రాష్ట్రంలో ఓటర్లు 3,99,84,868
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల సంఖ్య 3,99,84,868కు చేరింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2023 చేపట్టిన ఎన్నికల సంఘం గురువారం తుది జాబితాను ప్రచురించింది. ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది జాబితాలో 1,30,728 మంది ఓటర్లు పెరిగారు.
పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ
కొత్తగా జాబితాలో చేరింది 5,97,701 మంది
4,66,973 మంది పేర్ల తొలగింపు
1,30,278 మంది ఓటర్ల పెరుగుదల
తుది జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల సంఖ్య 3,99,84,868కు చేరింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2023 చేపట్టిన ఎన్నికల సంఘం గురువారం తుది జాబితాను ప్రచురించింది. ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది జాబితాలో 1,30,728 మంది ఓటర్లు పెరిగారు. గతేడాది నవంబరు 9న విడుదల చేసిన ముసాయిదా జాబితాలో 3,98,54,093 మంది ఓటర్లు ఉండగా... ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టిన తర్వాత ఎన్నికల సంఘం కొత్తగా 5,97,701 మంది ఓటర్లను జాబితాలో చేర్చింది. 4,66,973 మందిని తొలగించింది. తుదిజాబితా ప్రకారం రాష్ట్రంలో పురుషుల కన్నా 4,61,966 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. సమగ్ర సవరణ అనంతరం రాష్ట్రంలో నికరంగా 0.33% ఓటర్లు పెరిగారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4 కోట్లకు 15,132 మంది ఓటర్లు తక్కువగా ఉన్నారు. ఈ వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనా వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 45,951 పోలింగ్ కేంద్రాలున్నాయి.
17 జిల్లాల్లో పెరుగుదల... 9 జిల్లాల్లో తగ్గుదల
తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 17 జిల్లాల్లో పెరగ్గా.. 9 జిల్లాల్లో తగ్గింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 30,824 మంది, ఎన్టీఆర్ జిల్లాలో 15,690 మంది, బాపట్ల జిల్లాలో 13,678 మంది ఓటర్లు తగ్గారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 28,579 మంది, అనంతపురం జిల్లాలో 27,464 మంది, నంద్యాలలో 18,270 మంది ఓటర్లు పెరిగారు. అత్యధిక ఓటర్లు కలిగిన జిల్లాల్లో కర్నూలు మొదటిస్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా అనంతపురం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. అతి తక్కువ ఓటర్లున్న జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా తొలిస్థానంలో, పార్వతీపురం మన్యం జిల్లా రెండోస్థానంలో ఉన్నాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, ప్రకాశం, శ్రీ సత్యసాయి మినహా అన్ని జిల్లాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ.
శ్రీకాకుళంలో సర్వీసు ఓటర్లు అత్యధికం
అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 16,162 మంది, ప్రకాశం జిల్లాలో 7,063 మంది, విజయనగరంలో 5,460 మంది, బాపట్లలో 4,821 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. అతి తక్కువగా ఎన్టీఆర్ జిల్లాలో 390 మంది ఉన్నారు.
భీమిలిలో అత్యధికం... పెడనలో అత్యల్పం
* రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాల జాబితాలో విశాఖ జిల్లాలోని భీమిలి, గాజువాక మొదటి రెండుస్థానాల్లో ఉన్నాయి. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం మూడోస్థానంలో ఉంది. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 2.36% ఈ మూడుచోట్లే ఉన్నారు.
* అతి తక్కువ ఓటర్లున్న జాబితాలో మొదటి మూడు స్థానాల్లో కృష్ణా జిల్లా పెడన, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, ఆచంట ఉన్నాయి. పెడన, నరసాపురాల్లో కలిపి మొత్తం ఓటర్లు 3,24,175 కాగా... భీమిలి నియోజకవర్గంలో అంతకంటే ఎక్కువగా 3,28,899 మంది ఉన్నారు.
థర్డ్ జెండర్.. కాకినాడ నగరం, కడప నియోజకవర్గాల్లోనే అత్యధికం
కాకినాడ నగర నియోజకవర్గం పరిధిలో రాష్ట్రంలోనే ఎక్కువమంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,924 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉండగా.. కాకినాడ నగరంలో 139 మంది ఉన్నారు. రెండోస్థానంలోని కడప నియోజకవర్గంలో 99 మంది, మూడోస్థానంలోని నంద్యాల నియోజకవర్గంలో 95 మంది ఉన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు, శ్రీసత్యసాయి జిల్లా మడకశిర, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గాల్లో ఈ ఓటర్లే లేరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు. -
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
కంట్రోల్లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం
సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’ -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
కొండల్ని మింగి.. గోతులు మిగిల్చారు!
విజయవాడ సమీపం జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొండపావులూరు పరిసరాల్లో కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. -
వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం
వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. -
ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు
రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! -
నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. -
మాటల ఏలిక.. మీటలో మెలిక!
అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్ లీవర్, పీఅండ్జీ, ఐటీసీ, రిలయన్స్, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
దండుకో.. వాటాలు పంచుకో!
జగన్ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్ అధికారులు చెలరేగిపోతున్నారు. -
రోగుల సమాచారం మీకెందుకు?
వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
-
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM