President Ram Nath Kovind: కోర్టుల్లో వ్యాఖ్యలతో జాగ్రత్త
న్యాయస్థానాల్లో వ్యాఖ్యలు చేసే సమయంలో అత్యంత విచక్షణ చూపించాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ న్యాయమూర్తులకు సూచించారు. అనాలోచితంగా ఒక్క మాట అన్నా..అది మంచి ఉద్దేశంతో అన్నప్పటికీ...తప్పుడు వ్యాఖ్యానాలకు అవకాశం ఇస్తుందని చెప్పారు.
అనాలోచితంగా చేస్తే పెడర్థాలు
న్యాయమూర్తులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హితవు
చట్టాల ప్రభావంపై అధ్యయనం ఏదీ?: జస్టిస్ రమణ
దిల్లీలో రాజ్యాంగ దినోత్సవం ముగింపు కార్యక్రమంలో జస్టిస్ ఎన్.వి.రమణ, రాష్ట్రపతి కోవింద్ల మాటామంతీ
ఈనాడు, దిల్లీ: న్యాయస్థానాల్లో వ్యాఖ్యలు చేసే సమయంలో అత్యంత విచక్షణ చూపించాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ న్యాయమూర్తులకు సూచించారు. అనాలోచితంగా ఒక్క మాట అన్నా..అది మంచి ఉద్దేశంతో అన్నప్పటికీ...తప్పుడు వ్యాఖ్యానాలకు అవకాశం ఇస్తుందని చెప్పారు. సుప్రీంకోర్టు రెండు రోజుల పాటు నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవం ముగింపు సందర్భంగా శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. న్యాయమూర్తులు ఎటువంటి రాగద్వేషాలు లేని స్థితప్రజ్ఞులని సమాజం భావిస్తోందని, దానికి అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో జడ్జీలపై దాడులు జరుగుతుండడం బాధాకరమని రాష్ట్రపతి చెప్పారు. పేర్లు వెల్లడించకుండా సమాచారం వెలువరించవచ్చన్న వెసులుబాటును కొందరు దుర్వినియోగం చేసి న్యాయవ్యవస్థపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. అయితే ఇలాంటి ఇబ్బందులు తాత్కాలికమేనని అన్నారు. అఖిల భారత న్యాయ సర్వీసు ఏర్పాటు చేస్తే బాగుంటుందని రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. పెండింగ్ కేసుల సమస్య పరిష్కారానికి భాగస్వాములంతా కలిసికట్టుగా ప్రయత్నించాలని సూచించారు.
సౌకర్యాలు కల్పించకుండా వాణిజ్య కోర్టులా?: జస్టిస్ రమణ
ఈ సమావేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ప్రసంగిస్తూ శాసనవ్యవస్థ తాను ఆమోదించే చట్టాల ప్రభావంపై అధ్యయనం చేయడంలేదని, అందువల్ల అది కొన్నిసార్లు పెద్ద సమస్యలకు దారితీస్తోందని చెప్పారు. చెల్లని చెక్కులకు సంబంధించిన నెగోషియల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లోని సెక్షన్ 138 ఇందుకు పెద్ద ఉదాహరణ అని పేర్కొన్నారు. ‘‘ఇప్పటికే పనిభారంతో ఉన్న మెజిస్ట్రేట్లపై ఈ సెక్షన్ కింద నమోదైన కేసులు మరింత భారం మోపాయి. ఎలాంటి అదనపు మౌలిక వసతులు కల్పించకుండానే ఇప్పుడున్న కోర్టులనే వాణిజ్య కోర్టులుగా పేరు మారుస్తున్నారు. ఈ కారణంగా పెండింగ్ కేసులు పెరగనున్నాయి’’ అని చెప్పారు. రాజ్యాంగ పరిధిలో పనిచేస్తున్న వివిధ వ్యవస్థల పాత్ర, పరిమితులపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించి, అవగాహన కలిగించాల్సి ఉందని తెలిపారు. ‘‘ముద్దాయిలను స్వేచ్ఛగా దోష విముక్తుల్ని చేయడానికి, కేసులను వాయిదా వేయడానికి కోర్టులే కారణమని చాలామంది అపార్థం చేసుకుంటుంటారు. కానీ నిజం వేరు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు, కక్షిదారులు అందరూ న్యాయప్రక్రియ ముందుకుసాగడానికి సహకరించాల్సి ఉంటుంది. సహాయ నిరాకరణ, నిబంధనల్లో లోపాలు, లోపభూయిష్టమైన దర్యాప్తునకు కోర్టులను బాధ్యుల్ని చేయలేరు’’ అని అన్నారు. దేశంలోని నాలుగు ప్రాంతాల్లో నాలుగు అప్పీలు కోర్టులు ఏర్పాటు చేయాలన్న అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. న్యాయస్థానాల సోపానక్రమాన్ని మార్చడంపై అధ్యయనం జరగాలని తెలిపారు. మౌలిక సౌకర్యాల కల్పనకు కేంద్రం రూ.9వేల కోట్లు కేటాయించడాన్ని అభినందించారు. అయితే రాష్ట్రాలు తమ వాటాను ఇవ్వడం లేదని, ఈ సమస్య పరిష్కారానికి జాతీయ న్యాయ మౌలిక వసతుల అథారిటీని ఏర్పాటు చేయాలని మరోసారి సూచించారు.
రాజ్యాంగ దినోత్సవ ముగింపు కార్యక్రమ వేదికపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తదితరులు
చట్టాలు అమలు చేయలేని పరిస్థితి రాకూడదు: రిజిజు
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ శాసన వ్యవస్థ ఆమోదించిన చట్టాలను అమలు చేయలేని పరిస్థితి రాకూడదని అన్నారు. తమ హక్కుల కోసం ఇతరుల హక్కులకు ఇబ్బందులు కలిగించకూడదని తెలిపారు. అందువల్ల ప్రాథమిక హక్కులు, ప్రాథమిక బాధ్యతల మధ్య సమతౌల్యం ఉండేలా చూడాలని సూచించారు. పెండింగ్ కేసుల సమస్య పరిష్కారానికి కృత్రిమ మేధను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు వందన సమర్పణ చేస్తూ రాజ్యాంగం ఎవరికీ అపరిమితమైన అధికారాలు ఇవ్వలేదని చెప్పారు. రాజ్యాంగం విధించిన పరిమితులు న్యాయమూర్తులకూ వర్తిస్తాయని తెలిపారు. దీనిని గమనించి అన్ని వ్యవస్థలూ నడుచుకోవాల్సిన అవసరముందని అన్నారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎ.ఎం. ఖాన్విల్కర్, జస్టిస్ డి.వై. చంద్రచూడ్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీత, బీటెక్ రవిల వ్యాజ్యాల నుంచి తప్పుకొన్న మరో ధర్మాసనం
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ జె.సుమతిలతో కూడిన ధర్మాసనం తప్పుకుంది. -
భూ హక్కు చట్టంపై మంత్రి ధర్మాన ద్వంద్వ వైఖరి.. అప్పుడలా..ఇప్పుడిలా..
మాటల గారడీలో ఆరితేరిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ‘భూహక్కు చట్టం’ అమలుపై ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారు. -
పేకేరు సర్పంచికి అరుదైన గౌరవం
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. -
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
పనుల్లో తన, మన భేదం లేదు.. అంతా నాసిరకంగా చేయడమే ఈ ప్రభుత్వ మార్కు అని నేలకొరిగిన రాజశేఖరరెడ్డి విగ్రహం వెక్కిరిస్తోంది. -
గడువిస్తే అధికారులు నిద్రపోతారు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పింఛన్లపై సర్కారు మరో కుట్ర!
ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ససేమిరా అంది. మండుటెండల్లో పింఛనుదారుల్ని గ్రామ, వార్డు సచివాలయాలకు బలవంతంగా రప్పించేలా గత నెలలో ఎత్తుగడ వేసింది. -
సర్వాధికారాలు ఉన్నా.. నోరు విప్పని జగన్
ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రానికి ఇప్పటికీ ఆయనే సుప్రీం. పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని కనుసైగలతో నడిపిస్తున్నారు. -
వడ్డీకాసుల వాడికి ‘వంచన సేవ!’
