Elon Musk: రోజుకు 4 మిలియన్ డాలర్ల నష్టం.. ఉద్యోగుల కోత తప్పలేదు: మస్క్
ట్విటర్ను హస్తగతం చేసుకున్న వారానికే కంపెనీలో దాదాపు 50 శాతం ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు ఎలాన్ మస్క్. మరో అవకాశం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.
శాన్ఫ్రాన్సిస్కో: ట్విటర్ను(Twitter) ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దాదాపు సగం మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు కొత్త యజమాని ఎలాన్ మస్క్(Elon Musk). దీనిపై విమర్శలు వ్యక్తమవడంతో స్పందించిన మస్క్ ఉద్యోగుల కోతలను సమర్థించారు. కంపెనీ రూ.వేల కోట్ల నష్టాల్లో ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ట్విటర్లో తెలిపారు.
‘‘ట్విటర్ రోజుకు 4 మిలియన డాలర్లకు పైగా నష్టపోతున్నప్పుడు.. దురదృష్టవశాత్తూ సిబ్బంది తగ్గింపు మినహా మరో అవకాశం కన్పించలేదు. అయితే కంపెనీ నుంచి నిష్క్రమించిన ప్రతి ఉద్యోగికి మూడు నెలల వేతన చెల్లింపులు చేస్తున్నాం. చట్టప్రకారం ఇవ్వాల్సిన దానికన్నా ఇది 50శాతం ఎక్కువే’’ అని మస్క్ రాసుకొచ్చారు.
44 బిలియన్ డాలర్లతో ట్విటర్ (Twitter)ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ (Elon Musk).. వారం రోజుల్లోనే సంస్థలో అనేక భారీ మార్పులు తీసుకొచ్చారు. కొనుగోలు ప్రక్రియ ముగిసిన కొద్ది గంటలకే సీఈఓ పరాగ్ అగర్వాల్ సహా నలుగురు ఉన్నతోద్యోగులను విధుల నుంచి ఇంటికి పంపించేసిన ఆయన.. తాజాగా కంపెనీలో దాదాపు సగం మందికి ఉద్వాసన పలికారు. తొలగింపు సమాచారాన్ని ఉద్యోగులకు ఇ-మెయిల్ ద్వారా పంపారు. ప్రపంచవ్యాప్తంగా ట్విటర్కు 7500 వరకు ఉద్యోగులుండగా.. 3738 మందికి ఈ లేఆఫ్ మెయిళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ లేఆఫ్లకు ముందు ఉద్యోగులు, వినియోగదార్ల డేటా భద్రత దృష్ట్యా తాత్కాలికంగా అన్ని కార్యాలయాలను ట్విటర్ మూసివేయనుంది.
వారి వల్లే రెవెన్యూ తగ్గింది..
ఇక ట్విటర్ (Twitter) ఆదాయం తగ్గడానికి సామాజిక కార్యకర్తలే కారణమని ఎలాన్ మస్క్ (Elon Musk) మండిపడ్డారు. ‘‘కంటెంట్ నియంత్రణలో ఏమీ మారనప్పటికీ కొందరు సామాజిక కార్యకర్తలు.. ప్రకటనదారులపై ఒత్తిడి చేశారు. దీనివల్లే ట్విటర్ ఆదాయం భారీగా పడిపోయింది. కార్యకర్తలను శాంతింపజేసేందుకు మేం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. చాలా గందరగోళంగా ఉంది. అమెరికాలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను వారు నాశనం చేస్తున్నారు’’ అని మస్క్ తెలిపారు. అయితే సంస్థకు ఎంతమేర నష్టం కలిగిందని, ఆ కార్యకర్తలు ఎవరు అన్నదానిపై ఆయన ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్న్యూస్.. ఆగస్టు నుంచి 4జీ సేవలు
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు త్వరలో 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. -
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు రెండు నెలల తాత్కాలిక బెయిల్ మంజూరైంది. -
రోజంతా ఒడుదొడుకుల్లో.. చివరికి ఫ్లాట్గా ముగిసిన సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో నిఫ్టీ 33.15 పాయింట్ల నష్టంతో ముగిశాయి. -
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
Indegene IPO: రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇండీజీన్ ఐపీఓ ప్రారంభమైంది. మదుపర్లు రూ.14,916తో కనీసం 33 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
రైతు భరోసా నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
ఇరాన్లో వేధింపులు తట్టుకోలేక.. పడవతో సహా భారత్కు చేరుకొన్న మత్స్యకారులు..!