ఉద్యోగుల సమ్మె సైరన్
వేతన సవరణ (పీఆర్సీ)పై ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమయ్యాయి. ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు ప్రకటించాయి. పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా సోమవారం నుంచి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్శర్మకు సోమవారం సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి. ఇప్పటి వరకూ ఒక్కొక్కటిగా ఉన్న నాలుగు ఐకాసలు కలిపి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడ్డాయి. ఏపీ ఐకాస, ఐకాస అమరాతి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉమ్మడి వేదికపైకి వచ్చాయి.
ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి
నాలుగు ఐకాసలతో పీఆర్సీ సాధన సమితి ఏర్పాటు
కార్యాచరణ ప్రకటించిన సమితి నేతలు
ఈనాడు - అమరావతి
వేతన సవరణ (పీఆర్సీ)పై ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమయ్యాయి. ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు ప్రకటించాయి. పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా సోమవారం నుంచి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్శర్మకు సోమవారం సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి. ఇప్పటి వరకూ ఒక్కొక్కటిగా ఉన్న నాలుగు ఐకాసలు కలిపి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడ్డాయి. ఏపీ ఐకాస, ఐకాస అమరాతి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉమ్మడి వేదికపైకి వచ్చాయి. ఉద్యోగసంఘాలు శుక్రవారం సుదీర్ఘ చర్చలు జరిపాయి. మొదట ఉదయం ఎన్జీవో హోంలో ఐకాసలు సమావేశమై మధ్యాహ్నం వరకు సమ్మె, ఉద్యమ కార్యాచరణపై చర్చించాయి. మధ్యాహ్నం నుంచి నాలుగు ఐకాసలు కలిసి సచివాలయంలో సమావేశమై ఉమ్మడి కార్యాచరణ రూపొందించాయి. సమావేశం అనంతరం ఏపీ ఐకాస, ఐకాస అమరావతి ఛైర్మన్లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సీఎస్ సమీర్శర్మను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. కొత్త జీతాల బిల్లులు చేయాలని డీడీఓలపై ఒత్తిడి చేయొద్దని, పాత జీతాలే ఇవ్వాలని కోరారు. పీఆర్సీ ఉత్తర్వులు ఆపాలని విన్నవించారు. సోమవారం సమ్మె నోటీసు ఇచ్చేందుకు సమయం కోరారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించడానికి 12 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు.
ప్రభుత్వానిది మొండి వైఖరి: బండి
పీఆర్సీపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు అన్నారు. ‘తప్పనిసరి పరిస్థితుల్లో నాలుగు ఐకాసలు కలిసి పీఆర్సీ సాధన సమితి ఏర్పాటుచేసి, ఉద్యమించాల్సి వస్తోంది. సామాన్య ఉద్యోగి, ఉపాధ్యాయుల హక్కుల కోసమే పోరాటం చేస్తున్నాం. రెండు రోజులుగా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్యంలో జరిగిన ఉద్యమాన్ని చూసి ప్రభుత్వం మారుతుందనుకున్నాం. కానీ, ప్రభుత్వం ముందుకు వెళ్లడంవల్లే ఉద్యమ కార్యాచరణ చేపట్టాల్సి వచ్చింది. ఆర్టీసీ కార్మికులనూ నిరసనలో భాగస్వాములు కావాలని కోరాం. పీఆర్సీతో ఉద్యోగుల జీతాలు తగ్గలేదని ప్రభుత్వం అంటోంది. దీనిపై పునరాలోచించాలి. 3.5 లక్షల మంది ఉన్న పింఛనుదారులకు అదనపు పింఛను పీఆర్సీలో భాగమే అయినందున వారూ ఉద్యమానికి కలిసి రావాలి. పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో చర్చించడానికి మంత్రుల కమిటీని ఏర్పాటుచేసినట్లు తెలిసింది’ అన్నారు.
పార్టీలను అనుమతించం: బొప్పరాజు
ఉద్యమంలోకి రాజకీయ పార్టీలను అనుమతించకూడదని నిర్ణయించామని, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు, కార్మిక సంఘ నాయకులనే ఉద్యమంలోకి తీసుకుంటామని ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ‘పీఆర్సీపై ప్రకటన సమయంలో సీపీఎస్ రద్దుపై సీఎం కాలవ్యవధి ప్రకటించారు. దాని ప్రకారం చాలా సమయం పడుతుంది. దీనిపై ఇప్పటికే నివేదికలను తెప్పించుకున్నారు. మూడేళ్లుగా సీపీఎస్ రద్దు గురించి లక్షల మంది ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. దీనిపై ఆలస్యం కాకుండా ప్రభుత్వం నిర్ణయం ప్రకటించేలా పీఆర్సీ సాధనసమితి ద్వారా నాలుగు ఐకాసలు కలిసి పోరాడుతాయి. పీఆర్సీ ప్రకటన సమయంలో సీఎం పేర్కొన్న అంశాలు.. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు, కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ వంటి అంశాలపై కార్యాచరణ ఉంటుంది’ అన్నారు.
గొంతెమ్మ కోర్కెలు కావు: వెంకట్రామిరెడ్డి
ప్రభుత్వాన్ని తాము గొంతెమ్మ కోర్కెలు కోరటం లేదని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ‘ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీతో జీతాలు తగ్గుతున్నాయి. ఆ నష్టాన్ని పూడ్చాలనే డిమాండు చేస్తున్నాం. జీతాలు తగ్గుతాయనే ఆందోళనతోనే ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారు. వారి ప్రయోజనాలను కాపాడాలని అన్ని సంఘాల నాయకులు విభేదాలను పక్కనపెట్టి.. ఒకే డిమాండుతో పోరాడాలని నిర్ణయించాం. అశుతోష్ మిశ్ర కమిటీ నివేదికను ఉద్యోగసంఘాలకు ఇవ్వాలి. అందులోని లోటుపాట్లను పరిశీలించి, మళ్లీ ఉద్యోగసంఘాలతో చర్చించాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండేళ్ల సర్వీసు పూర్తిచేసి.. పరీక్షల్లో పాసైనవారికి ప్రొబేషన్ ఇవ్వాలి. పీఆర్సీ ప్రకారం వారికీ కొత్త పేస్కేలు అమలుచేయాలి. ఉద్యోగులు ఎక్కడా అసభ్య పదజాలం వాడకుండా చట్ట పరిమితులకు లోబడే ఆందోళనల్లో పాల్గొనాలి’ అని వెల్లడించారు.
వెనక్కి తీసుకోవాల్సిందే: సూర్యనారాయణ
పీఆర్సీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ‘పీఆర్సీ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలతో సంప్రదించినట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఏకపక్షంగా ఉత్తర్వులిచ్చింది. వాటిని వెనక్కి తీసుకోవాలి. రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల సంఘాలన్నీ ఒక సమాఖ్యగా ఏర్పడ్డాయి. పీఆర్సీ, దానికి అనుబంధంగా ఉన్న అంశాలన్నింటిపై ఆందోళన కార్యక్రమాలను పీఆర్సీ సాధన సమితి రూపొందిస్తుంది. దీనికోసం అన్ని సంఘాల జేఏసీల నుంచి ముగ్గురి చొప్పున 12మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటుచేశాం. పీఆర్సీ ఉత్తర్వుల అమలు నిలిపేసి జనవరికి పాతజీతాలే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నాం. సవరించిన జీతాలు చేయాలని ప్రభుత్వం డీడీఓలపై ఒత్తిడి చేస్తోంది. కార్యాచరణలో ఎక్కడా రాజకీయ పార్టీలను అనుమతించకూడదని నిర్ణయించాం’ అని వెల్లడించారు.
ఉద్యమ కార్యాచరణ ఇలా...
జనవరి 23: అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్టేబుల్ సమావేశాలు
జనవరి 24: సీఎస్ను కలిసి సమ్మె నోటీసు
జనవరి 25: అన్ని జిల్లాకేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు. సచివాలయంలో ప్రత్యేకంగా నిరసన
జనవరి 26: అంబేడ్కర్ విగ్రహానికి అన్నిచోట్లా వినతిపత్రాలు
జనవరి 27 నుంచి 30 వరకు: అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిలే దీక్షలు
ఫిబ్రవరి 3: చలో విజయవాడ
ఫిబ్రవరి 5: అన్ని ప్రభుత్వ విభాగాల్లోని సిబ్బంది సహాయ నిరాకరణ. అన్ని విభాగాల యాప్లలో సమాచారం అప్లోడ్ నిలిపివేత
ఫిబ్రవరి 7: ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం
గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. -
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
మధ్యస్థంగా నీట్ పేపర్
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ-2024 ప్రవేశపరీక్షలో భౌతికశాస్త్రంలో మొత్తం 50 ప్రశ్నలకు 10 కష్టంగా ఉన్నాయని నిపుణులు వై.శారదాదేవి అన్నారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. -
యువతకు లక్ష విదేశీ ఉద్యోగాలు
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెదేపా కసరత్తు ప్రారంభించింది. దీనికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, పారిశ్రామికవేత్తలూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. -
ఉద్యోగాలు సృష్టించేవారినే ఎన్నుకోవాలి
‘ఉద్యోగాలు సృష్టించేవారినే అమెరికాలో ఎన్నుకుంటారు. విదేశీ పెట్టుబడులు రావడానికి ఆ దేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అందుకే అమెరికా అన్ని రంగాల్లో ముందుంది. -
సమస్యలపై ప్రశ్నించినందుకు నిండు గర్భిణిపై వైకాపా నేతల దాడి
స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నేతలు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన మేరకు.. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగులోళ్లపల్లిలో తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి... -
వైకాపా బంటులైన డీఎస్పీలపై వేటు
అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
నిన్న ఎగ్గొట్టి.. రేపు ఇస్తారట!
2019 ఎన్నికలప్పుడు జగన్ చెప్పిందేంటి? అన్నదాతలకు వడ్డీ లేని పంట రుణాలిస్తామనే కదా? మరి గద్దెనెక్కాక చేసిందేమిటి..? రూ.లక్షలోపు పంట రుణాలకేనంటూ నిబంధన పెట్టారు -
దళితులు జగన్ను ఓడించి.. తమను తాము రక్షించుకోవాలి
దళితులు, ముఖ్యంగా మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో వారిని రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు ధ్వజమెత్తారు. -
బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి
ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. -
సామాన్యుల ఆస్తులకు రక్షణేదీ?
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. -
భూ యాజమాన్య హక్కు చట్టం.. ప్రమాదకరం
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 కింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో)కి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధించొచ్చు. -
ప్రజల ఆస్తులపై వైకాపా పడగ నీడ
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అధికార పార్టీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది. -
చేదోడని.. ‘చెయ్యిచ్చి’!
‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది. -
ఐదేళ్ల ‘విద్వేషం.. విధ్వంసం’
జగన్ను 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించి... సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. ఇలాంటి అవకాశం వస్తే ఇంకెవరైనా సరే ప్రజారంజక పాలన అందించి, తన మార్కు చిరకాలం గుర్తుండిపోయేలా శ్రమిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్