పింఛను పంపిణీ వివరాలు గోప్యం
జీవోలను ఆన్లైన్లో పెట్టే విధానానికి ఇప్పటికే స్వస్తి పలికిన ప్రభుత్వం తాజాగా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచకుండా గోప్యత పాటిస్తోంది. ఆన్లైన్లో ప్రజలకు తెలిసేలా ఉంచే విధానాన్ని ఆపేసింది. వైఎస్సార్ పింఛను
ఆన్లైన్లో ప్రజలకు కనిపించకుండా నిలిపివేత
అధికారులే చూసేలా మార్పు చేసిన ప్రభుత్వం
నిలిపివేసిన పింఛన్లు బహిర్గతం కాకూడదనే ఈ చర్యలని పలువురి విమర్శ
ఈనాడు డిజిటల్, అమరావతి: జీవోలను ఆన్లైన్లో పెట్టే విధానానికి ఇప్పటికే స్వస్తి పలికిన ప్రభుత్వం తాజాగా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచకుండా గోప్యత పాటిస్తోంది. ఆన్లైన్లో ప్రజలకు తెలిసేలా ఉంచే విధానాన్ని ఆపేసింది. వైఎస్సార్ పింఛను కానుక కింద ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీని చేపడుతోంది. ఆ రోజు పంపిణీ మొదలు రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల ద్వారా పింఛనుదారులకు లబ్ధి అందుతున్న తీరును వైఎస్సార్ పింఛను కానుక వెబ్సైట్లో నమోదు చేసేవారు. గంటకొకసారి వివరాలను అప్లోడ్ చేసేవారు. ఆగస్టు నెల వరకు ఈ విధానాన్ని పాటించారు. పింఛన్ల పంపిణీ వివరాలను ఆన్లైన్లో ప్రజలకు అందుబాటులో ఉంచారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఆ విధానాన్ని నిలిపేసి సంబంధిత అధికారులు మాత్రమే లాగిన్ అయి వివరాలు చూసుకునేలా మార్పులు తీసుకొచ్చారు.
గత నెలలో పింఛన్ల పంపిణీ విధానంలో ప్రభుత్వం భారీగా మార్పులు చేసింది. ఒక బియ్యం కార్డుకు ఒకే పింఛను విధానాన్ని అమలు చేసింది. ఇతర ప్రాంతాల్లో ఉంటూ రెండు, మూడు నెలలకొకసారి వచ్చి పింఛను తీసుకునే వెసులుబాటును రద్దు చేసింది. ఏ నెల పింఛను ఆ నెలే తీసుకోవాలని స్పష్టం చేసింది. పోర్టబులిటీ విధానాన్ని ఆపేసింది. ఈకేవైసీ చేయించుకోని, హౌస్హోల్డ్ మ్యాపింగ్ కాని వారి పింఛన్లను నిలిపేసింది. ఈ ప్రభావం పింఛన్ల పంపిణీలో బహిర్గతమవుతుందనే ఆలోచనతోనే వివరాలు ఆన్లైన్లో ప్రజలకు కనిపించకుండా చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అదనంగా మరో రోజు పంపిణీ...
గత నెల వరకు పింఛన్లను ఒకటో తేదీ మొదలు మూడు రోజులపాటు పంపిణీ చేస్తున్నారు. సెప్టెంబరు 1నుంచి దాన్ని మరో రెండు రోజులకు పొడిగించి 5 రోజులపాటు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో అర్హులకు పింఛను అందలేదన్న ఫిర్యాదులు రావడంతో 6న కూడా పంపిణీకి అనుమతిచ్చారు. సాంకేతిక కారణాల వల్ల నిలిచిన పింఛన్లను పంపిణీ చేయాలని ఆదేశాలు పంపారు. సెప్టెంబరు నెల పింఛను తీసుకోకపోతే అక్టోబర్ నెల పింఛనులో ఆ మొత్తం విడుదల కాదని ఆదేశాల్లో స్పష్టం చేశారు. సెప్టెంబరు 1వ తేదీ సాయంత్రం 6:30 గంటల వరకు 88.92% పంపిణీ చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 6వ తేదీ(సోమవారం) నాటికి 98% మందికి పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈకేవైసీ లేని కారణంగా పింఛన్లు నిలిచిపోయిన వారికి బుధవారం నుంచి నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించనుందని సెర్ప్ అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
జగన్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ దయనీయంగా తయారైంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను విద్యుత్తు కోతల కష్టాలు పీడిస్తున్నాయి. -
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
‘ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడతా. జగనన్న ప్రభుత్వంలో నాకు, నా బిడ్డకు రక్షణ లేదు. వారణాసిలో కుమార్తెతో కలిసి తలదాచుకుంటున్నా..’ అని కాకినాడకు చెందిన రాజులపల్లి ఆరుద్ర తెలిపారు. -
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్లపై జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానానికి చరమగీతం పాడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నాసిక్ నుంచి స్టాంపు పేపర్లను తెప్పించడం ఇప్పటికే నిలిపేసింది. -
గోవా మద్యానికి ‘వైకాపా’ గ్రీన్ఛానల్!
