ఒమిక్రాన్పై భయం వద్దు
‘‘ఒమిక్రాన్ నమోదైన అన్ని దేశాల్లో కేసులను పరిశీలిస్తే.. అన్నీ కూడా స్వల్ప లక్షణాలతో కూడినవే. వైరస్ స్వభావం మారుతుంటే.. ఒక విధంగా బలహీనపడుతున్నట్లు అనిపిస్తోంది’’ అని భారతీయ ప్రజారోగ్య సంస్థ అధ్యక్షులు,.....
కొవాగ్జిన్ తరహా టీకాలతో మెరుగైన ఫలితాలు
ఇంకా ఇది నిర్ధారణ కావాల్సి ఉంది
ముప్పున్నవారికి మొదట బూస్టర్ డోసు ఇవ్వాలి
‘ఈనాడు’ ముఖాముఖిలో డాక్టర్ శ్రీనాథరెడ్డి
అయితరాజు రంగారావు
ఈనాడు - హైదరాబాద్
‘‘ఒమిక్రాన్ నమోదైన అన్ని దేశాల్లో కేసులను పరిశీలిస్తే.. అన్నీ కూడా స్వల్ప లక్షణాలతో కూడినవే. వైరస్ స్వభావం మారుతుంటే.. ఒక విధంగా బలహీనపడుతున్నట్లు అనిపిస్తోంది’’ అని భారతీయ ప్రజారోగ్య సంస్థ అధ్యక్షులు, ప్రఖ్యాత గుండె వ్యాధుల నిపుణులు డాక్టర్ శ్రీనాథరెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే ఇది నిర్ధారణ కావాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుందన్నారు. కొత్త వేరియంట్పై అంత భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే దీనివల్ల ఇన్ఫెక్షన్ బారినపడే వారి సంఖ్య పెరుగుతుందని తెలిపారు. వ్యాక్సిన్ల ప్రభావమూ కొంతవరకు తగ్గుతోందన్నారు. ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ను ఎదుర్కొనే అవకాశం కొవాగ్జిన్ తరహా టీకాలకు ఉందని ఆయన చెప్పారు. ఒమిక్రాన్కు వ్యతిరేకంగా ఈ తరహా టీకాలు మెరుగైన రక్షణ కల్పించే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, ఇతర కారణాలతో ముప్పు పొంచి ఉన్నవారికి బూస్టర్ డోసు ఇవ్వాల్సిన అవసరముందని ఆయన స్పష్టం చేశారు. భారత్లోకి ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించిన నేపథ్యంలో.. ‘ఈనాడు’తో ముఖాముఖిలో డాక్టర్ శ్రీనాథరెడ్డి పలు అంశాలను వెల్లడించారు.
ఒమిక్రాన్.. కొత్త వేరియంట్ వచ్చేసింది. దీనిపై ప్రస్తుతమున్న టీకాలు పనిచేస్తాయా?
టీకాల పనితీరు గురించి చర్చించడానికి ముందు.. వైరస్, టీకాల తయారీ గురించి తెలుసుకోవాలి. కరోనా వైరస్ ఎప్పటికప్పుడూ అతి వేగంగా ఉత్పరివర్తనాలు చెందుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం వినియోగిస్తున్న అత్యధిక వ్యాక్సిన్లు ఎక్కువగా ‘స్పైక్ ప్రొటీన్ల’పై కేంద్రీకృతమై రూపొందించినవే. వీటిలో కరోనా వైరస్లోని ‘స్పైక్ ప్రొటీన్’ జన్యుక్రమాన్ని విడదీస్తారు. వెలుపలికి తీసిన ‘స్పైక్ ప్రొటీన్’ను ‘ఎడినో వైరస్’తో సమ్మిళితం చేస్తారు. ఎడినో వైరస్ ఒక వాహకంగా ఉపయోగపడుతుంది. ఇది శరీరంలోకి వెళ్లినా ఎటువంటి హాని కలగజేయదు. ‘స్పైక్ ప్రొటీన్ శరీరంలోకి వెళ్లగానే శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ దాన్ని గుర్తించి దానిని ఎదుర్కొవడానికి వీలుగా యాంటీబాడీస్ను ఉత్పత్తి చేస్తుంది. మళ్లీ తర్వాత ఎప్పుడైనా ఈ స్పైక్ ప్రొటీన్ ప్రవేశించినా.. శరీరం అందుకగుణంగా రోగ నిరోధక శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
కొవాగ్జిన్ తరహా టీకాలను నిర్జీవ కరోనా వైరస్ (ఇనాక్టివేటెడ్ వైరస్)తో తయారుచేస్తారు. ఇవి స్పైక్ ప్రొటీన్తో పాటు వైరస్లోని ఇతర భాగాలపైనా ప్రభావం చూపుతాయి. వైరస్లో స్పైక్ ప్రొటీన్ అనేది ఒక భాగం మాత్రమే. ఆ పదార్థం వచ్చి మన శరీరంలోని కణాలకు అతుక్కుపోతుంది. వైరస్ శరీరంలోకి ప్రవేశించడానికి అది మార్గం లాంటిది. సాధారణ భాషలో చెప్పాలంటే కరోనా వైరస్కు స్పైక్ ప్రొటీన్ తల లాంటిది. అయితే వైరస్కు ఇతర భాగాలు కూడా ఉంటాయి. ఇ ప్రొటీన్, ఎన్ ప్రొటీన్, ఓఆర్ఎఫ్ జన్యువు వంటివి ఉంటాయి. కొవాగ్జిన్ తరహా టీకాలు స్పైక్ ప్రొటీన్తో పాటు వైరస్లోని ఇతర భాగాలను కూడా లక్ష్యంగా చేసుకొని ఛేదిస్తాయి. ఒకవేళ వైరస్ ఉత్పరివర్తనం వల్ల స్పైక్ ప్రొటీన్లో మార్పులు వచ్చి సమర్థంగా ఎదుర్కోలేకపోయినా.. ఇతర భాగాలపైనా సమర్థంగా పనిచేసి రక్షణ కల్పిస్తుంది. అందువల్ల స్పైక్ ప్రొటీన్ ఆధారిత టీకాల కంటే.. ఇనాక్టివేటెడ్ టీకాలు ఒమిక్రాన్పైనా సమర్థంగా పనిచేసే అవకాశాలున్నాయి.
దీనిపై అధ్యయనాలు జరిగాయా?
స్పైక్ ప్రొటీన్ ఆధారిత టీకాలు కేవలం ఆ మేరకే పనిచేస్తాయి. ఇంతకుముందు వచ్చిన బీటా వేరియంట్, డెల్టా వేరియంట్లకు వ్యతిరేకంగా ఇవి పనిచేశాయి. తీవ్రమైన జబ్బు నుంచి రక్షించాయి. కానీ.. వాటి సామర్థ్యం కొంచెం తగ్గిపోయిందని ఆయా టీకా ఉత్పత్తి సంస్థలే ఒప్పుకున్నాయి. కానీ పూర్తి నిర్జీవ వైరస్ను వాడే కొవాగ్జిన్ తరహా టీకాలతో ఆ పూర్తి వైరస్ మన శరీరానికి పరిచయం అవుతుంది. అంటే సహజమైన ఇన్ఫెక్షన్ మాదిరిగా అన్నమాట. ఆ పూర్తి వైరస్ పరిచయం అయినప్పుడు అందులో చాలా యాంటీజెన్లు ఉంటాయి. వాటికి ప్రతిగా యాంటీబాడీలు కూడా తయారవుతాయి. తద్వారా విస్తారమైన రోగ నిరోధక శక్తి లభిస్తుంది. అయితే ఇందులో పెద్ద ఎత్తున స్పైక్ ప్రొటీన్ ఆధారిత రోగ నిరోధక శక్తి తయారుకాకపోవచ్చు. కానీ ఇతర యాంటీబాడీలు తయారై ఉండడం వల్ల.. ఒకవేళ ఉత్పరివర్తనం కారణంగా స్పైక్ ప్రొటీన్ యాంటీబాడీలు పనిచేయని సందర్భం ఎదురైనప్పుడు.. మిగిలిన యాంటీబాడీలు పనిచేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చూస్తే మిగిలిన వ్యాక్సిన్ల కంటే కొవాగ్జిన్ తరహా వ్యాక్సిన్లు బాగా పనిచేస్తాయని భావించవచ్చు. అయితే ఇది ఒక అంచనా మాత్రమే. పూర్తిగా ప్రయోగశాలలో నిర్ధారణ కావాల్సి ఉంది. దీనిపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వారు ప్రయోగాలు చేస్తున్నారు. డెల్టా వేరియంట్ వచ్చినప్పుడు కూడా ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తుందని స్పష్టంచేశారు. ఇప్పుడు ఒమిక్రాన్పైనా పరిశోధనలు జరుగుతున్నాయి. వారం రోజుల్లో ఈ విషయంపైనా వారు స్పష్టత ఇస్తారు.
బూస్టర్ డోసుపైనా చర్చ జరుగుతోంది?
ప్రస్తుత పరిస్థితుల్లో బూస్టర్ డోసు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఒమిక్రాన్ కాకపోయినా.. ఇప్పటికే డెల్టా వేరియంట్ మన దగ్గర ప్రభావం చూపుతోంది. అయితే వెనువెంటనే తొందరపడి అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, అధిక రక్తపోటు, మధుమేహం, గుండె, మూత్రపిండాలు, కాలేయ జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నవారికి, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ప్రాధాన్య క్రమంలో ఇవ్వాలి. కొవిడ్ రోగులతో నిత్యం గడిపే వైద్యులు, నర్సులు, ఇతర ఆసుపత్రి సిబ్బంది లాంటి వారికి కూడా ఇవ్వాలి. వచ్చే పరిస్థితులను బట్టి, టీకాల లభ్యతను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఒకవేళ కేసులు పెరుగుతూ పోతే.. బూస్టర్ డోసు ఇవ్వడంపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీత, బీటెక్ రవిల వ్యాజ్యాల నుంచి తప్పుకొన్న మరో ధర్మాసనం
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ జె.సుమతిలతో కూడిన ధర్మాసనం తప్పుకుంది. -
భూ హక్కు చట్టంపై మంత్రి ధర్మాన ద్వంద్వ వైఖరి.. అప్పుడలా..ఇప్పుడిలా..
మాటల గారడీలో ఆరితేరిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ‘భూహక్కు చట్టం’ అమలుపై ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారు. -
పేకేరు సర్పంచికి అరుదైన గౌరవం
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. -
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
పనుల్లో తన, మన భేదం లేదు.. అంతా నాసిరకంగా చేయడమే ఈ ప్రభుత్వ మార్కు అని నేలకొరిగిన రాజశేఖరరెడ్డి విగ్రహం వెక్కిరిస్తోంది. -
గడువిస్తే అధికారులు నిద్రపోతారు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పింఛన్లపై సర్కారు మరో కుట్ర!
ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ససేమిరా అంది. మండుటెండల్లో పింఛనుదారుల్ని గ్రామ, వార్డు సచివాలయాలకు బలవంతంగా రప్పించేలా గత నెలలో ఎత్తుగడ వేసింది. -
సర్వాధికారాలు ఉన్నా.. నోరు విప్పని జగన్
ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రానికి ఇప్పటికీ ఆయనే సుప్రీం. పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని కనుసైగలతో నడిపిస్తున్నారు. -
వడ్డీకాసుల వాడికి ‘వంచన సేవ!’
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల నీరాజనాలందుకునే శ్రీనివాసుడు కొలువైన తిరుమల.. దేశ, విదేశాల్లోని కోట్లాది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం..! -
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈసారి బ్యాంకు ఖాతా ద్వారా పింఛను పొందేందుకు తీరప్రాంత వాసులు పడవ ప్రయాణం చేయాల్సి వస్తోంది. -
అక్రమాలతో చెట్ట‘పట్టాలు’!
ఎన్నికల్లో అనుచిత లబ్ధికి వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ల ముసుగులో నకిలీ పట్టాలను పంచుతున్నారు. -
స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో ప్రజలపై రూ.1,274 కోట్ల భారం
ఎన్నికలకు ముందు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో(ఎస్టీవోఏ) సుమారు రూ.1,274 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై జగన్ ప్రభుత్వం మోపనుంది. -
అక్రమాల ఆధారాలను మా ముందు ఉంచండి
2018 నాటి గ్రూప్-1 నోటిఫికేషన్ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష (మెయిన్స్) జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో (చేతితో దిద్దడం) అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయనేందుకు గల ఆధారాలను వరుస క్రమంలో కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. -
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
డోన్ సభలో చంద్రబాబు ప్రసంగం అనంతరం ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బారికేడ్లు దాటుకుని ఏకంగా ఆయన వాహనంపైకి ఎక్కారు. -
మొక్కు‘బడి’లో ‘గ్లోబల్’ మోసం
పాఠశాలల్లో విద్యార్థులకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. ఘనత వహించిన జగన్ సర్కార్ మాత్రం అంతా రివర్స్. -
గ్రావెల్ గద్ద.. ఈ పెద్ద!
రాష్ట్రంలో వైకాపా నాయకులు ఒక్కొక్కరిది ఒక్కో తీరు. ‘నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా’ అని అందరూ చెబుతుంటారు. -
మల్లిక స్పైన్ సెంటర్కు అంతర్జాతీయ అవార్డు
స్పాండిలైటిస్ సమస్యపై చేసిన పరిశోధనకుగాను గుంటూరు మల్లిక స్పైన్ సెంటర్ డైరెక్టర్, ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు నరేష్బాబుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. -
‘కాపు’ కాస్తానని కాటేశారు!
దగా.. వంచన.. మోసం.. ఇలా ఏ పేరు పెట్టినా జగన్ దుర్మార్గపు ఆలోచనలకు సరితూగవు. పైకి అమాయకపు చక్రవర్తిలా నటిస్తూ.. ఆయన పాలనలో చేసిందంతా ఇదే! అది ఏ వర్గానికైనా సరే. -
జగన్ అహంభావంతో.. ఐదేళ్లలో పాలన అస్తవ్యస్తం
‘సీఎం జగన్ను సింహం అని ఆయన అనుచరులు పొగుడుతుంటారు. తనను తాను కారణ జన్ముడినని చిత్రించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తుంటారు. -
‘నిప్పు రాజేస్తున్నా’ నిర్లిప్తతేనా?
అధికార పార్టీకి చెందిన రౌడీమూకలు తెదేపా కార్యాలయాలు, ఆ పార్టీ నాయకుల ఆస్తులను తగలబెట్టేస్తే ఒక్కటంటే ఒక్క ఘటనలోనూ నిందితుల్ని పట్టుకోలేదు. -
మద్యం కాదు.. మంచినీళ్లతో గొంతు తడపండి!
ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు అభ్యర్థుల వెంట వెళ్తే చాలు.. తాగినంత మద్యం పోయిస్తున్నారు. -
చేపా చేపా ఎందుకు ఎండావ్?
సుదీర్ఘ తీరప్రాంతం అపార జలవనరులు... ఆంధ్రావనికి ఆదాయ మార్గాల్లో ఆక్వా రంగం కూడా ఒకటి.