జగన్ పాలనలో హిందువులపై ముప్పేట దాడి
‘జగన్ అయిదేళ్ల పాలనలో రాష్ట్రంలోని హిందువులపై ముప్పేట దాడి జరిగింది. ఆలయాలను కూల్చేశారు. విగ్రహాలను పగులగొట్టారు. అర్చకులపై దౌర్జన్యాలు పెరిగాయి.
ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతిస్వామి ధ్వజం
ఈనాడు, అమరావతి: ‘జగన్ అయిదేళ్ల పాలనలో రాష్ట్రంలోని హిందువులపై ముప్పేట దాడి జరిగింది. ఆలయాలను కూల్చేశారు. విగ్రహాలను పగులగొట్టారు. అర్చకులపై దౌర్జన్యాలు పెరిగాయి. 300 దేవాలయాలపై దాడులు జరిగాయి. ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు. ఇలాంటి ప్రభుత్వానికి మళ్లీ అవకాశమిస్తే హిందూ సనాతన ధర్మాన్ని కోల్పోతాం. రాష్ట్రంలోని హిందువులంతా ఏకమై అన్ని మతాలను సమానంగా చూసే తెదేపా, జనసేన, భాజపా కూటమిని గెలిపించాలి..’ అని శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కృష్ణాపురంలోని ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతిస్వామి పిలుపునిచ్చారు. ఏపీ సాధు పరిషత్, హిందూధార్మిక సంఘాలు, అట్లూరి నారాయణరావు ట్రస్టు ఆధ్వర్యంలో విజయవాడలో మంగళవారం ఏర్పాటు చేసిన ‘ఆంధ్రాలో హిందువుల ఆత్మగౌరవ పరిరక్షణ- భవిష్యత్తు కార్యాచరణ’ సదస్సులో ఆయన మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను వైకాపా ప్రభుత్వం మంటకలిపిందని శ్రీనివాసానంద మండిపడ్డారు. ‘తిరుమలలో అన్యమత ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ప్రసాదాల ధరలు విపరీతంగా పెంచారు. అన్నప్రసాదం నాణ్యత కోల్పోయింది. హిందూ దేవాలయాల సంస్కృతి, సంప్రదాయాలను దెబ్బతీయాలనే ఇలా చేస్తున్నారు. రామతీర్థంలో రాముడి విగ్రహం శిరస్సును ఖండించినా ఇంతవరకూ నిందితులను పట్టుకునేవారు లేరు. అందుకే హిందువులు, మఠాధిపతులు, పీఠాధిపతులంతా ఏకమై ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారు. జగన్ తన భార్యతో కలిసి కనీసం ఆలయాలకు వెళ్లకపోవడమేంటి?’ అని ప్రశ్నించారు. కార్యక్రమంలో శ్రీరామసేన అధ్యక్షుడు తురగ శ్రీరామ్, హిందూ దేవాలయాల పరిరక్షణ ట్రస్టు కార్యదర్శి తోట సురేష్బాబు, హిందూ జనశక్తి ప్రతినిధి లలిత్కుమార్, శివశక్తి చిట్లపల్లి కల్యాణ్, భక్తి చైతన్యానంద స్వామి, మాతాజీ గీత, స్కంద దేవానందస్వామి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం
తమిళనాడు పరిసర ప్రాంతంలో ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశముంది. -
ఏపీలో 5 వేల మంది ఒప్పంద ఉపాధ్యాయినుల మెడపై కత్తి
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) ఉపాధ్యాయినులు, భవిత కేంద్రాల్లోని ప్రత్యేక ఉపాధ్యాయుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. వీరి పనితీరును మదింపు చేసి ఒప్పందాన్ని పొడిగించేందుకు సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) చర్యలు చేపట్టింది. -
నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత
పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) ప్రతినిధుల మధ్య మంగళవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. -
అమెరికా ‘వీసా’వహులకు తీపి కబురు
అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులకు జూన్, జులై, ఆగస్టు కోటాకు సంబంధించిన మరిన్ని విద్యార్థి వీసా(ఎఫ్-1) ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. -
భారత్-అమెరికా భాగస్వామ్యం.. ప్రపంచానికి భాగ్యదాయకం
భారత్-అమెరికా దేశాల ఉమ్మడి భాగస్వామ్యం యావత్ ప్రపంచానికి లాభదాయకమని భారతదేశంలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి అన్నారు. -
‘నాడు-నేడు’ అదే గోడు!
ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన ‘నాడు-నేడు’ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఐదారు నెలలుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు సంస్థలు సామగ్రి సరఫరాను నిలిపివేశాయి. చాలా బడుల్లో సిమెంటు లేక పనులు సాగట్లేదు. -
ఎగువ కాఫర్ డ్యాం సీపేజీకి కట్టడి ఎలా?
పోలవరం ప్రాజెక్టుకు పెను సవాల్గా నిలిచిన ఎగువ కాఫర్ డ్యాం సీపేజీ పరిష్కారానికి అధికారులు దారులు వెతుకుతున్నారు. కేంద్ర జలసంఘం సూచన మేరకు గుత్తేదారు ఏజెన్సీ సంస్థ తరఫున ఆఫ్రి డిజైన్ కన్సల్టెన్సీ సంస్థను నియమించారు. -
62 ఏళ్లు పూర్తయ్యేవరకూ సర్వీసులో కొనసాగొచ్చు
రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)లో పనిచేస్తున్న ఉద్యోగులు 62 ఏళ్లు పూర్తయ్యేవరకు సర్వీసులో కొనసాగవచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. పీఏసీఎస్ ఉద్యోగుల్లో ఎవరైనా 60 ఏళ్ల తర్వాత పదవీ విమరణ చేసి, ఇంకా 62 ఏళ్లు పూర్తికాకుంటే అలాంటివారిని పునర్నియమించాలని ఆదేశించింది. -
మెప్మా ఎండీపై విచారణకు ఈసీ ఆదేశం
ఎన్నికల్లో వైకాపాకి అనుకూలంగా పని చేశారని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఎండీ విజయలక్ష్మిపై వచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి విచారణకు ఆదేశించారు. -
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు డీఓ విధానం తొలగింపు
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో డిపార్టుమెంట్ అధికారి(డీఓ) నియామక విధానాన్ని రద్దు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల కోసమంటూ.. గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఈ విధానానికి స్వస్తి పలికారు. -
కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు మృతి
ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు అలియాస్ కృష్ణబాబు(71) మంగళవారం మృతిచెందారు. అనారోగ్యం కారణంగా కొంతకాలంగా హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. -
గుంతల రోడ్లకు రెండు ప్రాణాలు బలి
రాష్ట్రంలో గుంతల రోడ్లు ప్రాణాలు తీస్తున్నాయి. గుంతల్ని చూసి అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో ఒకరు, బురదతో నిండిపోయిన గోతుల్లోపడి మరొకరు మంగళవారం మృతి చెందారు. రోడ్డు మీద గుంతలు పూడ్చలేని పాలకుల నిర్లక్ష్యం రెండు కుటుంబాలను దుఃఖంలో ముంచేసింది. -
తిరుమల చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
శ్రీవారి దర్శనార్థం తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. స్థానిక రచనా అతిథిగృహం వద్ద రేవంత్రెడ్డికి తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. -
విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు.. ఏడాదికి రెండు సార్లు సందర్శించాలి: ప్రవీణ్ ప్రకాశ్
విద్యార్థుల ఇళ్లను ఉపాధ్యాయులు ఏడాదికి రెండు పర్యాయాలు సందర్శించాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ సూచించారు. -
ఇదీ సంగతి!
-
ఈవీఎంల ధ్వంసం ఘటనలపై ఎస్పీ ఆరా
పోలింగ్ రోజున ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనలపై పల్నాడు ఎస్పీ మలికాగార్గ్ ఆరా తీశారు. మంగళవారం ఆమె రెంటచింతల మండలం పాల్వాయిగేటు, తుమృకోట గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. -
గూగులమ్మ ఇంట ఏఐ పంట
టెక్నాలజీ రంగంలో ఎక్కడ చూసినా కృత్రిమ మేధ (ఏఐ) హవానే. గూగుల్ వార్షిక డెవలపర్ సదస్సు ఏ/ఓ 2024 కూడా దీనికే పెద్ద పీట వేసింది. ఇటీవల జరిగిన ఈ సదస్సులో గొప్ప గొప్ప కృత్రిమ మేధ నమూనాలను ప్రదర్శించింది. -
ఏబీ వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా హైకోర్టులో వ్యాజ్యం
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ హైదరాబాద్లోని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఈనెల 8న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. -
ఎన్నికల ఘర్షణ కేసుల్లో 4,668 మంది గుర్తింపు
ఎన్నికల ముందు రోజు, ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన ఘర్షణలకు సంబంధించి నమోదైన కేసుల్లో 4,668 మందిని గుర్తించి కొంత మందిని అరెస్ట్ చేశామని, మరికొందరికి నోటీసులు జారీ చేశామని డీజీపీ హరీశ్కుమార్ గుప్తా తెలిపారు. -
సంక్షిప్త వార్తలు(11)
తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ మంగళవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
తాజా వార్తలు (Latest News)
-
దయచేసి వినండి మీ రైలు రద్దయింది!.. ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్న రైల్వే శాఖ
-
మూడోకన్ను మూసుకుపోయింది.. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించని పోలీసులు
-
పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైలు
-
‘హార్ట్ బ్రేకింగ్ ఫొటో ఆఫ్ ది మ్యాచ్’.. దిగాలుగా హైదరాబాద్ బ్యాటర్
-
సరదా శ్రుతిమించితే... మృత్యు ఒడికి..!
-
అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల వ్యయం.. రూ.300 కోట్లు ?