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల నీరాజనాలందుకునే శ్రీనివాసుడు కొలువైన తిరుమల.. దేశ, విదేశాల్లోని కోట్లాది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం..! -
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈసారి బ్యాంకు ఖాతా ద్వారా పింఛను పొందేందుకు తీరప్రాంత వాసులు పడవ ప్రయాణం చేయాల్సి వస్తోంది. -
అక్రమాలతో చెట్ట‘పట్టాలు’!
ఎన్నికల్లో అనుచిత లబ్ధికి వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ల ముసుగులో నకిలీ పట్టాలను పంచుతున్నారు. -
స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో ప్రజలపై రూ.1,274 కోట్ల భారం
ఎన్నికలకు ముందు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో(ఎస్టీవోఏ) సుమారు రూ.1,274 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై జగన్ ప్రభుత్వం మోపనుంది. -
అక్రమాల ఆధారాలను మా ముందు ఉంచండి
2018 నాటి గ్రూప్-1 నోటిఫికేషన్ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష (మెయిన్స్) జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో (చేతితో దిద్దడం) అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయనేందుకు గల ఆధారాలను వరుస క్రమంలో కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. -
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
డోన్ సభలో చంద్రబాబు ప్రసంగం అనంతరం ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బారికేడ్లు దాటుకుని ఏకంగా ఆయన వాహనంపైకి ఎక్కారు. -
మొక్కు‘బడి’లో ‘గ్లోబల్’ మోసం
పాఠశాలల్లో విద్యార్థులకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. ఘనత వహించిన జగన్ సర్కార్ మాత్రం అంతా రివర్స్. -
గ్రావెల్ గద్ద.. ఈ పెద్ద!
రాష్ట్రంలో వైకాపా నాయకులు ఒక్కొక్కరిది ఒక్కో తీరు. ‘నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా’ అని అందరూ చెబుతుంటారు. -
మల్లిక స్పైన్ సెంటర్కు అంతర్జాతీయ అవార్డు
స్పాండిలైటిస్ సమస్యపై చేసిన పరిశోధనకుగాను గుంటూరు మల్లిక స్పైన్ సెంటర్ డైరెక్టర్, ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు నరేష్బాబుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. -
‘కాపు’ కాస్తానని కాటేశారు!
దగా.. వంచన.. మోసం.. ఇలా ఏ పేరు పెట్టినా జగన్ దుర్మార్గపు ఆలోచనలకు సరితూగవు. పైకి అమాయకపు చక్రవర్తిలా నటిస్తూ.. ఆయన పాలనలో చేసిందంతా ఇదే! అది ఏ వర్గానికైనా సరే. -
జగన్ అహంభావంతో.. ఐదేళ్లలో పాలన అస్తవ్యస్తం
‘సీఎం జగన్ను సింహం అని ఆయన అనుచరులు పొగుడుతుంటారు. తనను తాను కారణ జన్ముడినని చిత్రించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తుంటారు. -
‘నిప్పు రాజేస్తున్నా’ నిర్లిప్తతేనా?
అధికార పార్టీకి చెందిన రౌడీమూకలు తెదేపా కార్యాలయాలు, ఆ పార్టీ నాయకుల ఆస్తులను తగలబెట్టేస్తే ఒక్కటంటే ఒక్క ఘటనలోనూ నిందితుల్ని పట్టుకోలేదు. -
మద్యం కాదు.. మంచినీళ్లతో గొంతు తడపండి!
ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు అభ్యర్థుల వెంట వెళ్తే చాలు.. తాగినంత మద్యం పోయిస్తున్నారు. -
చేపా చేపా ఎందుకు ఎండావ్?
సుదీర్ఘ తీరప్రాంతం అపార జలవనరులు... ఆంధ్రావనికి ఆదాయ మార్గాల్లో ఆక్వా రంగం కూడా ఒకటి.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు దూరం.. కారణమిదే
-
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత
-
సేల్స్ తగ్గాయన్న ఫ్రస్ట్రేషన్.. సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై వేటు వేసిన మస్క్
-
కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!
-
అమిత్ షా నకిలీ వీడియోల కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్టు
-
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు