గుడివాడ ఘటనలో తెదేపా నేతలపై కేసులు
గుడివాడ ఘటనలో తెదేపా నేతలపై కేసులు నమోదయ్యాయి. తెలుగుదేశానికి చెందిన ముఖ్యనేతలు సహా 27 మందిపై గుడివాడ ఒకటో పట్టణ పోలీసులు కేసులు నమోదుచేశారు. వైకాపా నేతల ఫిర్యాదుపై కూడా తెదేపా నేతలపై కేసులు నమోదు చేశారు.
ముళ్లపూడి రమేష్ ఫిర్యాదు న్యాయసలహాకు
వైకాపా వర్గీయులపై బైండోవర్ కేసులు
ఈనాడు, అమరావతి: గుడివాడ ఘటనలో తెదేపా నేతలపై కేసులు నమోదయ్యాయి. తెలుగుదేశానికి చెందిన ముఖ్యనేతలు సహా 27 మందిపై గుడివాడ ఒకటో పట్టణ పోలీసులు కేసులు నమోదుచేశారు. వైకాపా నేతల ఫిర్యాదుపై కూడా తెదేపా నేతలపై కేసులు నమోదు చేశారు. వీటి వివరాలను పోలీసులు బయటపెట్టడం లేదు. తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో మంత్రి కొడాలి నాని ఓఎస్డీ శశిభూషణ్పై కేసు నమోదు చేశారు. గాయపడిన తెదేపా కార్యకర్త ముళ్లపూడి రమేష్ పోలీసు అవుట్పోస్టులో ఇచ్చిన ఫిర్యాదుపై ఇంకా కేసు నమోదు చేయలేదు. దీన్ని న్యాయసలహా కోసం పంపినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. పోలీసులు కేసుల నమోదులో పక్షపాతం చూపిస్తున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు.
27 మందిపై కేసు: తెదేపాకు చెందిన 27 మందిపై పోలీసులు సీఆర్పీసీ 151 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. పోలీసు నిషేధాజ్ఞలు ఉల్లంఘించినట్లు గుడివాడ ఒకటో పట్టణ సీఐ గోవిందరాజు ఫిర్యాదుతో కేసు నమోదైంది. మాజీ ఎంపీ కొనకొళ్ల నారాయణ, బొండా ఉమా, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, వర్ల కుమార్రాజా, నక్కా ఆనంద్బాబు, కాగిత కృష్ణప్రసాద్, కొనకొళ్ల జగన్నాథరావు తదితరులపై కేసులు నమోదయ్యాయి.
ముళ్లపూడి రమేష్పై కేసు: శుక్రవారం జరిగిన దాడిలో గాయపడిన తెదేపా కార్యకర్త ముళ్లపూడి రమేష్తో పాటు.. మరికొందరిపై దాడి, హత్యాయత్నం కేసు నమోదైంది. తనపై హత్యాయత్నం చేశారని, తన వాహనాన్ని ధ్వంసం చేశారని వైకాపా కార్యకర్త వాలిశెట్టి సత్యనారాయణ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
వైకాపా నేతలు 19 మందిపైనా..: 19 మంది వైకాపా నేతలపై పోలీసులు బైండోవర్ కేసులు నమోదు చేశారు. సీఆర్పీసీ 151 కింద 19 మందిపై సీఐ గోవిందరాజు కేసు నమోదుచేశారు. కార్యకర్తలు తోట నాగరాజు, జి.శ్రీనివాసరావు, కె.నాగరాజు తదితరులపై కేసు నమోదైంది.
బొండా ఉమా ఫిర్యాదుతో..: తెదేపా మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఒక కేసు నమోదుచేశారు. తమపై దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని ఉమా ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. ఇందులో శశిభూషణ్, ఇతరులు ఇద్దరిని నిందితులుగా పేర్కొన్నారు. తమపై హత్యకు దాడి జరిగిందని ఫిర్యాదు చేసినా ఆ సెక్షన్ నమోదు చేయలేదని తెదేపా నేతలు ఫిర్యాదు చేస్తున్నారు.
మీకు ఇష్టం వచ్చింది రాసుకోండి: గుడివాడ ఘటనలో కేసుల వివరాలు తెలియజేయాలని ఒకటో పట్టణ సీఐ గోవిందరాజును మీడియా కోరగా ‘మీ ఇష్టం వచ్చింది రాసుకోండి. నేను ఎలాంటి వివరాలు చెప్పను’ అంటూ బూతులు మాట్లాడారు. మీడియా రికార్డు చేసిన దృశ్యాలను తొలగించాలని ఒత్తిడి తెచ్చారు.
పామర్రులోనూ తెదేపాపై కేసు: కృష్ణాజిల్లా పామర్రు పోలీసుస్టేషన్లోనూ తెదేపా నేతలపై కేసు నమోదైంది. పైవంతెన వద్ద 30 కార్లలో వచ్చిన తెదేపా నేతలు తమ విధులకు ఆటంకం కలిగించారని నూజివీడుకు చెందిన సీసీఎస్ సీఐ బాలశౌరి ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ కోసం.. ఎంతకైనా దిగజారుతా
నువ్వు ఇంతకంటే దిగజారవనుకునే ప్రతిసారీ నా నమ్మకం తప్పని నిరూపిస్తున్నావు అంటూ జెర్సీ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డికి అది అతికినట్టుగా సరిపోతుంది. -
మద్యం మహమ్మారికి ‘జగన్ ముద్దులు’
‘‘నాలుగు సంవత్సరాల్లో మద్యపానాన్ని పూర్తిగా తీసేయాలన్న కసి నాలో ఉంది’’ అని తన తండ్రి సమాధి సాక్షిగా చెప్పిన జగన్మోహన్రెడ్డి - సీఎంగా చేసిందేంటి? కాపురాలను కూల్చే మద్యం మహమ్మారిని కసికసిగా ముద్దుచేశారు. -
వైకాపా వీరభక్త అమ్మిరెడ్డిపై వేటు
వైకాపా సేవే పరమావధిగా, ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావిస్తూ విధులు నిర్వర్తించిన మరో ‘ఎస్ బాస్’పై ఎన్నికల సంఘం వేటు వేసింది. -
ఏపీ నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
రాష్ట్ర నూతన డీజీపీగా హరీష్కుమార్ గుప్తా సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ఆయన ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. -
నీరు ఇవ్వలేం... కొనుక్కుని తాగండి!
ఒంగోలు శివారు కాలనీల్లో ప్రజలు ఎన్ని రోజులకోసారి స్నానం చేస్తున్నారో తెలుసా? మూడు రోజులకోసారి. ఇది నీటి కొరత తెచ్చిన దుస్థితి. శివారు కాలనీలకు ఐదు రోజులకోసారి ట్యాంకర్లతో నగరపాలక సంస్థ అరకొరగా నీరు సరఫరా చేస్తోంది. ఇవి అవసరాలకు సరిపోక పోవడంతో స్నానం చేయడం తగ్గించుకున్నారు. -
వైకాపా అరాచకాలపై మేము సైతం పోరాడతాం
‘ఏపీలో అరాచక పాలన సాగుతోంది. అన్ని వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మా వంతు పోరాడతాం’ అని అమెరికాలోని ప్రవాస భారతీయ మహిళలు తెలిపారు. -
వైద్య బోధకుల బదిలీల దుమారం
ముందస్తు సమాచారం లేకుండా బదిలీల ఉత్తర్వులు జారీచేసి, వెంటనే రిలీవ్ కావాలని పేర్కొనడంపై వైద్య బోధకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి పాడేరు, మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందులలోని కొత్త వైద్యకళాశాలల్లో తరగతులు ప్రారంభం కావాలి. -
ఇఫ్కోకు భూకేటాయింపుపై పిల్ కొట్టివేత
యూరియా, అమోనియా ప్లాంట్ నిర్మాణం కోసం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ (ఇఫ్కో)కు భూములు కేటాయించడాన్ని సవాలు చేస్తూ.. 2017లో దాఖలైన పిల్ను కొట్టేస్తూ సోమవారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. -
భరోసానూ బరికేశారు!
రైతుబంధు కింద తెలంగాణలో ఎకరానికి ఏడాదికి ఇస్తోంది రూ.10,000. ఐదెకరాలుంటే రూ.50 వేలు. అంటే ఐదేళ్లలో ఒక్కో రైతుకు అందింది కనీసం రూ.2.50 లక్షలు. -
ముందుచూపుతో ప్రజల్ని నడిపించే దార్శనికులు రావాలి
పౌరులు ధైర్యంగా ప్రభుత్వాల్ని ప్రశ్నించగలిగినప్పుడే ప్రజాస్వామ్యం మనగలుగుతుందని సామాజికవేత్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై భౌతికదాడులు సర్వసాధారణంగా మారాయని, వారికి పథకాలు నిలిపివేయడం.. -
ఉద్యోగాలు సృష్టించే వారికే ఓటేయాలి
‘హైదరాబాద్ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం అక్కడి మౌలిక వసతులే. అటువంటి పరిస్థితులు ఏపీలో కనిపించడం లేదు. కనీసం రోడ్లు కూడా సరిగ్గా లేవు. అన్ని వసతులు కల్పిస్తేనే పెట్టుబడులు వస్తాయి. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు నేనే ప్రత్యక్ష బాధితుడిని
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు తానే ప్రత్యక్ష బాధితుడినని విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో సోమవారం ట్వీట్ చేశారు. చనిపోయిన తన తల్లిదండ్రులకు చెందిన కృష్ణా జిల్లా విన్నకోటలోని పట్టాభూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పేర్కొన్నారు. -
ఎన్నికలు పూర్తయ్యే వరకూ.. నిధుల విడుదల వాయిదా
రైతులకు పెట్టుబడి రాయితీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ పంపిన ప్రతిపాదనలను ఎన్నికల సంఘం తిరస్కరించింది. -
రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
‘బిల్లుల చెల్లింపులపై విచారణ జరిపించండి’
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక.. మొదట బిల్లులు అప్లోడ్ అయిన గుత్తేదారులకు తొలుత చెల్లింపు విధానం(ఫిఫో) పాటించలేదని, దీనిపై విచారణ జరిపించాలని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (సబ్కా) కోరింది. -
ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు ప్రకటన జారీ
ట్రిపుల్ ఐటీ కళాశాలలో అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీయూకేటీ కులపతి కేసీ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
-
పెద్దల మాట
-
గోడు విన్నా.. ‘గోల్డ్’ ఇవ్వలే!
ఓ సంస్థ చేసిన మోసంతో వారు అప్పటికే పీకలతు మునగగా ఆ బాధితులను జగన్ నిండాముంచారు. అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని, వాటికి వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని పూటకో మాట మార్చారు. తలమీద చెయ్యివేసి గోడు వింటుంటే.. ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లేనని బాధితులు ఎంతో ఆశపడ్డారు. -
ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు తీసే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
-
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
-
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్