పీఆర్సీపై హైకోర్టుకు అధికారుల ఐకాస
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 17న ఇచ్చిన పీఆర్సీ(వేతన సవరణ) ఉత్తర్వులను(జీవో 1) సవాలు చేస్తూ ఏపీ గెజిటెడ్ అధికారుల ఐకాస ఛైర్మన్ కేవీ కృష్ణయ్య గురువారం హైకోర్టులో వ్యాజ్యం వేశారు. వాటి అమలుతో ప్రభుత్వ ఉద్యోగుల
ఉత్తర్వులను చట్ట విరుద్ధమైనవిగా ప్రకటించండి
వాటితో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతపడుతుంది
సవరించేలా ఆదేశించాలని కోరిన గెజిటెడ్ అధికారుల సంఘం
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 17న ఇచ్చిన పీఆర్సీ(వేతన సవరణ) ఉత్తర్వులను(జీవో 1) సవాలు చేస్తూ ఏపీ గెజిటెడ్ అధికారుల ఐకాస ఛైర్మన్ కేవీ కృష్ణయ్య గురువారం హైకోర్టులో వ్యాజ్యం వేశారు. వాటి అమలుతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత పడుతుందన్నారు. ఆర్థిక అత్యవసర పరిస్థితిలో మాత్రమే ప్రభుత్వాలు జీతాలను తగ్గిస్తాయని, రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదన్నారు. ఏపీ విభజన చట్టానికి జీవోలు వ్యతిరేకంగా ఉన్నాయని వాటిని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. తమ వినతులను పరిగణనలోకి తీసుకొని వేతనాలను తాజాగా సవరించేలా ఆదేశించాలని కోరారు. జీవో అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్నారు. వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, పే రివిజన్ కమిషన్ను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
పిటిషన్లో ఏముందంటే...
‘ఏపీ విభజన చట్టంలో హైదరాబాద్ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించినప్పటికీ పరిపాలనను 2016లో అమరావతికి మార్చారు. దీంతో ఉన్నపళంగా కుటుంబాలను హైదరాబాద్లోనే వదిలేసి ఉద్యోగులు అమరావతికి మారాల్సి వచ్చింది. మాపై హైదరాబాద్తోపాటు అమరావతిలో ఇంటి అద్దెల భారం పడింది. అకస్మాత్తుగా రాజధానిని తరలించడంతో గుంటూరు, విజయవాడల్లో అద్దెలు అసాధారణంగా పెరిగాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని అప్పటి ప్రభుత్వం... ఉద్యోగులకు చెల్లించే మూల వేతనం(బేసిక్ పే)లో 30% ఇంటి అద్దె భత్యం(హెచ్ఆర్ఏ)గా ప్రకటించారు. ప్రతి అయిదేళ్లకోసారి పీఆర్సీ వేస్తారు. అప్పటి జీవన విధానానికి అవుతున్న ఖర్చులను పరిగణనలోకి తీసుకొని ఎంతమేరకు జీతాలు పెంచాలనే అంశంపై కమిషన్ సిఫారసు చేస్తుంది. ఉద్యోగి నివసించే నగరంతోపాటు అక్కడున్న అద్దెలను పరిగణనలోకి తీసుకొని న్యాయబద్ధంగా హెచ్ఆర్ఏ నిర్ణయించాల్సి ఉంటుంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి అశుతోష్ మిశ్ర నేతృత్వంలో 2018లో అప్పటి ప్రభుత్వం పే రివిజన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. కమిషన్ లేవనెత్తిన అంశాలపై మేం సమగ్ర వివరాలు ఇచ్చాం. దురదృష్టవశాత్తు ఆ కమిషన్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టలేదు. కమిషన్ నివేదికను పరిశీలించేందుకు కార్యదర్శులతో ప్రభుత్వం మరో కమిటీ వేసింది. ఇది చట్ట విరుద్ధం. పీఆర్సీ కమిషన్ స్థాయిని తక్కువ చేయడమే. పీఆర్సీ కమిషన్ నివేదికను కాని, తదనంతర ఏర్పాటు చేసిన కార్యదర్శుల కమిటీ పరిశీలించిన విషయాలను ప్రభుత్వం బయటపెట్టకుండా ఏకపక్షంగా జీవోను జారీచేసింది. సహజ న్యాయసూత్రాలకు, విభజన చట్టానికి విరుద్ధంగా జీవో ఉంది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 78(1) ప్రకారం ఏపీ రాష్ట్రానికి కేటాయించిన ఉద్యోగులకు కల్పించే ప్రయోజనాలను స్పష్టంచేస్తోంది. ఆ సెక్షన్ ప్రకారం ఉద్యోగులు హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చినా సర్వీసు నిబంధనలు, వారి కల్పించే హెచ్ఆర్ఏ తదితర ప్రయోజనాలకు రక్షణ ఉంటుంది. ప్రస్తుత పీఆర్సీని 2018 జులై 1 నుంచి అమలవుతుందని పేర్కొనడం ద్వారా... ఇప్పటివరకు ఉద్యోగులకు అదనంగా ఏమైనా చెల్లించి ఉంటే వాటిని తిరిగి రాబట్టుకునే అధికారం కల్పించడం అసంబద్ధం. మేం ఇచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకోకుండా వేతన సవరణ ఉత్తర్వులిచ్చారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం జోక్యాన్ని కోరుతున్నాం’ అని పిటిషన్లో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీత, బీటెక్ రవిల వ్యాజ్యాల నుంచి తప్పుకొన్న మరో ధర్మాసనం
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ జె.సుమతిలతో కూడిన ధర్మాసనం తప్పుకుంది. -
భూ హక్కు చట్టంపై మంత్రి ధర్మాన ద్వంద్వ వైఖరి.. అప్పుడలా..ఇప్పుడిలా..
మాటల గారడీలో ఆరితేరిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ‘భూహక్కు చట్టం’ అమలుపై ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారు. -
పేకేరు సర్పంచికి అరుదైన గౌరవం
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. -
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
పనుల్లో తన, మన భేదం లేదు.. అంతా నాసిరకంగా చేయడమే ఈ ప్రభుత్వ మార్కు అని నేలకొరిగిన రాజశేఖరరెడ్డి విగ్రహం వెక్కిరిస్తోంది. -
గడువిస్తే అధికారులు నిద్రపోతారు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పింఛన్లపై సర్కారు మరో కుట్ర!
ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ససేమిరా అంది. మండుటెండల్లో పింఛనుదారుల్ని గ్రామ, వార్డు సచివాలయాలకు బలవంతంగా రప్పించేలా గత నెలలో ఎత్తుగడ వేసింది. -
సర్వాధికారాలు ఉన్నా.. నోరు విప్పని జగన్
ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రానికి ఇప్పటికీ ఆయనే సుప్రీం. పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని కనుసైగలతో నడిపిస్తున్నారు. -
వడ్డీకాసుల వాడికి ‘వంచన సేవ!’
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల నీరాజనాలందుకునే శ్రీనివాసుడు కొలువైన తిరుమల.. దేశ, విదేశాల్లోని కోట్లాది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం..! -
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈసారి బ్యాంకు ఖాతా ద్వారా పింఛను పొందేందుకు తీరప్రాంత వాసులు పడవ ప్రయాణం చేయాల్సి వస్తోంది. -
అక్రమాలతో చెట్ట‘పట్టాలు’!
ఎన్నికల్లో అనుచిత లబ్ధికి వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ల ముసుగులో నకిలీ పట్టాలను పంచుతున్నారు. -
స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో ప్రజలపై రూ.1,274 కోట్ల భారం
ఎన్నికలకు ముందు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో(ఎస్టీవోఏ) సుమారు రూ.1,274 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై జగన్ ప్రభుత్వం మోపనుంది. -
అక్రమాల ఆధారాలను మా ముందు ఉంచండి
2018 నాటి గ్రూప్-1 నోటిఫికేషన్ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష (మెయిన్స్) జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో (చేతితో దిద్దడం) అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయనేందుకు గల ఆధారాలను వరుస క్రమంలో కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. -
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
డోన్ సభలో చంద్రబాబు ప్రసంగం అనంతరం ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బారికేడ్లు దాటుకుని ఏకంగా ఆయన వాహనంపైకి ఎక్కారు. -
మొక్కు‘బడి’లో ‘గ్లోబల్’ మోసం
పాఠశాలల్లో విద్యార్థులకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. ఘనత వహించిన జగన్ సర్కార్ మాత్రం అంతా రివర్స్. -
గ్రావెల్ గద్ద.. ఈ పెద్ద!
రాష్ట్రంలో వైకాపా నాయకులు ఒక్కొక్కరిది ఒక్కో తీరు. ‘నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా’ అని అందరూ చెబుతుంటారు. -
మల్లిక స్పైన్ సెంటర్కు అంతర్జాతీయ అవార్డు
స్పాండిలైటిస్ సమస్యపై చేసిన పరిశోధనకుగాను గుంటూరు మల్లిక స్పైన్ సెంటర్ డైరెక్టర్, ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు నరేష్బాబుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. -
‘కాపు’ కాస్తానని కాటేశారు!
దగా.. వంచన.. మోసం.. ఇలా ఏ పేరు పెట్టినా జగన్ దుర్మార్గపు ఆలోచనలకు సరితూగవు. పైకి అమాయకపు చక్రవర్తిలా నటిస్తూ.. ఆయన పాలనలో చేసిందంతా ఇదే! అది ఏ వర్గానికైనా సరే. -
జగన్ అహంభావంతో.. ఐదేళ్లలో పాలన అస్తవ్యస్తం
‘సీఎం జగన్ను సింహం అని ఆయన అనుచరులు పొగుడుతుంటారు. తనను తాను కారణ జన్ముడినని చిత్రించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తుంటారు. -
‘నిప్పు రాజేస్తున్నా’ నిర్లిప్తతేనా?
అధికార పార్టీకి చెందిన రౌడీమూకలు తెదేపా కార్యాలయాలు, ఆ పార్టీ నాయకుల ఆస్తులను తగలబెట్టేస్తే ఒక్కటంటే ఒక్క ఘటనలోనూ నిందితుల్ని పట్టుకోలేదు. -
మద్యం కాదు.. మంచినీళ్లతో గొంతు తడపండి!
ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు అభ్యర్థుల వెంట వెళ్తే చాలు.. తాగినంత మద్యం పోయిస్తున్నారు. -
చేపా చేపా ఎందుకు ఎండావ్?
సుదీర్ఘ తీరప్రాంతం అపార జలవనరులు... ఆంధ్రావనికి ఆదాయ మార్గాల్లో ఆక్వా రంగం కూడా ఒకటి.