే 2016లో కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం ఆదేశాల ప్రకారం.. ఆమోదం పొందిన ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 20 శాతానికి మించి పెరిగితే ఆర్థిక సలహాదారు నేతృత్వంలోని అంచనాల సవరింపు కమిటీ (ఆర్సీసీ)కి వెళ్లాల్సి ఉంటుంది. అలా కేంద్ర జల్శక్తి శాఖ సలహా మండలి ఆమోదించిన రూ.55,548.87 కోట్ల ప్రతిపాదన ఆర్సీసీకి వెళ్లింది.
* 2020 మార్చి 17న జరిగిన ఆర్సీసీ సమావేశంలో 2013-14, 2017-18 ధరల ప్రకారం కేంద్ర జలసంఘం ప్రతిపాదించిన సవరించిన అంచనా వ్యయాన్ని అంచనాల కమిటీ ఆమోదించింది.
* చివరికి 2013-14 ధరల ప్రకారం రూ.29,027.95 కోట్లకు, 2017-18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్లకు ఆమోదం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్.!
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపు
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థతో పాటు రాజాం, తణుకు, గుడివాడ, బాపట్ల, గూడూరు (తిరుపతి జిల్లా), భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు పురపాలక సంఘాలు, నగర పంచాయతీల ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలలపాటు పొడిగిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. -
అమూల్యమైంది ఓటు.. మరచిపోతే చేటు
ఓటుహక్కు ప్రాధాన్యంపై వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కూలి కొమ్ము అబ్రహం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు.