APSRTC Drivers: ప్రాణాలపై ఆశలొదులుకున్నాం
ఒక్కసారిగా అంతమంది తమపై దాడి చేయడానికి రావడంతో ప్రాణాలపై ఆశలు వదులుకున్నామని.. దేవుడి దయతోనే బతికి బయటపడ్డామని కావలిలో దాడికి గురైన ఆర్టీసీ డ్రైవర్లు బి.ఆర్.సింగ్, శ్రీనివాసరావులు వాపోయారు.
కావలి వద్ద దాడికి గురైన ఆర్టీసీ డ్రైవర్లు బి.ఆర్.సింగ్, శ్రీనివాసరావు
ఈనాడు - అమరావతి, నెల్లూరు: ఒక్కసారిగా అంతమంది తమపై దాడి చేయడానికి రావడంతో ప్రాణాలపై ఆశలు వదులుకున్నామని.. దేవుడి దయతోనే బతికి బయటపడ్డామని కావలిలో దాడికి గురైన ఆర్టీసీ డ్రైవర్లు బి.ఆర్.సింగ్, శ్రీనివాసరావులు వాపోయారు. తమపై విచక్షణారహితంగా దాడి చేసిన 14 మందిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక విజయవాడకు చేరుకున్న వారు.. ‘ఈటీవీ’తో మాట్లాడారు. ఘటన జరిగిన తీరు, పడిన వేదన.. వారి మాటల్లోనే
వైకాపా నాయకులంటున్నారు...
బి.ఆర్. సింగ్ మాట్లాడుతూ.. ‘కావలి డిపో నుంచి బయటకొచ్చాక.. ఒక సైకిల్ బస్సు దగ్గరగా వస్తుంటే హారన్ కొట్టా.. దీంతో మా ముందు కారులో వెళుతున్నవారు ఆగి మా వద్దకు వచ్చారు. ఏం తప్పు చేశానని అడిగేలోపే హారన్ ఎందుకు కొట్టావంటూ దాడికి దిగారు. ఇంతలో పోలీసులు వచ్చి సర్దిచెప్పి పంపించేశారు. బస్సు శివార్లలోకి వచ్చాక నిందితులు మరి కొంతమందితో కలిసి మూడు కార్లలో వచ్చారు. మా దగ్గరకు వచ్చి మళ్లీ అసభ్యకరంగా తిడుతూ కొట్టారు. తెలుపు రంగు దుస్తుల్లో ఉన్న వ్యక్తి గట్టిగా కొట్టాడు. అడ్డుకోబోయిన వారిపైనా దాడికి దిగారు. నన్ను కొట్టిన వ్యక్తి స్థానిక కౌన్సిలర్ అట..అక్కడున్న వాళ్లను అడిగితే వాళ్లు వైకాపా వాళ్లన్నారు. వారు ఏ పార్టీ అనేది నాకైతే సరిగా తెలియదు. మాపై దాడి చేసిన 14 మంది ఫొటోలూ నా వద్ద ఉన్నాయి. ఆ సమయంలో రవాణా శాఖమంత్రి వాహనం అటుగా వస్తోందని పోలీసులు మమ్మల్ని పక్కకు లాగేశారు. మంత్రి వాహనం వెళ్లిపోయాక సీఐ వచ్చి విషయం తెలుసుకున్నారు. వారిపై చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నా మా(ఆర్టీసీ) ఎండీ కూడా ఈ విషయంలో స్పందించాలి’ అని విజ్ఞప్తి చేశారు. రెండో డ్రైవర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ..‘మాపై వారు రౌడీల్లా దాడి చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన మా బస్సులోని కొందరు ప్రయాణికులపై దాడి చేయబోతే వారు తప్పుకొన్నారు. ఒకరికి దెబ్బ కూడా తగిలింది. ఇప్పుడు మాకు జరిగింది.. రేపు మరో డ్రైవర్కు జరగదని నమ్మకం ఏముంది?’ అని ప్రశ్నించారు.
నేడు నల్లబ్యాడ్జీలతో విధులకు..
ఆర్టీసీ డ్రైవర్పై విచక్షణారహితంగా దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. నెల్లూరులోని ప్రధాన ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు, ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఘటనకు నిరసనగా ఆర్టీసీ ఉద్యోగులంతా ఆదివారం నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలని, డిపోల వద్ద నిరసనలు తెలపాలని ఈయూ, ఎన్ఎంయూఏ పిలుపునిచ్చాయి. నిందితులపై నాన్బెయిలబుల్ కేసులు పెట్టి వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ డీజీపీ, ఆర్టీసీ ఎండీకి ఎన్ఎంయూఏ వినతిని అందజేసింది. సోమవారం నెల్లూరు కలెక్టర్, ఎస్పీని కలిసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు ఈయూ తెలిపింది. బాధ్యుల పట్ల కఠినంగా వ్యవహరించాలని వైఎస్సార్ ఎంప్లాయీస్ యూనియన్, కార్మిక పరిషత్, టీఎన్టీయూసీ వేర్వేరు ప్రకటనల్లో కోరాయి. ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ రామ్సింగ్ని టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు పరామర్శించారు. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుల సూచన మేరకు బాధితుడిని పరామర్శించారు. టీఎన్టీయూసీ నాయకులు శనివారం రాత్రి ఆటోనగర్ ఆర్టీసీ డిపో వద్ద నిరసన వ్యక్తం చేశారు.
పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు
కావలి పరిధిలో ఆర్టీసీ డ్రైవర్ రాంసింగ్పై జరిగిన దాడి ఘటనలో ఇప్పటివరకు పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు కావలి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. ఆదివారం నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశముందని చెబుతున్నారు.
అంత దారుణంగా కొడతారా?: లోకేశ్
కావలిలో ఆర్టీసీ డ్రైవర్పై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటనపై నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టపగలు నడిరోడ్డుపై వైకాపా నేతలు గూండాల కంటే ఘోరంగా దాడి చేశారని ట్వీట్లో విమర్శించారు.
పోలీసులు దుండగులతో కుమ్మక్కయ్యారు: వైకాపా ఎమ్మెల్యే
ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేసినవారు నరరూప రాక్షసులని వైకాపాకు చెందిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి పేర్కొన్నారు. కొందరు పోలీసులు వారితో కుమ్మక్కై నేరాలకు కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వీడియో విడుదల చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు. -
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
కంట్రోల్లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం
సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’ -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
కొండల్ని మింగి.. గోతులు మిగిల్చారు!
విజయవాడ సమీపం జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొండపావులూరు పరిసరాల్లో కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. -
వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం
వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. -
ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు
రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! -
నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. -
మాటల ఏలిక.. మీటలో మెలిక!
అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్ లీవర్, పీఅండ్జీ, ఐటీసీ, రిలయన్స్, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
దండుకో.. వాటాలు పంచుకో!
జగన్ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్ అధికారులు చెలరేగిపోతున్నారు. -
రోగుల సమాచారం మీకెందుకు?
వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!