ఎన్ఐఆర్ఎఫ్ జాబితాలో... తెలంగాణకు మిశ్రమ ర్యాంకులు
కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన 8వ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలు తమ సత్తా చాటలేకపోయాయి.
5 విభాగాల్లో టాప్-10లో హైదరాబాద్లోని కేంద్ర విద్యా సంస్థలు
రాష్ట్ర విద్యాసంస్థలకు దక్కని చోటు
ఏపీ నుంచి ఒక్కటీ కనిపించని వైనం
ఈనాడు, దిల్లీ, హైదరాబాద్: కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన 8వ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలు తమ సత్తా చాటలేకపోయాయి. 2023 సంవత్సరానికి సంబంధించి ప్రకటించిన ర్యాంకుల్లో టాప్ 10లో తెలంగాణ విద్యాసంస్థలు కనిపించినా, ఏపీ ఆనవాళ్లు అసలే లేవు. మొత్తం 13 విభాగాల్లో... వ్యవస్థాగతంగా అయిదు(ఓవరాల్, కాలేజెస్, యూనివర్సిటీస్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, ఇన్నోవేషన్)... సబ్జెక్టుల వారీగా ఎనిమిది(ఇంజినీరింగ్, మేనేజ్మెంట్, ఫార్మసీ, లా, మెడికల్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, డెంటల్, అగ్రికల్చర్ అండ్ అలైడ్) ర్యాంకులు కట్టబెట్టారు. వీటిలోని 5విభాగాల్లో తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు టాప్-10లో నిలిచాయి. వాటిలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(యూనివర్సిటీల కేటగిరీలో 10వ ర్యాంకు), హైదరాబాద్ నైపర్ (ఫార్మసీ విభాగంలో 1వ ర్యాంకు), హైదరాబాద్ ఐఐటీ (ఇంజినీరింగ్ విభాగంలో 8, ఇన్నోవేషన్ విభాగంలో 3వ ర్యాంకు), హైదరాబాద్ నల్సార్ (లా విభాగంలో 3వ ర్యాంకు) ఉన్నాయి. దేశంలోని విద్యా సంస్థల ప్రతిభను కొలిచేందుకు కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి ర్యాంకులిస్తోంది. తొలి పోటీలో 3,565 విద్యాసంస్థలు పాల్గొనగా 2023 నాటికి వాటి సంఖ్య 8,686కి పెరిగింది. ఇందులో ఓవరాల్ టాప్-10 ర్యాంకుల్లో ఐఐటీలు ఏడు, దిల్లీ ఎయిమ్స్, దిల్లీ జేఎన్యూ, బెంగళూరు ఐఐఎస్సీ ఒక్కో ర్యాంకు చేజిక్కించుకున్నాయి. ఇంజినీరింగ్ విభాగంలోనూ ఐఐటీలు ఎనిమిది ర్యాంకులు గెలుచుకున్నాయి. మేనేజ్మెంట్ విభాగంలో ఐఐఎంలు 8, ఎక్స్ఎల్ఆర్ఐ, ముంబయి ఎన్ఐఐటీ ఒక్కో ర్యాంకును కైవసం చేసుకున్నాయి. కాలేజీ విభాగంలో టాప్10లో అయిదు ర్యాంకులను దిల్లీలోని విద్యాసంస్థలు చేజిక్కించుకున్నాయి. అగ్రికల్చర్ అండ్ అల్లాయిడ్ విభాగంలో... ది ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దిల్లీ ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. ఓవరాల్ విభాగంలో మద్రాస్ ఐఐటీ వరుసగా అయిదేళ్లుగా తొలి స్థానంలోనే ఉంటోంది.
తగ్గిన తెలంగాణ విద్యా సంస్థల వాసి...
ప్రతి లక్ష మంది జనాభాకు 50 కళాశాలలతో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ... ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో సత్తా చాటలేకపోతోంది. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థల్లో మూడు ఈసారి టాప్-10లో చోటు దక్కించుకున్నాయి. కానీ... రాష్ట్ర పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల ర్యాంకింగ్ పెరగకపోగా నిరుటికంటే మరింత పడిపోవడం గమనార్హం. ట్రిపుల్ఐటీ మాత్రం టాప్-100 వర్సిటీల్లో చోటు దక్కించుకుంది. ఆ సంస్థ ఇంజినీరింగ్ విభాగంలోనూ 62 నుంచి 55కి చేరుకుంది. తొలిసారిగా హెచ్సీయూలోని ఇంజినీరింగ్ కళాశాల 71వ స్థానంలో నిలిచింది. మరోవైపు ఇంజినీరింగ్ విభాగంలో ఎస్ఆర్ వర్సిటీ తప్ప మరో ప్రైవేట్ సంస్థ స్థానం సంపాదించలేకపోయింది. ఫార్మసీ కళాశాలలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. నైపర్ను మినహాయిస్తే ఒక రాష్ట్ర ప్రభుత్వ, మూడు ప్రైవేట్ విద్యాసంస్థలు టాప్-100లో స్థానాన్ని పొందాయి. ఈ తీరుపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి మాట్లాడుతూ... మరిన్ని రాష్ట్ర విద్యాసంస్థలు టాప్-100లో చేరేందుకు ప్రణాళిక రూపొందించుకొని, ముందుకెళతామన్నారు.
100 విద్యా సంస్థలు... 1.42 లక్షల పరిశోధనా పత్రాలు
వాటిలో 53% ఐఐటీలు, ఎన్ఐటీల నుంచే
ఈనాడు, హైదరాబాద్: దేశంలో ఇంజినీరింగ్ రంగంలో కేవలం ఒక్క ఏడాదిలో ప్రచురితమయ్యే పరిశోధనా పత్రాల్లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో తొలి 100 స్థానాల్లో నిలిచిన విద్యాసంస్థల నుంచే 62.95% ప్రచురితమమయ్యాయి. వాటిలోనూ 23 ఐఐటీలు, 31 ఎన్ఐటీలు... 54 సంస్థల నుంచే 53% రావడం విశేషం. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కోసం దేశవ్యాప్తంగా 1238 విద్యాసంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటి నుంచి మొత్తం 2,26,506 రీసెర్చ్ పబ్లికేషన్లు ఆయా జర్నళ్లలో ప్రచురితమయ్యాయి. అందులో 1,42,588 పత్రాలు టాప్-100 సంస్థల నుంచే వచ్చాయి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ల సందర్భంగా కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. వాస్తవానికి దేశంలో మొత్తం 3,600 వరకు ఇంజినీరింగ్ విద్యాసంస్థలు ఉండగా...అందులో 1,238 మాత్రమే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్కు దరఖాస్తు చేశాయి. టాప్-100 మినహా మిగిలిన 1138 విద్యాసంస్థల అధ్యాపకులు/ఆచార్యుల నుంచి 83,918 పత్రాలు(37.05 శాతం) ప్రచురితమయ్యాయి.
44.51% మందికే పీహెచ్డీ
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న 1238 ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో మొత్తం 1,61,195 మంది బోధనా సిబ్బంది ఉండగా అందులో 71,745 మంది(44.51%) పీహెచ్డీ విద్యార్హత కలిగి ఉన్నారు. మిగిలిన 89,450 మందికి పీజీ డిగ్రీ ఉంది. టాప్-100 విద్యాసంస్థల్లో 33,891 మంది పనిచేస్తుండగా వారిలో 27,247 మంది(81.20%)కి పీహెచ్డీ పట్టా ఉంది. మిగిలిన 1138 ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో 1,27,296 మంది అధ్యాపకులు ఉంటే... వారిలో 44,479 మందే(34.94%) పీహెచ్డీ కలిగి ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
జగన్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ దయనీయంగా తయారైంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను విద్యుత్తు కోతల కష్టాలు పీడిస్తున్నాయి. -
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
‘ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడతా. జగనన్న ప్రభుత్వంలో నాకు, నా బిడ్డకు రక్షణ లేదు. వారణాసిలో కుమార్తెతో కలిసి తలదాచుకుంటున్నా..’ అని కాకినాడకు చెందిన రాజులపల్లి ఆరుద్ర తెలిపారు. -
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్లపై జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానానికి చరమగీతం పాడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నాసిక్ నుంచి స్టాంపు పేపర్లను తెప్పించడం ఇప్పటికే నిలిపేసింది. -
గోవా మద్యానికి ‘వైకాపా’ గ్రీన్ఛానల్!
సార్వత్రిక ఎన్నికల వేళ కొంతమంది వైకాపా నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యంతో జనాల్ని ప్రలోభపెడుతూ వారి ప్రాణాల్ని బలిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
అన్న క్లాస్.. తమ్ముడు మాస్.. భూములన్నీ ఖల్లాస్!
భూమిని నమ్ముకున్నోళ్లెవ్వరూ ఆగం కాలేదు. అందుకేనేమో.. వైకాపా నేతలంతా ఒకరిని మించి మరొకరు కబ్జాలకు తెరతీశారు. -
ఎవరి ఆధీనంలో ఎవరు?
ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా...? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది. -
బ్రో... ఏ రాష్ట్రానికి పొమ్మంటావ్?
మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడి ఎక్కడా అభివృద్ధి లేకుండా చేశారు. నిర్మాణ రంగం కుదేలైంది. స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినడంతో వ్యాపారులు పెద్ద నగరాలకు తరలిపోయారు. -
మేనమామ కాదు.. మేకవన్నె పులి
ఓట్ల వేటలో.. చిన్నారులనూ పావులను చేసి... వారి చదువులను చట్టుబండలు చేసి... బైజూసనీ... ట్యాబ్లనీ.. టోఫెలనీ... ఐబీ అనీ... అమాయక పిల్లల్ని అర్థంలేని ప్రయోగాలకు బలి చేసిన... అయోమయం జగన్నాథం.... ఆంధ్రావని చేసుకున్న పాపం! -
ప్లాస్టర్ తీసేసిన సీఎం.. వెలంపల్లి ‘కట్టు’ కథా ముగిసింది!
సీఎం జగన్ నుదిటిపై వేసుకున్న ప్లాస్టర్ను తీసేశారు. ఈనెల 13న విజయవాడలో గులకరాయి తగిలిన రోజు నుంచి 25 వరకూ ప్లాస్టర్తోనే కనిపించారు. శనివారం పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా సీఎం ప్లాస్టర్ లేకుండా కనిపించారు. -
ఇలాగేటి.. బాదేస్తన్రు!
ఉత్తరాంధ్ర ప్రజానీకం ఏ సంకోచాలు లేకుండా వైకాపా పాలనపై గళమెత్తుతోంది. జగన్ ప్రభుత్వంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. విశాఖ వంటి మహా నగరంలోనే కాదు శ్రీకాకుళం వంటి నగరం, పలాస, పాలకొండ వంటి పల్లెలను ఆనుకుని ఉన్న పెద్ద, చిన్న పట్టణ ప్రాంతాల్లోనే కాదు. -
వైద్య సీట్లకు కోత
వైకాపా ప్రభుత్వం సన్నద్ధంగా లేనందున ఎంబీబీఎస్ సీట్లకు కోత పడింది. 2024-25లో కొత్తగా ప్రారంభం కానున్న 5 వైద్య కళాశాలల్లో వంద చొప్పున మాత్రమే ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయబోతున్నారు. -
యువ ఓటర్ల భుజస్కంధాలపైనే దేశ భవిష్యత్తు
పోలింగ్ శాతం గణనీయంగా పెంచేందుకు ప్రతి జిల్లాలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. లెట్స్ ఓట్ సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా శనివారం గుంటూరులో 3కె వాక్ నిర్వహించాయి. -
ఉపాధి పనుల్లో పశువులు!
‘ఉపాధి’ పని చేస్తున్న కూలీల చిత్రం ఉండాల్సిన చోట గేదెల చిత్రం అప్లోడ్ చేశారు.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల ఉపాధి ఉద్యోగులు. -
సంపాదనపై కాదు.. నేర్చుకోవడంపై దృష్టి సారించాలి
యువ న్యాయవాదులు ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో సంపాదనపై కాకుండా నేర్చుకోవడంపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు. -
‘ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ని విధుల నుంచి తప్పించండి’
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి నిరుద్యోగులను ప్రభావితం చేసేలా ఈనెల 29న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం (ఏపీఎన్ఎఫ్) అధ్యక్షుడు బి.శ్రీరాములు పేర్కొన్నారు. -
వారాంతమిస్తానని.. వాయింపే.. వాయింపు!
అధికారంలోకి రావడానికి జగన్ అన్ని వర్గాలను పావులుగా వాడుకున్నారు. ఎన్నెన్నో హామీలను గుప్పించారు. అన్నింటినీ నెరవేరుస్తానంటూ మ్యానిఫెస్టో ముద్రించారు. -
గులకరాయి కేసు నిందితుడికి ముగిసిన పోలీసు కస్టడీ
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ మూడు రోజుల పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. -
పాలిసెట్- 2024కి 88.74 శాతం మంది హాజరు
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్-2024కు 88.74శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
పింఛను లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. బ్యాంకు ఖాతాల్లోనే డబ్బు జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి