పంచాయతీలకు ఉరేసిన జిత్తులమారి జగన్
అనగనగా ఒక వేటగాడు... తెల్లారి లేచింది మొదలు అడవిలోని జంతువులను వెంటాడి వేటాడి చంపుతుండేవాడు. అతగాడే అప్పుడప్పుడు వన్యప్రాణి ప్రేమికుడి వేషంకట్టి ఊరికి ఉపన్యాసాలిచ్చేవాడు.
ఊసరవెల్లి తన భద్రత కోసం రంగులు మారుస్తుంది. జగన్ మాత్రం ప్రజలను, వ్యవస్థలను నాశనం చేసేందుకు అనుక్షణం ఒక కొత్త రంగు పులుముకుంటూనే ఉంటారు. గత పాలకులపై అక్కసు తలకెక్కించుకుని కక్షపూరిత చర్యలతో ఆంధ్రావనిలో పల్లె.. పట్టుగొమ్మలను నరికేశారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను అపహాస్యం చేశారు. పంచాయతీ పాలనకు పాతరేశారు. సర్పంచులు, కార్యదర్శుల అధికారాలకు కోతేసి.. ప్రకటనలతో పూతేసి.. పంచాయతీ ఖజానాలను కాజేసి.. పల్లెలు ఘొల్లుమనేలా ప్రగతిని దూరం చేశారు.
అనగనగా ఒక వేటగాడు... తెల్లారి లేచింది మొదలు అడవిలోని జంతువులను వెంటాడి వేటాడి చంపుతుండేవాడు. అతగాడే అప్పుడప్పుడు వన్యప్రాణి ప్రేమికుడి వేషంకట్టి ఊరికి ఉపన్యాసాలిచ్చేవాడు. జగన్మోహన్రెడ్డి కపట నాటకాలను చూస్తే- ఆ వేటగాడి దొంగ వేషాలే గుర్తొస్తాయి. ‘‘బాపూజీ గ్రామ స్వరాజ్యం - జగనన్న ప్రభుత్వ లక్ష్యం’’ అని ప్రకటనలు అచ్చేయించుకున్న జగన్... నిజానికి పంచాయతీరాజ్ వ్యవస్థకు విషంపెట్టారు. గ్రామీణాంధ్ర జీవకళను హరించారు. ‘‘గ్రామాల రూపురేఖలు మారుస్తా’’నని పైకి చెబుతూ, పంచాయతీ ఖజానాలకు కన్నాలేశారు. కనీసం పారిశుద్ధ్య సేవలకూ నోచుకోని దారుణ దౌర్భాగ్యస్థితిలోకి పల్లెలను నెట్టేశారు.
జగన్ చేతుల్లో రాజ్యాంగం ఖూనీ
పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందనేవారు బాపూజీ. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పంచాయతీరాజ్ వ్యవస్థకోసం రాజ్యాంగ సభలో గట్టిగా వాదించారు మన ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే ద్రవ్వోల్బణంతో పాటు అనేక ఇక్కట్లు తొలగిపోతాయని రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా ప్రకాశం బల్లగుద్ది చెప్పారు. పైన ఎక్కడో ఒక ప్రభుత్వం కూర్చుని, అన్ని పనులూ అదే చేయాలనుకోవడం సరైంది కాదని టంగుటూరి ఉద్ఘాటించారు. పైనుంచి పంచిపెట్టడం కన్నా గ్రామాలను స్వయంసమృద్ధం చేస్తే ప్రజాసమస్యలు సులభంగా పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. ప్రకాశం తదితరుల కృషివల్లే పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రాణంపోసుకుంది. ‘‘గ్రామ పంచాయతీలను వ్యవస్థీకరించాలి. స్వపరిపాలనా యూనిట్లుగా పనిచేసేందుకు అవసరమైన అన్ని అధికారాలను వాటికి కల్పించాలి. అందుకోసం రాజ్యం తగిన చర్యలు తీసుకోవాలి’’ అని 40వ రాజ్యాంగ అధికరణ నిర్దేశిస్తోంది. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు పురుడుపోస్తూ 73, 74వ రాజ్యాంగ సవరణలు జరిగాయి. ప్రజాస్వామ్య ఫలాలు పల్లెలకు చేరాలంటే పంచాయతీరాజ్ వ్యవస్థతోనే సాధ్యమని ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు విశ్వసించారు. సింహం స్థానంలోకి జిత్తులమారి నక్క జొరపడినట్లు- ‘ఆంధ్రకేసరి’ అధిష్ఠించిన సీఎం పదవిలోకి జగన్మోహన్రెడ్డి వచ్చారు. జాతినిర్మాతల ఆశయాలను, రాజ్యాంగ అధికరణలను ఆయన అడుసులోకి తొక్కేశారు. సచివాలయాల పేరిట గ్రామపంచాయతీల ఊపిరితీసే సొంత యంత్రాంగాన్ని జగన్ సృష్టించారు.
అధికారాన్ని కేంద్రీకరించిన నియంత
గోడ కట్టినట్లు అబద్ధాలాడటంలో అప్రకటిత గోల్డ్ మెడలిస్ట్ జగన్. ఆ ప్రతిభను ప్రదర్శిస్తూ 2019లో గ్రామ సచివాలయాల వ్యవస్థను తెరపైకి తెచ్చారాయన. పంచాయతీల పర్యవేక్షణలోనే అది పని చేస్తుందని మొదట్లో అందరినీ నమ్మించారు. 2021లో పంచాయతీ ఎన్నికలు పూర్తికాగానే తెప్ప తగలేశారు జగన్. సచివాలయాలపై నియంత్రణాధికారాన్ని సర్పంచ్ల చేతుల్లోంచి తీసేశారు. వాటిపై పర్యవేక్షణకు ప్రత్యేక శాఖను సృష్టించారు. ‘‘గ్రామ, వార్డు సచివాలయాలు పంచాయతీల్లో భాగం కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి అవి అదనపు ఆయుధాలు’’ అని హైకోర్టుకు సమర్పించిన ఓ ప్రమాణపత్రంలో జగన్ సర్కారు లోగుట్టు బయటపెట్టేసింది. తమ ఊరికి కావాల్సిందేమిటో స్థానికులందరూ చర్చించుకుని, గ్రామసభల్లో ఒక నిర్ణయం తీసుకుని, సర్పంచ్ల ఆధ్వర్యంలో ఆ పనులు జరిపించుకునే వాతావరణాన్ని జగన్ ఛిద్రంచేశారు. సర్పంచ్లను కూరలో కరివేపాకుల్లా తీసిపారేస్తూ- సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక తదితరాలన్నింటినీ సచివాలయాలకు అప్పగించారు. అలా తన గుప్పిట్లో ఉండే సచివాలయాలతో స్థానిక ప్రభుత్వాలకు మరణశాసనం రాశారు జగన్. పంచాయతీరాజ్ లక్ష్యాలకు భిన్నంగా అధికారాన్ని కేంద్రీకరించారు. తన ఆజ్ఞ లేనిదే రాష్ట్రంలో చీమైనా చిటుక్కుమనరాదనే స్థాయిలో నిరంకుశ రాజ్యాన్ని స్థాపించారు.
ఆగమాగమైన పల్లెలు
మురుగు కాల్వలను శుభ్రం చేయించడానికి సొమ్ముల్లేవు. తాగునీటి పైప్లైన్ల రిపేర్లకు పైసల్లేవు. రహదారులకు చిన్నపాటి మరమ్మతులు చేయించడం మొదలు చెరువుల్లో చెత్త తొలగింపు దాకా అన్నిటికీ కాసుల కటకటే. ఏ పని చేయడానికి కూడా సర్పంచ్ల దగ్గర సరిపడా సొమ్ము లేకుండా చేశారు జగన్. ఆఖరికి బ్లీచింగ్, ఫాగింగ్లకూ డబ్బు వెతుక్కోవాల్సిన దుస్థితిని కల్పించారు. పల్లెపట్టుల్లో ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి సచివాలయాలతో అద్భుతాలు చేస్తున్నామంటూ జగన్ జబ్బలు చరుచుకున్నారు. అంతకు ముందు ఉపాధి హామీ నిధులతో పల్లెల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేవారు. జగన్ వచ్చాక వాటికీ టెండర్ పెట్టారు. పంచాయతీ ఎన్నికలు పూర్తికాక మునుపే ప్రత్యేకాధికారులతో తీర్మానాలు చేయించి మరీ ఆ సొమ్ములకు కాళ్లు తెప్పించారు. పల్లెల అవసరాలను పట్టించుకోకుండా సచివాలయాల నిర్మాణం వంటి సొంత ప్రాధాన్య కార్యక్రమాలకు ‘ఉపాధి’ నిధులను ధారపోయించారు. ఏదీ చేయలేక గ్రామస్థులకు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని సర్పంచ్లు నెత్తీనోరూ కొట్టుకున్నా జగన్ వినిపించుకోలేదు. మిమ్మల్ని నమ్మిన పాపానికి నిండా ముంచారని వైకాపా సర్పంచ్లూ ఆందోళన బాటపట్టినా పట్టించుకున్న పాపాన పోలేదు. అవమానాలను తట్టుకోలేక రోడ్డెక్కి నిరసనలు తెలిపితే- పోలీసులను ఉసిగొల్పి హాయిగా వేడుక చూశారు జగన్. చేసిన పనులకు బిల్లులు రాక బలవన్మరణాలే దిక్కు అనుకునేంతగా పల్లె ప్రజాప్రతినిధులకు నరకం చూపించారాయన.
దున్నపోతు మీద వాన
‘‘మన శరీరమే దేశం అనుకుంటే- ప్రతి గ్రామమూ ఒక జీవకణం వంటిది’’ అని రాజ్యాంగ సభ సభ్యుడిగా సురేంద్రమోహన్ ఘోష్ అభివర్ణించారు. గ్రామాలకు స్వయం పాలనాధికారం ఇస్తే దేశం ఆరోగ్యకరంగా పురోగమిస్తుందని ఆయన ఉద్బోధించారు. జనం పడుకున్నా లేచినా తన పేరే జపించాలనుకునే జగన్- గ్రామ, వార్డు సచివాలయాలతో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శుల అధికారాల్లో కొన్నింటికి కత్తెరేసి, వాటిని వీఆర్వోలకు అప్పగించేందుకూ జగన్ తెగబడ్డారు. జీవో నం.2ను జారీచేయించారు. దాని మూలంగా పంచాయతీలు, సర్పంచ్లు ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలవుతారని రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఆ జీవో అమలును ఆపేసింది. వార్డు సచివాలయాల వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమని ‘కాగ్’ సైతం స్పష్టంచేసింది. ప్రజాప్రతినిధులు, పౌరుల భాగస్వామ్యం లేని ఆ వ్యవస్థ- స్థానిక పాలనలో వికేంద్రీకరణను దెబ్బతీస్తుందనే కఠోర వాస్తవాన్ని చెప్పింది. కానీ, దున్నపోతు మీద వాన పడినట్లుగా జగన్ సర్కారు ‘కాగ్’ హితవచనాలను దులపరించేసుకుంది. గ్రామ సచివాలయాలతో సర్పంచ్లను నిమిత్తమాత్రులను చేసిందిగాక పంచాయతీలపై అదనపు ఆర్థిక భారాన్నీ మోపారు జగన్. సచివాలయాల నిర్వహణ కోసమని ఏడాదికి వంద కోట్ల రూపాయలను పంచాయతీల నుంచే గుంజుకుంటున్నారు. సచివాలయాలపై అజమాయిషీ చేసే అధికారం లేనప్పుడు వాటి నిర్వహణకు పంచాయతీలు ఎందుకు నిధులివ్వాలి? అటువంటి ప్రశ్నలను జగన్ను ఎవరూ అడగకూడదు. అడిగినా ఆయన నోరు తెరవరు!
నిధులు కాజేసిన నయవంచకుడు
రాష్ట్రంలోని పంచాయతీల సంఖ్య 13వేలకు పైమాటే. ఏపీ జనాభాలో డెభ్భై శాతానికి పైగా(సుమారు 3.80 కోట్ల మంది) గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. పల్లెలపై పగబట్టినట్లు ప్రవర్తించిన జగన్- అంతమంది జీవితాలనూ దుర్భరంగా మార్చేశారు. ఏవో కొన్ని మేజర్ పంచాయతీలకు తప్ప మిగిలిన వాటికి సొంత ఆదాయ వనరులు చాలా తక్కువగా ఉంటాయి. ప్రత్యేకంగా నిధులు కేటాయించి పల్లెల ప్రగతికి చేయూతనివ్వాల్సిన జగన్- ఆ పని చేయలేదు. కానీ, పంచాయతీలకు వచ్చిన కేంద్ర ఆర్థిక సంఘం నిధులనూ ‘హాంఫట్’ అనిపించారు. విద్యుత్ బకాయిలను తీర్చడం కోసమంటూ రూ.1597 కోట్లును అలా దారి తప్పించారు. ఆర్థిక సంఘం నిధులతో కరెంట్ బాకీలను తీర్చేందుకు కేంద్రం అనుమతిచ్చిందని జగన్ సర్కారు అడ్డంగా బుకాయించింది. వాస్తవానికి ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో పదిశాతాన్నే పరిపాలన అవసరాలకు వెచ్చించాలి. ఆ సొమ్ములోంచే విద్యుత్తు బకాయిలను చెల్లించాలి. కానీ, జగన్ సర్కారు మాత్రం సగటున 24 శాతం నుంచి 90 శాతం వరకు ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల ఖాతాల్లోంచి ఖాళీ చేసింది. చట్టాలను చాపచుట్టడంలో చెయ్యితిరిగిన జగన్- పంచాయతీల సొమ్ము మళ్లింపులోనూ అంతే అరాచకంగా వ్యవహరించారు. దానిపై దిల్లీకి ఫిర్యాదులు వెళ్లడంతో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఉపకార్యదర్శి నిరుడు సెప్టెంబరులో ఇక్కడకు వచ్చి విచారించారు. ఫైనాన్స్ కమిషన్ నిధులను సర్పంచ్లకు తెలియకుండా ఎలా ఖర్చు చేస్తారని నిలదీశారు. తాగునీరు, పారిశుద్ధ్యం వంటి పనులకు ఉపయోగపడాల్సిన సొమ్మును కాజేసిన జగన్- పల్లెల్లో అధ్వాన పరిస్థితులకు ఆజ్యంపోశారు. పంచాయతీల్లోంచి పట్టుకుపోయిన డబ్బును డిస్కమ్లకు నిజంగానే జమేశారా అంటే- అదీ తెలియదు. ప్రశ్నించిన వారిని అమ్మనాబూతులు తిట్టడమే తప్ప ప్రజలకు నిజానిజాలు చెప్పే ధైర్యం జగన్ సర్కారుకు లేదు.
గ్రామ స్వరాజ్యానికి సమాధి
గ్రామీణాంధ్రకు జగన్మోహన్రెడ్డి చేసిన ద్రోహాలు ఒకటీ రెండూ కాదు. ‘‘పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుందాం... గ్రామాభివృద్ధికి సోపానాలు వేసుకుందాం’’ అంటూ ఎన్నికల సమయంలో జగన్ సర్కారు తెగ ఊదరకొట్టింది. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలను పెంచామని తనకుతానే వీరతాళ్లు వేసుకుంది. ఆ మాటలు నమ్మి ఏకగ్రీవమైన పంచాయతీలనూ చివరికి దగా చేశారు. ప్రోత్సాహకాల నిధులను విడుదల చేసినట్లే చేసి ఆ తరవాత చాలాచోట్ల ఖాతాల్లోంచి సొమ్మును మాయం చేయించారు. విద్యుత్ బకాయిలకంటూ ఆ నిధులను కొట్టేశారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి పన్నుల ఆదాయంలో వాటికి వాటా ఇవ్వాలని నాలుగో రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఆ నివేదికను నాలుగేళ్లు బయటికి రానివ్వని జగన్ సర్కారు- చివరికి సంఘం కీలక సూచనలను చెత్తబుట్టలో పడేసింది. మొత్తమ్మీద సీఎంగా జగన్ ఒరగబెట్టిందేంటంటే- గ్రామ స్వరాజ్యానికి సమాధి కట్టారు. పల్లెల్లో ప్రగతి దీపాలను స్వహస్తాలతో కొండెక్కించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారు
ఎన్నికల ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుపొందుతుందని.. చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ పేర్కొన్నారు. -
వైకాపా సోషల్మీడియా విభాగంపై కేసు
వైకాపా సోషల్ మీడియా విభాగంపై కేసు నమోదైంది. పోలింగ్కు 48 గంటల ముందు ప్రచారాలు నిషిద్ధమైనా.. వైకాపా సోషల్ మీడియా విభాగం నిబంధనలు ఉల్లంఘించి ప్రచారం కొనసాగించిందని విశాఖపట్నానికి చెందిన న్యాయ విద్యార్థి కొండేటి సోమశేఖర్ తగిన ఆధారాలతో ఈ నెల 12న కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి ఫిర్యాదు చేశారు. -
పోలీసులే.. నేరస్థులు: అంబటి రాంబాబు
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో తలలు పగులుతుంటే పోలీసులు స్పందించకుండా అలసత్వం వహించారని, అసలు నేరస్థులు పోలీసులేనని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. -
మమ్మల్ని వెంటనే భారత్కు రప్పించండి
కిర్గిజ్స్థాన్ రాజధాని బిష్కెక్లో స్థానికులు, ఈజిప్ట్ విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న విశాఖ జిల్లా విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
ఇదీ స్ట్రాంగ్రూమే!
చిత్రంలో టార్పాలిన్ కప్పి ఉంచిన కార్యాలయ గది బాపట్ల శాసనసభ నియోజకవర్గ పోస్టల్ బ్యాలట్ పెట్టెలను భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్. -
శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్రెడ్డి, రాష్ట్ర విభజన సమయంలో యాక్టింగ్ సీజేగా పనిచేసి ఇటీవల పదవీవిరమణ పొందిన జస్టిస్ ప్రవీణ్కుమార్ ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. -
అప్పన్న సన్నిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా ఆదివారం సతీసమేతంగా సింహాద్రి అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. -
రూ.5 వేలకు ఓటు అమ్ముకొని సస్పెండైన మంగళగిరి ఎస్సై
ఓ పోలీసు అధికారి తన పోస్టల్ బ్యాలట్ ఓటును అమ్ముకొని.. సస్పెండయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న ఖాజాబాబుది ప్రకాశం జిల్లా కురిచేడు. -
సంక్షిప్త వార్తలు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లపై సిట్ అధికారులు రెండోరోజైన ఆదివారం కూడా విచారణ కొనసాగించారు. -
రెండు రోజుల్లో తుపానుపై స్పష్టత
బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది ఈశాన్య దిశగా పయనించి 24 నాటికి వాయుగుండంగా బలపడనుంది. -
వైభవంగా అన్నవరం సత్యనారాయణస్వామి కల్యాణం
కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామివారి కల్యాణ మహోత్సవం ఆదివారం కనులపండువగా జరిగింది. రాత్రి 9.30 గంటలకు కల్యాణతంతు ప్రారంభించారు. -
పొలాలన్నీ దున్నేశాక.. పంటనష్టం లెక్కలా!
జూన్ 1 నుంచి ఖరీఫ్ పంట కాలం కిందే లెక్క.. నైరుతి రుతుపవనాలూ వచ్చేస్తున్నాయి. అతి త్వరలోనే రాష్ట్రాన్ని కూడా తాకనున్నాయి. అంటే రైతులకు మళ్లీ పొలం పనులు మొదలైనట్లే. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు రబీ పంటనష్టం గుర్తొచ్చింది. అదీ ఈ నెల 24 లోగా పూర్తిచేయాలి. దుక్కులు దున్నించి.. మళ్లీ విత్తనం వేసేందుకు సిద్ధం చేసిన పొలాల్లో వ్యవసాయాధికారులకు ఏ పంటనష్టం కనిపిస్తుందో మరి? ఇది వైకాపా నేతలు, కార్యకర్తల కరవు తీర్చడానికా? నిజంగా నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికా? అనే ప్రశ్నలు అన్నదాతల్లో వ్యక్తమవుతున్నాయి. -
పోలీసులపై ప్రశ్నల పరంపర
పల్నాడు జిల్లా నరసరావుపేట, తిరుపతి జిల్లా చంద్రగిరి, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ సందర్భంగానూ.. ఆ తర్వాత జరిగిన దమనకాండపై సిట్ అధికారులు రెండో రోజైన ఆదివారం కూడా విచారణ జరిపారు. -
బాధితుల గొంతు వినిపించడం నేరమా?
ఎన్డీయే అభ్యర్థులకు ఓటు వేశామనే అక్కసుతో తమపై వైకాపా మూకలు దాడికి తెగబడి తలలు పగలకొట్టి రక్తపాతం సృష్టించారంటూ బాధితులు చెబితే.. ఆ విషయాన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేయడం నేరమా? వారికి జరిగిన అన్యాయాన్ని, వారి ఆవేదనను రిపోర్టింగ్ చేయడం వర్గాల మధ్య శత్రుత్వం పెంచడమా? -
విద్యార్థుల లెక్కలపై ప్రభుత్వం దొంగాట!
ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. ‘విద్యా కానుక’ కోసం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని బహిర్గతం చేశాయి. -
ముగ్గురు ఐపీఎస్లపై అభియోగాల నమోదు
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుల్ని చేస్తూ ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన అనంతపురం, పల్నాడు ఎస్పీలు అమిత్ బర్దర్, బిందుమాధవ్ గరికపాటి, బదిలీ వేటుకు గురైన తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్పై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. -
గవి మఠం భూమి నొక్కేసిన ఉద్యోగి
కంచే చేను మేసిన చందంగా.. దేవాదాయశాఖ పరిధిలోని ఓ మఠంలో పనిచేసిన ఉద్యోగి, ఆ మఠానికి చెందిన భూమిని ఎవరికీ తెలియకుండా తన కుటుంబసభ్యుల పేరిట రికార్డుల్లో రాయించుకున్నారు. -
విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్ అడ్డగింత
అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ను గన్నవరం విమానాశ్రయ భద్రతా సిబ్బంది అడ్డుకొని, గన్నవరం పోలీసులకు అప్పగించారు. -
అక్క మరణం తట్టుకోలేక ఆగిన చెల్లెలి గుండె
తనతో ఎంతో స్నేహంగా ఉండే అక్క ఇక లేదని తెలిసి మానసిక వికలాంగురాలైన చెల్లెలు తట్టుకోలేకపోయింది. మౌనంగానే రోదించి గంటల వ్యవధిలోనే తనూ కన్నుమూసింది. -
తప్పిన విద్యుత్ లెక్కలు.. ప్రజలపై రూ.250 కోట్ల భారం!
వేసవిలో విద్యుత్ డిమాండ్పై ఇంధనశాఖ లెక్కలు తారుమారయ్యాయి. ఆ కారణంగా సుమారు రూ.259 కోట్ల మేర అదనపు భారం పడనుంది. -
పులివర్తి నానిపై దాడి ఘటనలో అక్రమ అరెస్టులు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు అక్రమ అరెస్టులు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..