కొనుగోలుదారులపై భారం రూ.217.50 కోట్లు
లేఅవుట్లో 5% స్థలాన్ని వైఎస్ఆర్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్టుకు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో కొనుగోలుదారులపై ఏటా రూ.217.50 కోట్ల అదనపు భారం పడనుందని అంచనా.
స్థిరాస్తి వ్యాపార వర్గాల్లో అసంతృప్తి
ఈనాడు, అమరావతి: లేఅవుట్లో 5% స్థలాన్ని వైఎస్ఆర్ జగనన్న హౌసింగ్ ప్రాజెక్టుకు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో కొనుగోలుదారులపై ఏటా రూ.217.50 కోట్ల అదనపు భారం పడనుందని అంచనా. ఎకరాపై ఈ భారం రూ.7.25 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. స్థిరాస్తి వ్యాపార రంగం ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయంపై ఆయా వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం లేఅవుట్లో 30% స్థలాన్ని రహదారులు, కాలువలు, ఇతర సదుపాయాల కల్పనకు కేటాయిస్తున్నారు. మరో 10% స్థలాన్ని సామాజిక అవసరాలకు సంబంధిత పట్టణాభివృద్ధి సంస్థలు, పురపాలక సంస్థలకు బదలాయిస్తున్నారు. ఎకరా స్థలంలో 40 శాతం మినహాయిస్తే...మిగిలిన 60 శాతం (2,904 చదరపు గజాల స్థలం)లో ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. ఇందులో నుంచి మరో 5% స్థలాన్ని కేటాయించాలంటే దాదాపు 145 చ.గజాల స్థలాన్ని ఒదులుకోవాలి. మార్కెట్లో ప్రస్తుతం చ.గజం సగటున రూ.5 వేల ధరకు విక్రయిస్తున్నారు. అంటే ఎకరా స్థలంలోనే రూ.7.25 లక్షల విలువైన స్థలం కోల్పోవాల్సి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఏటా 3 వేల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో కొత్త లేఅవుట్లకు అనుమతులిస్తున్నారు. అంటే వీటిలో నుంచి 5% స్థలం అంటే 4.35 లక్షల చదరపు గజాలు జగనన్న హౌసింగ్ ప్రాజెక్టుకి కేటాయించాలి. చ.గజం ధర రూ.5 వేల ప్రకారం లెక్కిస్తే ఈ స్థలం విలువ రూ.217.50 కోట్లుగా వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భారాన్ని భరించడానికి సిద్ధంగా లేమని...కొనుగోలుదారులపైనే వేస్తామంటున్నారు. ప్రస్తుతం విక్రయిస్తున్న ధరపై మరో రూ.వెయ్యి అదనంగా పెంచక తప్పదని విజయవాడకు చెందిన స్థిరాస్తి వ్యాపారి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏటా 300 నుంచి 400 లేఅవుట్లకు దరఖాస్తులొస్తున్నాయి. వీటిలో అత్యధికంగా విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉంటున్నాయి. తరువాత స్థానంలో ఉభయగోదావరి, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలు ఉన్నాయి.
కొవిడ్తో కొనుగోళ్లు బాగా తగ్గాయి
‘లేఅవుట్లో 5% స్థలాన్ని వ్యాపారులు కేటాయించాలంటే అంతిమంగా ఈ భారం కొనుగోలుదారులపై పడుతుంది. భూముల ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. అదే స్థాయిలో వ్యాపారం జరగడం లేదు. కొవిడ్తో కొనుగోళ్లు సైతం బాగా తగ్గాయి. ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నాం’.
- తాళ్లూరి శివాజీ, నెరెడ్కో విశాఖ ఛాప్టర్ వ్యవస్థాపక ఛైర్మన్
వెనక్కి తీసుకోవాలి
‘లేవుట్లలో ఐదు శాతం స్థలాన్ని కేటాయించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్థిరాస్తి వ్యాపార సంఘాలతో కలిసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. లేఅవుట్లో ఇప్పటికే 40% స్థలాన్ని ప్రజావసరాల కోసం కేటాయిస్తున్నాం. స్థిరాస్తి రంగం కూడా ఇబ్బందుల్లో ఉన్నందున మా విజ్ఞాపనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం’
-జి.హరిబాబు, జాతీయ స్థిరాస్తి వ్యాపార సమాఖ్య (నెరెడ్కో) రాష్ట్ర అధ్యక్షుడు
మూడు కిలో మీటర్లలో ఎక్కడైనా ఇవ్వొచ్చు కదా!
‘లేఅవుట్లోనే 5% స్థలాన్ని ఇవ్వాలని వ్యాపారులపై ఒత్తిడి తేవడం లేదు. మూడు కిలో మీటర్లలోపు ఎక్కడైనా ఇచ్చేలా వెసులుబాటు కల్పించాం. ఉమ్మడి రాష్ట్రంలోనూ లేఅవుట్లో 5% స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్నే అమలు చేస్తున్నాం తప్ప కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు. భాగస్వాములందరి అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నాకే జీవో ఇచ్చాం’
- బొత్స సత్యనారాయణ, పురపాలకశాఖ మంత్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీత, బీటెక్ రవిల వ్యాజ్యాల నుంచి తప్పుకొన్న మరో ధర్మాసనం
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ జె.సుమతిలతో కూడిన ధర్మాసనం తప్పుకుంది. -
భూ హక్కు చట్టంపై మంత్రి ధర్మాన ద్వంద్వ వైఖరి.. అప్పుడలా..ఇప్పుడిలా..
మాటల గారడీలో ఆరితేరిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ‘భూహక్కు చట్టం’ అమలుపై ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారు. -
పేకేరు సర్పంచికి అరుదైన గౌరవం
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. -
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
పనుల్లో తన, మన భేదం లేదు.. అంతా నాసిరకంగా చేయడమే ఈ ప్రభుత్వ మార్కు అని నేలకొరిగిన రాజశేఖరరెడ్డి విగ్రహం వెక్కిరిస్తోంది. -
గడువిస్తే అధికారులు నిద్రపోతారు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పింఛన్లపై సర్కారు మరో కుట్ర!
ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ససేమిరా అంది. మండుటెండల్లో పింఛనుదారుల్ని గ్రామ, వార్డు సచివాలయాలకు బలవంతంగా రప్పించేలా గత నెలలో ఎత్తుగడ వేసింది. -
సర్వాధికారాలు ఉన్నా.. నోరు విప్పని జగన్
ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రానికి ఇప్పటికీ ఆయనే సుప్రీం. పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని కనుసైగలతో నడిపిస్తున్నారు. -
వడ్డీకాసుల వాడికి ‘వంచన సేవ!’
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల నీరాజనాలందుకునే శ్రీనివాసుడు కొలువైన తిరుమల.. దేశ, విదేశాల్లోని కోట్లాది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం..! -
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈసారి బ్యాంకు ఖాతా ద్వారా పింఛను పొందేందుకు తీరప్రాంత వాసులు పడవ ప్రయాణం చేయాల్సి వస్తోంది. -
అక్రమాలతో చెట్ట‘పట్టాలు’!
ఎన్నికల్లో అనుచిత లబ్ధికి వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ల ముసుగులో నకిలీ పట్టాలను పంచుతున్నారు. -
స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో ప్రజలపై రూ.1,274 కోట్ల భారం
ఎన్నికలకు ముందు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో(ఎస్టీవోఏ) సుమారు రూ.1,274 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై జగన్ ప్రభుత్వం మోపనుంది. -
అక్రమాల ఆధారాలను మా ముందు ఉంచండి
2018 నాటి గ్రూప్-1 నోటిఫికేషన్ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష (మెయిన్స్) జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో (చేతితో దిద్దడం) అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయనేందుకు గల ఆధారాలను వరుస క్రమంలో కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. -
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
డోన్ సభలో చంద్రబాబు ప్రసంగం అనంతరం ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బారికేడ్లు దాటుకుని ఏకంగా ఆయన వాహనంపైకి ఎక్కారు. -
మొక్కు‘బడి’లో ‘గ్లోబల్’ మోసం
పాఠశాలల్లో విద్యార్థులకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. ఘనత వహించిన జగన్ సర్కార్ మాత్రం అంతా రివర్స్. -
గ్రావెల్ గద్ద.. ఈ పెద్ద!
రాష్ట్రంలో వైకాపా నాయకులు ఒక్కొక్కరిది ఒక్కో తీరు. ‘నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా’ అని అందరూ చెబుతుంటారు. -
మల్లిక స్పైన్ సెంటర్కు అంతర్జాతీయ అవార్డు
స్పాండిలైటిస్ సమస్యపై చేసిన పరిశోధనకుగాను గుంటూరు మల్లిక స్పైన్ సెంటర్ డైరెక్టర్, ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు నరేష్బాబుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. -
‘కాపు’ కాస్తానని కాటేశారు!
దగా.. వంచన.. మోసం.. ఇలా ఏ పేరు పెట్టినా జగన్ దుర్మార్గపు ఆలోచనలకు సరితూగవు. పైకి అమాయకపు చక్రవర్తిలా నటిస్తూ.. ఆయన పాలనలో చేసిందంతా ఇదే! అది ఏ వర్గానికైనా సరే. -
జగన్ అహంభావంతో.. ఐదేళ్లలో పాలన అస్తవ్యస్తం
‘సీఎం జగన్ను సింహం అని ఆయన అనుచరులు పొగుడుతుంటారు. తనను తాను కారణ జన్ముడినని చిత్రించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తుంటారు. -
‘నిప్పు రాజేస్తున్నా’ నిర్లిప్తతేనా?
అధికార పార్టీకి చెందిన రౌడీమూకలు తెదేపా కార్యాలయాలు, ఆ పార్టీ నాయకుల ఆస్తులను తగలబెట్టేస్తే ఒక్కటంటే ఒక్క ఘటనలోనూ నిందితుల్ని పట్టుకోలేదు. -
మద్యం కాదు.. మంచినీళ్లతో గొంతు తడపండి!
ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు అభ్యర్థుల వెంట వెళ్తే చాలు.. తాగినంత మద్యం పోయిస్తున్నారు. -
చేపా చేపా ఎందుకు ఎండావ్?
సుదీర్ఘ తీరప్రాంతం అపార జలవనరులు... ఆంధ్రావనికి ఆదాయ మార్గాల్లో ఆక్వా రంగం కూడా ఒకటి.