Amazon bazaar: లైవ్లోకి అమెజాన్ బజార్.. మీషో, ఫ్లిప్కార్ట్కు పోటీగానేనా?
అమెజాన్ బజార్ పేరిట కొత్త వ్యాపార విభాగాన్ని ప్రారంభించింది. ఇందులో తక్కువ ధర కలిగిన ఉత్పత్తులు లభిస్తాయి.
Amazon bazaar | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon).. కొత్త వ్యాపార విభాగాన్ని ప్రారంభించింది. అన్ బ్రాండెడ్, తక్కువ ధర కలిగిన ఫ్యాషన్, లైఫ్ స్టయిల్ ఉత్పత్తుల కోసం ‘బజార్’ను తీసుకొచ్చింది. అమెజాన్ ఆండ్రాయిడ్ యాప్లో లైవ్లోకి వచ్చింది. రూ.600లోపు విలువ కలిగిన దుస్తులు, వాచ్లు, ఫుట్వేర్ను అందించడమే లక్ష్యంగా కొత్త వ్యాపార విభాగాన్ని అమెజాన్ ప్రారంభించింది.
తక్కువ ధరకే ఫ్యాషన్, గృహ ఉత్పత్తులను అందించడం ఈ ‘బజార్’ ముఖ్య ఉద్దేశం. చీరలు, కుర్తాలు, షర్టులు, టీషర్టులు, చిన్నపిల్లల దుస్తులు, బెడ్షీట్లు, డోర్ కర్టెన్స్, హ్యాండ్ బ్యాగుల వంటి వివిధ కేటగిరీలకు చెందిన ఉత్పత్తులు ఈ స్టోర్లో లభిస్తాయి. దేశం నలుమూలలా ఉన్న మానుఫాక్చరింగ్ హబ్స్ నుంచి సెల్లర్లు తమ ఉత్పత్తులను ఈ బజార్ వేదికగా విక్రయిస్తారు. ఇందుకోసం సెల్లర్ల నుంచి ఎలాంటి ఫీజూ వసూలు చేయడం లేదు. వీటి డెలివరీకి మాత్రం అమెజాన్ 4-5 రోజుల సమయం తీసుకుంటోంది. సాధారణంగా అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు ఒకే రోజులో డెలివరీ అందిస్తుంటారు. అన్బ్రాండెడ్ ఉత్పత్తుల విషయంలో మాత్రం కాస్త అధిక గడువు తీసకుంటోంది.
రూ.6,000-8,000 స్మార్ట్ఫోన్ల వైపు..ఫీచర్ ఫోన్ వినియోగదార్ల చూపు
వాటిపై పోటీకేనా?
ప్రీమియం ఉత్పత్తులను సేమ్ డే డెలివరీ చేయడం ద్వారా తనదైన ముద్ర వేసుకున్న అమెజాన్.. తక్కువ ధర కలిగిన ఉత్పత్తుల విక్రయంలో మాత్రం వెనకబడింది. ఈ విషయంలో సాఫ్ట్బ్యాంక్ మద్దతు కలిగిన మీషో దూసుకెళ్తోంది. ఫ్లిప్కార్ట్ సైతం షాప్సీ పేరిట ఇదేతరహాలో ప్రత్యేక యాప్ను నిర్వహిస్తోంది. దీంతో బజార్ రూపంలో ఆ లోటును భర్తీ చేయాలని అమెజాన్ చూస్తోంది. తద్వారా కొత్త కస్టమర్లను, తన వ్యాపారాన్ని పెంచుకోవాలని భావిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు త్వరలో 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. -
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు రెండు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరైంది. -
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో నిఫ్టీ 33.15 పాయింట్ల నష్టంతో ముగిశాయి. -
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
Indegene IPO: రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇండీజీన్ ఐపీఓ ప్రారంభమైంది. మదుపర్లు రూ.14,916తో కనీసం 33 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
రఫాపై ఇజ్రాయెల్ దండయాత్ర.. దాడులు మొదలుపెట్టిన సైన్యం!
-
నన్ను గదిలో బంధించి దాడి చేశారు: రాధికా ఖేడా తీవ్ర ఆరోపణలు