PRC:ఉన్నంతలో ఉత్తమ పీఆర్సీ
‘ఉన్నంతలో సాధ్యమైనంత ఉత్తమ(బెస్ట్ పాజిబుల్) పీఆర్సీ ఇచ్చిన ముఖ్యమంత్రిగా జగన్ ఉద్యోగుల మనసు గెలుచుకోగలిగారు’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కొవిడ్ ఊహించని రీతిలో దెబ్బకొట్టింది. ఇప్పుడు ఒమిక్రాన్ ప్రభావం ఎలా ఉండబోతోందో తెలియదు
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
ఈనాడు, అమరావతి: ‘ఉన్నంతలో సాధ్యమైనంత ఉత్తమ(బెస్ట్ పాజిబుల్) పీఆర్సీ ఇచ్చిన ముఖ్యమంత్రిగా జగన్ ఉద్యోగుల మనసు గెలుచుకోగలిగారు’ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కొవిడ్ ఊహించని రీతిలో దెబ్బకొట్టింది. ఇప్పుడు ఒమిక్రాన్ ప్రభావం ఎలా ఉండబోతోందో తెలియదు. దీన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి’ అని వ్యాఖ్యానించారు. ‘చెప్పిన దానికంటే ఎక్కువ చేయాలనే ఆలోచన జగన్కు ఉంది. కానీ... పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. ఏదో చెప్పామని కాకుండా... దాంతో తర్వాత వచ్చే పరిణామాలకూ బాధ్యత వహించాలని భావించారు‘ అని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. ‘ఎవరూ అడక్కపోయినా ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62కు సీఎం పెంచారు. మరోవైపు యువతకూ ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. బహుశా ఏ ప్రభుత్వమూ చేయనంతగా అధికారంలోకొచ్చిన సంవత్సరంలోనే 1.30 లక్షల ఉద్యోగాలను సచివాలయ వ్యవస్థతో కల్పించాం. ఆ ఉద్యోగులకు జూన్తో రెగ్యులర్ స్కేలు ఇవ్వనున్నారు. దానివల్ల ప్రభుత్వంపై రూ.1,700 కోట్ల అదనపు భారం పడుతుంది. మరోవైపు వైద్యారోగ్య శాఖలో 40 వేల నియామకాలను చేపట్టనున్నారు’ అని వివరించారు.
ఉద్యమ ఫలితమే హామీల అమలు
ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు
ఈనాడు, అమరావతి: ఏపీ ఐకాస, ఐకాస అమరావతి ఉద్యమ ఫలితంగానే ఉద్యోగుల హామీలు అమలయ్యాయని ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ‘‘ఉద్యోగుల కమిటీ సిఫార్సు చేసిన 14.29 శాతాన్ని పక్కన పెట్టి, పీఆర్సీ కమిషనర్ అశుతోష్ మిశ్ర కమిటీ సిఫార్సు చేసినట్లు 23% ఫిట్మెంట్ ఇచ్చారు. ఇళ్లులేని ఉద్యోగులకు ఎంఐజీలో ఇళ్లు ఇవ్వాలన్న సీఎం నిర్ణయానికి ధన్యవాదాలు. ఐకాసలు పెట్టిన 71 డిమాండ్లలో 50 డిమాండ్లకు పరిష్కారం దొరికింది. ఫిట్మెంట్తో ప్రభుత్వానికి ఏడాదికి రూ.10,250 కోట్లు వ్యయమవుతుంది. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
ఫిట్మెంట్ తగ్గడంపై కొంత బాధ కలిగింది
ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
ప్రస్తుతం 27% ఐఆర్ ఇస్తున్నందున అదేస్థాయిలో ఫిట్మెంట్ను ఆశించామని, 23 శాతానికి తగ్గడం కొంత బాధ కలిగించిందని ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ‘‘ఫిట్మెంట్ కొంత తగ్గినా ఒప్పంద, పొరుగుసేవలు, గ్రామ, వార్డు ఉద్యోగులకు లబ్ధి చేకూర్చడం, ఇతర హామీలు పరిష్కారమైనందున సంతోషం కలిగింది. కొన్ని కావాలనుకున్నప్పుడు, కొన్ని పోతాయి. మెజారిటీ లబ్ధి వస్తున్నందున హర్షం వ్యక్తంచేస్తున్నాం. ఇదంతా ఐకాసల ఉద్యమ ఫలితమే. మేం కోరుకున్న ప్రధాన సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచడంపై ఒక్కసారిగా షాక్కు గురయ్యాం. సీఎం తీసుకున్న ఈ నిర్ణయం సాహసోపేతమైంది. ఉద్యోగుల సొంతింటి కలనూ మా డిమాండ్లలో పెట్టకపోయినా నెరవేర్చారు. రెండు వారాల్లో ఉద్యోగుల ఆరోగ్యకార్డుల సమస్యను పరిష్కరిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ పే స్కేళ్లను అమలు చేస్తామన్న దానిపై ఒకసారి అందరం మాట్లాడుకుని, ప్రభుత్వంతో చర్చిస్తాం’’ అని వివరించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అంగీకరించాం
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి
ఫిట్మెంట్ కొంచెం తగ్గినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అంగీకరించామని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. ‘‘ఒమిక్రాన్ వస్తున్నందున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మున్ముందు ఎలా ఉంటుందో తెలియడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన 23% ఫిట్మెంట్కు అంగీకరిస్తున్నాం. ఒక్క ఫిట్మెంట్ తప్ప మిగిలిన అంశాలు మేం ఊహించిన దానికంటే మిన్నగా వచ్చాయి. ఫిట్మెంట్, డీఏలు కలిపితే వేతనాల్లో మంచిపెరుగుదల ఉంటుంది’’ అని తెలిపారు.
ఉద్యోగులను వంచించారు: ఏపీసీపీఎస్ఈఏ
కంట్రిబ్యూటరీ పింఛను పథకం ఉద్యోగులను సీఎం జగన్ మరోసారి వంచించారని ఏపీసీపీఎస్ ఉద్యోగుల సంఘం (ఏపీసీపీఎస్ఈఏ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అప్పలరాజు, పార్థసారథి విమర్శించారు. వారానికే విశ్వసనీయత కరవైనప్పుడు, 6నెలల తర్వాత నిర్ణయం అనడం మరోసారి వంచించడమేనని ధ్వజమెత్తారు. ‘అధికారులు సొంత నివేదికను ముందుకు తీసుకురావడం దుర్మార్గం. ఇప్పటికే రావాల్సిన మూడు డీఏల బకాయిల గురించి మాట్లాడకపోవడంతో ఉద్యోగులు రూ.లక్షలు నష్టపోయే అవకాశముంది. సీపీఎస్ ఉద్యోగుల పట్ల సీఎం విశ్వసనీయతను చాటుకోవాలి. లేనిపక్షంలో కుటుంబాలతో కలిసి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం’ అని హెచ్చరించారు.
ప్రభుత్వంపై విశ్వాసం పోయింది: పీడీఎఫ్ ఎమ్మెల్సీలు
సీఎం జగన్ ప్రకటించిన పీఆర్సీ నిరాశ కలిగించిందని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) ఎమ్మెల్సీలు బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు, శ్రీనివాసులురెడ్డి, వెంకటేశ్వరరావు, షేక్సాబ్జీ వెల్లడించారు. ‘మధ్యంతర భృతికంటే ఫిట్మెంట్ తక్కువగా ఇవ్వడం చరిత్రలో ఇది మొదటిసారి. ఇలాంటి పీఆర్సీ గతంలో ఎప్పుడూ ఇవ్వలేదు. ఇంటి అద్దెభత్యం యథాతథంగా ఉంటుందా? తగ్గిస్తారా? చూడాలి. అన్నింటికంటే ఘోరం భవిష్యత్తులో పీఆర్సీకి మంగళం పాడుతూ కేంద్ర ప్రభుత్వ వేతన సవరణతో ముడిపెట్టడం. ఇదే జరిగితే 2023 పీఆర్సీ గల్లంతు ఖాయం. సీపీఎస్పై సీఎం చర్చించనే లేదు. దీంతో సీపీఎస్ను మర్చిపోండని చెప్పినట్లయింది. ఈ విధానం ప్రభుత్వంపై విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తోంది. ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల క్రమబద్ధీకరణపై వైఖరిని ప్రకటించలేదు. పీఆర్సీ వర్తిస్తుందని చెప్పి సరిపెట్టారు’ అని వివరించారు.
ఉద్యోగులకు న్యాయం చేయాలి: ఎమ్మెల్సీ కత్తి
పీఆర్సీ ఫిట్మెంట్, ఇంటి అద్దెభత్యం స్లాబులపై ఉద్యోగులకు న్యాయం చేయాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి కోరారు. ‘23శాతం ఫిట్మెంట్ ఉద్యోగులను నిరాశపర్చింది. 27శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి. ప్రస్తుతం పొందుతున్న ఇంటి అద్దెభత్యం స్థానంలో 8%,16%,24% అమలుచేస్తే ఆర్థికంగా నష్టపోతారు’ అని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు బెయిల్ రద్దు కేసు పది వారాలు వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 10 వారాలకు వాయిదా వేసింది. -
ఏపీ సీఎస్ ఉదాసీనతతో పండుటాకులకు పాట్లు
పింఛనుదార్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంటి వద్దే నగదు అందించేలా చర్యలు తీసుకోవాలని విపక్ష పార్టీలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్రెడ్డి పట్టించుకోలేదు. -
కావలిలో ఇంకా తొలగించని డబుల్ ఓట్లు
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో డబుల్ ఓట్లపై గతంలో ‘ఈనాడు’లో వరుస కథనాలు రాగా.. వాటిలో చాలా వరకు తొలగించారు. -
మంత్రి పెద్దిరెడ్డి వీర విధేయులపై వేటు
అధికార వైకాపాకు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వీర విధేయుల్లా పనిచేస్తున్న చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ మహేశ్వరరెడ్డి, సదుం ఎస్సై మారుతిలపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు మంగళవారం వేటు వేసింది. -
మోదీజీ.. మీరు పునాది వేసిన అమరావతి ఇప్పుడిలా!
‘‘హైదరాబాద్ని మించిన మహానగరాన్ని కడతాం. కేంద్రం సహాయం చేసినా, చేయకపోయినా నిర్మించితీరతాం. ఎలా అంటే మా బుర్రలోంచి వచ్చిన ఆలోచన నుంచి కడతాం’’- ఇవి జగన్ ప్రతిపక్షంలో ఉండగా పలికిన అబద్ధాలివి. -
‘బందోబస్తు’ బహుపరాక్!
సిద్ధం.. సిద్ధం.. అంటూ హోరెత్తిస్తున్న అధికార వైకాపా.. ఎన్నికల వేళ తీవ్ర హింసకు సర్వం సిద్ధం చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
అనూహ్య వర్షాలతో అతలాకుతలం
వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన అనూహ్య మార్పులు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. -
అంత అత్యవసరం ఏమిటో చెప్పమనండి
ఎన్నికలు పూర్తయ్యేవరకూ రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యాదీవెన, చేయూత పథకాల కింద నిధుల విడుదలకు అనుమతి నిరాకరిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు మంగళవారం అత్యవసరంగా విచారణ జరిపింది. -
రాజమహేంద్రవరం విలవిల
అధికారమిస్తే ప్రగతిని పరుగులు పెట్టిస్తానని మాయమాటలు చెప్పిన సీఎం జగన్.. అయిదేళ్ల పాలనలో కనీసం నగరాలను పట్టించుకోలేదని తేలిపోయింది. -
‘సొంత’వారికే వంత!
ప్రభుత్వాలు ఏవైనా రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలి. కానీ, మన రాష్ట్రంలో మొత్తం రివర్స్ కదా.. పేదల పక్షపాతినని డబ్బా కొట్టుకునే సీఎం జగన్.. తన అరాచకాల్ని ప్రశ్నించే విపక్ష నాయకులు, ఇతరులపై పెత్తందారులని ముద్ర వేస్తారు. -
పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం చెప్పలేదు
ప్రభుత్వ పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం చెప్పలేదని.. 5 నుంచి 10 రోజుల తరువాత అమలు చేయాలని సూచించిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా స్పష్టం చేశారు. -
‘వివేకం’ సినిమాకి 2.1 కోట్లకు పైగా వ్యూస్.. పక్క రాష్ట్రాల్లోనూ ఆసక్తి
సీఎం జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం ఆధారంగా తెరకెక్కిన ‘వివేకం’ చిత్రానికి మంగళవారం నాటికి అన్ని యూట్యూబ్ ఛానళ్లలో కలిపి సుమారు 2.1 కోట్లలకు పైగా వీక్షణలు వచ్చాయి. -
‘ఆ చీకటి చట్టం రాకముందే’ ఇన్ని అగచాట్లా?
‘వారసత్వంగా వచ్చిన పట్టా భూమి మ్యుటేషన్ చేయడానికి స్పెషల్ సీఎస్గా పనిచేసిన నన్నే ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే.. రాష్ట్రంలో సాధారణ రైతులు, బడుగులు, చదువురాని వాళ్లు ఏమైపోవాలి.. వారికి న్యాయం జరిగేదెలా?’ అని ఆర్థికవేత్త, విశ్రాంత ఐఏఎస్ అధికారి, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పీవీ రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. -
నడవాలు ‘నాశనం’!
‘నాకు దక్కకపోతే ఎవరికీ దక్కకూడదు’... ఇది ముఖ్యమంత్రి జగన్ వైఖరి. కేవలం గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ప్రాజెక్టులను కొనసాగిస్తే ఆ కీర్తి వారికి చెందుతుందనే వికృత ఆలోచనతో అభివృద్ధికి చోదక శక్తిలాంటి పారిశ్రామిక నడవాల నడకను ఆపేశారు. -
అమరావతి అభివృద్ధితోనే ఏపీ పురోగతి
రాజధాని అమరావతిపై ప్రధాని మోదీ ఇస్తున్న భరోసాతో రాజధాని వాసుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. -
‘అంబేడ్కర్’ను తొలగించి.. తన పేరు తగిలించి..!
గొప్పింటి బిడ్డలే విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలా? ప్రతిభ ఉన్న పేద పిల్లలు చదువుకోకూడదా? ప్రఖ్యాత వర్సిటీల్లో సీటు పొందిన పేద విద్యార్థులకు ఫీజు చెల్లించే స్థోమత ఉండదు. -
విజన్ ఉన్న నాయకుడినే ఎన్నుకోవాలి
రానున్న 25 ఏళ్లలో రాష్ట్ర, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విజన్ ఉన్న నాయకుడినే ఎన్నుకోవాలని ప్రవాస భారతీయుడు రంగనాథబాబు గొర్రెపాటి సూచించారు. -
జీపీఎఫ్ ఖాతాల నుంచి ప్రభుత్వమే రూ.500 కోట్లు దొంగిలించింది
జగన్ సర్కారు ఉద్యోగులకు బకాయిలు చెల్లించకపోగా.. జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ.500 కోట్లు దొంగతనంగా లాగేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
పోలీసు వ్యవస్థపైనే స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ బాధ్యత
రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోన్న నేపథ్యంలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ బాధ్యత పోలీసు వ్యవస్థపైనే ఉందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ పేర్కొన్నారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై వైకాపా ఫిర్యాదు నాన్ కాగ్నిజబుల్ నేరం
‘ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని, ఆ చట్టాన్ని వినియోగించి వైకాపా, జగన్ ప్రజల భూములను లాక్కుంటున్నట్లు తెదేపా చెబుతోంది. -
దురుద్దేశంతో కేసు నమోదు
పులివెందుల పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ వివేకా కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్సింగ్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి.
తాజా వార్తలు (Latest News)
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం
-
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్