ఇంటెలిజెన్స్ డీజీ నేతృత్వంలో ఫోన్ ట్యాపింగ్.. తెదేపా వర్క్షాప్లో పట్టుబడిన కానిస్టేబుల్
ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు నేతృత్వంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్కు గురవుతున్నాయని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు.
పక్కా ఆధారాలు సేకరించిన తెదేపా నేతలు
కేశినేని చిన్ని ఫోన్ ట్యాప్ చేసినట్లు బోండా ఉమా ఆరోపణ
ఈనాడు డిజిటల్, అమరావతి: ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు నేతృత్వంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్కు గురవుతున్నాయని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. శనివారం విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ హాల్లో తెదేపా అభ్యర్థులకు నిర్వహించిన వర్క్షాప్పై నిఘాపెట్టిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ జి.విశ్వేశ్వరరావును పట్టుకున్నామని తెలిపారు. ఆయన నుంచి కేశినేని చిన్ని ఫోన్ ట్యాప్ చేస్తున్నట్లు పలు ఆధారాలను సేకరించామన్నారు. ఈ వ్యవహారంపై ఆరాతీయగా డీజీ పంపితేనే వచ్చినట్టు ఆయన చెప్పారని బోండా ఉమా వెల్లడించారు. దీనికి బాధ్యులైన సీతారామాంజనేయులు, కొల్లి రఘురామిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులను ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండు చేశారు. విజయవాడలో కేశినేని చిన్ని, పట్టాభిరాంతో కలిసి బోండా ఉమా విలేకర్ల సమావేశం నిర్వహించారు.
‘‘తమ ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేస్తోందని ఓ సందర్భంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా వెల్లడించారు. పెగాసస్ సాఫ్ట్వేర్ను తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్తో కలిసి సీఎం జగన్ కూడా కొనుగోలు చేశారు. చంద్రబాబు, పవన్కల్యాణ్, పురందేశ్వరి సహా పలువురు ప్రతిపక్ష నాయకులపై నిఘా పెట్టారు. మేము ఏం మాట్లాడినా ఫోన్ ట్యాప్ చేసి వింటున్న పోలీసులు.. మా ఇళ్లు, ఆఫీసుల వద్ద గస్తీ కాస్తున్నారు. మా విషయాలన్నీ పోలీసులకు ఎలా చేరుతున్నాయని సాంకేతిక నిపుణులతో పరిశీలన చేయిస్తే ఫోన్లు ట్యాప్ అయినట్లు నిర్ధరణ అయింది. దీనిపై సీఎం జగన్ వెంటనే సమాధానం చెప్పాలి. ఈ కుట్రచేసిన, చేయిస్తున్న అందరిపై చర్యలు తీసుకుంటేనే రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పాక్షికంగా జరుగుతాయి. ఈ వ్యవహారంపై సీఈఓను కలిసి అన్ని ఆధారాలు సమర్పిస్తాం’’ అని బోండా ఉమా పేర్కొన్నారు.
జగన్కు అనుకూలంగా కొంతమంది పోలీసులు
‘‘నా ఫోన్ ట్యాప్ చేసేలా ఇంటెలిజెన్స్ విభాగం ప్రయత్నించింది. కానిస్టేబుల్ను పట్టుకుంటే అసలు బండారం బయటపడింది. జగన్కు అనుకూలంగా కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు.’’
కేశినేని చిన్ని, విజయవాడ తెదేపా లోక్సభ అభ్యర్థి
ట్యాపింగ్లో కేశినేని నాని పాత్ర
‘‘కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు ఐపీఎస్లా కాకుండా జేపీఎస్ (జగన్ పోలీస్ సర్వీస్) మాదిరిగా వ్యవహరిస్తున్నారు. ఈ ట్యాపింగ్లో కేశినేని నాని పాత్ర కూడా ఉంది. ఓటమి భయంతో కుటిల యత్నాలకు తెర తీస్తున్నారు’’
కొమ్మారెడ్డి పట్టాభిరాం, తెదేపా అధికార ప్రతినిధి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
జగన్ పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ దయనీయంగా తయారైంది. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను విద్యుత్తు కోతల కష్టాలు పీడిస్తున్నాయి. -
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’
‘ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే ఆంధ్రప్రదేశ్లో అడుగుపెడతా. జగనన్న ప్రభుత్వంలో నాకు, నా బిడ్డకు రక్షణ లేదు. వారణాసిలో కుమార్తెతో కలిసి తలదాచుకుంటున్నా..’ అని కాకినాడకు చెందిన రాజులపల్లి ఆరుద్ర తెలిపారు. -
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
నాన్ జ్యుడిషియల్ స్టాంపు పేపర్లపై జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానానికి చరమగీతం పాడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నాసిక్ నుంచి స్టాంపు పేపర్లను తెప్పించడం ఇప్పటికే నిలిపేసింది. -
గోవా మద్యానికి ‘వైకాపా’ గ్రీన్ఛానల్!
సార్వత్రిక ఎన్నికల వేళ కొంతమంది వైకాపా నాయకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యంతో జనాల్ని ప్రలోభపెడుతూ వారి ప్రాణాల్ని బలిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
అన్న క్లాస్.. తమ్ముడు మాస్.. భూములన్నీ ఖల్లాస్!
భూమిని నమ్ముకున్నోళ్లెవ్వరూ ఆగం కాలేదు. అందుకేనేమో.. వైకాపా నేతలంతా ఒకరిని మించి మరొకరు కబ్జాలకు తెరతీశారు. -
ఎవరి ఆధీనంలో ఎవరు?
ఎన్నికల సంఘం ఆధీనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నారా...? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం పనిచేస్తోందా? ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా పింఛన్ల పంపిణీ వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా ఇదే సందేహం కలుగుతోంది. -
బ్రో... ఏ రాష్ట్రానికి పొమ్మంటావ్?
మూడు రాజధానుల పేరుతో జగన్ మూడు ముక్కలాట ఆడి ఎక్కడా అభివృద్ధి లేకుండా చేశారు. నిర్మాణ రంగం కుదేలైంది. స్థిరాస్తి వ్యాపారం దెబ్బతినడంతో వ్యాపారులు పెద్ద నగరాలకు తరలిపోయారు. -
మేనమామ కాదు.. మేకవన్నె పులి
ఓట్ల వేటలో.. చిన్నారులనూ పావులను చేసి... వారి చదువులను చట్టుబండలు చేసి... బైజూసనీ... ట్యాబ్లనీ.. టోఫెలనీ... ఐబీ అనీ... అమాయక పిల్లల్ని అర్థంలేని ప్రయోగాలకు బలి చేసిన... అయోమయం జగన్నాథం.... ఆంధ్రావని చేసుకున్న పాపం! -
ప్లాస్టర్ తీసేసిన సీఎం.. వెలంపల్లి ‘కట్టు’ కథా ముగిసింది!
సీఎం జగన్ నుదిటిపై వేసుకున్న ప్లాస్టర్ను తీసేశారు. ఈనెల 13న విజయవాడలో గులకరాయి తగిలిన రోజు నుంచి 25 వరకూ ప్లాస్టర్తోనే కనిపించారు. శనివారం పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా సీఎం ప్లాస్టర్ లేకుండా కనిపించారు. -
ఇలాగేటి.. బాదేస్తన్రు!
ఉత్తరాంధ్ర ప్రజానీకం ఏ సంకోచాలు లేకుండా వైకాపా పాలనపై గళమెత్తుతోంది. జగన్ ప్రభుత్వంపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. విశాఖ వంటి మహా నగరంలోనే కాదు శ్రీకాకుళం వంటి నగరం, పలాస, పాలకొండ వంటి పల్లెలను ఆనుకుని ఉన్న పెద్ద, చిన్న పట్టణ ప్రాంతాల్లోనే కాదు. -
వైద్య సీట్లకు కోత
వైకాపా ప్రభుత్వం సన్నద్ధంగా లేనందున ఎంబీబీఎస్ సీట్లకు కోత పడింది. 2024-25లో కొత్తగా ప్రారంభం కానున్న 5 వైద్య కళాశాలల్లో వంద చొప్పున మాత్రమే ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయబోతున్నారు. -
యువ ఓటర్ల భుజస్కంధాలపైనే దేశ భవిష్యత్తు
పోలింగ్ శాతం గణనీయంగా పెంచేందుకు ప్రతి జిల్లాలో ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. లెట్స్ ఓట్ సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం సంయుక్తంగా శనివారం గుంటూరులో 3కె వాక్ నిర్వహించాయి. -
ఉపాధి పనుల్లో పశువులు!
‘ఉపాధి’ పని చేస్తున్న కూలీల చిత్రం ఉండాల్సిన చోట గేదెల చిత్రం అప్లోడ్ చేశారు.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల ఉపాధి ఉద్యోగులు. -
సంపాదనపై కాదు.. నేర్చుకోవడంపై దృష్టి సారించాలి
యువ న్యాయవాదులు ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో సంపాదనపై కాకుండా నేర్చుకోవడంపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి సూచించారు. -
‘ఏపీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ని విధుల నుంచి తప్పించండి’
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్సీహెచ్ఈ) ఛైర్మన్ కె.హేమచంద్రారెడ్డి నిరుద్యోగులను ప్రభావితం చేసేలా ఈనెల 29న ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం (ఏపీఎన్ఎఫ్) అధ్యక్షుడు బి.శ్రీరాములు పేర్కొన్నారు. -
వారాంతమిస్తానని.. వాయింపే.. వాయింపు!
అధికారంలోకి రావడానికి జగన్ అన్ని వర్గాలను పావులుగా వాడుకున్నారు. ఎన్నెన్నో హామీలను గుప్పించారు. అన్నింటినీ నెరవేరుస్తానంటూ మ్యానిఫెస్టో ముద్రించారు. -
గులకరాయి కేసు నిందితుడికి ముగిసిన పోలీసు కస్టడీ
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ మూడు రోజుల పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. -
పాలిసెట్- 2024కి 88.74 శాతం మంది హాజరు
పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పాలిసెట్-2024కు 88.74శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM