CBI: వివేకా హత్య వార్త జగన్కు ముందే తెలుసు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యపై ఆయన వ్యక్తిగత సహాయకుడు ఎం.వి.కృష్ణారెడ్డి ఉదయం 6.15కు ప్రపంచానికి వెల్లడించకముందే హత్య గురించి ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి సమాచారం అందినట్లు తేలిందని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ వెల్లడించింది.
ఉదయం 6.15 గంటలకు ముందే ఆయనకు సమాచారం
విషయం చేరవేసిన వైనంపై దర్యాప్తు చేయాల్సి ఉంది
4.11కు వాట్సప్లో చురుగ్గా ఉన్న అవినాష్రెడ్డి
హత్యానంతరం ఎంపీ ఇంట్లో సునీల్ యాదవ్
22న అరెస్ట్కు యత్నం, శాంతి భద్రతల దృష్ట్యా విరమణ
హైకోర్టులో సీబీఐ అదనపు కౌంటరు
ఈనాడు - హైదరాబాద్
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యపై ఆయన వ్యక్తిగత సహాయకుడు ఎం.వి.కృష్ణారెడ్డి ఉదయం 6.15కు ప్రపంచానికి వెల్లడించకముందే హత్య గురించి ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి సమాచారం అందినట్లు తేలిందని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ వెల్లడించింది. ఎంపీ అవినాష్రెడ్డి ఫోన్ను ఐపీడీఆర్ ద్వారా పరిశీలిస్తే హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 4.11 గంటలకు వాట్సప్లో చురుగ్గా ఉన్నారని, వై.ఎస్.జగన్కి వివేకా హత్య గురించి సమాచారం అందించడంలో అవినాష్రెడ్డి పాత్రపై దర్యాప్తు చేయాల్సి ఉందని హైకోర్టుకు సీబీఐ నివేదించింది. వివేకా హత్య అనంతరం అర్ధరాత్రి 1.58 గంటలకు రెండో నిందితుడైన వై.సునీల్యాదవ్ అవినాష్రెడ్డి ఇంట్లో ఉండటం, దీంతోపాటు అవినాష్ వాట్సప్ వాయిస్ కాల్లో ఉండటం వంటి అంశాల దృష్ట్యా పోలీసు కస్టడీలో ఎంపీని విచారించాల్సిన అవసరం ఉందని సీబీఐ పేర్కొంది.
సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేస్తున్నా విచారణకు హాజరై దర్యాప్తునకు సహకరించకపోవడంతో అవినాష్రెడ్డిని అరెస్టు చేయడానికి సీబీఐ బృందం కర్నూలు వెళ్లిందని తెలిపింది. అయితే అవినాష్ అనుచరులు ఆసుపత్రి దారులను మూసివేసి అడ్డుకోవడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ఎస్పీ సాయాన్ని కోరినట్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్ను వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో సీబీఐ శుక్రవారం అదనపు కౌంటరు దాఖలు చేసింది. అవినాష్రెడ్డి ముందస్తు బెయిలును వ్యతిరేకిస్తున్నామని, దర్యాప్తును సత్వరం పూర్తి చేయడానికి కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని తెలిపింది. గతంలో విచారణ సందర్భంగా తప్పించుకునే సమాధానాలు చెబుతూ దర్యాప్తునకు సహకరించలేదన్నారు. భిన్నమైన ప్రకటనలు ఇచ్చినట్లు వెల్లడైందని, హత్య వెనుక కుట్రను ఛేదించడానికి ఆయన ముందుకు రావడంలేదన్నారు. పోలీసు కస్టడీలో విచారణ అవసరమని ఇంతకుముందు కోర్టు దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపింది.
అవినాష్రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్లో గత నెల 25న కౌంటరు దాఖలు చేసినపుడు అన్ని విషయాలూ కోర్టు ముందు ఉంచామని, తదనంతర పరిణామాలను కోర్టు దృష్టికి తీసుకువస్తున్నట్లు పేర్కొంది. అవినాష్రెడ్డి మొబైల్ ఫోన్ను ఐపీడీఆర్ ద్వారా పరిశీలిస్తే వివేకానందరెడ్డి హత్యకు ముందు 2019 మార్చి 14వ తేదీ అర్ధరాత్రి దాటాక 00.27 నుంచి 1.10 (15వ తేదీ)వరకు వాట్సప్లో యాక్టివ్గా ఉండి.. వాట్సప్ కాల్స్ కూడా చేశారని తెలిపింది. వివేకానందరెడ్డి హత్యలో పాల్గొన్న నలుగురు నిందితులు ఆ రాత్రి 1.30 గంటల ప్రాంతంలో వివేకా ఇంట్లోకి చొరబడినట్లు పేర్కొంది. అంతేగాకుండా వివేకా హత్య అనంతరం రెండో నిందితుడైన వై.సునీల్యాదవ్ ఆ రాత్రి 1.58 గంటలకు వై.ఎస్.అవినాష్రెడ్డి/భాస్కరరెడ్డిల ఇంట్లో ఉన్నట్లు మొబైల్ ఫోన్ లొకేషన్ సూచించిందని తెలిపింది. 15వ తేదీ తెల్లవారుజామున 4.11 గంటలకు అవినాష్రెడ్డి వాట్సప్ ద్వారా సంభాషించినట్లు ఐపీడీఆర్ పరిశీలనలో తేలిందని సీబీఐ వివరించింది.
తల్లి ఆరోగ్యం సాకుతో విచారణకు ఎగవేత
విచారణ కోసం ఈ నెల 16న 11 గంటలకు హాజరుకావాలంటూ అవినాష్రెడ్డికి సీఆర్పీసీ సెక్షన్ 160 కింద 15వ తేదీన నోటీసు జారీ చేసినట్లు తెలిపింది. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా 4 రోజులు గడువు కావాలంటూ ఆయన హాజరుకాలేదని తెలిపింది. దీంతో 19న 11 గంటలకు హాజరుకావాలంటూ 16న మరో నోటీసు జారీ చేసినా హాజరుకాకుండా తన తల్లి ఆరోగ్యం బాగోలేదని, కుదుటపడిన తరవాత హాజరవుతానని ఆయన చెప్పారంది. 19న హైదరాబాద్లో ఉన్న అవినాష్రెడ్డి తల్లి అనారోగ్యం సాకుతో దర్యాప్తునకు హాజరుకాకుండా హైదరాబాద్ విడిచి వెళ్లిపోయారని తెలిపింది. తరువాత ఫోన్లో మాట్లాడి దర్యాప్తు నిమిత్తం రావాలని కోరినా రాకుండా పులివెందుల వైపు వెళుతున్నట్లు తెలిసిందని సీబీఐ తెలిపింది.
అవినాష్రెడ్డి హాజరు నిమిత్తం కడప ఎస్పీని సాయం కోరామని, అయితే అవినాష్ పులివెందుల రాకుండా కర్నూలు వెళ్లారంది. 22న సీబీఐ ముందు హాజరుకావాలని 19న మరో నోటీసు జారీ చేసినట్లు తెలిపింది. నోటీసును ఇవ్వడానికి హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళితే తాళం వేసి ఉందని, పులివెందులలో కూడా అందుబాటులో లేరని తెలుసుకొని అక్కడే ఉన్న వ్యక్తిగత సహాయకుడికి నోటీసును అందజేసినట్లు తెలిపింది. అంతేగాకుండా నోటీసును ఈమెయిల్, వాట్సప్ ద్వారా కూడా పంపినట్లు తెలిపింది. ఈ నోటీసు నేపథ్యంలో కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో ఉన్న తల్లిని చూసుకోవాల్సి ఉందని, అందువల్ల హాజరును 7 రోజులపాటు వాయిదా వేయాలని ఆయన సమాచారం ఇచ్చారని సీబీఐ తెలిపింది.
అరెస్ట్కు బయలుదేరాం
ఈ నెల 22న అవినాష్రెడ్డిని అరెస్ట్ చేయడానికి సీబీఐ బృందం కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రికి బయలుదేరిందని, అయితే అక్కడ అవినాష్ అనుచరులు గుమిగూడి దారులను బ్లాక్ చేశారని సీబీఐ వివరించింది. శాంతి భద్రతలకు భంగం కలుగుతుందన్న ఆందోళనతో అవినాష్రెడ్డి అరెస్ట్కు కర్నూలు ఎస్పీ సాయం కోరినట్లు తెలిపింది. 22న కూడా ఆయన విచారణకు హాజరుకాలేదని తెలిపింది. జూన్ 30లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, అయినా అవినాష్రెడ్డి ఉద్దేశపూర్వకంగా విచారణకు రాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని పేర్కొంది. ఈ కారణాల నేపథ్యంలో ముందస్తు బెయిలు పిటిషన్ను కొట్టివేయాలని కోరింది. బెయిలు పిటిషన్ను కొట్టివేస్తే జూన్ 30లోగా దర్యాప్తు పూర్తి చేయడానికి అవకాశం ఉందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం
గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. -
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
మధ్యస్థంగా నీట్ పేపర్
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ-2024 ప్రవేశపరీక్షలో భౌతికశాస్త్రంలో మొత్తం 50 ప్రశ్నలకు 10 కష్టంగా ఉన్నాయని నిపుణులు వై.శారదాదేవి అన్నారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. -
యువతకు లక్ష విదేశీ ఉద్యోగాలు
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెదేపా కసరత్తు ప్రారంభించింది. దీనికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, పారిశ్రామికవేత్తలూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. -
ఉద్యోగాలు సృష్టించేవారినే ఎన్నుకోవాలి
‘ఉద్యోగాలు సృష్టించేవారినే అమెరికాలో ఎన్నుకుంటారు. విదేశీ పెట్టుబడులు రావడానికి ఆ దేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అందుకే అమెరికా అన్ని రంగాల్లో ముందుంది. -
సమస్యలపై ప్రశ్నించినందుకు నిండు గర్భిణిపై వైకాపా నేతల దాడి
స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నేతలు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన మేరకు.. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగులోళ్లపల్లిలో తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి... -
వైకాపా బంటులైన డీఎస్పీలపై వేటు
అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
నిన్న ఎగ్గొట్టి.. రేపు ఇస్తారట!
2019 ఎన్నికలప్పుడు జగన్ చెప్పిందేంటి? అన్నదాతలకు వడ్డీ లేని పంట రుణాలిస్తామనే కదా? మరి గద్దెనెక్కాక చేసిందేమిటి..? రూ.లక్షలోపు పంట రుణాలకేనంటూ నిబంధన పెట్టారు -
దళితులు జగన్ను ఓడించి.. తమను తాము రక్షించుకోవాలి
దళితులు, ముఖ్యంగా మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో వారిని రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు ధ్వజమెత్తారు. -
బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి
ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. -
సామాన్యుల ఆస్తులకు రక్షణేదీ?
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. -
భూ యాజమాన్య హక్కు చట్టం.. ప్రమాదకరం
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 కింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో)కి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధించొచ్చు. -
ప్రజల ఆస్తులపై వైకాపా పడగ నీడ
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అధికార పార్టీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది. -
చేదోడని.. ‘చెయ్యిచ్చి’!
‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది. -
ఐదేళ్ల ‘విద్వేషం.. విధ్వంసం’
జగన్ను 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించి... సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. ఇలాంటి అవకాశం వస్తే ఇంకెవరైనా సరే ప్రజారంజక పాలన అందించి, తన మార్కు చిరకాలం గుర్తుండిపోయేలా శ్రమిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
ఐపీఎల్ 2024: ‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్