Kishan Reddy: హైదరాబాద్ చుట్టూ రైలు మార్గం
‘‘హైదరాబాద్ చుట్టూ 563.5 కిలోమీటర్ల మేర అవుటర్ రింగ్ రైలు మార్గం నిర్మించనున్నాం. ఈ మార్గంపై సర్వే చేపట్టాలని రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్ ఇప్పటికే ఆదేశించారు.
ఆర్ఆర్ఆర్కు సమాంతరంగా నిర్మాణానికి సర్వే
రూ.330 కోట్లతో రాయగిరి వరకు ఎంఎంటీఎస్ విస్తరణ
జీనోమ్వ్యాలీలో జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
భాజపా రాష్ట్ర అధ్యక్షుడి మార్పు లేదని స్పష్టీకరణ
ఈనాడు, దిల్లీ: ‘‘హైదరాబాద్ చుట్టూ 563.5 కిలోమీటర్ల మేర అవుటర్ రింగ్ రైలు మార్గం నిర్మించనున్నాం. ఈ మార్గంపై సర్వే చేపట్టాలని రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్ ఇప్పటికే ఆదేశించారు. డీపీఆర్ రూపకల్పన కోసం స్థల నిర్ధారణ తుది సర్వే చేయడానికి రైల్వే శాఖ రూ.13.95 కోట్లను కేటాయించింది’’ అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు దిల్లీలోని తన అధికారిక నివాసంలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘సర్వే విషయమై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాం. అవుటర్ రింగ్ రైలు మార్గాన్ని దేశంలోనే మొదటిసారి తెలంగాణలో చేపడుతున్నాం. నూతనంగా నిర్మిస్తున్న ప్రాంతీయ బాహ్య రహదారి (ఆర్ఆర్ఆర్)కి వెలుపల సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు రైల్వే డివిజన్ల పరిధిలోని విజయవాడ, గుంటూరు, నిజామాబాద్, మెదక్, కర్నూలు, ముంబయి, వికారాబాద్, కరీంనగర్ల నుంచి వచ్చే రైలు మార్గాలను అనుసంధానిస్తూ బైపాస్లు, ఆర్వోఆర్లతో (రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జి) సాగే ఈ నిర్మాణంతో ఎక్కడికక్కడ నూతన జంక్షన్లు ఏర్పాటవుతాయి. అవుటర్ రింగ్ రైలుతో దూర ప్రాంతాల ప్రజలు సికింద్రాబాద్, కాచిగూడలకు రాకుండానే ప్రయాణం సాగించే వీలుంటుంది. నూతనంగా ఏర్పడే జంక్షన్ల సమీపంలోని పట్టణాలు, గ్రామాల ప్రజలకు నగరంలోకి రాకపోకలు సాగించేందుకు సౌకర్యంగా ఉంటుంది. ఆర్ఆర్ఆర్ పనులు ఇప్పటికే సాగుతున్నాయి. అయితే... భూ సేకరణ పరిహారం చెల్లింపు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడం లేదు. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులైన ఆర్ఆర్ఆర్, అవుటర్ రింగ్ రైలుతో హైదరాబాద్కు ఎంతో మేలు జరుగుతుంది. ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతుల్లో, వ్యాపార, రవాణా రంగంలో గణనీయ మార్పులు వస్తాయి. అలాగే 61 కిలోమీటర్ల పొడవైన కరీంనగర్-హసన్పర్తి అనుసంధాన రైలు మార్గం స్థల నిర్ధారణ తుది సర్వే కోసం రైల్వే శాఖ రూ.1.50 కోట్లను మంజూరు చేసింది.
యాదాద్రి కోసం రాయగిరి వరకు కేంద్రం నిధులతో ఎంఎంటీఎస్-2
యాదాద్రిని సందర్శించే భక్తుల సంఖ్య పెరగడంతో వారి సౌకర్యార్థం ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు 33 కిలోమీటర్ల ఎంఎంటీఎస్ మార్గాన్ని కేంద్రం సొంత నిధులతో పొడిగించనుంది. ఎంఎంటీఎస్ రెండో దశ కింద దాన్ని పొడిగించాలని సూచిస్తే... మూడింట రెండొంతుల వ్యయాన్ని భరించడానికి ఎనిమిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నూతన భవనానికి ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన సమయంలో ఎంఎంటీఎస్ విస్తరణ అంశాన్ని ఆయన దృష్టికి నేను తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు. ప్రధాని ఆదేశంతో ఎంఎంటీఎస్-2 దశ కింద ఈ రైలుమార్గం విస్తరణకు రూ.330 కోట్లు అవుతాయని రైల్వే శాఖ అంచనా వేసింది. త్వరలోనే టెండర్లు పిలుస్తుంది.
ఎన్సీడీసీ ఏర్పాటుకు ఇప్పటికే లేఖ రాశా
తెలంగాణలో జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం (ఎన్సీడీసీ) ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనికోసం స్థలం కేటాయించాలని గతంలోనే నేను ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖలు రాశా. కానీ, ఆయన నుంచి స్పందన కరవైంది. అవసరమైన భూమిని జీనోమ్వ్యాలీలో కేటాయించి, కేంద్ర వైద్య శాఖకు అప్పగిస్తే వెంటనే భవన నిర్మాణం ప్రారంభమవుతుంది. భూ కేటాయింపు, బదలాయింపుపై ముఖ్యమంత్రి కేసీఆర్కు మరోసారి లేఖ రాస్తా.
రూ.2,102 కోట్ల కేటాయింపునకు ఆమోదం
కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం కింద (50 సంవత్సరాలకు వడ్డీలేని రుణాలు) నిధులు కేటాయించింది. అందులో తెలంగాణకు రూ.2,102 కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. వాటిని విద్య, వైద్యం, తాగునీరు, రహదారుల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించుకోవచ్చు. ఈ పథకంలో 2021 నుంచి ఇప్పటివరకు తెలంగాణకు రూ.5,221 కోట్లు మంజూరు చేసి, రూ.4,144 కోట్లు విడుదల చేశాం. అందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.2,696 కోట్లు పూర్తిగా వినియోగించుకుంది. వినియోగ ధ్రువపత్రాలు సమర్పిస్తే కేంద్రం మిగతా నిధులను విడుదల చేస్తుంది’’ అని కిషన్రెడ్డి వివరించారు.
తెలంగాణ పార్టీ అధ్యక్ష మార్పు లేదు
తెలంగాణలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై తమ పార్టీలో చర్చ జరగలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పష్టంచేశారు. ఈ విషయంలో భాజపా కార్యకర్తల్లో ఎలాంటి అనుమానాలు లేవని మీరే (మీడియాను ఉద్దేశించి) గందరగోళం చేస్తున్నారని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష మార్పుపై అధిష్ఠానం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఆ వార్తలు ఎందుకొచ్చాయో తమకు తెలియదన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్షాను కలవనుండడంపై ప్రశ్నించగా... మంత్రుల బృందం సమావేశానికి ముందు అమిత్ షాను కలవబోతున్నానని, వేరే సమావేశంలోనూ ఇంతకుముందే ఆయన్ని కలిశానని తెలిపారు. ఒకరిద్దరు ఇతర పార్టీల్లోకి పోయినంత మాత్రాన ఏమీ జరగదంటూ కాంగ్రెస్లో చేరికలపై కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్కు ప్రాణహాని ఉందనే అంశాన్ని అమిత్షా దృష్టికి తీసుకెళతానని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు. -
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
కంట్రోల్లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం
సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’ -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
కొండల్ని మింగి.. గోతులు మిగిల్చారు!
విజయవాడ సమీపం జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొండపావులూరు పరిసరాల్లో కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. -
వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం
వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. -
ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు
రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! -
నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. -
మాటల ఏలిక.. మీటలో మెలిక!
అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్ లీవర్, పీఅండ్జీ, ఐటీసీ, రిలయన్స్, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
దండుకో.. వాటాలు పంచుకో!
జగన్ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్ అధికారులు చెలరేగిపోతున్నారు. -
రోగుల సమాచారం మీకెందుకు?
వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
-
ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి, 23 మందికి గాయాలు
-
భర్త మద్దతుగా మాట్లాడలేదని వివాహిత ఆత్మహత్య
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక