AP Roads - CM Jagan: సాఫీ ప్రయాణం సీఎంకేనా?
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మీదుగా చింతపల్లి వెళ్లే ఆర్అండ్బీ రహదారి ఇలా అధ్వానంగా మారింది. నెల కిందట గుంతల్లో కంకరవేశారు. తర్వాత పనులు చేయకపోవడంతో కంకర కూడా పోయి, మళ్లీ గుంతలతో నిండిపోయింది.
రాష్ట్ర వ్యాప్తంగా అధ్వానంగా మారిన రహదారులు
గోతులు తేలిన రోడ్లపై వాహనదారుల నరకయాతన
మరమ్మతులు లేక ప్రమాదాల బారినపడుతున్న జనం
వర్షాలకు మరింతగా దిగజారిన పరిస్థితులు
ఎక్కడ గొయ్యి ఉందో.. ఎక్కడ రోడ్డు ఉందో తెలియని దుస్థితి
ఈనాడు - అమరావతి, ఈనాడు, న్యూస్టుడే యంత్రాంగం
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మీదుగా చింతపల్లి వెళ్లే ఆర్అండ్బీ రహదారి ఇలా అధ్వానంగా మారింది. నెల కిందట గుంతల్లో కంకరవేశారు. తర్వాత పనులు చేయకపోవడంతో కంకర కూడా పోయి, మళ్లీ గుంతలతో నిండిపోయింది.
ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయటకు వెళ్లేదే తక్కువ... ఎక్కువ సందర్భాల్లో ఆయన హెలికాప్టర్లోనే ప్రయాణిస్తుంటారు. ఏ విజయవాడలో జరిగే కార్యక్రమానికో పొరపాటున రోడ్డు మార్గంలో వెళుతుంటే, ఆయన ప్రయాణం సాఫీగా... చిన్న కుదుపులు కూడా తెలియకుండా... పూల తేరుపై వెళ్లినట్టుగా... మెత్తగా సాగేలా అధికారులు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. సీఎం ఆ మార్గంలో వెళుతున్నారని ఇటీవల తాడేపల్లి నుంచి జాతీయ రహదారిపైకి వెళ్లే సర్వీసు రోడ్డులో ఉన్న స్పీడ్ బ్రేకర్లని (మల్టిపుల్ బంప్స్) ఎత్తూపల్లాలు తీసేసి నున్నగా మార్చేశారు. సీఎం ప్రయాణించే ఖరీదైన వాహనంలో సాధారణంగా కుదుపులు తెలియవు. అయినా... ఆయనకు ఆ కొద్దిపాటి అసౌకర్యం కూడా కలగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. సీఎం కోసం ఆ మాత్రం ఏర్పాట్లు చేయడంలో తప్పులేదు. కొన్ని వారాల క్రితం విజయవాడలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం వెళుతున్నారని... ముందు రోజు మధ్యాహ్నం కృష్ణా నదిపై గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే బ్రిడ్జిపై ఒక వరుస రహదారిలో ట్రాఫిక్ ఆపేసి, పోలీసుల్ని కాపలాపెట్టి మరీ యుద్ధప్రాతిపదికన రోడ్డుకు మరమ్మతులు చేశారు. జాతీయ రహదారిపై కొన్ని నిమిషాలు ట్రాఫిక్ నిలిచిపోతేనే తీవ్ర గందరగోళం ఏర్పడుతుంది. అలాంటిది కొన్ని గంటలపాటు రాకపోకలను నిలిపేసి పనులు చేశారు. ఆ వేగం హర్షణీయమే..! ముఖ్యమంత్రికి చిన్నపాటి కుదుపులు కూడా లేకుండా అధికారులు అంతగా తపన పడుతున్నారే..! మరి ఓట్లేసి జగన్కు సీఎం పదవి కట్టబెట్టిన కోట్ల మంది ప్రజల పరిస్థితేంటి..? రాష్ట్రంలో అనేకచోట్ల రహదారులు ఛిద్రమై, పెద్ద పెద్ద గోతులతో దారుణంగా మారి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతుంటే అసలేమాత్రం పట్టించుకోరా? భారీ గోతులన్నీ వర్షాలకు చెరువుల్లా మారి... అసలు రోడ్డు ఎక్కడుందో వెతుక్కోవలసిన దుస్థితిలో ఉంటే... వాటిపై ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతుంటే.. కనీసం ఆ గోతులు పూడ్చేందుకూ చేతులు రావా? చాలాచోట్ల గోతులు తప్ప రోడ్డే కనిపించనంత దారుణమైన పరిస్థితులున్నా... కనీస మరమ్మతులూ ఎందుకు చేయరు? సీఎం జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు... అక్కడ ఆయన ప్రయాణించే రెండు, మూడు కిలోమీటర్ల రోడ్లను యుద్ధప్రాతిపదికన అద్దంలా మార్చేస్తున్నారే..! మరి ప్రజలు ఏళ్ల తరబడి అవే రోడ్లపై, తీవ్ర అవస్థలు పడుతూ ప్రయాణిస్తుంటే... వారి కష్టాలు అధికారులకు కనిపించవా? సీఎం మాత్రమే సాఫీగా ప్రయాణించాలా? ఆయన్ను ఎన్నుకున్న ప్రజలు ఎలా పోయినా ఫర్వాలేదా?
రాష్ట్రవ్యాప్తంగా ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, గ్రామీణ రహదారులు అత్యంత అధ్వానంగా మారాయి. భారీ గుంతలతో ప్రమాదకరంగా ఉన్నాయి. మూడు నెలలుగా వర్షాలు కురుస్తున్నా, ఏ రహదారిలోనూ గుంతలు పూడ్చిన దాఖలాల్లేవు. అత్యంత ఘోరంగా మారిన రహదారుల పునరుద్ధరణ (రెన్యువల్) గురించి ఈ ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయింది. నాలుగేళ్లలో ఒక్క ఏడాది మాత్రమే బ్యాంకు రుణం తీసుకొని, పునరుద్ధరించింది. పెట్రోల్, డీజిల్పై రహదారి అభివృద్ధి పన్ను పేరిట... లీటరుకి రూపాయి చొప్పున నెలకు రూ.50 కోట్లు, ఏడాదికి రూ.600 కోట్లు ప్రజల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్న ప్రభుత్వం.. ఆ నిధులతో కనీసం గుంతలు కూడా పూడ్చకపోవడం వారికి ద్రోహం చేయడం కాదా? ఇది రాష్ట్రంలో కొన్ని కోట్ల గొంతుకల నుంచి వస్తున్న ప్రశ్న..?
రాష్ట్రంలో రహదారులు ఎంత అధ్వానంగా, భయంకరంగా ఉన్నాయో ఈ చిత్రాల్ని చూస్తే కళ్లకు కట్టినట్టు అర్థమవుతుంది.
విజయనగరం
విజయనగరం జిల్లా రాజాం మండలం బొద్దాం నుంచి కొఠారిపురం, లక్ష్మీపురం గ్రామాలకు వెళ్లే రహదారి ఇది. ఏళ్ల తరబడి దీనికి కనీస మరమ్మతులూ చేయడంలేదు. ఇటీవలే దీని మరమ్మతులకు రూ.50 లక్షల మంజూరైనట్లు అధికారులు చెబుతున్నారు.
విజయవాడ నుంచి రేపల్లెకు కృష్ణానది కరకట్ట మీదుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు గురువారం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం గొడవర్రు వద్ద గుంతలు తప్పించే క్రమంలో రోడ్డు అంచులోకి వెళ్లి ఇలా కూరుకుపోయింది. మరొక్క అడుగు పక్కకు వెళ్లివుంటే.. 15 అడుగుల దిగువకు దూసుకుపోయేది. డ్రైవర్ బస్సును అదుపుచేశారు. అందులోని 40 మంది ప్రయాణికులు డ్రైవర్ డోర్, అత్యవసర ద్వారం నుంచి బయటకు వచ్చారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలోని గుడిమెళ్లంక వంతెన కూడలి నుంచి చింతలపల్లి కళింగుల కూడలి వరకు ఆర్అండ్బీ రహదారి దుస్థితి ఇది. ఇందులో 4.6 కి.మీ. అభివృద్ధికి న్యూడెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) ప్రాజెక్ట్ కింద రూ.11 కోట్లు మంజూరైనా, గుత్తేదారు పనులు చేయడంలేదు.
శ్రీకాకుళం జిల్లా
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి కూడలిలో గోతులమయమైన అలికాం-బత్తిలి ఆర్అండ్బీ రహదారి. ఈ రోడ్డు అభివృద్ధికి ప్రతిపాదనలు పంపినా, నిధులు మాత్రం కేటాయించడంలేదు.
ప్రకాశం
ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం-ముడివేముల రహదారి దుస్థితి ఇది. 9 కిలోమీటర్లలో కొంత పీఆర్, మరికొంత ఆర్అండ్బీకి చెందినది ఉంది. ఏళ్ల తరబడి ఇది
మరమ్మతులకు, రెన్యువల్కు నోచుకోవడం లేదు.
పశ్చిమగోదావరి
భారీ గుంతలతో అధ్వానంగా మారిన ఈ మార్గం పశ్చిమగోదావరి జిల్లాలో ఉండి నుంచి కోపల్లె వెళ్లే ఆర్అండ్బీ రోడ్డు. నాలుగేళ్లుగా దీని నిర్వహణను పట్టించుకోవడం లేదు.
ఎన్టీఆర్ జిల్లా
మోస్తరు వర్షం కురిసినప్పుడు.. భారీ వర్షం తరువాత రోడ్డు దుస్థితిని తెలియజేస్తున్న ఈ చిత్రాలు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ శివారు నిడమానూరు గ్రామానికి వెళ్లే మార్గానివి. ఇక్కడ వర్షపునీరు పోయే అవకాశంలేక వాన కురిసిన ప్రతిసారి రహదారి చెరువులా మారిపోతుంది. ఎక్కడ గుంత ఉందో తెలియక నిత్యం పదుల సంఖ్యలో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
చిత్తూరు
చిత్తూరు నగరంలో కట్టమంచి నుంచి సాంబయ్యకండ్రిగ వరకు ఉన్న 3 కి.మీ. బైపాస్ రహదారి ఇది. నాలుగేళ్లుగా ఇది అధ్వానంగా మారింది. పురపాలిక రోడ్గా ఉన్న దీనిని ఆరు నెలల కిందట ఆర్అండ్బీకి బదలాయించారు. అయినా దీనికి మోక్షం కలగలేదు.
నంద్యాల
నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం మహానందికి వెళ్లే రహదారి అడుగడుగునా గుంతలతో నిండిపోయింది. మహానంది నుంచి మహానంది ఫారం వరకు 3 కిలోమీటర్ల మేర ఘోరంగా మారడంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ రోడ్డు అభివృద్ధికి రెండేళ్ల కిందట రూ.8 కోట్ల నిధులు విడుదలైనా పనులు చేయలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు ఉన్నాయని, త్వరలో పనులు చేస్తామని ఇంజినీర్లు చెబుతూనే ఉన్నారు.
కర్నూలు
కర్నూలు జిల్లాలో ఆదోని-రాయచూరు రహదారిలో భారీ గుంతలు ఏర్పడటంతో.. స్థానిక దుకాణదారులు ఇలా రాళ్లు అడ్డంగాపెట్టి వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు.
గుంటూరు
విజయవాడ-అమరావతి మార్గంలో రాజధాని గ్రామం తుళ్లూరు టిడ్కో గృహాల వద్ద రహదారి గుంతలో ఇరుక్కుపోయిన వాహనం. ఇసుక లారీల రాకపోకలతో ఈ రోడ్డు ఘోరంగా తయారైంది.
కృష్ణా
కృష్ణా జిల్లా గుడివాడ మండలంలో భీమవరం రోడ్ నుంచి చౌటపల్లి గ్రామానికి వెళ్లే ఆర్అండ్బీ రహదారిలో సగం భాగం ఇలా కోతకు గురైంది. అయిదేళ్లుగా దీనికి కనీసం మరమ్మతులు కూడా చేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దల మాట
మన ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటరు అజ్ఞానం, అందరి భద్రతకు ముప్పు కలిగించవచ్చు. -
నేడు మన ‘నీడ’ మనకు కనిపించదు!
మనం ఎండలో ఎక్కడికి వెళ్లినా.. కూర్చున్నా.. నిల్చున్నా.. మన నీడ వెన్నంటే ఉంటుంది కదా.. గురువారం మిట్టమధ్యాహ్న సమయంలో మాత్రం అలా ఉండదు. -
రూ.7 వేలకోట్ల రుణానికి ప్రయత్నాలు.. పోలింగ్ ముందురోజు పంపకాలకు సన్నాహాలు
ఎప్పుడో బటన్ నొక్కి, నెలల తరబడి పెండింగ్లో ఉంచిన వివిధ పథకాల సొమ్ములను పోలింగ్ ముందురోజు పంచేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏపీ ఉన్నతాధికారులే హైకోర్టును ఆశ్రయించారు. -
షర్మిల, సునీత, బీటెక్ రవి పిటిషన్ల కొట్టివేత
వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి బహిరంగంగా మాట్లాడవద్దని ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని దాఖలైన మూడు వెకేషన్ పిటిషన్లను కొట్టివేస్తూ కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి బుధవారం తీర్పు చెప్పారు. -
కోర్టు ఆదేశించినా స్టీల్ప్లాంటుకు బొగ్గు తరలింపునకు అవరోధం
అదానీ గంగవరం పోర్టు నుంచి కన్వేయర్ బెల్ట్ ద్వారా విశాఖ ఉక్కు కర్మాగారానికి బొగ్గు తరలించడంలో అవరోధం కల్పించవద్దని నిర్వాసిత కార్మికులను ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు అమలు కాకపోవడంతో ‘స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్’ ప్రధాన కార్యదర్శి కె.వెంకట దుర్గాప్రసాద్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. -
కేంద్రం నిధులు వాడేసుకొని జీతాలు ఇవ్వని జగన్ సర్కార్
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఇతర పథకాలకు మళ్లించేసిన ప్రభుత్వం.. 2 నెలలుగా సమగ్ర శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ)లో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. -
మీ లాకర్ తెరిచారు.. అది మీరేనా?
‘విజయవాడ పటమటలోని భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బీఐ)లో ఉన్న మీ బ్యాంకు లాకరును సాయంత్రం 5.32 నిమిషాలకు తెరిచారు. అది మీరేనా? ఒకవేళ మీరు కాకుంటే వెంటనే బ్యాంకు శాఖను సంప్రదించండి’ అని సందేశం వస్తే మీరేం చేస్తారు. -
విష కౌగిలిలో విలవిల
తూర్పు తీరాన పొద్దుపొడుపు... ఆంధ్రావని ప్రగతికి దిక్సూచి... అందాల విశాఖ. వైకాపా అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వంలోని ముఖ్యులు రాజధాని పేరుతో ఈ నగరంపై రాబందుల్లా వాలారు కనీవినీ ఎరుగనికబ్జాకాండకు తెరతీశారు. -
ధీమా లేదు.. బీమా రాదు!
జగన్ అంటే రివర్స్ కదా... అధికారం అప్పగిస్తే అల్లకల్లోలం చేశారు... సాఫీగా సాగుతున్న పద్ధతిని సంక్లిష్టం చేశారు..! కౌలు కార్డులంటూ కష్టాలు తెచ్చారు... విత్తనాలు లేవు... విత్తమూ ఇవ్వలేదు... బీమా దక్కలేదు.. పంటలకు, జీవితాలకు ధీమా కల్పించలేదు... ప్రాణాలు వదిలేసినా... -
భగ్గుమంటున్న మగ్గం
రాట్నాలు.. రగిలిపోతున్నాయి.. కండెలు.. మండిపడుతున్నాయి.. పట్టుచీరలు.. వెక్కిరిస్తున్నాయి.. అల్లికలు.. అబద్ధాల కోరువంటున్నాయి.. వర్ణాలు.. రంగులు మార్చే ఊసరెల్లివి అంటున్నాయి.. మగ్గం.. మడమ తిప్పావంటోంది.. ఓట్లు దండుకొని... అధికారంలోకి వచ్చాక.. -
దుల్హన్ బంద్ కియా ... ‘తోఫా’కో ధోకా దియా!
ముస్లింలకు అండగా ఉంటానన్న జగన్ నిబంధనల కొర్రీపెట్టి ‘దుల్హన్’ను దూరం చేశారు. షాదీఖానాలు కట్టించేందుకు చొరవ చూపలేదు. కనీసం రంజాన్ రోజున మంచి భోజనం పెట్టేందుకూ మనసొప్పలేదు. గత తెదేపా ప్రభుత్వం అమలుచేసిన రంజాన్ తోఫాను రద్దు చేశారు. -
సొమ్ము జనానిది.. బొమ్మ జగన్ది!
కోడిగుడ్లు, రాగిపిండి, పల్లీచిక్కి.. కాదేదీ జగన్ బొమ్మకు అనర్హం! ఇదేదో కవిత్వం అనుకునేరు. శ్రుతిమించిన జగన్ ప్రచార పైత్యం! ప్రజలు కష్టపడి కట్టుకున్న ఇళ్లు.. అప్పుచేసి కొనుక్కున్న స్థలాలు.. వారసత్వంగా వచ్చిన పొలాలు.. ఇలా ఏదైనా ఆయనకు అనవసరం. -
ఉద్యోగాలు సృష్టించే నాయకుణ్ని ఎన్నుకోవాలి
ఏ నాయకుడు రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్తారు? ఎవరి వల్ల యువతకు ఉద్యోగాలు వస్తాయి? రాష్ట్రంలో శాంతిభద్రతలను ఎవరు కాపాడతారో అలాంటి నాయకుడిని ఎన్నుకోవాలని ప్రవాస భారతీయుడు వెంకటరావు మూల్పూరి సూచించారు. -
యూరప్ వెళ్తా.. అనుమతించండి
విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హైదరాబాద్లోని సీబీఐ కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. -
పారిశ్రామికవేత్త రామభద్రకు జపాన్ పురస్కారం
హైదరాబాద్లోని ‘నాగ రామ జపాన్ హబ్’ సంస్థ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త బొడ్డుపల్లి రామభద్ర జపాన్ ప్రభుత్వ ‘ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్, గోల్డ్ రేస్ విత్ రోసెట్’ పురస్కారం అందుకున్నారు. -
ఒక్క వానకే.. దెబ్బతిన్న ఆసుపత్రి గోడలు
వైకాపా పాలనలో చేపట్టిన పనుల్లో ఎక్కడా చూసినా డొల్లతనమే కనిపిస్తోంది. తాజాగా ప్రకాశం జిల్లాలో నిర్మిస్తున్న సర్వజన వైద్యశాల (సాధారణ) అదనపు గదుల గోడలు ఒక్క గాలి వానకే దెబ్బతిన్నాయి. -
పాలిసెట్లో 87.61% మంది అర్హత
ఏపీ పాలిసెట్లో 87.61శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 1,42,025మంది అభ్యర్థులు హాజరు కాగా.. 1,24,430మంది అర్హత సాధించారు. పాలిసెట్ ఫలితాలను మంగళగిరిలోని కార్యాలయంలో బుధవారం -
ఆ ‘గోవా’ మద్యం తాగితే ప్రాణాలు పోవడం తథ్యం
ఎన్నికల వేళ రాష్ట్రంలోని ఓ ప్రధాన రాజకీయ పార్టీ ఉచితంగా పోస్తున్న మద్యం తాగుతున్నారా? అది మద్యం కాదు.. మీ ప్రాణాలు తోడేసే విషం. గోవా బ్రాండ్ల పేరుతో ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల పెద్ద ఎత్తున కల్తీ మద్యాన్ని పంచుతోంది. అత్యంత హానికర రసాయనాలతో తయారైన సరకు తాగితే ప్రాణాలు పోవటం తథ్యమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. -
జగన్ ప్రభుత్వ అహంకారంపై సమ్మెటపోటు
జగన్ ప్రభుత్వానికి ఇది గట్టి చెంపదెబ్బ. నిజాయతీ, సమర్థత కలిగిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును కక్ష సాధింపులు, వేధింపులతో ఐదేళ్ల పాటు తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన జగన్ అండ్ కో నిరంకుశత్వం, నియంతృత్వం, అహంకారంపై పడిన సమ్మెట పోటు ఇది. -
‘నేనూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు బాధితుడినే’
ల్యాండ్ టైటిలింగ్ చట్ట బాధితులు బయటికొస్తున్నారు. కొత్త పట్టాదారు పాసు పుస్తకాల్లో విస్తీర్ణంలో తేడా చూసుకొని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన కొమ్మూరి గంగాధర్కు ఇదే పరిస్థితి ఎదురైంది. -
మరో రెండు రోజులు వర్షాలు!
మండు వేసవిలో ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర ప్రజలకు వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. తమిళనాడు మీదుగా సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
ఉద్యోగులకు ఏఐఎక్స్ షాక్.. 25 మంది తొలగింపు.. మిగిలిన వారికి అల్టిమేటం
-
భారత క్రికెట్లో అభిషేక్ ఓ అద్భుతం.. సంచలనాలు సృష్టిస్తాడు: ట్రావిస్ హెడ్
-
షికాగోలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం..
-
పన్నూ హత్యకు కుట్ర కేసు.. అమెరికా ఆరోపణల వేళ భారత్కు రష్యా మద్దతు
-
చిరు టు మహేశ్.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ రోజెంతో ప్రత్యేకం..!
-
నష్టాల్లోనే స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,271