కోతకు ముందే కన్నీళ్లు
జెమిని వైరస్ ఒకవైపు.. తామర పురుగు మరోవైపు మిరపను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఎడతెరపి లేని వర్షాలూ తోడై రైతును నట్టేట ముంచేస్తున్నాయి. ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.70 వేలకు పైగా పెట్టుబడి పెట్టాక పంటను
మిరపను మింగేస్తున్న తామర పురుగు, జెమిని వైరస్
వేలాది ఎకరాల్లో తోటల తొలగింపు
ఎకరాకు రూ.70 వేల వరకు నష్టపోతున్న రైతాంగం
గుంటూరు జిల్లా సిరిపురం వద్ద వదిలేసిన మిరప చేలో మేస్తున్న ఎడ్లు
* కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాలపల్లికి చెందిన గువ్వల హనుమంతు ఎకరా భూమిలో మిరప నాటారు. వైరస్ ఆశించి మొక్కలు చనిపోయాయి. మళ్లీ నాటినా నిలవలేదు. రూ.70 వేల పెట్టుబడి అయింది. మరో మూడెకరాల్లో సాగు చేసిన పత్తి గట్టెక్కిస్తుందనుకుంటే.. వర్షాల్లేక ఎకరాకు రెండు క్వింటాళ్ల లోపే వచ్చింది. తెచ్చిన అప్పు తీర్చేందుకు.. లక్షకు కొన్న ఎడ్ల జతను రూ.50 వేలకు అమ్మేసి.. భార్యతో కలిసి మహబూబ్నగర్ జిల్లాకు వలస వెళ్లి పత్తి ఏరుకుంటున్నారు.
* గుంటూరు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడుకు చెందిన కావూరు పిచ్చయ్య ఎకరన్నరలో మిరప వేస్తే.. పెట్టుబడి రూ.75 వేలు అయింది. వైరస్ సోకడంతో పైరు పీకేశారు. ఈ గ్రామంలో 90% పైరు తెగులుతో దెబ్బతింది. ‘మళ్లీ మిరప వేద్దామనుకున్నా.. పెట్టుబడి తట్టుకోలేక మానుకున్నాను. అందుకే కంది వేశా’ అని వివరించారు.
ఈనాడు, అమరావతి: జెమిని వైరస్ ఒకవైపు.. తామర పురుగు మరోవైపు మిరపను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఎడతెరపి లేని వర్షాలూ తోడై రైతును నట్టేట ముంచేస్తున్నాయి. ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.70 వేలకు పైగా పెట్టుబడి పెట్టాక పంటను తొలగించే పరిస్థితి కల్పిస్తున్నాయి. ఈ ఏడాది ఎదురైన గడ్డు పరిస్థితులు మునుపెన్నడూ లేవని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురుగు, తెగుళ్ల నివారణకు కొందరు వారానికి నాలుగైదుసార్లు రసాయన మందులు పిచికారీ చేస్తున్నారు. చనిపోయిన మొక్కల స్థానంలో.. ఒకటికి రెండుసార్లు మొక్కలు కొని తెచ్చి నాటుతున్నారు. అయినా ఫలితం లేక వేలాది ఎకరాల్లో మొక్కల్ని తొలగిస్తున్నారు. వీటిని తట్టుకుని పంటను కాపాడుకున్నా.. అధిక వానలతో మొక్కలు ఉరకెత్తి చనిపోతున్నాయి. గుంటూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఈ పరిస్థితి అధికంగా కన్పిస్తోంది. అనంతపురం, కృష్ణా జిల్లాలోనూ తెగుళ్ల ప్రభావం ఉంది. వైరస్ తట్టుకునే రకాలంటూ.. కొందరు వ్యాపారులు నల్లబజారులో అధిక ధరలకు విత్తనాలు అంటగట్టారు. వీటికీ వైరస్ సోకి నష్టపోయామని గుంటూరు జిల్లా పెదకూరపాడు ప్రాంత రైతులు వాపోతున్నారు.
రికార్డు స్థాయిలో సాగు
గతేడాది ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఖరీఫ్లో రికార్డు స్థాయిలో 4.59 లక్షల ఎకరాల్లో మిరప వేశారు. నిరుటి కంటే ఇది 1.11 లక్షల ఎకరాలు ఎక్కువ. గుంటూరు జిల్లాలో 2.41 లక్షలు, ప్రకాశంలో 94 వేలు, కర్నూలు 56 వేలు, కృష్ణా జిల్లాలో 35వేల ఎకరాల్లో మిరప సాగవుతోంది.
కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ఎండిపోతున్న మిర్చిపంటను ట్రాక్టర్ సాయంతో తొలగింపు
వైరస్కు తోడు.. తామర పురుగు
గత కొన్నేళ్లుగా మిరపలో జెమిని వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంటోంది. ఇది సోకిన మొక్కల ఆకులు ముడతలుపడి, కుంచించుకుపోతాయి. ఆ మొక్కలను తొలగించడం తప్ప గత్యంతరం లేదు. పలువురు రైతులు పొలాల్ని దున్ని మళ్లీ కొత్తగా మొక్కలు నాటుతున్నారు. వాటికీ తెగులు సోకడంతో మళ్లీ తొలగించాల్సి వస్తోంది. ఈ వైరస్ బారి నుంచి మొక్కలను కాపాడుకున్నా.. కొత్తగా తామర పురుగులు మిరప పంటను ఆశించి, పూతను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. దీంతో దిగుబడులు భారీగా తగ్గుతాయి. రైతులు వీటిని నల్లి తాకిడిగా భావిస్తూ మందులు కొడుతుండటంతో ఖర్చు పెరుగుతోంది తప్ప ఫలితం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో సస్యరక్షణ చర్యలపై రైతుల్లో అవగాహన కల్పించడానికి ఉద్యాన, వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తల బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయి. వైరస్తో దెబ్బతిన్న మిరప తోటలను పరిశీలించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ అండ్ రీసెర్చ్, బెంగళూరు శాస్త్రవేత్తల బృందం డిసెంబర్ 2 తర్వాత రాష్ట్రంలో పర్యటించనుంది.
కాపు రాకముందే.. ఎకరాకు రూ.70వేల నష్టం
ఎకరా మిరప సాగుకు రూ.1.75 లక్షల నుంచి రూ.1.90 లక్షల వరకు ఖర్చవుతోంది. ఎకరా రూ.30 వేలకు పైగా కౌలు ముందే చెల్లిస్తున్నారు. విత్తనాలు, దుక్కి, మొక్కల పెంపకం, నాటడం, ఎరువులు, పురుగుమందులు, కలుపుతీతలు ఇతరత్రా ఖర్చులకు కాపు రాక ముందే.. ఎకరాకు రూ.70 వేల వరకు ఖర్చవుతోంది. కోత, అమ్మకం ఖర్చులు క్వింటాలుకు రూ.4వేల పైనే అవుతాయి. ఈ ఏడాది మొక్క దశ నుంచే వైరస్, తామర పురుగు ఆశించడంతో తొలగించక తప్పడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు. -
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
కంట్రోల్లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం
సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’ -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
కొండల్ని మింగి.. గోతులు మిగిల్చారు!
విజయవాడ సమీపం జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొండపావులూరు పరిసరాల్లో కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. -
వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం
వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. -
ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు
రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! -
నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. -
మాటల ఏలిక.. మీటలో మెలిక!
అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్ లీవర్, పీఅండ్జీ, ఐటీసీ, రిలయన్స్, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
దండుకో.. వాటాలు పంచుకో!
జగన్ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్ అధికారులు చెలరేగిపోతున్నారు. -
రోగుల సమాచారం మీకెందుకు?
వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్