సార్వత్రిక ఎన్నికల వేళ కొంతమంది వైకాపా నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యంతో జనాల్ని ప్రలోభపెడుతూ వారి ప్రాణాల్ని బలిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
అన్న క్లాస్.. తమ్ముడు మాస్.. భూములన్నీ ఖల్లాస్!
భూమిని నమ్ముకున్నోళ్లెవ్వరూ ఆగం కాలేదు. అందుకేనేమో.. వైకాపా నేతలంతా ఒకరిని మించి మరొకరు కబ్జాలకు తెరతీశారు. -
ఎవరి ఆధీనంలో ఎవరు?
ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా...? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది. -
బ్రో... ఏ రాష్ట్రానికి పొమ్మంటావ్?
మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడి ఎక్కడా అభివృద్ధి లేకుండా చేశారు. నిర్మాణ రంగం కుదేలైంది. స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినడంతో వ్యాపారులు పెద్ద నగరాలకు తరలిపోయారు. -
మేనమామ కాదు.. మేకవన్నె పులి
ఓట్ల వేటలో.. చిన్నారులనూ పావులను చేసి... వారి చదువులను చట్టుబండలు చేసి... బైజూసనీ... ట్యాబ్లనీ.. టోఫెలనీ... ఐబీ అనీ... అమాయక పిల్లల్ని అర్థంలేని ప్రయోగాలకు బలి చేసిన... అయోమయం జగన్నాథం.... ఆంధ్రావని చేసుకున్న పాపం! -
ప్లాస్టర్ తీసేసిన సీఎం.. వెలంపల్లి ‘కట్టు’ కథా ముగిసింది!
సీఎం జగన్ నుదిటిపై వేసుకున్న ప్లాస్టర్ను తీసేశారు. ఈనెల 13న విజయవాడలో గులకరాయి తగిలిన రోజు నుంచి 25 వరకూ ప్లాస్టర్తోనే కనిపించారు. శనివారం పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా సీఎం ప్లాస్టర్ లేకుండా కనిపించారు. -
ఇలాగేటి.. బాదేస్తన్రు!
ఉత్తరాంధ్ర ప్రజానీకం ఏ సంకోచాలు లేకుండా వైకాపా పాలనపై గళమెత్తుతోంది. జగన్ ప్రభుత్వంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. విశాఖ వంటి మహా నగరంలోనే కాదు శ్రీకాకుళం వంటి నగరం, పలాస, పాలకొండ వంటి పల్లెలను ఆనుకుని ఉన్న పెద్ద, చిన్న పట్టణ ప్రాంతాల్లోనే కాదు. -
వైద్య సీట్లకు కోత
వైకాపా ప్రభుత్వం సన్నద్ధంగా లేనందున ఎంబీబీఎస్ సీట్లకు కోత పడింది. 2024-25లో కొత్తగా ప్రారంభం కానున్న 5 వైద్య కళాశాలల్లో వంద చొప్పున మాత్రమే ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయబోతున్నారు. -
యువ ఓటర్ల భుజస్కంధాలపైనే దేశ భవిష్యత్తు
పోలింగ్ శాతం గణనీయంగా పెంచేందుకు ప్రతి జిల్లాలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. లెట్స్ ఓట్ సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా శనివారం గుంటూరులో 3కె వాక్ నిర్వహించాయి. -
ఉపాధి పనుల్లో పశువులు!
‘ఉపాధి’ పని చేస్తున్న కూలీల చిత్రం ఉండాల్సిన చోట గేదెల చిత్రం అప్లోడ్ చేశారు.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల ఉపాధి ఉద్యోగులు. -
సంపాదనపై కాదు.. నేర్చుకోవడంపై దృష్టి సారించాలి
యువ న్యాయవాదులు ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో సంపాదనపై కాకుండా నేర్చుకోవడంపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు. -
‘ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ని విధుల నుంచి తప్పించండి’
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి నిరుద్యోగులను ప్రభావితం చేసేలా ఈనెల 29న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం (ఏపీఎన్ఎఫ్) అధ్యక్షుడు బి.శ్రీరాములు పేర్కొన్నారు. -
వారాంతమిస్తానని.. వాయింపే.. వాయింపు!
అధికారంలోకి రావడానికి జగన్ అన్ని వర్గాలను పావులుగా వాడుకున్నారు. ఎన్నెన్నో హామీలను గుప్పించారు. అన్నింటినీ నెరవేరుస్తానంటూ మ్యానిఫెస్టో ముద్రించారు. -
గులకరాయి కేసు నిందితుడికి ముగిసిన పోలీసు కస్టడీ
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ మూడు రోజుల పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. -
పాలిసెట్- 2024కి 88.74 శాతం మంది హాజరు
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్-2024కు 88.74శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా