LIC: ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్
Good news For LIC Agents and employees: ఎల్ఐసీ ఏజెంట్లకు, ఉద్యోగులకు కేంద్రం తీపికబురు అందించింది. 13 లక్షల మంది ఏజెంట్లకు, లక్ష మంది ఉద్యోగులకు సంబంధించిన ప్రయోజనాలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.
Good news for LIC Agents and employees | దిల్లీ: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ (LIC) ఏజెంట్లు, ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్కు సంబంధించి కొన్ని ప్రయోజనాలకు కేంద్ర ఆర్థిక శాఖ (Finance ministry) ఆమోదం తెలిపింది. దీంతో లక్షలాది మంది ఏజెంట్లు, లక్షకు పైగా ఉన్న ఎల్ఐసీ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఎల్ఐసీ ఏజెంట్లకు ప్రస్తుతం అందిస్తున్న గ్రాట్యూటీ మొత్తాన్ని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. వారిక ప్రయోజనాలు అందించే దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అలాగే రీ అపాయింట్ అయిన ఏజెంట్లకూ రెన్యువల్ కమీషన్ పొందేందుకు అర్హత కల్పిస్తున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ప్రస్తుతం పాత ఏజెన్సీలో బిజినెస్ పూర్తి చేసిన వారికి రెన్యువల్ కమీషన్ అందడం లేదు.
క్రెడిట్కార్డు బిల్లు భారంగా మారిందా? ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు..!
ఎల్ఐసీ ఏజెంట్లకు టర్మ్ ఇన్సురెన్స్ కవరేజీని ప్రస్తుతం ఉన్న రూ.3,000-10వేలు స్థాయి నుంచి రూ.25,000-1.50 లక్షల స్థాయికి పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. దీనివల్ల మృతి చెందిన ఏజెంట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపింది. అలాగే, ఎల్ఐసీ ఉద్యోగుల కుటుంబాలకు సంక్షేమం అందించేందుకు గానూ అందరికీ ఒకే తరహాలో 30 శాతం ఫ్యామిలీ పెన్షన్ కింద అందివ్వనున్నట్లు తెలిపింది.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న 13 లక్షల ఏజెంట్లకు, లక్షకు పైగా రెగ్యులర్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. ఎల్ఐసీ ఈ స్థాయికి చేరడానికి వీరి పాత్ర కీలకమని ఈ సందర్భంగా ఆర్థిక శాఖ కొనియాడింది. 1956లో రూ.5 కోట్ల మూలధనంతో ఏర్పాటైన ఎల్ఐసీ.. 2023 మార్చి 31 నాటికి పెద్ద సంస్థల్లో ఒకటిగా ఎదిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
Indegene IPO: రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఇండీజీన్ ఐపీఓ ప్రారంభమైంది. మదుపర్లు రూ.14,916తో కనీసం 33 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాలి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ 202 పాయింట్ల లాభంతో 74,080 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 35 పాయింట్లు పుంజుకొని 22,511 దగ్గర కొనసాగుతోంది. -
లేని సీట్లు అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఓ విమానయాన సంస్థ నిర్వాకం!
Qantas: కాంటాస్ అనే ఆస్ట్రేలియా విమానయాన సంస్థ క్యాన్సిల్ అయిన విమానాల్లోని సీట్లను విక్రయించింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన అక్కడి నియంత్రణా సంస్థ రూ.550 కోట్ల జరిమానా విధించింది. -
3 ఐపీఓలు.. రూ.6,400 కోట్ల లక్ష్యం
ఈ వారం మూడు కంపెనీల తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)లు మార్కెట్లో సందడి చేయనున్నాయి. రూ.6,400 కోట్ల సమీకరించే లక్ష్యంతో ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండీజీన్, టీబీఓ టెక్ ఐపీఓలు వస్తున్నాయి. -
లాభాలకే అవకాశం
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం సూచీలు భారీగా నష్టపోయినా, అది తాత్కాలికమేనని.. సూచీలు అధిక స్థాయులకు చేరాయనే భావనతో, లాభాల స్వీకరణకు దిగడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పసిడిలో లాభాల స్వీకరణ!
పసిడి ఇటీవల రూ.73,925 వద్ద గరిష్ఠాన్ని తాకిన తర్వాత లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే జూన్ కాంట్రాక్టు ఈ వారం రూ.69,418 వరకు పడిపోవచ్చు. -
75,100 పైన మరిన్ని సానుకూలతలు!
సానుకూల అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో గత వారం సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ముడిచమురు ధరలు చల్లపడటం కలిసొచ్చాయి. -
పురుగు మందుల అవశేషాలపై భారత్లో కఠిన నిబంధనలు: ప్రభుత్వం
ఆహార పదార్థాల్లో పురుగు మందుల అవశేషాల విషయంలో.. భారత్ అత్యంత కఠినమైన నిబంధనలను కలిగి ఉందని ప్రభుత్వం ఆదివారం పునరుద్ఘాటించింది. -
గృహ రుణ బకాయిలు పెరిగాయ్: ఆర్బీఐ
గృహ నిర్మాణ రంగానికి బకాయిపడిన రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో సుమారు రూ.10 లక్షల కోట్లు పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇండీజీన్ ఐపీఓ ప్రారంభం.. రూ.1,842 కోట్ల సమీకరణ లక్ష్యం
-
హౌస్ కీపర్ ఇంట్లో.. రూ. కోట్లల్లో నోట్ల గుట్టలు..!
-
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
-
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 74,000 ఎగువన సెన్సెక్స్
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?