Pegasus: పెగాసస్పై దుమారం
పెగాసస్ స్పైవేర్ వ్యవహారం.. శాసనసభలో దుమారం రేపింది. సోమవారం మధ్యాహ్నం సభ ప్రారంభం కాగానే సభా వ్యవహారాలశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు
చంద్రబాబు హయాంలో ఈ స్పైవేర్ కొన్నారన్న వైకాపా
అసెంబ్లీలో ఆరోపణ
సభాసంఘం వేయాలని డిమాండ్
అంగీకరించిన సభాపతి
ఈనాడు, అమరావతి: పెగాసస్ స్పైవేర్ వ్యవహారం.. శాసనసభలో దుమారం రేపింది. సోమవారం మధ్యాహ్నం సభ ప్రారంభం కాగానే సభా వ్యవహారాలశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు పెగాసస్ సాఫ్ట్వేర్ కొన్నారని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ వేదికగా సీఎం మమతా బెనర్జీ చెప్పారని, దీనిపై సమగ్ర చర్చ అవసరమని పేర్కొన్నారు. దీనిపై తెదేపా సభ్యులు తీవ్ర అభ్యంతరం చెబుతూ నినాదాలు చేశారు. ‘పెగాసస్తోపాటు 2014 నుంచి 2019 మధ్య చోటు చేసుకున్న వివిధ అక్రమాలపైనా విచారణ చేయాలి. సభా సంఘం వేయాలి. తప్పు చేసిన వారిని శిక్షించేలా చర్యలు తీసుకోవాలి’ అని బుగ్గన కోరారు. పలువురు వైకాపా సభ్యులూ ఇదే డిమాండు చేయడంతో విచారణకు సభా సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సభాపతి తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఒకటి, రెండు రోజుల్లో కమిటీలో సభ్యుల పేర్లు వెల్లడిస్తామని తెలిపారు.
సోమవారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత పెగాసస్పై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ మొదలైంది. అప్పటికే తెదేపా సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయడంతో ఈ అంశంపై వైకాపా ఎమ్మెల్యేలే మాట్లాడారు. మమతా బెనర్జీ చెప్పినట్లు.. చంద్రబాబు ఈ సాఫ్ట్వేర్ కొని ఉంటే అది ఘోరాతిఘోరమైన విషయమని మంత్రి బుగ్గన ధ్వజమెత్తారు. అసెంబ్లీలో ఆమె మాట్లాడారంటూ వివిధ ఆంగ్ల దిన పత్రికల్లో వచ్చిన వార్తా క్లిప్పింగులను ఆయన చదివి వినిపించారు. పెగాసన్ కొన్నారనడానికి రుజువేమీ లేదని, ఇలాంటి చట్టవిరుద్ధమైన పనులను చట్ట వ్యతిరేకంగానే చేస్తారని, అంత సులభంగా ఆధారాలు దొరకనివ్వరని విమర్శించారు. 2017, ఆ తర్వాత చోటుచేసుకున్న పలు వ్యవహారాలు దీనికి ఊతమిచ్చేలా ఉన్నాయని ఆరోపించారు.
ప్రతిపక్షాలు, ప్రజలపైనా నిఘా పెట్టారు: పెగాసస్ స్పైవేర్తోపాటు వివిధ రకాలుగా నిఘా పెట్టారని మంత్రి బుగ్గన విమర్శించారు. రూ.25 కోట్లతో డ్రోన్ల సరఫరాకు 2017 జూన్లో ప్రతిపాదనలు రూపొందించారని, తర్వాత జులైలో అప్పటి ఇంటెలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు చేతన్ సాయికృష్ణకు చెందిన ఆకాశం అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంస్థ ఏర్పాటు చేశారని విమర్శించారు. ‘డ్రోన్ల సరఫరాకు 4 సంస్థలు ముందుకొచ్చాయి. సాంకేతిక పరిశీలన సందర్భంగా ఇందులో మూడు వెనక్కి వెళ్లగా.. ఇజ్రాయెల్కు చెందిన సంస్థ మాత్రమే ఎంపికైంది. ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు సీఈవోగా ఉన్న ఆకాశం అడ్వాన్స్డ్ సిస్టమ్స్ దీనికి భారత్లో డీలర్. అయితే తర్వాత వివిధ స్థాయిల్లోని పోలీసు అధికారుల బృందం ఏదో కారణంతో.. దీనిపై చర్చించి టెండర్లను రద్దు చేసింది. ఇంటెలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు 2017లో రెండుసార్లు ఇజ్రాయెల్ వెళ్లి వచ్చారు. అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి (ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు) తన ఫోన్తోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరికొందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయని రిట్ దాఖలు చేశారు. ఐటీగ్రిడ్ ఆధ్వర్యంలో సేవామిత్ర యాప్ ద్వారా ఆంధ్రప్రదేశ్లోని ఓటర్లపై నిఘా పెట్టి.. వారు ఏ పార్టీకి ఓటేసే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశారనేందుకూ ఆధారాలున్నాయి’ అని బుగ్గన తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాసమాచారం కూడా దొంగిలించారని స్పష్టమవుతోందని, దీనిపై సభా కమిటీ వేయాలని ఛీఫ్విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు పెగాసస్పై చర్చను వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రారంభించి మాట్లాడారు. పెగాసస్ కొనుగోలు వ్యవహారంపై ప్రతిపక్షనేత చంద్రబాబు శాసనసభకు వచ్చి సమాధానం చెప్పాలని ఆయన డిమాండు చేశారు. ‘చంద్రబాబు, ఆమె (మమత) రాజకీయ మిత్రులే. వాస్తవం కాకపోతే ఆమె ఆ విషయం ఎందుకు చెబుతారు’ అని వ్యాఖ్యానించారు. అయిదు కోట్ల ప్రజల హక్కులకు సంబంధించిన పెగాసస్పై విచారణ జరిపించాలని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. దేశ భద్రతకు ముప్పు కలిగించే పెగాసస్ వ్యవహారంపై విచారణ చేయించి శాసనసభ, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీకి నివేదిక పంపాలని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ను గెలిపించినందుకు లెంపలేసుకుంటున్నాం
గత ఎన్నికల్లో జగన్కు ఓట్లు వేసి గెలిపించినందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని ఆంధ్రా పెన్షనర్ల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనుదారులకు ఆత్మబంధువైన చంద్రబాబును గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. -
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ నమూనా చట్టంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా విస్మరించింది. -
మధ్యస్థంగా నీట్ పేపర్
దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ-2024 ప్రవేశపరీక్షలో భౌతికశాస్త్రంలో మొత్తం 50 ప్రశ్నలకు 10 కష్టంగా ఉన్నాయని నిపుణులు వై.శారదాదేవి అన్నారు. -
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి జగన్ ఝలక్!
సామాజిక సమస్యలు, విప్లవం నేపథ్యంలో సినిమాలు చిత్రీకరించే ఆర్.నారాయణమూర్తి నిరాడంబరుడు, సౌమ్యుడు, మంచివాడని సినిమా పరిశ్రమలో పేరుంది. అలాంటి నారాయణమూర్తికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఝలక్ ఇచ్చారు. -
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
రాయలసీమలోని మూడు జిల్లాల రైతాంగానికి జీవనాధారమైన తుంగభద్ర హైలెవెల్ కెనాల్(హెచ్చెల్సీ)ను అధ్వాన స్థితికి చేర్చింది జగన్ సర్కారు. -
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన నేపథ్యంలో.. నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ఏపీ డీజీపీపై బదిలీ వేటు
అధికార వైకాపా అరాచకాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి.. మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధ విభాగంగా మార్చేసిన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
జనాలకు డొక్కు.. జగన్కు హై‘టెక్కు’
రాష్ట్రంలో రహదారులన్నీ అడుగుకో గుంతతో ప్రమాదకరంగా మారగా.. ఆ రోడ్లపైన కాలం చెల్లిన ఆర్టీసీ డొక్కు బస్సుల్ని నడిపిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు సీఎం జగన్. ‘ఆర్టీసీలో 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగిన 3,600 బస్సులను వెంటనే మార్చాలి. -
కామధేనువునూ కుళ్లబొడుస్తున్నారు!
ఎన్నో ఆశయాలు.. మరెన్నో లక్ష్యాలతో.. ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన కంపెనీలు తిరుపతి సమీప రేణిగుంటలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో తమ యూనిట్లను నెలకొల్పాయి. -
ఇసుక మాఫియా విధ్వంసానికి ఇదే సాక్ష్యం!
వైకాపా పాలనలో ఇసుక మాఫియా ‘అందినంత తీసుకో.. దొరికినకాడికి దోచుకో’ అన్న సిద్ధాంతాన్ని పాటిస్తోంది. అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ దోచుకుంటోంది. -
యువతకు లక్ష విదేశీ ఉద్యోగాలు
రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన దిశగా తెదేపా కసరత్తు ప్రారంభించింది. దీనికి వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగువారు, పారిశ్రామికవేత్తలూ మేము సైతం అంటూ ముందుకొస్తున్నారు. -
ఉద్యోగాలు సృష్టించేవారినే ఎన్నుకోవాలి
‘ఉద్యోగాలు సృష్టించేవారినే అమెరికాలో ఎన్నుకుంటారు. విదేశీ పెట్టుబడులు రావడానికి ఆ దేశంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అందుకే అమెరికా అన్ని రంగాల్లో ముందుంది. -
సమస్యలపై ప్రశ్నించినందుకు నిండు గర్భిణిపై వైకాపా నేతల దాడి
స్థానిక సమస్యలపై ప్రశ్నించడంతో గర్భిణి అని కూడా చూడకుండా వైకాపా నేతలు ఓ మహిళపై దాడికి పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితులు తెలిపిన మేరకు.. ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కుటాగులోళ్లపల్లిలో తంబళ్లపల్లె వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్రెడ్డి... -
వైకాపా బంటులైన డీఎస్పీలపై వేటు
అధికార వైకాపాకు అనుకూలంగా పనిచేస్తూ.. ప్రతిపక్ష పార్టీల శ్రేణులను వేధించడం, అణచివేయడమే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. -
నిన్న ఎగ్గొట్టి.. రేపు ఇస్తారట!
2019 ఎన్నికలప్పుడు జగన్ చెప్పిందేంటి? అన్నదాతలకు వడ్డీ లేని పంట రుణాలిస్తామనే కదా? మరి గద్దెనెక్కాక చేసిందేమిటి..? రూ.లక్షలోపు పంట రుణాలకేనంటూ నిబంధన పెట్టారు -
దళితులు జగన్ను ఓడించి.. తమను తాము రక్షించుకోవాలి
దళితులు, ముఖ్యంగా మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో వారిని రాజకీయంగా, సామాజికంగా అథఃపాతాళానికి తొక్కారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు ధ్వజమెత్తారు. -
బూతులు మాట్లాడే వారికి ఓటుతోనే సమాధానం చెప్పండి
ఓటు హక్కు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరూ తప్పక వినియోగించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్టులో స్వయం ఉపాధి శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. -
సామాన్యుల ఆస్తులకు రక్షణేదీ?
‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022) వల్ల సామాన్యులు, నిరక్షరాస్యులు తీవ్ర ఇబ్బందులు పడతారు. -
భూ యాజమాన్య హక్కు చట్టం.. ప్రమాదకరం
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంలో సెక్షన్ 64 కింద భూములు, ఆస్తులకు సంబంధించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో)కి సమాచారం ఇవ్వకపోతే బాధ్యులైన హక్కుదారులకు 6 నెలల వరకు జైలుశిక్ష లేదా రూ.50 వేల వరకు జరిమానా విధించొచ్చు. -
ప్రజల ఆస్తులపై వైకాపా పడగ నీడ
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు పెరిగాయి. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అధికార పార్టీ నాయకుల భూదాహానికి అంతే లేకుండా పోయింది. -
చేదోడని.. ‘చెయ్యిచ్చి’!
‘నా బీసీలు, నా పేదలు’ అంటూ నిత్యం సీఎం జగన్ ఊదరగొడుతుంటారు. తమది పేదల ప్రభుత్వమంటూ.. వారికి ఎంతో చేశామంటూ మాటలు చెబుతారు. కానీ జగన్ పేదల విషయంలో ఎంత కఠినమైన హృదయంతో ఉన్నారనేది ‘చేదోడు’ పథకం అమలు చూస్తేనే అర్థమైపోతుంది.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
-
10 గంటల పాటు డంప్యార్డ్లో ధనుష్.. నెట్టింట ప్రశంసలు
-
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!