Ambani: అంబానీ వారసులకు వేతనాలు ఉండవు
వారసత్వ ప్రణాళికలో భాగంగా రిలయన్స్ బోర్డులోకి అడుగుపెట్టిన ముకేశ్ అంబానీ (Mukesh Ambani) వారసుల వేతనాల గురించి కంపెనీ తాజాగా వెల్లడించింది. నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల హోదాలో వారు ఎలాంటి వేతనాలు అందుకోబోరని తెలిపింది.
దిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) వారసులు ఆకాశ్ (Akash), ఈశా (Isha), అనంత్ అంబానీ (Anant Ambani) ఇటీవలే రిలయన్స్ బోర్డులోకి వచ్చారు. అయితే నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులైన వీరికి ఎలాంటి వేతనాలు (Salary) ఉండబోవట. కేవలం బోర్డు, కమిటీ సమావేశాలకు హాజరైనందుకు ఫీజులు మాత్రమే చెల్లించనున్నారు. ఈ మేరకు షేర్ల హోల్డర్లకు పంపిన రిజల్యూషన్లో కంపెనీ వెల్లడించింది.
తన వారసత్వ ప్రణాళిక (Ambani succession plan)లో భాగంగా తన ముగ్గురు పిల్లలకు గతేడాది కంపెనీలో కీలక బాధ్యతలు అప్పగించిన ముకేశ్ అంబానీ.. ఈ ఏడాది వారిని కంపెనీ బోర్డులోకి తీసుకున్నారు. గత నెల జరిగిన రిలయన్స్ వార్షిక సాధారణ సమావేశంలో (AGM) ఈశా, అనంత్, ఆకాశ్లను బోర్డు సభ్యులు (Board Members)గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీరు నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల హోదాలో వ్యవహరించనున్నారు. వీరి నియామకాన్ని ఆమోదించడం కోసం కంపెనీ తాజాగా షేర్ హోల్డర్లకు రిజల్యూషన్ పంపింది.
ఈ ముగ్గురు కేవలం సిట్టింగ్ ఫీజులు, కంపెనీ నమోదు చేసిన లాభాల్లో కమిషన్ మాత్రమే పొందుతారని కంపెనీ అందులో పేర్కొంది. గతంలో ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ కూడా రిలయన్స్ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహరించారు. ఆమె కూడా వేతనం లేకుండా సిట్టింగ్ ఫీజుతో పాటు కమిషన్ పొందినట్లు కంపెనీ తమ వార్షిక నివేదికలో వెల్లడించింది.
పొదుపు తగ్గి అప్పు పెరుగుతోందా? ఈ వ్యూహాలను అనుసరిద్దాం!
వారసత్వ ప్రణాళికను ప్రకటించినప్పటికీ మరో ఐదేళ్ల పాటు తానే ఛైర్మన్గా కొనసాగనున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి ఆయన ఎలాంటి వార్షిక వేతనం, లాభం ఆధారిత కమిషన్ను తీసుకోవట్లేదు. మరో ఐదేళ్ల పాటు కూడా ఎలాంటి వేతనం వద్దని ముకేశ్ కంపెనీ బోర్డుకు తెలిపారు. కాగా.. అంతకుముందు కూడా 2008-09 నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు ముకేశ్ తన వార్షిక వేతనాన్ని రూ.15 కోట్లకు పరిమితం చేసుకున్నారు.
వారసత్వ ప్రణాళికలో భాగంగా గతేడాది రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్ బాధ్యతల్ని ఆకాశ్ అంబానీ (Akash Ambani) స్వీకరించారు. ఈశా అంబానీ (Isha Ambani) రిలయన్స్ రిటైల్ బాధ్యతల్ని తీసుకున్నారు. అలాగే అనంత్ అంబానీ (Anant Ambani) నూతన ఇంధన రంగ బిజినెస్ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. గత నెల నీతా అంబానీ రిలయన్స్ బోర్డు డైరెక్టర్గా వైదొలిగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Automobile retail sales: పండగ సీజన్లో రికార్డు స్థాయికి వాహన విక్రయాలు.. 19% వృద్ధి
Automobile retail sales | నవరాత్రితో మొదలై ధనత్రయోదశి తర్వాత 15 రోజుల వరకు కొనసాగిన 42 రోజుల పండగ సీజన్ (festive season)లో మొత్తం వాహన విక్రయాల సంఖ్య 31,95,213 యూనిట్ల నుంచి 37,93,584 యూనిట్లకు చేరింది. -
₹10వేల బడ్జెట్లో శాంసంగ్ కొత్త ఫోన్.. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో!
Samsung Galaxy A05: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ తాజాగా గెలాక్సీ ఏ05 పేరుతో కొత్త మొబైల్ని లాంచ్ చేసింది. ప్రారంభ ఆఫర్లో కొనుగోలు చేసే వారికి రూ.1,000 క్యాష్బ్యాక్ ఇవ్వనుంది. -
Digital Payments: ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట.. తొలి UPI చెల్లింపునకు 4 గంటల వ్యవధి?
Digital Payments: ఆన్లైన్ మోసాలు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఓ సరికొత్త విధానంపై సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. ఇది అమల్లోకి వస్తే ఇద్దరు వ్యక్తుల మధ్య తొలి ఆన్లైన్ లావాదేవీకి నాలుగు గంటల వ్యవధి పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
JioPhone Prima Plans: జియోఫోన్ ప్రైమాకు ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్లు.. వివరాలివే!
JioPhone Prima Prepaid Plans: జియో ఇటీవల తీసుకొచ్చిన ప్రైమా ఫీచర్ ఫోన్ ప్రీపెయిడ్ ప్లాన్ల వివరాలు బయటకు వచ్చాయి. డేటా ప్రయోజనాలతో కూడిన మొత్తం ఏడు ప్లాన్లను తీసుకొచ్చింది. -
Stock Market: స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 48 పాయింట్ల లాభంతో 66,018 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 37 పాయింట్లు పెరిగి 19,832 దగ్గర కొనసాగుతోంది. -
జనవరి నుంచి కార్ల ధరల పెంపు..
కొత్త ఏడాదిలో కార్ల ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. జనవరి నుంచి వాహనాల ధరలను పెంచనున్నట్లు మారుతీ సుజుకీ, మహీంద్రా, టాటా మోటార్స్ వెల్లడించాయి. -
6 నెలల గరిష్ఠానికి బంగారం ధరలు
అంతర్జాతీయ విపణిలో బంగారం ధరలు 6 నెలల గరిష్ఠానికి చేరాయి. ఔన్సు (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర సోమవారం 2013.99 డాలర్లకు చేరింది. -
రేమండ్ వ్యాపారం సాఫీగా సాగుతుంది
వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. ఉద్యోగులు, బోర్డు సభ్యులకు కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సింఘానియా భరోసా ఇచ్చారు. -
రూ.13,000 కోట్లతో భారత్లో ఫాక్స్కాన్ విస్తరణ!
ఐఫోన్ తయారీ సంస్థ హాన్హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ భారత్లో మరింత విస్తరించనుంది. ఫాక్స్కాన్గా సుపరిచితమైన ఈ సంస్థ ఇక్కడి నిర్మాణ ప్రాజెక్టులపై 1.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.13,000 కోట్లు) పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. -
ఐడీబీఐ బ్యాంక్లో పూర్తి వాటా విక్రయించం
బ్యాంకస్యూరెన్స్ ప్రయోజనాలు పొందేందుకు, ఐడీబీఐ బ్యాంక్లో కొంత వాటా అట్టే పెట్టుకోవాలని.. ఆ బ్యాంక్ ప్రమోటర్, ప్రభుత్వ రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) యోచిస్తోంది. -
ఏఐ నైపుణ్యాలను నేర్చుకుందాం
కృత్రిమ మేధ సాంకేతికత, ఐటీ నిపుణులకు తప్పనిసరి అవసరంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70 శాతం మంది దీని గురించే మాట్లాడుకుంటున్నారని ప్రొఫెషనల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ పేర్కొంది. -
66,500 పాయింట్ల స్థాయి కీలకం!
అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలతో గత వారం దేశీయ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. కీలక పరిణామాలు లేకపోవడంతో మార్కెట్లు స్తబ్దుగా ట్రేడయ్యాయి. -
అల్యూమినియంలో కొనుగోళ్లు!
పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.61,985 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.62,351; రూ.62,967 వరకు రాణిస్తుందని భావించొచ్చు. -
దివ్యాంగుల కోసం అమెజాన్ ప్రత్యేక కార్యక్రమం
చదువులో ఇబ్బందిపడే దివ్యాంగుల్లో నైపుణ్యాలను వెలికితీసి, వారికి ఉపాధి కల్పించేందుకు అమెజాన్ ఇండియా ప్రత్యేక కార్యక్రమం ‘ఆరోరా’ను ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు
వినియోగదారు సేవా ఏజెంట్ల పని భారం తగ్గించేందుకు ఏఐ చాట్బాట్ను వినియోగించడం ప్రారంభించినట్లు విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది.


తాజా వార్తలు (Latest News)
-
Automobile retail sales: పండగ సీజన్లో రికార్డు స్థాయికి వాహన విక్రయాలు.. 19% వృద్ధి
-
ఐపీఎల్ వాళ్లకు చేదు.. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు అచ్చిరాని ఇండియన్ లీగ్
-
North Korea: కిమ్ శాటిలైట్.. శ్వేతసౌధం, పెంటాగన్ ఫొటోలు తీసిందట..!
-
Atchannaidu: వచ్చేది తెదేపా ప్రభుత్వమే.. దోచుకున్న సొమ్మంతా కక్కిస్తాం: అచ్చెన్నాయుడు
-
Bobby Deol: బాబీ దేవోల్ చెప్పిన డైలాగ్ ఆ సినిమాలోదేనా! నెట్టింట ఆసక్తికర చర్చ..
-
₹10వేల బడ్జెట్లో శాంసంగ్ కొత్త ఫోన్.. ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో!