గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లో ఏటీఎంలు
‘గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను విస్తరించే దిశగా ఆలోచన చేయాలి. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) ఏటీఎంలు ఏర్పాటు చేసేందుకు బ్యాంకులు చర్యలు
ఏర్పాటు చేయాలని ఎస్ఎల్బీసీ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ సూచన
గ్రామస్థాయిలో బ్యాంకింగ్ సేవలను విస్తరించాలని సలహా
ఈనాడు, అమరావతి: ‘గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను విస్తరించే దిశగా ఆలోచన చేయాలి. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) ఏటీఎంలు ఏర్పాటు చేసేందుకు బ్యాంకులు చర్యలు తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సూచించారు. రాష్ట్రంలో ఇంకా 4,240 ఆర్బీకేల పరిధిలో బ్యాంకింగ్ సేవలను ప్రారంభించాల్సి ఉందని గుర్తు చేశారు. నిరర్ధక ఆస్తులను (ఎన్పీఏ) తగ్గించడంలో వాలంటీర్లు తోడుగా నిలుస్తారని చెప్పారు. సీఎం అధ్యక్షతన మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో 217వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘కొవిడ్ కారణంగా 2019-20లో రూ.8వేల కోట్లు, 2020-21లో రూ.14వేల కోట్ల మేర ప్రభుత్వ ఆదాయం తగ్గింది. కొవిడ్ నియంత్రణకు అదనంగా రూ.8వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. మొత్తంగా రూ.30వేల కోట్ల భారం పడింది. బ్యాంకింగ్ రంగం సహకారంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిస్థితిని అధిగమించగలిగింది...’ అని పేర్కొన్నారు. ‘నిర్దేశిత రుణ మొత్తంలో వ్యవసాయరంగానికి గతేడాది 42.50% రుణాలివ్వగా.. ఈ ఏడాది 38.48% మాత్రమే ఇచ్చారు. అర్హులైన రైతులకు ఇంకా కిసాన్ క్రెడిట్ కార్డులు అందించాల్సి ఉంది. ఆర్బీకేల స్థాయిలో వీటిని జారీ చేయాలి. కౌలు రైతులకు రుణాలు అందించాలి. ఈ-క్రాప్ ఆధారంగా ఈ ప్రక్రియ చేపడితే రుణ జాబితాల నుంచి అనర్హులు తొలగిపోతారు...’ అని సీఎం పేర్కొన్నారు.
బోధనాసుపత్రులకు నాబార్డు రుణం
రాష్ట్రంలో కొత్తగా నిర్మించే 16 బోధనాసుపత్రులు, 16 నర్సింగ్ కళాశాలలకు రూ.12,243 కోట్లు అవసరం. ఇందులో కొంత రుణంగా ఇచ్చేందుకు నాబార్డు ముందుకొచ్చింది. ఇంకా రూ.9వేల కోట్లు కావాలి...’ అని సీఎం చెప్పారు. ‘నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లస్థలాలిచ్చింది. ప్రధానమంత్రి ఆవాస యోజన (పీఎంఏవై) పథకం ద్వారా కేంద్రం ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలు ఇస్తోంది. లబ్ధిదారులకు మరో రూ.35వేల చొప్పున బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలి. ఇళ్ల స్థలాలను ప్రభుత్వం మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్న నేపథ్యంలో అవసరమైతే వాటిని తనఖా పెట్టుకుని రుణాలు పంపిణీ చేయాలి. ఈ రుణాలపై 3% వడ్డీ మాత్రమే వసూలు చేయాలి. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది’ అని వివరించారు. ‘ఎంఎస్ఎంఈలకు సంబంధించి 8.3 లక్షల రుణ ఖాతాలుంటే 1.78 లక్షల ఖాతాలే పునర్వ్యవస్థీకరించారు. ఓటీఆర్(వన్ టైమ్ రీ స్ట్రక్చరింగ్) వినియోగించుకునే అవకాశం వారికి కల్పించాలి..’ అని సూచించారు.
నాబార్డు సహకరించాలి
రాష్ట్రంలోని 10,778 ఆర్బీకేల్లో ప్రత్యేక సామాజిక అద్దె యంత్రాల కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు వివరించారు. ఇందుకు సహకరించాలని నాబార్డును కోరారు. ‘వ్యవసాయ, ప్రాధాన్య రంగాల్లో బ్యాంకింగ్ వ్యవస్థ మంచి పనితీరు కనబర్చింది. ఎంఎస్ఎస్ఈ రంగానికి మరింత ప్రాధాన్యం కల్పించాలి. విద్య, గృహరుణాల మంజూరు కూడా మందకొడిగా ఉంది...’ అని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. ఆర్బీకేల్లో ఏటిఎం సహా ఇతర బ్యాంకింగ్ సేవలను విస్తరించే ప్రయత్నం చేస్తున్నామని యూనియన్ బ్యాంక్ ఎండీ రాజ్కిరణ్రాయ్ చెప్పారు. సున్నా వడ్డీని ఎప్పటికప్పుడు బ్యాంకులకు చెల్లిస్తున్నందున రైతులకు లబ్ధి కలుగుతోందని ఎస్ఎల్బీసీ కన్వీనర్ వి.బ్రహ్మానందరెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం
గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. -
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
మధ్యస్థంగా నీట్ పేపర్
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ-2024 ప్రవేశపరీక్షలో భౌతికశాస్త్రంలో మొత్తం 50 ప్రశ్నలకు 10 కష్టంగా ఉన్నాయని నిపుణులు వై.శారదాదేవి అన్నారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. -
యువతకు లక్ష విదేశీ ఉద్యోగాలు
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెదేపా కసరత్తు ప్రారంభించింది. దీనికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, పారిశ్రామికవేత్తలూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. -
ఉద్యోగాలు సృష్టించేవారినే ఎన్నుకోవాలి
‘ఉద్యోగాలు సృష్టించేవారినే అమెరికాలో ఎన్నుకుంటారు. విదేశీ పెట్టుబడులు రావడానికి ఆ దేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అందుకే అమెరికా అన్ని రంగాల్లో ముందుంది. -
సమస్యలపై ప్రశ్నించినందుకు నిండు గర్భిణిపై వైకాపా నేతల దాడి
స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నేతలు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన మేరకు.. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగులోళ్లపల్లిలో తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి... -
వైకాపా బంటులైన డీఎస్పీలపై వేటు
అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
నిన్న ఎగ్గొట్టి.. రేపు ఇస్తారట!
2019 ఎన్నికలప్పుడు జగన్ చెప్పిందేంటి? అన్నదాతలకు వడ్డీ లేని పంట రుణాలిస్తామనే కదా? మరి గద్దెనెక్కాక చేసిందేమిటి..? రూ.లక్షలోపు పంట రుణాలకేనంటూ నిబంధన పెట్టారు -
దళితులు జగన్ను ఓడించి.. తమను తాము రక్షించుకోవాలి
దళితులు, ముఖ్యంగా మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో వారిని రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు ధ్వజమెత్తారు. -
బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి
ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. -
సామాన్యుల ఆస్తులకు రక్షణేదీ?
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. -
భూ యాజమాన్య హక్కు చట్టం.. ప్రమాదకరం
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 కింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో)కి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధించొచ్చు. -
ప్రజల ఆస్తులపై వైకాపా పడగ నీడ
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అధికార పార్టీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది. -
చేదోడని.. ‘చెయ్యిచ్చి’!
‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది. -
ఐదేళ్ల ‘విద్వేషం.. విధ్వంసం’
జగన్ను 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించి... సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. ఇలాంటి అవకాశం వస్తే ఇంకెవరైనా సరే ప్రజారంజక పాలన అందించి, తన మార్కు చిరకాలం గుర్తుండిపోయేలా శ్రమిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు