Apple: భారత్లో యాపిల్ తొలి స్టోర్ ప్రారంభం.. స్వయంగా తలుపులు తెరిచిన టిమ్ కుక్
Apple: భారత్లో తొలి రిటైల్ స్టోర్ అయిన యాపిల్ బీకేసీని సీఈఓ టిమ్ కుక్ ప్రారంభించారు. ఆయన స్వయంగా స్టోర్ తలుపులు తెరిచి కస్టమర్లను ఆహ్వానించారు.
ముంబయి: భారత్లో యాపిల్ తొలి రిటైల్ స్టోర్ (Apple retail Store) ప్రారంభమైంది. కంపెనీ సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) స్వయంగా తలుపులు తెరిచి కస్టమర్లను ఆహ్వానించారు. ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ‘యాపిల్ బీకేసీ’ (Apple BKC) పేరిట ఈ స్టోర్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. భారత్లో వేగంగా విస్తరించేందుకు సిద్ధమైన యాపిల్.. అందులో భాగంగా రిటైల్ స్టోర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. రెండో స్టోర్ ‘యాపిల్ సాకేత్’ను దిల్లీలో తెరవనున్నారు.
ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని రిలయన్స్ జియో వరల్డ్ డ్రైవ్ మాల్లో యాపిల్ బీకేసీని ఏర్పాటు చేశారు. 20,800 చదరపు అడుగుల స్థలంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్లో కస్టమర్లు యాపిల్ ఉత్పత్తులన్నింటినీ కొనుగోలు చేయొచ్చు. అలాగే ఇతర సేవలను కూడా పొందొచ్చు. ఈ స్టోర్ను ప్రారంభించడం కోసం కుక్ సోమవారమే ముంబయికి చేరుకున్నారు. నిన్న సాయంత్రం ఆయన ప్రముఖ నటి మాధురీ దీక్షిత్తో కలిసి ‘వడా పావ్’ ఆరగించారు.
యాపిల్కు ప్రపంచవ్యాప్తంగా 500 రిటైల్ స్టోర్లు ఉన్నాయి. భారత్లో విస్తరణకు భారీ అవకాశాలు ఉన్న నేపథ్యంలో యాపిల్ ఇక్కడి మార్కెట్పై దృష్టి సారించింది. అందులో భాగంగా తయారీని చైనా నుంచి భారత్కు తరలిస్తోంది. విక్రయాలు సైతం భారీగా పుంజుకుంటున్న నేపథ్యంలో స్టోర్లను ప్రారంభించడం వల్ల మరింత మంది కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
గత ఏడాది సెప్టెంబరు నాటికి భారత్లో ప్రీమియం స్మార్ట్ఫోన్ విక్రయాల్లో యాపిల్ వాటా 40 శాతం. శాంసంగ్, వన్ప్లస్ కంటే కూడా ఇది అధికం. మరోవైపు మొత్తం యాపిల్ ఉత్పత్తుల్లో మూడు శాతం భారత్లోనే తయారవుతున్నాయి. వీటిని వచ్చే కొన్నేళ్లలో ఐదు శాతానికి పెంచాలని కంపెనీ వ్యూహాలు రచిస్తోంది. భారత్లో ఫాక్స్కాన్, పెగాట్రాన్, విస్ట్రాన్ ఐఫోన్లను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ఎయిర్పాడ్స్, ఐప్యాడ్స్ను కూడా ఫాక్స్కాన్ తయారు చేసే యోచనలో ఉంది.
యాపిల్ బీకేసీ ప్రత్యేకతలు..
❉ కస్టమర్లు ఈ స్టోర్ మొత్తం కలియదిరిగి తమకు నచ్చిన యాపిల్ ప్రొడక్ట్ డెమోను అడిగి తీసుకోవచ్చు. డివైజ్లను ఆపరేట్ చేయడంలో అక్కడ ఉండే యాపిల్ ప్రతినిధులు కస్టమర్లకు సాయం చేస్తారు. స్టోర్లోనే ఒక బృందం నిరంతరం యాపిల్ ఉత్పత్తులపై అవగాహనా సెషన్లను నిర్వహిస్తుంటుంది.
❉ దాదాపు 100 మంది యాపిల్ ప్రతినిధులు దీంట్లో పనిచేస్తారు. యాపిల్ ప్రొడక్ట్లకు సంబంధించి ఎలాంటి సేవలనైనా అందిస్తారు. మొత్తం 20 భారతీయ భాషల్లో మాట్లాడే ప్రతినిధులు అందుబాటులో ఉంటారు.
❉ ఈ స్టోర్ నుంచి ‘యాపిల్ పికప్’ సర్వీస్ను కూడా అందిస్తున్నారు. ఆన్లైన్లో ఆర్డర్ చేసి కస్టమర్లు తమకు కావాల్సిన చోట యాపిల్ ఉత్పత్తులను డెలివరీ తీసుకోవచ్చు.
❉ ఈ స్టోర్ పూర్తిగా పునరుత్పాదక ఇంధనంపైనే నడుస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. స్టోర్లో ఎక్కడా శిలాజ ఇంధనాలను వినియోగించబోరని యాపిల్ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోరమాండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్
ఎరువులు, రసాయనాలు, సస్య రక్షణ మందుల కంపెనీ, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు నూతన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా అరుణ్ అలగప్పన్ నియమితులయ్యారు. -
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల కోసం డాక్టర్ రెడ్డీస్, నెస్లే సంయుక్త సంస్థ
న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తుల విక్రయాలను దేశీయ మార్కెట్లో గణనీయంగా పెంచుకునే లక్ష్యంతో నెస్లే ఇండియా, డాక్టర్ రెడ్డీస్ చేతులు కలిపాయి. -
వ్యవసాయ రుణాలు మరింత వేగంగా
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
2023-24లో 1.03 లక్షల పేటెంట్లు మంజూరు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ 1.03 లక్షల పేటెంట్లను మంజూరు చేసినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్మార్క్స్ ఉన్నత్ పండిట్ గురువారం వెల్లడించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభం రూ.3,825 కోట్లు
బజాజ్ ఫైనాన్స్ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. -
బీజింగ్ ఆటోషో జిగేల్
చైనాలో అతిపెద్ద వాహన ప్రదర్శన ‘బీజింగ్ ఆటో షో’ గురువారం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 117 కొత్త మోడళ్లు ప్రదర్శించనున్నారు. -
ఇండస్ఇండ్ బ్యాంక్ డివిడెండ్ 165%
ఇండస్ఇండ్ బ్యాంక్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.2,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. -
మదుపర్ల సంపద రూ.404 లక్షల కోట్లకు
కొనుగోళ్ల జోరుతో వరుసగా అయిదో రోజూ సూచీలు మెరిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, లోహ షేర్లు రాణించడంతో సెన్సెక్స్ మళ్లీ 74,000 పాయింట్ల ఎగువకు చేరింది. నిఫ్టీ 22,500 స్థాయిని అందుకుంది. -
ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు రూ.700 కోట్లు: దివీస్
దివీస్ లేబొరేటరీస్ రూ.700 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోనుంది. దీర్ఘకాలిక మందుల సరఫరా నిమ్తితం ఒక ఔషధ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోనున్నట్లు, దీనికి అవసరమైన అదనపు ఉత్పత్తి సామర్ధ్యం కోసం రూ.700 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని దివీస్ లేబొరేటరీస్ గురువారం వెల్లడించింది. -
సంక్షిప్తవార్తలు(6)
హైదరాబాద్కు ‘ఇంటర్కాంటినెంటల్’ హోటల్ను పరిచయం చేయడం కోసం ఐహెచ్జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్తో బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ జట్టుకట్టింది. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
అప్పు చేసి.. పెట్టుబడి వద్దు
రెండేళ్ల క్రితం వాహన రుణం తీసుకున్నాను. దీనిపై ఇప్పుడు రూ.4 లక్షల వరకూ టాపప్ రుణం ఇస్తామని బ్యాంకు చెబుతోంది. -
ఉత్పత్తి రంగంలో మదుపు
దేశీయ వినియోగం, ఎగుమతులు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశంలో ఉత్పత్తి రంగం గతంలో ఎన్నడూ లేనంత అధిక వృద్ధిని నమోదు చేయబోతోంది. -
ప్రయాణంలో తోడుగా..
ప్రయాణాలు చేసే వారికి ఉపయోగపడేలా ఎస్బీఐ కార్డ్ కొత్త క్రెడిట్ కార్డును తీసుకొచ్చింది. ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ ప్రైమ్, ఎస్బీఐ కార్డ్ మైల్స్ పేర్లతో మూడు రకాలుగా అందిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం