కొత్త జడ్పీలపై ఉత్కంఠ!
కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో నూతన జిల్లా పరిషత్తులు కూడా తెరపైకి వస్తున్నాయి. జడ్పీలపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ... నెలాఖరులోగా స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని
తెలంగాణ విధానమే కొనసాగిస్తారా?
కొత్తగా నిర్ణయాలు తీసుకుంటారా?
రాష్ట్రంలో మొదలైన చర్చ
ఈనాడు, అమరావతి: కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో నూతన జిల్లా పరిషత్తులు కూడా తెరపైకి వస్తున్నాయి. జడ్పీలపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ... నెలాఖరులోగా స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని అధికారవర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా అక్కడి ప్రభుత్వం అమలు చేసిన పద్ధతిని ఇక్కడా కొనసాగిస్తారా? కొత్త నిర్ణయాలు తీసుకుంటారా? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
అక్కడ ఏం చేశారంటే?
తెలంగాణలో కొత్త జిల్లాలు ప్రారంభించాక వెంటనే జిల్లా పరిషత్తులు ఏర్పాటు కాలేదు. అప్పటికే ఉన్న జడ్పీ ఛైర్మన్, జడ్పీటీసీ సభ్యులు... తదుపరి పరిషత్ ఎన్నికలు నిర్వహించే వరకు యథావిధిగా కొనసాగారు. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాను విభజించి కొత్తగా వికారాబాద్, మేడ్చల్ జిల్లాలను ఏర్పాటు చేశారు. రంగారెడ్డితో కలిపి మొత్తం మూడు జిల్లాల్లోనూ అప్పటికే ఉన్న జడ్పీ పాలకవర్గమే కొన్నాళ్లు కొనసాగింది. మూడు జిల్లాలకూ కలిపే జిల్లా పరిషత్తు ఉమ్మడి సర్వసభ్య సమావేశాలు నిర్వహించారు. పాలకవర్గ పదవీ కాలం ముగిశాక మరో రెండు జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేసి మూడింటికీ కలిపి 2019లో ఒకేసారి పరిషత్ ఎన్నికలు నిర్వహించారు. తెలంగాణ అంతటా ఇదే విధానాన్ని అమలు చేశారు.
చట్టాన్ని సవరించి బిల్లు పెట్టాల్సిందే
కొత్తగా జడ్పీలు ఏర్పాటు చేయాలంటే పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి అసెంబ్లీలో బిల్లు పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాల విస్తీర్ణం మారనుంది. అదేవిధంగా జిల్లా పరిషత్తులకు కొత్త విస్తీర్ణంతో మ్యాపింగ్ చేయాలి. చట్ట సవరణ అనంతరమే ఈ ప్రక్రియ మొదలవుతుంది. రాష్ట్రంలోని జిల్లా పరిషత్తుల పాలకవర్గాల పదవీ కాలం 2021 సెప్టెంబరులో ప్రారంభమైంది. మరో నాలుగున్నరేళ్లకుపైగా వీరు కొనసాగుతారు. అప్పటివరకు ప్రభుత్వం వేచి చూస్తుందా? కొత్త జడ్పీల కోసం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి అసెంబ్లీలో బిల్లు పెడుతుందా? అనేది చూడాలి. కేవలం కొత్త జిల్లా పరిషత్తులకు ఎన్నికలు నిర్వహించాలనుకుంటే సాంకేతికంగా కొన్ని సమస్యలు తలెత్తొచ్చని నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు ఒక జడ్పీటీసీ స్థానం నుంచి ఎన్నికైన వ్యక్తికి రిజర్వేషన్లు కలిసి రావడంతో జడ్పీ ఛైర్మన్ స్థానం కూడా దక్కింది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జడ్పీటీసీ స్థానం కొత్త జిల్లాలోకి మారి అక్కడ కొత్తగా మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే... అప్పటివరకు ఉన్న ఛైర్మన్ పదవి కోల్పోయే అవకాశముంది. ఇలాంటి సాంకేతిక అంశాలను అధిగమించి ప్రభుత్వం ఏవిధంగా ముందుకు వెళుతుందనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రం యూనిట్గా వివిధ వర్గాల జనాభా ఆధారంగా జడ్పీ ఛైర్మన్ స్థానాలకు ఖరారు చేసే రిజర్వేషన్ల విధానమే మున్ముందూ కొనసాగుతుందని నిపుణులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం
గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. -
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
మధ్యస్థంగా నీట్ పేపర్
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ-2024 ప్రవేశపరీక్షలో భౌతికశాస్త్రంలో మొత్తం 50 ప్రశ్నలకు 10 కష్టంగా ఉన్నాయని నిపుణులు వై.శారదాదేవి అన్నారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. -
యువతకు లక్ష విదేశీ ఉద్యోగాలు
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెదేపా కసరత్తు ప్రారంభించింది. దీనికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, పారిశ్రామికవేత్తలూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. -
ఉద్యోగాలు సృష్టించేవారినే ఎన్నుకోవాలి
‘ఉద్యోగాలు సృష్టించేవారినే అమెరికాలో ఎన్నుకుంటారు. విదేశీ పెట్టుబడులు రావడానికి ఆ దేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అందుకే అమెరికా అన్ని రంగాల్లో ముందుంది. -
సమస్యలపై ప్రశ్నించినందుకు నిండు గర్భిణిపై వైకాపా నేతల దాడి
స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నేతలు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన మేరకు.. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగులోళ్లపల్లిలో తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి... -
వైకాపా బంటులైన డీఎస్పీలపై వేటు
అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
నిన్న ఎగ్గొట్టి.. రేపు ఇస్తారట!
2019 ఎన్నికలప్పుడు జగన్ చెప్పిందేంటి? అన్నదాతలకు వడ్డీ లేని పంట రుణాలిస్తామనే కదా? మరి గద్దెనెక్కాక చేసిందేమిటి..? రూ.లక్షలోపు పంట రుణాలకేనంటూ నిబంధన పెట్టారు -
దళితులు జగన్ను ఓడించి.. తమను తాము రక్షించుకోవాలి
దళితులు, ముఖ్యంగా మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో వారిని రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు ధ్వజమెత్తారు. -
బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి
ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. -
సామాన్యుల ఆస్తులకు రక్షణేదీ?
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. -
భూ యాజమాన్య హక్కు చట్టం.. ప్రమాదకరం
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 కింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో)కి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధించొచ్చు. -
ప్రజల ఆస్తులపై వైకాపా పడగ నీడ
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అధికార పార్టీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది. -
చేదోడని.. ‘చెయ్యిచ్చి’!
‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ ధైర్యం పేరు జస్ప్రీత్.. వివరాలు చెప్పండి ప్లీజ్: ఆనంద్ మహీంద్రా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హిరామండీ’ నటుడు
-
కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన బైకు.. ఇద్దరి మృతి
-
ఆస్ట్రేలియాలో కత్తి దాడిలో భారత విద్యార్థి మృతి
-
అణ్వాయుధాల కసరత్తు మొదలుపెట్టండి - సైన్యానికి పుతిన్ ఆదేశం