Adani group: అదానీ చేతికి ట్రైన్మ్యాన్.. 100% వాటా
Trainman: రైల్వే సమాచారాన్ని అందించే ట్రైన్మ్యాన్ను అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. నూరు శాతం వాటాలను కొనుగోలు చేస్తున్నట్లు ఆ సంస్థ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది.
దిల్లీ: ఆన్లైన్ ట్రైన్ బుకింగ్, ఇన్ఫర్మేషన్ పోర్టల్ ట్రైన్మ్యాన్ను (Trainman) అదానీ గ్రూప్ (Adani group) కొనుగోలు చేసింది. అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్కు చెందిన అనుబంధ సంస్థ అదానీ డిజిటల్ ల్యాబ్స్ ఈ స్టారప్ను దక్కించుకుంది. ఈ మేరకు అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. నూరు శాతం వాటా కొనుగోలుకు షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు తెలిపింది. అయితే, ఎంతకు కొనుగోలు చేసిందీ వెల్లడించలేదు.
ఐఐటీ-రూర్కీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వినీత్ చిరానియా, కరణ్ కుమార్ ట్రైన్మ్యాన్ను స్థాపించారు. ఐఆర్సీటీసీ అధీకృత ట్రైన్ బుకింగ్ స్టారప్ అయిన ట్రైన్మ్యాన్.. రైళ్లలో సీట్ల అందుబాటు, పీఎన్ఆర్ స్టేటస్, లైవ్ స్టేటస్ వంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంటుంది. ఇటీవలే అమెరికాకు చెందిన ఇన్వెస్టర్ల నుంచి 1 మిలియన్ నిధులను కూడా సమీకరించింది. మరోవైపు ఎయిర్లైన్ బుకింగ్ యాప్ క్లియర్ ట్రిప్లో సైతం 2021లో అదానీ గ్రూప్ వాటాలు కొనుగోలుచేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.