మావోయిస్టు అగ్రనేత కన్నుమూత
మావోయిస్టు పార్టీ అగ్ర నాయకుడు, పొలిట్బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ (69) అనారోగ్య కారణాలతో మృతిచెందారు.
పొలిట్బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ గుండెపోటుతో మృతి
రాడికల్ విద్యార్థి సంఘం ఏర్పాటులో క్రియాశీల పాత్ర
ఈనాడు - హైదరాబాద్, న్యూస్టుడే - బెల్లంపల్లి పట్టణం: మావోయిస్టు పార్టీ అగ్ర నాయకుడు, పొలిట్బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ (69) అనారోగ్య కారణాలతో మృతిచెందారు. దాదాపు 50 ఏళ్లు కీలక హోదాల్లో పనిచేసిన ఆయన పార్టీ నిర్మాణంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. దండకారణ్య గెరిల్లాజోన్ పరిధిలో గత నెల 31న మధ్యాహ్నం 12.20 గంటలకు ఆయన కన్నుమూసినట్లు పార్టీ కేంద్ర కమిటీ మీడియా ప్రతినిధి అభయ్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దీర్ఘకాలిక శ్వాసకోశవ్యాధి, మధుమేహం, అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో మరణించారని, దండకారణ్యంలోనే అంత్యక్రియలు నిర్వహించామని పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించిన కేంద్ర కమిటీ.. జూన్ 5 నుంచి ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా ఆనంద్ స్మారకసభలు నిర్వహించాలని కోరింది.
నక్సల్బరీ పోరాటం ప్రేరణగా ఉద్యమంలోకి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కార్మిక కుటుంబంలో జన్మించిన సుదర్శన్.. నక్సల్బరీ, శ్రీకాకుళం పోరాటాల ప్రేరణతో 1974లో విప్లవోద్యమం వైపు ఆకర్షితుడయ్యారు. మైనింగ్ డిప్లొమా విద్యార్థిగా ఉంటూ 1975లో రాడికల్ విద్యార్థి సంఘం ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించారు. బెల్లంపల్లి పార్టీ సెల్లో సభ్యుడిగా ఉంటూ సింగరేణి కార్మికోద్యమం, రాడికల్ విద్యార్థి యువజన ఉద్యమాల్లో ముఖ్యపాత్ర పోషించారు. 1978లో లక్షెట్టిపేట- జన్నారం ప్రాంతంలో పార్టీ ఆర్గనైజర్గా బాధ్యతలు చేపట్టి రైతాంగాన్ని సమీకరించారు. 1980లో ఆదిలాబాద్ జిల్లా కమిటీ సభ్యుడిగా ఉంటూనే దండకారణ్యంలో ఉద్యమ విస్తరణకు కృషి చేశారు. ఇంద్రవెల్లి ఆదివాసీ రైతాంగ ఉద్యమానికి ప్రత్యక్ష నాయకత్వం వహించారు.
సీఆర్బీకి సుదీర్ఘకాలం నాయకత్వం
1995లో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది అఖిలభారత ప్రత్యేక కాన్ఫరెన్స్లో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2001లో అప్పటి పీపుల్స్వార్ 9వ కాంగ్రెస్లో ఆనంద్ను మరోసారి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నుకున్నారు. దేశవ్యాప్తంగా విప్లవోద్యమాన్ని సమన్వయం చేయడం కోసం పార్టీ రీజినల్ బ్యూరోలను ఏర్పాటు చేసినప్పుడు ఆనంద్ కీలకమైన సెంట్రల్ రీజినల్ బ్యూరో (సీఆర్బీ) కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2004లో సీపీఐ మావోయిస్టు పార్టీ ఆవిర్భవించిన అనంతరం మూడేళ్లకు 9వ ఐక్యతా కాంగ్రెస్ జరిగినప్పుడు ఆయన్ని కీలకమైన పొలిట్బ్యూరోలోకి తీసుకున్నారు. 2001-2017 కాలంలో సుదీర్ఘకాలం సీఆర్బీ కార్యదర్శిగా కొనసాగి అనారోగ్య కారణాలతో ఆ బాధ్యతల నుంచి వైదొలగారు. గత రెండేళ్లుగా కేంద్రకమిటీ మీడియా ప్రతినిధిగా పనిచేశారు. 2004 నుంచి వేర్వేరు సమయాల్లో క్రాంతి, ఎర్రజెండా, పీపుల్స్వార్, పీపుల్స్మార్చ్ పత్రికలకు సంపాదకుడిగా వ్యవహరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు. -
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
కంట్రోల్లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం
సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’ -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
కొండల్ని మింగి.. గోతులు మిగిల్చారు!
విజయవాడ సమీపం జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొండపావులూరు పరిసరాల్లో కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. -
వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం
వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. -
ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు
రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! -
నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. -
మాటల ఏలిక.. మీటలో మెలిక!
అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్ లీవర్, పీఅండ్జీ, ఐటీసీ, రిలయన్స్, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
దండుకో.. వాటాలు పంచుకో!
జగన్ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్ అధికారులు చెలరేగిపోతున్నారు. -
రోగుల సమాచారం మీకెందుకు?
వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!