Margadarsi: కోర్టు ఆదేశాలు బేఖాతరు.. మార్గదర్శిపై మళ్లీ దాడులు
మార్గదర్శి చిట్ఫండ్పై నిరాధార, ఊహాజనిత ఆరోపణలతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న జగన్ ప్రభుత్వం.. తాజాగా మరోసారి కక్ష సాధింపు చర్యలకు తెగబడింది.
మూసివేత లక్ష్యంగా చర్యలకు తెగబడ్డ ప్రభుత్వం
సీఐడీ సహా వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల సోదాలు
సీసీ కెమెరాలన్నీ ఆపేసి, సిబ్బంది ఫోన్లు స్వాధీనం చేసుకుని తనిఖీలు
డబ్బులు చెల్లించటానికి వచ్చిన చందాదారులకు అనుమతి నిరాకరణ
గేట్లకు తాళాలేసి, తలుపులు మూసేసి సోదాలు
సంస్థ రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం
రాత్రిపూటా తనిఖీలు
బ్రాంచ్లు కొనసాగుతున్న భవనాల యజమానులను పిలిపించి పత్రాలు సమర్పించాలని ఆదేశాలు
ఈనాడు, అమరావతి: మార్గదర్శి చిట్ఫండ్పై నిరాధార, ఊహాజనిత ఆరోపణలతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న జగన్ ప్రభుత్వం.. తాజాగా మరోసారి కక్ష సాధింపు చర్యలకు తెగబడింది. ఎలాగైనా సరే మార్గదర్శిని మూసివేయించాలన్న కుట్ర, దురుద్దేశంతో సీఐడీతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలనూ మార్గదర్శి పైకి పంపించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్గదర్శి చిట్స్ వ్యాపారం జరగనీయకుండా చూడాలన్న దుర్బుద్ధితో చేసిన ప్రయత్నాలన్నీ ఆశించిన ఫలితమివ్వకపోవటంతో.. వివిధ ప్రభుత్వ శాఖలను అడ్డం పెట్టుకుని వేధింపులకు తెరలేపింది. మార్గదర్శిపై ఎలాంటి తీవ్రమైన చర్యలూ తీసుకోవద్దని, చందాదారులను ఇబ్బందులకు గురిచేయ వద్దని ఉన్నత న్యాయస్థానాలు పలుమార్లు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆంధ్రప్రదేశ్లోని మార్గదర్శి చిట్స్కు సంబంధించిన 37 బ్రాంచిల్లో గురువారం సోదాలు జరిపింది. సీఐడీ, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, అగ్నిమాపకశాఖ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ ఇంటలిజెన్స్, పోలీసు అధికారులు, సిబ్బందితో కూడిన బృందాలు గురువారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు మార్గదర్శి చిట్స్ బ్రాంచీల్లో తనిఖీలు కొనసాగాయి. కొన్నిచోట్ల సాయంత్రం 6 గంటలతో తనిఖీలు ముగించినట్లే ముగించి.. మళ్లీ రాత్రి 10 గంటల సమయంలో తలుపులు తీయించి సోదాలు మొదలుపెట్టాయి.
విజయనగరం తదితర చోట్ల సీఐడీ, పోలీసు సిబ్బంది రాత్రి మార్గదర్శి బ్రాంచీల్లోనే పడుకున్నారు. సోదాల పేరిట సంస్థ సాధారణ వ్యాపార కార్యకలాపాలకు అధికారులు తీవ్ర ఆటంకం కలిగించారు. డబ్బులు కట్టడానికి వచ్చిన చందాదారులను ఇబ్బందులకు గురిచేశారు. పలు బ్రాంచిల్లో గేట్లు, తలుపులు మూసేసి లోపలికి ఎవర్నీ రానీయకుండా, లోపలున్న వారిని బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. పలుచోట్ల తనిఖీ బృందాల సిబ్బంది మాస్కులు ధరించి లోపలికి ప్రవేశించారు. తనిఖీలకు వచ్చిన వెంటనే బ్రాంచ్లోని సీసీ కెమెరాలన్నింటినీ ఆపేశారు. మార్గదర్శి సిబ్బంది మినహా ఇతర వ్యక్తులందర్నీ బయటకు పంపించేశారు. పలుచోట్ల మార్గదర్శి బ్రాంచి కార్యాలయాలు కొనసాగుతున్న భవనాల యజమానులను పిలిపించి ఆ స్థలానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు, భవన నిర్మాణ అనుమతులు, విద్యుత్తు బిల్లుల రసీదులు, ఆస్తిపన్ను చెల్లింపు రసీదు వంటివి సమర్పించాలని ఆదేశించారు. అగ్రిమెంట్ ఎప్పటివరకూ ఉందనే అంశంపై ఆరా తీశారు. కొన్ని చోట్ల ఆయా భవనాల చుట్టూ కొలతలు తీసుకున్నారు. అగ్నిమాపక శాఖాధికారుల ఆయా భవనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసి లోపాలేమైనా ఉన్నాయా? అని వెతికారు. పలుచోట్ల చీటీపాటలకు సంబంధించిన మినిట్స్ పరిశీలించారు. పెద్ద మొత్తాలకు సంబంధించిన చిట్లు వేసిన వారిని పిలిపించి ప్రశ్నించారు. విజయనగరంలో షణ్ముఖరావు అనే ఖాతాదారు ఇంటికి రాత్రి 8 గంటల ప్రాంతంలో పోలీసులను పంపించి పిలిపించి చిటీ గురించి విచారించారు.
చందాదారుల్ని వెనక్కి పంపించేసి
- విజయనగరంలో మార్గదర్శి బ్రాంచ్ గేటు బయట పోలీసులను కాపలాగా పెట్టి.. లోపలికి ఎవర్నీ అనుమతించలేదు. డబ్బులు కట్టటానికి వచ్చిన చందాదారులను తనిఖీలు జరుగుతున్నాయని చెప్పి వెనక్కి పంపించేశారు.
- తిరుపతిలోనూ చందాదారుల్ని కార్యాలయం లోపలికి అనుమతించలేదు. ఒకాయనను లోపలికి పిలిపించి దాదాపు 40 నిమిషాల పాటు ఆయన వ్యక్తిగత వివరాలపై ప్రశ్నల వర్షం కురిపించి భయభ్రాంతులకు గురిచేసి బయటకు పంపారు.
- ఏలూరులో మార్గదర్శి బ్రాంచ్ గేటుకు తాళం వేసి. లోపల నుంచి తలుపులు మూసేసి సోదాలు జరిపారు. దీంతో అక్కడ వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి.
- విశాఖ నగరంలోని ఎన్ఏడీ బ్రాంచ్ ప్రధాన తలుపులకు తాళాలు వేశారు. డబ్బులు కట్టేందుకు వచ్చామంటూ కొంతమంది చందాదారులు తలుపులు కొట్టినా తెరవలేదు.
- గోపాలపట్నం బ్రాంచ్లోనూ తలుపులన్నీ మూసేసి తనిఖీలు జరిపారు. దీంతో వివిధ పనులపై వచ్చిన చందాదారులు వెనుదిరిగారు.
- కాకినాడలో చందాదారులను కార్యాలయం లోపలికి అనుమతించకపోవటంతో వారు వెనుదిరిగారు.
- ప్రొద్దుటూరులో తొలుత చందాదారుల్ని అడ్డుకున్నారు. చందాదారుల్ని ఇబ్బందులకు గురిచేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సీఐడీ అధికారులకు మార్గదర్శి తరఫు న్యాయవాదులు చూపించటంతో ఆ తర్వాత వారిని అనుమతించారు.
సీసీ కెమెరాలు ఆపేసి..
విజయవాడ వన్టౌన్, విశాఖపట్నంలోని గోపాలపట్నం, నెల్లూరులోని వేదాయపాలెం తదితర బ్రాంచీల్లోని సీసీ కెమెరాలను సీఐడీ సిబ్బంది ఆపేశారు. డాబా గార్డెన్స్లో సీసీ కెమెరాలు నిలిపేయాలని సూచించారు. ఎలక్ట్రీషియన్లు అందుబాటులో లేకపోవటంతో సీసీ కెమెరాను ఎరుపు రంగు రుమాలుతో కప్పేశారు. చాలా బ్రాంచీల్లోని మార్గదర్శి సిబ్బంది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
భవన యజమానులకు బెదిరింపులు
అనంతపురంలో మార్గదర్శి కార్యాలయం కొనసాగుతున్న భవన యజమానిని పిలిపించి ఆ స్థలానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు, భవన నిర్మాణానికి సంబంధించిన అనుమతి పత్రాలు, విద్యుత్తు బిల్లులు, ఆస్తి పన్ను చెల్లింపు పత్రాలు సమర్పించాలని ఆదేశించారు. అమలాపురంలో భవన యజమానిని పిలిపించి మార్గదర్శితో చేసుకున్న అద్దె ఒప్పందాన్ని పరిశీలించారు. పన్నుల చెల్లింపు రసీదులను అడిగి తీసుకున్నారు. గుడివాడలో భవన యజమానిని రావాలని ఆదేశించారు.
భవనాలకు కొలతలు.. అగ్నిమాపక శాఖాధికారులతో తనిఖీలు
విశాఖపట్నంలోని పీఎంపాలెం మార్గదర్శి బ్రాంచ్ కొనసాగుతున్న భవనాన్ని నగర ప్రణాళిక విభాగం కార్యదర్శులు పరిశీలించారు. ఆ భవనం హద్దులకు సంబంధించిన కొలతలు తీసుకున్నారు. జీవీఎంసీ నుంచి తగిన అనుమతులున్నాయా? లేదా? పరిశీలించారు. ఎన్ఏడీలోని బ్రాంచ్ ఉన్న భవనం చుట్టూ కొలతలు వేసి.. వివరాలు నమోదు చేసుకున్నారు. భవన యజమానికి ఫోన్ చేసి సేఫ్టీ అంశాలపై బెదిరింపు ధోరణిలో మాట్లాడారు.
బెదిరించి తెల్లకాగితాలపై సంతకాలు
చిట్రిజిస్ట్రార్లు రమ్మంటున్నారంటూ గుంటూరులోని అరండల్పేట బ్రాంచ్ నుంచి సీఐడీ అధికారులు కొంతమంది ఖాతాదారులకు ఫోన్లు చేసి పిలిపించారు. ఓ మహిళా ఖాతాదారు నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. నరసరావుపేటలో మార్గదర్శి ఏజెంట్ను పిలిపించి ఎన్నాళ్లుగా పనిచేస్తున్నారు? చిట్ మార్కెటింగ్ ఎలా చేస్తారు? తదితర వివరాలు గురించి ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. తెనాలి బ్రాంచ్లో మన్నె రామకృష్ణను బెదిరించి.. ఆయనతో తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నారు. కర్నూలులో మార్గదర్శి మేనేజర్ నుంచి సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తాము రాసుకున్న వాంగ్మూలాలపై సంతకాలు చేయాలని ఆయనపై ఒత్తిడి తీసుకొచ్చారు.
- చిత్తూరులో మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్పై కేసు నమోదు చేసి ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు సీఐడీ అధికారులు ప్రయత్నించారు.
మార్గదర్శి చందాదారులకు ఫోన్లు చేస్తున్న అధికారులు
గుడ్లవల్లేరు, న్యూస్టుడే: మార్గదర్శిపై కక్ష కట్టిన రాష్ట్ర ప్రభుత్వం చివరకు ఖాతాదారులకు ఫోన్లు చేసి మార్గదర్శితో ఏమైనా ఇబ్బందులున్నాయా అంటూ వాకబు చేస్తోంది. రాత్రిళ్లు సైతం అధికారులు ఖాతాదారులకు ఫోన్లు చేయడం గమనార్హం. దీనిపై ఖాతాదారులు గట్టిగానే వారికి సమాధానమిస్తుండటంతో కంగుతింటున్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన కోలా రాధాకృష్ణనాయుడుకు గురువారం రాత్రి 7.10 గంటలకు ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి మీరు మార్గదర్శి ఖాతాదారేనా అని అడుగుతూ మీకు ఏమైనా ఇబ్బందులున్నాయా..? అని ప్రశ్నించారు. రాధాకృష్ణ అసలు మీరెవరూ, ఎందుకు ఫోన్ చేశారని ప్రశ్నించడంతో ఆ వ్యక్తి తను మచిలీపట్నం చిట్స్ రిజిస్ట్రార్ను అని చెప్పడంతో తను, తన భార్య 35 ఏళ్లుగా మార్గదర్శి ఖాతాదారులమని, ఏనాడూ తనకు మార్గదర్శి వలన ఇబ్బందులు ఎదురుకాలేదని బదులిచ్చారు. అసలు నాకెందుకు రాత్రిపూట ఫోన్ చేశారంటూ ఆయన నిలదీశారు. దీంతో అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేశారు. తర్వాత కాసేపటికి అదే నంబరు నుంచి మరో వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడుతూ అసలు మీకు ఆదాయ మార్గాలు ఏంటని ప్రశ్నించడంతో రాధాకృష్ణ ఆగ్రహంతో.. అన్నీ పక్కాగానే ఉన్నాయి, వివరాలు మీకెందుకు చెప్పాలి అని నిలదీయడంతో ఫోన్ పెట్టేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం
గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. -
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
మధ్యస్థంగా నీట్ పేపర్
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ-2024 ప్రవేశపరీక్షలో భౌతికశాస్త్రంలో మొత్తం 50 ప్రశ్నలకు 10 కష్టంగా ఉన్నాయని నిపుణులు వై.శారదాదేవి అన్నారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. -
యువతకు లక్ష విదేశీ ఉద్యోగాలు
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెదేపా కసరత్తు ప్రారంభించింది. దీనికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, పారిశ్రామికవేత్తలూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. -
ఉద్యోగాలు సృష్టించేవారినే ఎన్నుకోవాలి
‘ఉద్యోగాలు సృష్టించేవారినే అమెరికాలో ఎన్నుకుంటారు. విదేశీ పెట్టుబడులు రావడానికి ఆ దేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అందుకే అమెరికా అన్ని రంగాల్లో ముందుంది. -
సమస్యలపై ప్రశ్నించినందుకు నిండు గర్భిణిపై వైకాపా నేతల దాడి
స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నేతలు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన మేరకు.. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగులోళ్లపల్లిలో తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి... -
వైకాపా బంటులైన డీఎస్పీలపై వేటు
అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
నిన్న ఎగ్గొట్టి.. రేపు ఇస్తారట!
2019 ఎన్నికలప్పుడు జగన్ చెప్పిందేంటి? అన్నదాతలకు వడ్డీ లేని పంట రుణాలిస్తామనే కదా? మరి గద్దెనెక్కాక చేసిందేమిటి..? రూ.లక్షలోపు పంట రుణాలకేనంటూ నిబంధన పెట్టారు -
దళితులు జగన్ను ఓడించి.. తమను తాము రక్షించుకోవాలి
దళితులు, ముఖ్యంగా మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో వారిని రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు ధ్వజమెత్తారు. -
బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి
ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. -
సామాన్యుల ఆస్తులకు రక్షణేదీ?
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. -
భూ యాజమాన్య హక్కు చట్టం.. ప్రమాదకరం
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 కింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో)కి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధించొచ్చు. -
ప్రజల ఆస్తులపై వైకాపా పడగ నీడ
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అధికార పార్టీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది. -
చేదోడని.. ‘చెయ్యిచ్చి’!
‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది. -
ఐదేళ్ల ‘విద్వేషం.. విధ్వంసం’
జగన్ను 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మంచి మెజారిటీతో గెలిపించి... సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. ఇలాంటి అవకాశం వస్తే ఇంకెవరైనా సరే ప్రజారంజక పాలన అందించి, తన మార్కు చిరకాలం గుర్తుండిపోయేలా శ్రమిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు
-
1600 అడుగుల వంతెనకు రూ.91 వేల కోట్లా.. హేళన చేస్తున్న అమెరికా వ్యాపారవేత్తలు
-
హౌస్కీపర్ ఇంట్లో నోట్ల గుట్టలు.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..?
-
‘నువ్వు లేకపోయినా ఫర్వాలేదు’ అంటూ నెటిజన్ కామెంట్.. హీరో ఏమన్నారంటే?
-
‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్