మహర్దశ తెస్తానని.. మగ్గాన్నే విరిచేశారు!
వారివి పడుగు-పేకలతో అల్లుకున్న బతుకులు... జగన్ చేసిన నమ్మకద్రోహానికి దారం తెగిన గాలిపటాలయ్యాయి! మగ్గాలను నడిపిన చేతులు... మట్టి పనిచేస్తున్నాయి! పట్టుచీరలు నేసిన హస్తాలు... సోడాలమ్ముతున్నాయి!
నేతన్నల ఉపాధిపై జగన్ కోలుకోలేని దెబ్బ
అమ్మకాలకు సరైన ప్రోత్సాహం కరవు
గత తెదేపా ప్రభుత్వం అమలు చేసిన పథకాల ఎత్తివేత
ఆకలిదప్పులు తాళలేక కూలీలుగా మారిన కార్మికులు
ఈనాడు, అమరావతి
వారివి పడుగు-పేకలతో అల్లుకున్న బతుకులు... జగన్ చేసిన నమ్మకద్రోహానికి దారం తెగిన గాలిపటాలయ్యాయి! మగ్గాలను నడిపిన చేతులు... మట్టి పనిచేస్తున్నాయి! పట్టుచీరలు నేసిన హస్తాలు... సోడాలమ్ముతున్నాయి! నేతన్న కష్టాలు కళ్లముందే కనిపిస్తున్నా ఆయన మాత్రం చేష్టలుడిగి చూశారు! మరోసారి ‘సిద్ధం’ అంటూ బస్సుయాత్రకు దిగారు!!
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వస్త్రాలను నేస్తూ ఆంధ్రప్రదేశ్కు తలమానికంగా నిలిచిన చేనేత రంగాన్ని సీఎం జగన్ ఛిద్రం చేశారు. మగ్గానికి మహర్దశ తెస్తామని 2019 ఎన్నికల ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, అధికారంలోకి రాగానే నేతన్నల వెన్నువిరిచారు. మగ్గంపై పడుగు, పేకలు ఆడక నేతన్నల కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నా కనికరించలేదు. చివరికి కుటుంబ పోషణ కష్టమై వారు కూలీ పనుల బాట పట్టినా మిన్నకున్నారు. గత ఎన్నికల ముందు వడ్డీ లేని రుణాలు అందిస్తామని హామీ ఇచ్చి దానిపైనా నాలుక మడతేశారు. ఆఖరుకు ఎంత దారుణానికి ఒడిగట్టారంటే... వారికి కొత్తగా పింఛన్ మంజూరు చేసేందుకూ నిబంధనల కొర్రీలు వేసి దక్కకుండా చేశారు. పదేపదే ‘నా బీసీ, నా బీసీ’లంటూ గుండెలు బాదుకునే జగన్... వెనకబడిన వర్గాలైన చేనేతలతో వ్యవహరించిన తీరిదీ. సొంత మగ్గాలున్న వారికి ఏడాదికి ఒకసారి నేతన్న నేస్తమంటూ బటన్ నొక్కడమే తప్ప... వృత్తిరీత్యా ఎదుర్కొంటున్న సమస్యలను ఆలకించడంగానీ, వాటిని పరిష్కరించేందుకు ముందడుగు వేసిన సందర్భంగానీ లేవు.
త్రిఫ్ట్ ఫండ్ను తీసేశారు
సంఘాల్లోని కార్మికుల్లో పొదుపును ప్రోత్సహించేందుకు అప్పట్లో ‘త్రిఫ్ట్’ పథకం అమలైంది. నేత కార్మికుడు తన నెలవారీ ఆదాయంలో 8% పొదుపు చేసుకుంటే దానికి సమానంగా 8% ప్రభుత్వం చెల్లిస్తుంది. మొదట్లో ఈ ఎనిమిది శాతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 4% చొప్పున భరించేవి. కేంద్రం ఈ పథకాన్ని తీసేసినా... అప్పటి తెదేపా ప్రభుత్వం మొత్తం 8% తానే భరిస్తానని హామీ ఇచ్చింది. కానీ, జగన్ దీన్ని అమలు చేయలేదు.
కరోనా సమయంలో పట్టించుకోలేదు
నాడు కరోనా మహమ్మారి ప్రభావం చేనేత రంగంపై తీవ్రంగా పడింది. అమ్మకాలు లేక కార్మికులు, మాస్టర్ వీవర్ల దగ్గర నిల్వలు భారీగా పేరుకుపోయాయి. ఇలాంటి సమయంలో ఆదుకోవాల్సిన జగన్ ఆ పని చేయలేదు. పట్టుచీరల తయారీకి ప్రఖ్యాతిగాంచిన ధర్మవరం, మదనపల్లె, ఎమ్మిగనూరు, మైలవరం, మాధవరం, జమ్మలమడుగులో నేతన్నలు అల్లాడినా పట్టించుకోలేదు.
మార్కెటింగ్ ప్రోత్సాహకాల నిలిపివేత
రాష్ట్రవ్యాప్తంగా చేనేత, అనుబంధ రంగాల్లో 3.50 లక్షల మంది కార్మికులు 800కిపైగా చేనేత సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. వీరి ఉపాధి కల్పనకు వీలుగా గత ప్రభుత్వాలు మార్కెటింగ్ ఇన్సెంటివ్ పథకాన్ని అమలు చేశాయి. చేనేత సొసైటీ ద్వారా జరిగే అమ్మకాల ప్రాతిపదికగా దీన్ని కొనసాగించాయి. మూడేళ్ల సరాసరి అమ్మకాలను ప్రాతిపదికగా తీసుకుని దానిపై 10% రాయితీ ఇచ్చేవి. ఫలితంగా ఒక్కో సంఘానికి రూ.8 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు లబ్ధి చేకూరేది. జగన్ దీన్ని పూర్తిగా నిలిపేశారు. ఆయన చర్య కార్మికుల ఉపాధిని దారుణంగా దెబ్బతీసింది.
జీఎస్టీతోనూ వ్యాపారం కుదేలు
చేనేతలపై జీఎస్టీ గుదిబండగా మారింది. నూలుపై 5%, రంగుపై 18%, రసాయనాలపై 18% జీఎస్టీ అమలవుతోంది. కరోనాకు ముందు ముడిసరకు కిలో ధర రూ.3,200 వరకు ఉండగా ప్రస్తుతం రూ.5,500లకు చేరింది. ఇటీవలి వరకు రూ.6 వేలు కూడా పలికింది. ఇదేకాకుండా డిజైన్ పంచింగ్ కార్డులు, రంగుల అద్దకానికి వినియోగించే పిండిపైనా జీఎస్టీ విధిస్తున్నారు. ఫలితంగా చేనేతలో ఉత్పత్తి ఖర్చు అమాంతం పెరిగింది. గతం కంటే చీరల ధరలు కొద్దిగా పెరగడంతో అమ్మకాలు భారీగా తగ్గాయి. దీంతో మాస్టర్వీవర్లు కూలీలకు పని ఇవ్వడాన్ని తగ్గించారు. వారికి నెలలో 10-15 రోజులు కూడా ఉపాధి దొరకడంలేదు. కుటుంబ పోషణ కోసం చాలామంది నేతన్నలు ఇతర పనుల బాట పట్టారు.
‘పట్టు’నూ దెబ్బతీశారు
పట్టు చీరల కార్మికులకు ముడి సరకు రాయితీ అత్యంత కీలకం. దీన్ని జగన్ నిలిపేశారు. తెదేపా ప్రభుత్వం మొదట్లో ఒక్కో కార్మికునికి నెలకు కిలోకు రూ.200 చొప్పున ఆరు కిలోలపై రూ.1,200 రాయితీగా ఇచ్చింది. అంటే ఏడాదికి రూ.14,400 అందించినట్టే. ఆ తర్వాత ముడి సరకు ధరలు పెరిగాయని గుర్తించి 2018-19లో నెలకు ఇచ్చే రాయితీ మొత్తాన్ని రూ.2000లకు పెంచింది. అంటే ఏడాదికి మగ్గం నేసే కార్మికునికి రూ.24 వేలు రాయితీగా ఇచ్చింది. ప్రతిపక్షనేతగా జగన్ ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా 2017 అక్టోబరు 18న ముడి సరకు రాయితీ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. వారి ఓట్లు దండుకుని గెలిచాక మడమ తిప్పేశారు.
కొర్రీల ‘నేస్తం’
నేతన్న నేస్తం అమలు చేస్తున్నామంటూ గొప్పలు చెప్పే జగన్... పథకాన్ని సొంత మగ్గం ఉన్న వారికే పరిమితం చేశారు. అర్హులైనప్పటికీ కూలి మగ్గం నేసే వారికి వర్తింపచేయలేదు. చేనేత అనుబంధ రంగాల్లో పనిచేసే వారి నోట్లోనూ మట్టి కొట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 3.50 లక్షల మంది కార్మికులుంటే 81 వేల మందికే నేతన్ననేస్తం కింద సాయం అందిస్తున్నారు.
హోటల్లో పని చేస్తున్నా
నేను మా నాన్నతో కలిసి గద్వాల పట్టు చీరలను నేశా. రెండేళ్ల కిందట వచ్చిన కరోనా మా ఉపాధిని దెబ్బకొట్టింది. గిరాకీ లేకపోవడంతో వ్యాపారులు ముడిసరకు ఇవ్వడం తగ్గించారు. అంతకుముందు నెలకు అయిదు చీరలు నేసేందుకు సరిపడా సరకు ఇచ్చేవారు. ప్రతినెలా రూ.11 వేల ఆదాయం ఉండేది. ఇప్పుడు నెలకు రెండు చీరలు నేసేలా ముడిసరకు ఇస్తుండటంతో మా ఆదాయం సగానికి తగ్గింది. ప్రస్తుతం నాన్న మగ్గం నేస్తుండగా... నేను హోటల్లో సర్వర్గా పనిచేస్తున్నా. ప్రభుత్వ సహకారం అందితే మళ్లీ మగ్గం పనిచేస్తా.
వీరేశ్, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా
ఆరు నెలలు ఆకలితో అల్లాడాం
పాతికేళ్లుగా చేనేత వృత్తిపై ఆధారపడి కుటుంబాన్ని పోషించా. యజమాని దగ్గర నెలకు 4 పట్టు చీరలు నేస్తే రూ.7 వేలు వచ్చేవి. నేత చీరలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంలేదు. ఆదాయం లేక యజమాని 8నెలల క్రితం మగ్గాలను మూసేశారు. కుటుంబ సభ్యులమంతా ఆరు నెలలు ఆకలితో అల్లాడాం. రెండు నెలల కిందట రూ.70 వేలను అప్పుగా తెచ్చి సోడా బండి కొని, వ్యాపారం చేస్తున్నా.
సుబ్రహ్మణ్యం, ధర్మవరం
నా భార్య టమాటా యార్డుకు కూలీకి వెళుతోంది
నేను, నా భార్య కలసి కూలీకి ఒక మగ్గం నడిపితే వారానికి మూడు పట్టు చీరలు నేస్తాం. రూ.6,300 ఆదాయం వస్తుంది. ఏడాదిగా వ్యాపారాలు లేకపోవడంతో యజమాని ముడిసరకు కోటాను తగ్గించారు. ఇల్లు గడవటం కష్టంగా మారింది. దాంతో నేను మగ్గం నేస్తూ, నా భార్యను టమాటా మార్కెట్ యార్డులో కూలీకి పంపుతున్నా.
అనంతయ్య, మదనపల్లె
భవన నిర్మాణానికి కూలీగా వెళుతున్నా
నాకు రెండు మగ్గాలున్నాయి. పద్నాలుగేళ్లుగా ఇదే పని చేస్తున్నా. రెండేళ్లుగా నేతపని గిట్టుబాటు కావడం లేదు. చీరలు నేసినా... మార్కెటింగ్ లేక అమ్మకాలు భారీగా తగ్గాయి. ఆదాయమూ పడిపోయింది. ఫలితంగా మగ్గాలు పక్కన పెట్టేశా. ఆరు నెలల నుంచి భవన నిర్మాణ కూలీగా వెళుతున్నా. రోజంతా పని చేస్తే రూ.500 ఇస్తున్నారు.
శివ, చేనేతకాలనీ, మదనపల్లె
మాతోనే ఈ కళ ఆగిపోతుందేమో!
భార్యాభర్తలమిద్దరం కష్టపడి రోజంతా మగ్గంపై పనిచేసినా రూ.400 రావడం లేదు. కుటుంబ పోషణ చాలా కష్టంగా మారింది. పిల్లలను చదివించడానికి అవస్థలు పడుతున్నాం. ప్రభుత్వం నుంచి మాలాంటి వాళ్లకు ఎలాంటి సహాయం అందడం లేదు. మా తరంతోనే ఈ కళ ఆగిపోతుందేమోననే భయంగా ఉంది.
ముప్పన కవిత, పొందూరు, శ్రీకాకుళం జిల్లా
ఇట్లయితే మేం బతికేదెట్ల!
కూలీ పని కింద సాధారణ రకం చీరలు నేస్తా. ఒక బారు(5 చీరలు, 5 జాకెట్లు) నేస్తే రూ.2 వేలు మిగులుతుంది. గతంలో నెలకు యజమాని ఎన్ని బారులైనా ఇచ్చేవారు. ఇప్పుడు రెండుకు మించి ఇవ్వడం లేదు. అంటే నెలకు 15 రోజుల మాత్రమే పని ఉంటోంది. రూ.4 వేలకు మించి ఆదాయం ఉండటం లేదు. కుటుంబం గడవడమే కష్టంగా ఉంది.
సత్రం బాలేందు మౌళి, చీరాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్నాడులో సాఫ్ట్వేర్ ఉద్యోగికి బేడీలు.. కుటుంబసభ్యులు, నాయకుల అభ్యంతరం
ఎన్నికల అనంతరం జరిగిన ఘర్షణల్లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని, రైతును అరెస్టుచేసిన పోలీసులు.. వైద్యపరీక్షల కోసం వారికి బేడీలు తొడిగి ఆసుపత్రికి తీసుకెళ్లాలనుకోవడం వివాదాస్పదంగా మారింది. -
గుంటూరు పశ్చిమలో.. పోస్టల్ బ్యాలట్ బాక్సులకు సీలు వేయని అధికారులు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పోస్టల్ బ్యాలట్ బాక్సుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తెదేపా నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
అంతా మెతక వైఖరే
వందల మంది వైకాపా వర్గీయులు రాళ్లు, మారణాయుధాలతో దాడులకు తెగబడితే హత్యాయత్నం సెక్షన్లే పెట్టలేదు. అధికారపార్టీ నాయకులే పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలు ధ్వంసం చేస్తే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు వర్తింపజేయలేదు. -
అంతరిక్ష యాత్రికుడు బెజవాడ బిడ్డే
భారతదేశ తొలి స్పేస్ టూరిస్టు గోపీచంద్ తోటకూరకు విజయవాడతో విడదీయలేని బంధం ఉంది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజన్ సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్-25 వ్యోమనౌకలో ఆయన ఇటీవల అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. -
రెవెన్యూ రికార్డుల్లో ఇష్టానుసారం మార్పులేంటి?
భూ యజమానులకు తెలియకుండా, నోటీసిచ్చి వారి వాదనలు వినకుండా అధికారులు రెవెన్యూ రికార్డుల్లో పేర్లను మార్చడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. -
ఏపీకి తుపాను ముప్పు లేనట్లే..!
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
సోషల్ ట్రోలింగ్.. లైట్ తీసుకుందాం!
అసలే చదువుల ఒత్తిళ్లు. ఉరుకులు పరుగులు. ఇతరులతో సమానంగా ఎదగాలనే ఆశతో ఎన్నో ఇబ్బందులు పడుతూ చదువుకుంటూ ఉంటారు. -
శ్రీవారి వీఐపీ బ్రేక్ టికెట్ల జారీ పునఃప్రారంభం
ఎన్నికల కోడ్ అమలుతో గత నెల నుంచి ఆగిపోయిన వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల సిఫార్సు లేఖలను సోమవారం నుంచి అనుమతిస్తున్నారు. -
ఏపీలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత
ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన చికిత్స బిల్లులను ప్రభుత్వం చెల్లించట్లేదని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) సోమవారం వెల్లడించింది. -
24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
రాష్ట్రంలో ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించనున్న పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 1,61,877 మంది హాజరుకానున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. -
ఏపీసీపీఎస్ఈఏ నూతన కార్యవర్గం ఎన్నిక
ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్ఈఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పఠాన్ బాజీ, కరిమి రాజేశ్వరరావు ఎన్నికయ్యారు. -
గులకరాయి కేసు.. నిందితుడి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
సీఎం జగన్పై జరిగిన గులకరాయి దాడి ఘటనలో నిందితుడు సతీష్కుమార్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. -
జూ.ఎన్టీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్
జూనియర్ ఎన్టీఆర్కు తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. -
కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ
కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయ బాడిగ నియమితులయ్యారు. -
పోలీసులు అమాయకులను బలిచేశారు
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు సుధాకర్రెడ్డి, హరికృష్ణను అన్యాయంగా ఇరికించి కడప జైలుకు తరలించారని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
మీ పిల్లలకు పలక ఇచ్చారా?
-
విధి వంచితులకు చేయూత
అప్పటివరకు సాఫీగా సాగుతున్న వారి జీవితంపై విధి పగబట్టింది. ఆడుకుంటూ విద్యుత్తు షాక్కు గురై చేయి కోల్పోయిన చిన్నారి ఒకరు. -
నైపుణ్యాల ప్రయాణం ఇలా విజయవంతం!
విద్యార్థులూ, తాజా గ్రాడ్యుయేట్లూ తమ అభిరుచిమేరకు కెరియర్ను రూపొందించుకునే ప్రయత్నాల్లో ఉంటారు. వీరు వాస్తవ ప్రపంచ విలువైన అనుభవాన్ని గడించడానికి ఇంటర్న్షిప్లు తోడ్పడతాయి. -
ప్రపంచంలో బలమైన శక్తిగా భారత్ ఎదుగుతోంది
ప్రపంచంలోనే భారత్ బలమైన శక్తిగా ఎదుగుతోందని.. అందుకు యువత, విద్యార్థులు కీలకపాత్ర పోషించనున్నారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. -
నాలుగు సబ్డివిజన్లకు కొత్త డీఎస్పీలు
రాష్ట్రంలోని నరసరావుపేట, గురజాల, తిరుపతి, తాడిపత్రి సబ్డివిజన్లకు కొత్త డీఎస్పీలను ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రైవేటు, ప్రభుత్వ బడులు రెండూ అవసరమైన ఆస్తులే: మంత్రి బొత్స
ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉత్తమ విద్యార్థులను ఆశిస్తున్నందున.. రెండింటినీ అవసరమైన ఆస్తులుగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి విశాల్ ‘రత్నం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
అబద్ధాలు చెప్పడం భారాస నేతలకు అలవాటు: భట్టి విక్రమార్క
-
వరల్డ్కప్ స్క్వాడ్ సభ్యులు లేకుండా.. ఐపీఎల్ టాప్-2 జట్లా?
-
ఆ రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారు: బెంగళూరు కమిషనర్
-
నా కుటుంబాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు: స్వాతి మాలీవాల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM