Ap news:సమ్మిళిత, సమతుల వృద్ధికే 3 రాజధానులు
రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సమ్మిళిత, సమతుల వృద్ధికి మూడు రాజధానులు ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోందని ఆర్థిక, ప్రణాళికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి వెల్లడించారు. ప్రాంతీయ అసమానతలను తొలగించి, అభివృద్ధి ఫలాల్ని
ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి
బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా విస్తృత చర్చ
సభాపతి తమ్మినేని సీతారాం
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సమ్మిళిత, సమతుల వృద్ధికి మూడు రాజధానులు ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోందని ఆర్థిక, ప్రణాళికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి వెల్లడించారు. ప్రాంతీయ అసమానతలను తొలగించి, అభివృద్ధి ఫలాల్ని చివరి లబ్ధిదారుడి దాకా చేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్రంలో 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి వీలుగా ప్రాంతీయ అసమానతలను తొలగించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి? అని సభ్యులడిగిన ప్రశ్నకు మంత్రి బుగ్గన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ‘రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధికి, సమాజంలోని నిరుపేదలు, సన్నకారు, వెనుకబడిన, నిస్సహాయ వర్గాల కోసం అనేక పథకాలు అమలవుతున్నాయి. పరిపాలనను పౌరులకు దగ్గరకు తీసుకెళ్లి, సామాన్యులనూ ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వికేంద్రీకరణను అవలంబించింది. వికేంద్రీకృత అభివృద్ధిపై దృష్టి సారించి, 26 జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది’ అని మంత్రి పేర్కొన్నారు. సభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ... మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధి, ఇతర అంశాలపై సభ్యులు ధర్మాన ప్రసాదరావు, గోవర్ధన్రెడ్డి, శ్రీధర్రెడ్డి, నాగార్జున, జోగి రమేష్ అడిగిన ప్రశ్నలపై చర్చను మరోరోజు చేపడతామన్నారు. మిగిలిన సభ్యులూ ఈ అంశంపై విస్తృత చర్చ అవసరమని అభిప్రాయపడినట్లు తెలిపారు. బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా ఈ అంశం గురించి విస్తృత స్థాయిలో చర్చించేందుకు అనుమతిస్తానని ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దల మాట
మన ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటరు అజ్ఞానం, అందరి భద్రతకు ముప్పు కలిగించవచ్చు. -
నేడు మన ‘నీడ’ మనకు కనిపించదు!
మనం ఎండలో ఎక్కడికి వెళ్లినా.. కూర్చున్నా.. నిల్చున్నా.. మన నీడ వెన్నంటే ఉంటుంది కదా.. గురువారం మిట్టమధ్యాహ్న సమయంలో మాత్రం అలా ఉండదు. -
రూ.7 వేలకోట్ల రుణానికి ప్రయత్నాలు.. పోలింగ్ ముందురోజు పంపకాలకు సన్నాహాలు
ఎప్పుడో బటన్ నొక్కి, నెలల తరబడి పెండింగ్లో ఉంచిన వివిధ పథకాల సొమ్ములను పోలింగ్ ముందురోజు పంచేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏపీ ఉన్నతాధికారులే హైకోర్టును ఆశ్రయించారు. -
షర్మిల, సునీత, బీటెక్ రవి పిటిషన్ల కొట్టివేత
వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి బహిరంగంగా మాట్లాడవద్దని ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని దాఖలైన మూడు వెకేషన్ పిటిషన్లను కొట్టివేస్తూ కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి బుధవారం తీర్పు చెప్పారు. -
కోర్టు ఆదేశించినా స్టీల్ప్లాంటుకు బొగ్గు తరలింపునకు అవరోధం
అదానీ గంగవరం పోర్టు నుంచి కన్వేయర్ బెల్ట్ ద్వారా విశాఖ ఉక్కు కర్మాగారానికి బొగ్గు తరలించడంలో అవరోధం కల్పించవద్దని నిర్వాసిత కార్మికులను ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు అమలు కాకపోవడంతో ‘స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్’ ప్రధాన కార్యదర్శి కె.వెంకట దుర్గాప్రసాద్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. -
కేంద్రం నిధులు వాడేసుకొని జీతాలు ఇవ్వని జగన్ సర్కార్
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఇతర పథకాలకు మళ్లించేసిన ప్రభుత్వం.. 2 నెలలుగా సమగ్ర శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ)లో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. -
మీ లాకర్ తెరిచారు.. అది మీరేనా?
‘విజయవాడ పటమటలోని భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ)లో ఉన్న మీ బ్యాంకు లాకరును సాయంత్రం 5.32 నిమిషాలకు తెరిచారు. అది మీరేనా? ఒకవేళ మీరు కాకుంటే వెంటనే బ్యాంకు శాఖను సంప్రదించండి’ అని సందేశం వస్తే మీరేం చేస్తారు. -
విష కౌగిలిలో విలవిల
తూర్పు తీరాన పొద్దుపొడుపు... ఆంధ్రావని ప్రగతికి దిక్సూచి... అందాల విశాఖ. వైకాపా అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వంలోని ముఖ్యులు రాజధాని పేరుతో ఈ నగరంపై రాబందుల్లా వాలారు కనీవినీ ఎరుగనికబ్జాకాండకు తెరతీశారు. -
ధీమా లేదు.. బీమా రాదు!
జగన్ అంటే రివర్స్ కదా... అధికారం అప్పగిస్తే అల్లకల్లోలం చేశారు... సాఫీగా సాగుతున్న పద్ధతిని సంక్లిష్టం చేశారు..! కౌలు కార్డులంటూ కష్టాలు తెచ్చారు... విత్తనాలు లేవు... విత్తమూ ఇవ్వలేదు... బీమా దక్కలేదు.. పంటలకు, జీవితాలకు ధీమా కల్పించలేదు... ప్రాణాలు వదిలేసినా... -
భగ్గుమంటున్న మగ్గం
రాట్నాలు.. రగిలిపోతున్నాయి.. కండెలు.. మండిపడుతున్నాయి.. పట్టుచీరలు.. వెక్కిరిస్తున్నాయి.. అల్లికలు.. అబద్ధాల కోరువంటున్నాయి.. వర్ణాలు.. రంగులు మార్చే ఊసరెల్లివి అంటున్నాయి.. మగ్గం.. మడమ తిప్పావంటోంది.. ఓట్లు దండుకొని... అధికారంలోకి వచ్చాక.. -
దుల్హన్ బంద్ కియా ... ‘తోఫా’కో ధోకా దియా!
ముస్లింలకు అండగా ఉంటానన్న జగన్ నిబంధనల కొర్రీపెట్టి ‘దుల్హన్’ను దూరం చేశారు. షాదీఖానాలు కట్టించేందుకు చొరవ చూపలేదు. కనీసం రంజాన్ రోజున మంచి భోజనం పెట్టేందుకూ మనసొప్పలేదు. గత తెదేపా ప్రభుత్వం అమలుచేసిన రంజాన్ తోఫాను రద్దు చేశారు. -
సొమ్ము జనానిది.. బొమ్మ జగన్ది!
కోడిగుడ్లు, రాగిపిండి, పల్లీచిక్కి.. కాదేదీ జగన్ బొమ్మకు అనర్హం! ఇదేదో కవిత్వం అనుకునేరు. శ్రుతిమించిన జగన్ ప్రచార పైత్యం! ప్రజలు కష్టపడి కట్టుకున్న ఇళ్లు.. అప్పుచేసి కొనుక్కున్న స్థలాలు.. వారసత్వంగా వచ్చిన పొలాలు.. ఇలా ఏదైనా ఆయనకు అనవసరం. -
ఉద్యోగాలు సృష్టించే నాయకుణ్ని ఎన్నుకోవాలి
ఏ నాయకుడు రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్తారు? ఎవరి వల్ల యువతకు ఉద్యోగాలు వస్తాయి? రాష్ట్రంలో శాంతిభద్రతలను ఎవరు కాపాడతారో అలాంటి నాయకుడిని ఎన్నుకోవాలని ప్రవాస భారతీయుడు వెంకటరావు మూల్పూరి సూచించారు. -
యూరప్ వెళ్తా.. అనుమతించండి
విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హైదరాబాద్లోని సీబీఐ కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. -
పారిశ్రామికవేత్త రామభద్రకు జపాన్ పురస్కారం
హైదరాబాద్లోని ‘నాగ రామ జపాన్ హబ్’ సంస్థ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త బొడ్డుపల్లి రామభద్ర జపాన్ ప్రభుత్వ ‘ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్, గోల్డ్ రేస్ విత్ రోసెట్’ పురస్కారం అందుకున్నారు. -
ఒక్క వానకే.. దెబ్బతిన్న ఆసుపత్రి గోడలు
వైకాపా పాలనలో చేపట్టిన పనుల్లో ఎక్కడా చూసినా డొల్లతనమే కనిపిస్తోంది. తాజాగా ప్రకాశం జిల్లాలో నిర్మిస్తున్న సర్వజన వైద్యశాల (సాధారణ) అదనపు గదుల గోడలు ఒక్క గాలి వానకే దెబ్బతిన్నాయి. -
పాలిసెట్లో 87.61% మంది అర్హత
ఏపీ పాలిసెట్లో 87.61శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 1,42,025మంది అభ్యర్థులు హాజరు కాగా.. 1,24,430మంది అర్హత సాధించారు. పాలిసెట్ ఫలితాలను మంగళగిరిలోని కార్యాలయంలో బుధవారం -
ఆ ‘గోవా’ మద్యం తాగితే ప్రాణాలు పోవడం తథ్యం
ఎన్నికల వేళ రాష్ట్రంలోని ఓ ప్రధాన రాజకీయ పార్టీ ఉచితంగా పోస్తున్న మద్యం తాగుతున్నారా? అది మద్యం కాదు.. మీ ప్రాణాలు తోడేసే విషం. గోవా బ్రాండ్ల పేరుతో ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల పెద్ద ఎత్తున కల్తీ మద్యాన్ని పంచుతోంది. అత్యంత హానికర రసాయనాలతో తయారైన సరకు తాగితే ప్రాణాలు పోవటం తథ్యమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
జగన్ ప్రభుత్వ అహంకారంపై సమ్మెటపోటు
జగన్ ప్రభుత్వానికి ఇది గట్టి చెంపదెబ్బ. నిజాయతీ, సమర్థత కలిగిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును కక్ష సాధింపులు, వేధింపులతో ఐదేళ్ల పాటు తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన జగన్ అండ్ కో నిరంకుశత్వం, నియంతృత్వం, అహంకారంపై పడిన సమ్మెట పోటు ఇది. -
‘నేనూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు బాధితుడినే’
ల్యాండ్ టైటిలింగ్ చట్ట బాధితులు బయటికొస్తున్నారు. కొత్త పట్టాదారు పాసు పుస్తకాల్లో విస్తీర్ణంలో తేడా చూసుకొని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన కొమ్మూరి గంగాధర్కు ఇదే పరిస్థితి ఎదురైంది. -
మరో రెండు రోజులు వర్షాలు!
మండు వేసవిలో ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర ప్రజలకు వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. తమిళనాడు మీదుగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్పై తొలి ఛార్జ్షీట్.. దాఖలు చేయనున్న ఈడీ
-
జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు: కోర్టును కోరిన సీబీఐ
-
అందుకే భారత్కు సొంత టెక్నాలజీ అవసరం.. లింక్డిన్పై ఓలా సీఈఓ ఫైర్!
-
ఐపీఓకు గో డిజిట్ ఇన్సూరెన్స్.. విరుష్క జోడీ వాటాలు వదులుకుంటున్నారా?
-
హరియాణా సంక్షోభం.. ‘బలపరీక్ష’కు భాజపా మాజీ మిత్రుడి డిమాండ్
-
రివ్యూ: ఆవేశం.. రూ.150 కోట్లు వసూలు చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ ఎలా ఉంది?