Ambani: అంబానీ వారసులకు వేతనాలు ఉండవు
వారసత్వ ప్రణాళికలో భాగంగా రిలయన్స్ బోర్డులోకి అడుగుపెట్టిన ముకేశ్ అంబానీ (Mukesh Ambani) వారసుల వేతనాల గురించి కంపెనీ తాజాగా వెల్లడించింది. నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల హోదాలో వారు ఎలాంటి వేతనాలు అందుకోబోరని తెలిపింది.
దిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) వారసులు ఆకాశ్ (Akash), ఈశా (Isha), అనంత్ అంబానీ (Anant Ambani) ఇటీవలే రిలయన్స్ బోర్డులోకి వచ్చారు. అయితే నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులైన వీరికి ఎలాంటి వేతనాలు (Salary) ఉండబోవట. కేవలం బోర్డు, కమిటీ సమావేశాలకు హాజరైనందుకు ఫీజులు మాత్రమే చెల్లించనున్నారు. ఈ మేరకు షేర్ల హోల్డర్లకు పంపిన రిజల్యూషన్లో కంపెనీ వెల్లడించింది.
తన వారసత్వ ప్రణాళిక (Ambani succession plan)లో భాగంగా తన ముగ్గురు పిల్లలకు గతేడాది కంపెనీలో కీలక బాధ్యతలు అప్పగించిన ముకేశ్ అంబానీ.. ఈ ఏడాది వారిని కంపెనీ బోర్డులోకి తీసుకున్నారు. గత నెల జరిగిన రిలయన్స్ వార్షిక సాధారణ సమావేశంలో (AGM) ఈశా, అనంత్, ఆకాశ్లను బోర్డు సభ్యులు (Board Members)గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీరు నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల హోదాలో వ్యవహరించనున్నారు. వీరి నియామకాన్ని ఆమోదించడం కోసం కంపెనీ తాజాగా షేర్ హోల్డర్లకు రిజల్యూషన్ పంపింది.
ఈ ముగ్గురు కేవలం సిట్టింగ్ ఫీజులు, కంపెనీ నమోదు చేసిన లాభాల్లో కమిషన్ మాత్రమే పొందుతారని కంపెనీ అందులో పేర్కొంది. గతంలో ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ కూడా రిలయన్స్ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరించారు. ఆమె కూడా వేతనం లేకుండా సిట్టింగ్ ఫీజుతో పాటు కమిషన్ పొందినట్లు కంపెనీ తమ వార్షిక నివేదికలో వెల్లడించింది.
పొదుపు తగ్గి అప్పు పెరుగుతోందా? ఈ వ్యూహాలను అనుసరిద్దాం!
వారసత్వ ప్రణాళికను ప్రకటించినప్పటికీ మరో ఐదేళ్ల పాటు తానే ఛైర్మన్గా కొనసాగనున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి ఆయన ఎలాంటి వార్షిక వేతనం, లాభం ఆధారిత కమిషన్ను తీసుకోవట్లేదు. మరో ఐదేళ్ల పాటు కూడా ఎలాంటి వేతనం వద్దని ముకేశ్ కంపెనీ బోర్డుకు తెలిపారు. కాగా.. అంతకుముందు కూడా 2008-09 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు ముకేశ్ తన వార్షిక వేతనాన్ని రూ.15 కోట్లకు పరిమితం చేసుకున్నారు.
వారసత్వ ప్రణాళికలో భాగంగా గతేడాది రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్ బాధ్యతల్ని ఆకాశ్ అంబానీ (Akash Ambani) స్వీకరించారు. ఈశా అంబానీ (Isha Ambani) రిలయన్స్ రిటైల్ బాధ్యతల్ని తీసుకున్నారు. అలాగే అనంత్ అంబానీ (Anant Ambani) నూతన ఇంధన రంగ బిజినెస్ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. గత నెల నీతా అంబానీ రిలయన్స్ బోర్డు డైరెక్టర్గా వైదొలిగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?